13 November 2017

పూలవ‌ర్షం

వైయస్‌ఆర్‌ జిల్లా:  వైయస్‌ జగన్‌ చేపట్టిన పాదయాత్రకు పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలతో లబ్ధిపొందిన ప్రజలు వైయస్‌ జగన్‌కు ఆత్మీయ స్వాగతం పలుకుతున్నారు. ఎటు చూసినా జనమే. అశేష జనవాహిని ఉవ్వెత్తున ఎగిసిపడుతోంది. ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి పూలతో స్వాగతం పలుకుతున్నారు. ఏడో రోజు ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా దువ్వూరులో ప్రజలు పూలవర్షం కురిపించి తమ అభిమానాన్ని చాటుకున్నారు.

No comments:

Post a Comment