29 February 2016

చంద్ర‌బాబునాయుడు జోకులు వేయ‌టంలో దిట్టం

విజ‌య‌వాడ‌ : ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు జోకులు వేయ‌టంలో దిట్టం. అబ‌ద్దాల్నే గ‌ట్టిస్వ‌రంతో చెప్పి న‌మ్మించే ప్ర‌య‌త్నం చేస్తుంటారు. ఈసారి జాతీయ ఛానెల్ ఎన్డీ టీవీ లో అలాంటి అబ‌ద్దాలే అతికినట్లు చెప్పేశారు. కానీ అస‌లు వాస్త‌వాల్ని అక్క‌డ ఉన్న వారంతా గ‌మ‌నించి న‌వ్వుకొన్నారు. నదీ పరిరక్షణ చట్టాన్ని ఉల్లంఘించి కృష్ణా నది గట్టుపై నిర్మించిన గెస్ట్‌హౌస్‌ను అధికారిక నివాసంగా చేసుకున్న చంద్రబాబు.. ఆ గెస్ట్‌హౌస్‌లోనే ఎన్‌డీటీవీ ‘వాక్ ది టాక్’లో ఇంటర్వ్యూ ఇచ్చారు. కృష్ణా నది గట్టు మీద, గెస్ట్‌హౌస్ లాన్లలో విహరిస్తూ ఆయన చెప్పిన అబ‌ద్దాలు.. అస‌లు వాస్త‌వాల్ని  ఇప్పుడు చూద్దాం..

చంద్ర‌బాబు) ‘నా జీవితం, రాజకీయాలు అంతా పోరాటమయం. నేను ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత అందరూ నన్ను అంతం చేయాలనుకున్నారు. ఎన్నో కష్టాలు.. పదేళ్ల పాటు పోరాడి చివరకు నేను నవ్యాంధ్రప్రదేశ్‌కు సీఎం అయ్యాను.
వాస్త‌వం) చంద్ర‌బాబు జీవితమంతా వెన్నుపోట‌ల మ‌యం. అప్పుడు ఎన్టీయార్ కు వెన్నుపోటు పొడిచి ఎమ్మెల్యేల‌ను లాక్కొన్నారు. ఇప్పుడు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల‌ను ప్ర‌లోభ పెట్టి ఎమ్మెల్యేల‌ను లాక్కొంటున్నారు.

 
చంద్ర‌బాబు) హైదరాబాద్ నా బ్రెయిన్ చైల్డ్. హైదరాబాద్, సికిందరాబాద్‌లకు నేను సైబరాబాద్‌ను చేర్చాను. నేను హైదరాబాద్‌ను అభివృద్ధి చేశా అన్న ఆలోచనలు వస్తాయి. కానీ.. నేను జనం కోసం హైదరాబాద్‌ను నిర్మించానన్నది వాస్తవం. వారిని అనుభవించనివ్వండి.. నేను మరో నగరాన్ని నిర్మిస్తా.
వాస్త‌వం) సైబ‌రాబాద్ లో ఐటీ ప‌రిశ్ర‌మ‌ల‌కు అంకురార్ప‌ణ జ‌రిగింది. మాజీ ప్ర‌ధాని పీవీ న‌ర‌సింహ‌రావు చొర‌వ‌తో అప్ప‌టి సీఎం జ‌నార్ద‌న్ రెడ్డి హ‌యంలో. హైటెక్ సిటీ కి శంకుస్థాప‌న జ‌రిగింది కూడా అప్పుడే. కానీ దానికి రిబ్బ‌న్ క‌టింగ్ చేసి అన్నీ నేనే చేశా అంటే ఎలా బాబు.

చంద్ర‌బాబు) ఆరు నెలల కాలంలో.. గోదావరి నుంచి కృష్ణాకు నేను నీళ్లు తీసుకురాగలిగాను. ఈ ఏడాది 8 టీఎంసీ నీళ్లు ఇక్కడికి వచ్చాయి. పోలవరం ద్వారా గోదావరిలో వరద ఉన్నపుడు ఎంత నీటినైనా ఇక్కడికి తీసుకురాగలం
వాస్త‌వం) ఇప్ప‌టికీ పోల‌వ‌రం ప్రాజెక్టు అస‌లు ఏమాత్రం జ‌ర‌గ‌నే లేదు. ప‌ట్టి సీమ ప‌నులు ఇంకా సాగుతున్నాయి. ఇంకా నెల ప‌డుతుంద‌ని త‌మ‌రే చెప్పారు. మ‌రి ఇన్ని నీళ్లు ఎక్క‌డ నుంచి ఎక్క‌డ‌కు వ‌చ్చిన‌ట్లు

చంద్ర‌బాబు). దేశంలో రెండు పెద్ద నదులను తొలిసారి అనుసంధానించాం. ఇక్కడి నుంచి పెన్నాకు తీసుకెళ్లాలనుకుంటున్నాను.
వాస్త‌వం) రెండు చెంబులు నీళ్లు గోదావ‌రి నుంచి తెచ్చి క్రిష్ణా లో పోసి అనుసంధానం చేశాం అని గొప్ప‌లు చెబుతున్నారు. అస‌లు క్రిష్ణా న‌దిలో నీటి కోసం ఎంతటి డిమాండ్ ఉంది. శ్రీశైలం, నాగార్జున సాగ‌ర్‌, పులిచింత‌ల, విజ‌య‌వాడ ద‌గ్గ‌ర ఎంత కొర‌త ఉందో తెలుసు. అక్క‌డ క్రిష్ణా, గోదావ‌రి న‌దుల మీద ఎగువ రాష్ట్రాల ప్రాజెక్టులు ఆపించ‌క పోతే మిగిలేవి ఈ చెంబుల నీళ్లే.
 
