రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు వరదాయిని అయిన పోలవరం
ప్రాజెక్టును చంద్రబాబు తన స్వార్థం కోసం పక్క దారి పట్టిస్తున్నారు. ఈ విషయాన్ని
స్వయంగా మిత్రపక్షం బీజేపీ చెబుతోంది.పోలవరం పనులు నత్త నడకన నడుస్తున్నాయని
మంత్రిమండలిలో సభ్యుడైన బీజేపీ మంత్రి పైడికొండల మాణిక్యాల రావు కుండ బద్దలు
కొట్టారు.
తెలివిగా పక్కదారి
పట్టిసీమ పేరుతో తెలివిగా పోలవరం పనుల్ని నత్త నడకన నడిపించాలని చంద్రబాబు నిర్ణయించారు. ఇందుకు కేంద్రం నుంచి నిదులు, సహకారం అందడం లేదని డ్రామా సాగించారు.
పట్టిసీమ కోసం పోలవరాన్ని అటక ఎక్కించి చేతులు దులుపుకొన్నారు. ఈ విషయాన్ని
బీజేపీ పార్టీ పెద్దలు పసిగట్టారు. స్వయంగా బీేజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు
హరిబాబు,
తర్వాత మంత్రి
మాణిక్యాలరావు బహిరంగంగా వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి కేంద్రం
వైపు నుంచి ఎటువంటి ఇబ్బంది లేదని తేల్చి చెప్పారు. అంతా చంద్రబాబు సర్కారులోనే
ఉందని చెప్పకనే చెప్పారు. కేంద్ర వైపు నుంచి ఇబ్బందే లేదని, అసలు సమస్య అంతా ఇక్కడే ఉందని మంత్రి
మాణిక్యాల రావు కుండ బద్దలు కొట్టి చెప్పారు. పనులకు సంబంధించిన అంచనాలు తయారుచేసి కేంద్రానికి నివేదిక ఇస్తే నిదుల్ని విడుదల చేస్తారని చెప్పారు. ఈ విషయాన్ని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి స్వయంగా చంద్రబాబుకి స్పష్టం చేశారని చెప్పారు. అటువంటప్పుడు కేంద్రం నుంచి లోపం లేదని వివరించారు.