చంద్ర‌బాబు).అప్పుడు (గతంలో అధికారంలో ఉన్నపుడు) నేను సంపదను సృష్టించాను. అది దానికదిగా కింది వర్గాల వారికి చేరుతుందని (ట్రికిల్ డౌన్) నేను భావించా. కానీ అలా జరగలేదు.. నేను అధికారం కోల్పోయాను. నా కృషి మొత్తం వృథా అయింది. 
వాస్త‌వం) మీరు సంప‌ద‌ను పోగేసింది ఈ సొంత కుటుంబానికి త‌ప్ప‌. మ‌రొకరికి కాదు. మీరు ప‌రిపాలించిన తొమ్మిదేళ్ల కాలంలో సామాన్యుల కోసం చేసిన ప‌ని ఒక్క‌టంటే ఒక్క‌టి చూపించ‌గ‌ల‌రా

చంద్ర‌బాబు)ఇప్పుడు మళ్లీ మైనస్‌లో నేను మొదలు పెట్టా. సున్నాతో కాదు.నావల్లే 2004 నాటికి విద్యుత్ మిగులు ఉంది. నేను మళ్లీ అధికారంలోకి వచ్చేటప్పటికి.. ఒక్క ఏపీలోనే 22.5 మిలియన్ యూనిట్ల లోటు ఉంది. తెలంగాణలో కాదు. ఒక నెల కాలంలోనే నేను దానిని మళ్లీ సరి (రివర్స్) చేయగలిగాను.
వాస్త‌వం) ఆంధ్ర‌ప్ర‌దేశ్ విభ‌జ‌న తో తెలంగాణ లో విద్యుత్ కొర‌త‌, ఏపీలో విద్యుత్ మిగులు ఉంటుంద‌ని చిన్న‌పిల్ల‌ల‌కు కూడా తెలుసు. అయినా స‌రే ఏపీలో విద్యుత్ ను నేనే పోగేశా, సెల్ ఫోన్ ని నేనే క‌నిపెట్టా అని గొప్ప‌లు చెబితే ఏం చేయ‌గ‌లం. ఉన్న విద్యుత్ ఉండ‌గానే ప్రైవేటు విద్యుత్ కొనుగోలుకి తెర దీసిన ఘ‌న‌త మీది

చంద్ర‌బాబు) నేను ఇలా ఎందుకు పనిచేయాలి? నా కుటుంబం ఇక్కడ లేదు. వారు ఏదో వ్యాపారం చేస్తున్నారు. ఆమె కూడా బిజీ. నాకొక మనవడు ఉన్నాడు. రోజుకు గంట సమయం కూడా గడపటం లేదు. నేను మనవడితో ఆడుకునే సమయం ఇది. కానీ నేను నా జీవితం త్యాగం చేస్తున్నాను. ఎందుకు? ప్రజల కోసం.
వాస్త‌వం) జీవితం అంతా చీక‌టి మ‌యం, వెన్నుపోట్ల మయం అయితే ఎవ‌రినీ న‌మ్మ‌లేరు. అందుకే ప్ర‌శాంతంగా ఉండ‌లేరు. ఇది త్యాగం కాదు ప‌చ్చి స్వార్థం. హైద‌రాబాద్ లో ఓటుకి కోట్లు కుంభ‌కోణంలో అడ్డంగా దొరికిపోయాక విజ‌య‌వాడ‌కు జంప్ అయిపోయి, భ‌య‌ప‌డి దాక్కొన్న మ‌న‌స్త‌త్వం.

చంద్ర‌బాబు) నేను ఎన్నికల్లో అతిగా హామీలు ఇవ్వలేదు. నేను హామీలు ఇచ్చిన దానికన్నా ఎక్కువ ఇస్తున్నా. కొన్నిసార్లు మేం ఆలోచనలు మార్చుకోవచ్చు. అప్పుడు అది సరికావచ్చు.. ఇప్పుడు ఇంకొకటి సరికావచ్చు. 
వాస్త‌వం) అన్ని అతి హామీలే. అధికారంలోకి వ‌చ్చాక మొట్ట‌మొద‌టి సంత‌కం పెట్టిన ఐదు హామీలు కూడా అలాగే ఉన్నాయి. రైతు రుణ‌మాఫీ, డ్వాక్రా రుణ‌మాఫీ, నిరుద్యోగుల‌కు ఉద్యోగాలు, ప‌క్కా ఇళ్ల నిర్మాణం, ప్ర‌త్యేక హోదా.. అటువంటప్పుడు వీటిని దొంగ హామీలు అన‌టంలో త‌ప్పేముంది. 

చంద్ర‌బాబు)తెలంగాణలో టీడీపీ ఎమ్మెల్యేలు 15 మందిలో 9 మందిని (కేసీఆర్) తీసుకెళ్లటం చట్టబద్ధం కాదు. పార్టీ ఫిరాయింపుల చట్టం ఉంది. అసలు పార్టీని చీల్చలేరు. దానిపై న్యాయపోరాటం ఒక నిరంతర ప్రక్రియ.
 వాస్త‌వం) ఓటుకి కోట్లు కుంభ‌కోణం లో దొరికి పోయి, కేసీయార్ తో సెటిల్ మెంట్ చేయించుకొన్నాక‌ ఈ పోరాటాల‌న్నీ నిరంత‌ర‌మే అని మీ నాయ‌కులే చెవులు కొరుక్కొంటున్నారు. కానీ ఏపీలో మాత్రం కోట్లుకుమ్మ‌రించి ఎమ్మెల్యేల‌ను కొనేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. 

చంద్ర‌బాబు)హైదరాబాద్‌లో తెలంగాణలో నా జనం ఉంటారు.. నేను అక్కడికి వెళ్లలేను. అక్కడ (అసెంబ్లీ ఎన్నికల్లో) పోటీ చేయలేను. 2018 ఎన్నికల్లో అక్కడ అధికారం కోసం పోటీచేస్తాం.’’
వాస్త‌వం) మ‌ళ్లీ హైద‌రాబాద్ లో పోటీ చేస్తే నెంబ‌ర్ వ‌న్ అవుతార‌ని జ‌నం అనుకొంటున్నారు. కానీ ఇప్పుడు చేస్తున్న మోసాల‌తో ఏపీ లో కూడా ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు పెడితే అస‌లు రంగు బ‌య‌ట ప‌డుతుంది. క‌నీసం మునిసిప‌ల్ ఎన్నిక‌లు పెట్టినా బండారం బ‌య‌ట ప‌డుతుంది. 

27 February 2016

వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిని చూసి విలువ‌లు నేర్చుకో చంద్ర‌బాబు

టీడీపీ నేత‌ల స‌వాల్‌ను స్వీక‌రించిన వైయ‌స్ఆర్‌సీపీ
చంద్ర‌బాబుది నీతిమాలిన క్యారెక్ట‌ర్‌
కాంగ్రెస్సే ఏమీ చేయ‌లేక‌పోయింది. టీడీపీ ఎంత‌?
16 నెల‌లు వైయ‌స్ జ‌గ‌న్‌ను జైల్లో పెట్టినా తొణ‌క‌లేదు
తండ్రి అడుగుజాడ‌ల్లో వెన్నుపోటు రాజ‌కీయాలు చేస్తున్న లోకేష్‌
వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా

హైద‌రాబాద్‌: తెలుగుదేశం పార్టీ నాయ‌కుల‌కు  ద‌మ్మూ, ధైర్యం ఉంటే.. మీరు అభివృద్ధి చేశామ‌ని భావిస్తే ముందు మీరు రాజీనామా చేయాల‌ని, మేం కూడా వెంట‌నే రాజీనామా చేస్తామ‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా స్ప‌ష్టం చేశారు. వైయ‌స్ఆర్‌సీపీకి చెందిన 62 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయాల‌న్న టీడీపీ నాయ‌కులు ప‌య్యావుల కేశ‌వ్, బోండా ఉమా విసిరిన స‌వాల్‌ను వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వీక‌రించింది. అయితే మాతో పాటు మీరు కూడా ప‌ద‌వుల‌కు రాజీనామా చేసి, శాస‌న స‌భ ర‌ద్దుకు డేట్ ఫిక్స్ చేయాల‌ని రోజా డిమాండ్ చేశారు. హైద‌రాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాల‌యంలో శుక్ర‌వారం ఆమె విలేక‌రుల‌తో మాట్లాడుతూ చంద్ర‌బాబుది నీతిమాలిన క్యారెక్ట‌ర్ అని అభివ‌ర్ణించారు.  టీడీపీ నాయ‌కులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని శాశ్వ‌తంగా రాజ‌కీయాల నుంచి త‌ప్పిస్తామ‌ని పేర్కొన‌డం హాస్యాస్ప‌దంగా ఉంద‌న్నారు. ఆయ‌న ఎప్ప‌టికీ సీఎం కాలేర‌ని టీడీపీ ఎమ్మెల్సీ ప‌య్యావుల కేశ‌వ్ చెప్ప‌డం దుర‌దృష్ట‌క‌ర‌మ‌న్నారు. క‌నీసం ఎమ్మెల్యేగా కూడా గెల‌వ‌లేక దొడ్డి దారిన ఎమ్మెల్సీగా వ‌చ్చిన కేశ‌వ్‌కు జ‌గ‌న్ గురించి మాట్లాడే అర్హ‌త ఉందా అని ప్ర‌శ్నించారు. అర్హ‌త లేక‌పోయిన ప‌ర్వాలేదు. ఆయ‌న ఇచ్చిన స‌వాల్‌ను మేం స్వీక‌రిస్తున్నామ‌న్నారు. వైయ‌స్ార్‌సీపీకి  చెందిన 62 మంది ఎమ్మెల్యేతో రాజీనామా చేసి ప్ర‌జా క్షేత్రంలోకి వెళ్లి ప్ర‌జ‌లు మా ప‌క్షంలో ఉన్నార‌ని నిరూపించుకునే ద‌మ్మూ, ధైర్యం మా నాయ‌కుడు వైయ‌స్ జ‌గ‌న్‌కు ఉంద‌న్నారు. స‌ల‌హా ఇచ్చే ముందు మీరు పాటించి ఉంటే బాగుండేద‌ని సూచించారు. టీడీపీ ఎమ్మెల్యేలు , ఎంపీలంద‌రితో రాజీనామా చేయించాల‌ని ఆమె ప‌ట్టుబ‌ట్టారు. మీరు చేసిన అభివృద్ధి  ఏంటో.. మీ ఫేస్ వ్యాల్యూ ఏంటో ప్ర‌జాక్షేత్రంలో తేల్చుకుందామ‌ని ఛాలెంజ్ విసిరారు. ఇన్నాళ్లు ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై ఎలా పోరాటం చేశామో.. మా నాయ‌కుడి ఫేస్ వ్యాల్యూ ఏంటో ఉప ఎన్నిక‌ల్లో ఘ‌న విజ‌యం సాధించి నిరూపిస్తామ‌న్నారు. వైయ‌స్ఆర్‌సీపీ  గుర్తుతో గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేల‌ను తీసుకెళ్లి.. ఈ రోజు మేం రాజీనామా చేయం, మీరే చేయాల‌ని టీడీపీ నాయ‌కులు స‌వాల్ విస‌ర‌డం దిక్కుమాలిన ప్ర‌క‌ట‌న  అన్నారు. ఈ రోజు తెలుగుదేశం పార్టీ నాయ‌కులు చెప్పేవి శ్రీ‌రంగ నీతులు.. చేసేవి నీతిమాలిన రాజ‌కీయాల‌ని ఎద్దేవా చేశారు. 
ఇదీ చంద్ర‌బాబు క్యారెక్ట‌ర్‌
ముఖ్య‌మంత్రి  చంద్ర‌బాబుది నీతిమాలిన క్యారెక్ట‌ర్ అని ఎమ్మెల్యే ఆర్కే రోజా దుయ్య‌బ‌ట్టారు. మ‌న క్యారెక్ట‌ర్ ఎలాంటిదో ప‌ది మంది చెప్పాల‌ని  కానీ .. మ‌న గురించి మ‌నంచెప్పుకోవ‌డం బాగుండ‌ద‌న్నారు. చంద్ర‌బాబు నిన్న స‌భ‌లో మాట్లాడుతూ  నాకుండేదే క్యారెక్ట‌ర్ అన్న స్టేట్ మెంట్‌చూస్తే ఎవ‌రికైనా న‌వ్వొస్తుంద‌న్నారు. ప‌క్క పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేల‌ను కేసులు పెట్టి వేధించి, సూట్‌కేసులు ఇచ్చి మీ పార్టీలో చేర్చుకోవ‌డ‌మే రాజ‌కీయ‌మా అని ప్ర‌శ్నించారు. 35 ఏళ్ల రాజ‌కీయా జీవితంలో నేను ఏ త‌ప్పుచేయ‌లేదు అని చంద్ర‌బాబు చెప్ప‌డం విడ్డూరంగా ఉంద‌న్నారు. నీ రాజ‌కీయ జీవిత‌మే త‌ప్పుడు మార్గంలో మొద‌లైంద‌న్న‌ది అంద‌రికీ తెలుసు అన్నారు. పిల్ల‌నిచ్చిన మామ ఎన్టీ రామారావును వెన్నుపోటు పొడిచావ‌న్నారు. ఈ రోజు నీవు.. నీ కుమారుడు క‌లిసి రాష్ట్రాన్ని దోచుకుంటున్నార‌ని విమ‌ర్శించారు. నాడు ఎన్టీఆర్ వ‌ద్ద ఉన్న ఎమ్మెల్యేల‌ను , నేడు వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యేల‌ను కొనే నీతిమాలిన క్యారెక్ట‌ర్ బాబుది అన్నారు. మా వాళ్లు బ్రీఫ్డ్ మీ అంటూ తెలంగాణ‌లో ఎమ్మెల్సీల‌ను కొంటూ అడ్డంగా దొరికి ప్ర‌పంచంలో తెలుగు వారి ప‌రువు బ‌జారున వేసిన క్యారెక్ట‌ర్ నీది అని సీఎం ను విమ‌ర్శించారు. రుణ‌మాఫీ చేస్తామ‌ని చెప్పి రైతుల‌తో ఓట్లు వేయించుకున్న త‌రువాత హామీ నెర‌వేర్చ‌క‌పోవ‌డంతో రైతులు ఆత్మ‌హ‌త్య‌లు చేసుకునేలా చేసిన మోస‌కారి క్యారెక్ట‌ర్ బాబుది అన్నారు.  అస‌లు, వ‌డ్డీతో స‌హా రుణ‌మాఫీ చేస్తామ‌ని డ్వాక్రా మ‌హిళ‌ల‌ను మోసం చేసిన ద‌గా కోరు క్యారెక్ట‌ర్ చంద్ర‌బాబుది అని గుర్తు చేశారు. మ‌హిళా త‌హ‌శీల్దార్ వ‌న‌జాక్షిపై దాడి చేయించి, కాల్‌మ‌నీ సెక్స్ రాకెట్ పేరుతో అమాయ‌క మ‌హిళ‌ల‌ను వ్య‌భిచారంలోకి దించిన మ‌హిళా ద్రోహి క్యారెక్ట‌ర్ అన్నారు. రాజ‌ధాని అభివృద్ధి పేరుతో ల‌క్ష‌ల ఎక‌రాల ద‌ళితుల భూములు లాక్కున్న ద‌ళిత ద్రోహి క్యారెక్ట‌ర్ చంద్ర‌బాబుది అని రోజా అభివ‌ర్ణించారు.
వైయ‌స్ జ‌గ‌న్ ను చూసి నేర్చుకో
నాయ‌కుడంటే ఎలా ఉండాలో నైతిక విలువ‌లు ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని చూసి నేర్చుకోవాల‌ని ఎమ్మెల్యే రోజా చంద్ర‌బాబుకు సూచించారు. క్యారెక్ట‌ర్ అంటే వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిద‌ని ఆమె వివ‌రించారు. త‌న తండ్రి పోరాట స్ఫూర్తితో ఈ రోజు ఎన్ని క‌ష్టాలు ఎదురైనా తొణ‌కుండా ప్ర‌జ‌ల ప‌క్షాన ఉంటూ పోరాడుతున్న నాయ‌కుడు వైయ‌స్ జ‌గ‌న్ అని కొనియాడారు. 131 ఏళ్ల చ‌రిత్ర ఉన్న కాంగ్రెస్  పార్టీనే వైయ‌స్ జ‌గ‌న్‌ను ఏమీ చేయ‌లేక‌పోయింద‌ని, 33 ఏళ్ల టీడీపీ ఇంకేం చేస్తుంద‌ని  ప్ర‌శ్నించారు. సోనియాగాంధీ, చంద్ర‌బాబు కుమ్మ‌క్క వైయ‌స్ జ‌గ‌న్‌ను 16 నెల‌లు జైల్లో నిర్భందించినా కూడా తొణ‌కుండా, బెణ‌క‌కుండా ఎవ‌రి కాళ్లు కూడా ప‌ట్టుకోకుండా ఎదుర్కొంటున్న ధైర్య‌శాలీ.. మొన‌గాడు వైయ‌స్ జ‌గ‌న్ అన్నారు.  ఎవ‌రైనా త‌న నాయ‌క‌త్వంపై న‌మ్మ‌కంతో పార్టీలోకి రావాలంటే ముందుగా వారి ప‌ద‌వికి రాజీనామా చేయించి త‌న సొంత జెండా, అసెండాతో ప్ర‌జ‌ల్లోకి వెళ్లి ఆమోదం పొందిన యంగ్ అండ్ డైన‌మిక్ లీడ‌ర్ వైఎస్ జ‌గ‌న్ అన్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వ‌ర‌కు ముఖ్య‌మంత్రి  అయ్యేందుకు ఎన్నో అవ‌కాశాలు వ‌చ్చినా కూడా లెక్క చేయ‌లేద‌న్నారు. చంద్ర‌బాబు వైశ్రాయ్‌లో మీటింగ్ పెట్టిన విధంగా వైయ‌స్ జ‌గ‌న్ వ్య‌వ‌హ‌రించి ఉంటే వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి మ‌ర‌ణించిన త‌ర్వాత ఈ పాటికి ఎన్నిసార్లు సీఎం అయ్యేవారో ఆలోచించాల‌న్నారు. ప్ర‌తి  సంద‌ర్భంలో కూడా విలువ‌ల‌కు ప్రాముఖ్య‌త ఇవ్వాల‌ని, రాజ‌కీయాల్లో విలువ‌ల‌ను కాపాడాల‌ని ప్ర‌జ‌ల్లోకి వెళ్లి వారి ఆశీస్సులు పొందార‌న్నారు. ప్ర‌జ‌లు ఎప్పుడు అవ‌కాశం ఇస్తే అప్పుడు ప్ర‌భుత్వంలోకి వ‌చ్చి ప్ర‌జ‌ల‌కు న్యాయం చేయాల‌న్న ఆశ‌యంతో వైయ‌స్ జ‌గ‌న్ ముందుకు వెళ్తున్నార‌న్నారు. చంద్ర‌బాబు మాదిరిగా దొడ్డిదారిన అధికారంలోకి రావాల‌ని వైయ‌స్ జ‌గ‌న్  ఎప్పుడూ అనుకోలేద‌న్నారు. మా నాయ‌కుడికి ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు ఉంది. ఫేస్ వ్యాల్యూ త‌న తండ్రి ఆశీర్వాదం ఉంద‌ని టీడీపీ నాయ‌కుల‌కు గుర్తు చేశారు. ఈ రోజు అంద‌రి ఎమ్మెల్యేల‌తో రాజీనామా చేయించి ప్ర‌జా క్షేత్రంలోకి వెళ్లే ద‌మ్మూ, ధైర్యం వైయ‌స్ జ‌గ‌న్‌కు ఉంద‌న్నారు. మీకు ద‌మ్ము లేన‌ప్పుడు మ‌మ్మ‌ల్ని రాజీనామా చేయ‌మ‌ని కోరే హ‌క్కు లేద‌ని టీడీపీ నాయ‌కుల‌ను నిల‌దీశారు. ఇక‌నైన బుద్ధి తెచ్చుకొని ప్ర‌జ‌ల‌కు ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీలు నెర‌వేర్చాల‌న్నారు. మీకు క్యారెక్ట‌ర్ ఉంటే రైతులు, డ్వాక్రా మ‌హిళ‌ల‌కు అస‌లు, వ‌డ్డీతో స‌హా రుణాలు మాఫీ చేయాల‌న‌నారు. ప్ర‌తి ఇంటికో ఉద్యోగం ఇవ్వాల‌ని, లేదంటేనిరుద్యోగ భృతి ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు. ఆత్మ‌హ‌త్య‌ల‌ను నియంత్రించి.. సంబంధిత క‌ళాశాల‌ల యాజ‌మాన్యాల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు.
భ‌యంతోనే ఎమ్మెల్యేల కొనుగోలు
చంద్ర‌బాబుకు సొంత‌పార్టీ ఎమ్మెల్యేల‌పై న‌మ్మ‌కం లేక ప‌క్క‌పార్టీ ఎమ్మెల్యేల‌ను కొనుగోలు చేస్తున్నార‌ని వైయ‌స్ఆర్‌సీపీ నేత రోజా విమ‌ర్శించారు. న‌మ్ముకున్న కార్య‌క‌ర్త‌నైనా.. బంధువ‌నైనా వెన్నుపోటు పొడ‌వ‌గ‌ల నారా వారి సిద్ధాంతం చంద్ర‌బాబుది అన్నారు. ఆ సిద్ధాంతాన్ని ప‌క్క‌న పెట్టి ఏ సిద్ధాంతంతో తెలుగుదేశం పార్టీని స్థాపించారో వ్య‌వ‌స్థాప‌కుడు ఎన్‌టీ రామారావు ఆశ‌య సాధ‌నకు పాటుప‌డాల‌ని హిత‌వు ప‌లికారు. ప‌క్క‌పార్టీలో నాయ‌కుల‌ను తీసుకెళ్లినంత మాత్రానా బ‌ల‌ప‌డ‌ర‌న్నారు. టీడీపీ తెలంగాణ‌లో టీఆర్ ఎస్ లో విలీనం అయిన త‌రువాత విశ్వ‌స‌నీయ‌త కొల్పోయాన్నార‌న్నారు. ఆంధ్రాలో కూడా అదే పున‌రావృతం అవుతుంద‌న్న భ‌యంతో ఈ రోజు వైయ‌స్ఆర్ సీపీ ఎమ్మెల్యేల‌ను కొనుగోలు చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. కౌర‌వ సంత‌తి లాగా 102 మంది ఎమ్మెల్యేలు ఉన్నా కూడా ప‌క్క పార్టీ ఎమ్మెల్యేల‌ను కొంటున్నారంటే చంద్ర‌బాబుకు ఆ పార్టీ నేత‌ల‌పై న‌మ్మ‌కం లేన‌ట్లే అన్నారు.

రాజ‌కీయాల‌కు ప‌ట్టిన తుప్పు చంద్ర‌బాబు
రాజ‌కీయాల‌కు ప‌ట్టిన తుప్పు చంద్ర‌బాబు అని రోజా దుయ్య‌బ‌ట్టారు. మీ అడుగు జాడ‌ల్లోనే మీ అబ్బాయి లోకేష్ వెన్నుపోటు రాజ‌కీయాలు చేస్తున్నార‌ని విమ‌ర్శించారు. మీ అబ్బాయి ప‌ప్పు స‌న్నాఫ్ నిప్పు అంటున్నార‌ని, అది తుప్పు అని వ్యాఖ్యానించారు. ఇసుక మాఫియా నుంచి క‌ల్తీ మ‌ద్యం వ‌ర‌కు అవినీతి సొమ్ము కూడ‌గ‌ట్టుకున్నార‌ని ధ్వ‌జ‌మెత్తారు. ప్రాజెక్టులో సీఎస్‌లు సంత‌కం పెట్ట‌క‌పోయినా కూడా వేల కోట్ల‌లో  దోచుకున్నార‌న్నారు. కాల్‌మ‌నీ సెక్స్ రాకెట్లో కూడా లోకేష్ అనుచ‌రులు ఉన్నార‌ని ఆరోపించారు. ఇన్ని త‌ప్పులు చేసిన చంద్ర‌బాబు నేను త‌ప్పు చేసిన‌ట్లు నిరూపిస్తే రాజ‌కీయాల నుంచి త‌ప్పుకుంటా అన్న స్టేట్ మెంట్  సిగ్గు చేట‌న్నారు. అదే బాట‌లో చిన్న‌బాబు కూడా ప్ర‌క‌ట‌న‌లు చేస్తూ ఇంత చిన్న వ‌య‌సులో కూడా చిన్న త‌ప్పు కూడా దొర‌క‌కుండా జాగ్ర‌త్త ప‌డుతున్నారంటే భ‌విష్య‌త్‌లో రాష్ట్రానికి లోకేష్ వ‌ల్ల పెనుముప్పు ఉంద‌ని.. మొగ్గ‌లోనే ఆయ‌న త‌ప్పుడు ఆలోచ‌న‌లు తుంచి వేయాల‌ని రోజా కోరారు.

పార్టీ ఎందుకు మారారో అంద‌రికీ తెలుసు
ఇటీవ‌ల పార్టీ మారిన ఎమ్మెల్యేలు టీడీపీలోకి ఎందుకు వెళ్లారో అంద‌రికీ తెలుసు అని ఎమ్మెల్యే ఆర్కే రోజా పేర్కొన్నారు. మా నియోజ‌క‌వ‌ర్గంలో 20ఏళ్లుగా అభివృద్ధి జ‌ర‌గ‌లేదు అని భూమా అఖిల ప్రియ చెప్ప‌డం ఆశ్చ‌ర్యంగా ఉంద‌న్నారు. చాలా ఏళ్లుగా ఆ నియోజ‌క‌వ‌ర్గంలో వాళ్ల అమ్మ దివంగ‌త శోభానాగిరెడ్డి ఎమె్మ‌లే్య‌గా ఉన్నార‌ని గుర్తు చేశారు. ఆ నియోజ‌క‌వ‌ర్గంలో ఆవిడ‌ను చూసే ఎవ‌రైనా ఓట్లు వేస్తార‌న్నారు. అలాంటిది శోభానాగిరెడ్డి ప‌నిచేయ‌లేద‌ని వాళ్ల కూతురు చెప్ప‌డం బాధాక‌ర‌మ‌న్నారు. త‌న తండ్రిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టిన చంద్ర‌బాబుతో చేతులు క‌ల‌ప‌డం ఎంత‌వ‌ర‌కు న్యాయ‌మ‌న్నారు. ఆదినారాయ‌ణ‌రెడ్డి ఎందుకు పార్టీ మారారో అంద‌రికీ తెలుసు అన్నారు. అలాంటి అవ‌స‌రాలు మిగ‌తా ఎమ్మెల్యేల‌కు లేవ‌ని రోజా స్ప‌ష్టం చేశారు. ఇప్ప‌టికైనా ప్ర‌జ‌లు, మీ పార్టీ ఎమ్మెల్యేల మ‌న్న‌న‌లు పొందాలంటే ఎన్నిక‌ల్లో ఇచ్చిన వాగ్దానాలు నెర‌వేర్చాల‌ని రోజా హితువు ప‌లికారు. 

26 February 2016

అవినీతి సొమ్ముతో సిగ్గుమాలిన పనులు

బ్లాక్ మనీ సొమ్ముతో ఎమ్మెల్యేలకు ఎర
ఉంగరమే లేదన్న నీకు కోటాను కోట్లు..
ఎక్కడి నుంచి వచ్చాయి బాబు
బాబు కుంభకోణాల గురించి మీడియా ఎందుకు ప్రశ్నించడం లేదు
ఎవరూ పార్టీ వీడకపోయినా అదేపనిగా ఎందుకు రాస్తున్నారు
పోలీసులు, రిగ్గింగ్, డబ్బులతో రాజకీయాలు చేయలేరు
చంద్రబాబును ప్రజలు బంగాళాఖాతంలో కలిపేస్తారుః వైఎస్ జగన్


వైఎస్సార్ జిల్లాః  ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఉగంరం లేదు, గడియారంలేదు, చేతుల్లో డబ్బుల్లేవని మాట్లాడుతున్న చంద్రబాబుకు...కోటాను కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో ఓటుకు కోట్లు కేసులో ఆడియో వీడియో టేపులతో అడ్డంగా దొరికిపోయారు. పట్టిసీమ, గాలేరు నగరి లో కోట్ల స్కాం, ఇసుక నుంచి మట్టి దాకా స్కాం, మద్యం, జెన్ కో టెండర్లలో కుంభకోణాలు,  తాత్కాలిక సచివాలయం, పుష్కరాల్లో 1600 కోట్లు,  రాజధాని పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం, పేదల భూములు, దళిత భూములు దోచుకుంటున్నారు. ఇన్ని కుంభకోణాలు జరుగుతుంటే  అవేమీ పట్టించుకోకుండా...వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలపై తప్పుడు వార్తలు రాయడమేంటని కొన్ని మీడియా ఛానళ్లను ప్రశ్నించారు. 

చంద్రబాబు చెప్పినట్లు మీడియా ఆడడం మంచి పద్ధతి కాదన్నారు. దోచుకున్న అవినీతి సొమ్ముతో చంద్రబాబు నిస్సిగ్గుగా ఎమ్మెల్యేలను కొనే కార్యక్రమం చేస్తున్నారు.  ఆయన చేస్తున్న సిగ్గుమాలిన కార్యక్రమాలను తప్పుపట్టకుండా...ఎవరూ వైఎస్సార్సీపీ నుంచి పోకపోయినా పోతున్నారని ఎల్లో మీడియా ప్రచారం చేయడం దారుణమని వైఎస్ జగన్ మండిపడ్డారు. మీరు చేసే ప్రచారాల వల్ల నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారన్నారు. చంద్రబాబుకు ఇది ప్రజలతో జరుగుతున్న పోరాటామన్నారు. ప్రజల గొంతు నొక్కలేరని,  ఎవరూ పోయినా బాధపడాల్సిన పనిలేదన్నారు. టీడీపీలోకి వెళ్లినపోయిన నాయకులున్నచోట అంతకన్నా మంచి లీడర్లు వస్తారన్నారు. చినబాబు జిల్లాకు వస్తున్నారని ఆఖరికి కార్పొరేటర్లనైనా చేర్పించాలని టీడీపీ నాయకులు తెగ తాపత్రయపడడం విడ్డూరమన్నారు.  

చంద్రబాబును చూస్తే అసలు మనిషేనా అనిపిస్తోందని వైఎస్ జగన్ ఎద్దేవా చేశారు. రాక్షసుడిగా పుట్టాల్సింది మనిషిగా పుట్టాడని ఫైరయ్యారు.  బాబుకు దమ్మూ, ధైర్యం సిగ్గు, లజ్జ ఉంటే ఎన్నికలకు పోదాం రావాలన్నారు.  ప్రజలు ఎవరికి ఓటేస్తారో దాన్ని రెఫరెండం తీసుకుందామన్నారు. రాజీనామా చేయకుండా ఎమ్మెల్యేలను తీసుకోవడమేంటని ప్రశ్నించారు. లాక్కున్న వాళ్లను ఉపఎన్నికలకు వెళ్లలేని పరిస్థితిలో బాబు ఉన్నారని దుయ్యబట్టారు. ప్రజల్లోకి వెళ్లే సత్తా లేక భయపడుతున్నారన్నారు. పోలీసులు, రిగ్గింగ్ లు, డబ్బులతో రాజకీయాలు చేయలేరని, ప్రజలు తిరగబడితే చంద్రబాబు బంగాళాఖాతంలో కలిసిపోవడం ఖాయమన్నారు. 


చంద్రబాబు గ్రామాల్లో తిరిగే పరిస్థితి లేదని వైఎస్ జగన్ అన్నారు. రుణమాఫీ అన్నాడు. వడ్డీలు కూడా మాఫీ కాలేదని రైతులు గగ్గోలు పెడుతున్నారు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం వేలం వేస్తున్నారని రైతులు బాబును నిలదీస్తన్నారు. చంద్రబాబు కారణంగా రెండు రూపాయలు వడ్డీ కట్టాల్సి వస్తుందని, చంద్రబాబు లాంటి మోసగాడు లేడని డ్వాక్రామహిళలు అంటున్నారు. చదువుకునే పిల్లలు బాబును ద్వేషిస్తున్నారు. జాబు రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలన్నారు. కోటి 75 లక్షల ఇళ్లు నెలకు రూ.2వేలు ఎప్పుడు ఇస్తావని అడుగుతున్నారు. చంద్రబాబు నోట మోసం తప్ప ఇంకోటి రావడం లేదు. ప్రజలు, దేవుడు చంద్రబాబు పునాదులు కదుపుతారన్నారు. 

అధికారంలోకి వచ్చి 22 నెలలయంది. కొత్త ఇళ్లు సంగతి దేవుడెరుగు పాత ఇళ్లకు బిల్లులు కూడా రావడం లేదు. కరెంట్ బిల్లులు షాక్ కొడుతున్నాయి. నిత్యవసర ధరలు భగ్గుమంటున్నాయి. చంద్రబాబును ప్రజలు తిట్టిపోస్తున్నారు.  ప్రజల పక్షాన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు పోరాటాలు చేస్తున్నారని చంద్రబాబు అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. చంద్రబాబు ప్రలోభాలకు తలొగ్గకుండా..వైఎస్సార్సీపీలోనే ఉన్న 61 మంది ఎమ్మెల్యేలకు హ్యాట్సాప్ చెప్పారు. ప్రజల బాధలు కనపడకూడదని చంద్రబాబు వారి గొంతు నొక్కుతున్నారు. దాంట్లో బాగంగానే బ్లాక్ మనీతో పదవులు, డబ్బులు ఆఫర్ చేస్తున్నారని నిప్పులు చెరిగారు. 

తనకు తప్ప బాబు అందరికీ ఫోన్లు కొడుతున్నారు. ఎల్లో చొక్కాలు వేసుకున్న ఛానళ్లు అదేపనిగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు వెళ్లిపోతున్నారని వార్తలు రాస్తున్నారు. మా ఎమ్మెల్యేలు ఖండించినా...ఒకటి రెండు రోజులు ఆగి మళ్లీ మొదలుపెడుతున్నారు. చంద్రబాబు బ్లాక్ మనీ గురించి ఎందుకు ప్రశ్నించడం లేదు. మీ మనస్సాక్షిని మీరే ప్రశ్నించుకోండి. మీరు రాయడం వల్ల ఎమ్మెల్యేలకు ఫోన్లు వస్తున్నాయి. పోకముందే బండ వేయడం తగదు. మానవత్వంతో వ్యవహరించాలి.  చంద్రబాబు ప్రజల విశ్వాసం కోల్పోయారు. ఇంత డబ్బులు ఆఫర్ చేస్తున్నా ఐదుగురు పోయారు. మునిగిపోయే పడవలోకి ఎవరూ వెళ్లరు. ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకోవాలి గానీ ఇలా అడ్డదారిన దిక్కుమాలిన పనులు చేయడం దుర్మార్గమన్నారు

25 February 2016

బాబుకు వైఎస్ జగన్ బహిరంగ సవాల్

ఆఫర్లు ఇచ్చి మరీ అవినీతి సొమ్ముతో..
దొడ్డిదారిన ఎమ్మెల్యేలను లాక్కుంటున్నాడు
హామీలు నెరవేర్చని బాబును ప్రజలు తిట్టిపోస్తున్నారు
ప్రజల్లోకి వెళ్లే ధైర్యం లేక..ప్రతిపక్షం గొంతు నొక్కుతున్నాడు
చంద్రబాబుకు దమ్మూ,ధైర్యం ఉంటే..
ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు రావాలి

వైఎస్సార్ జిల్లాః అవినీతి సొమ్ముతో దొడ్డిదారిన ఎమ్మెల్యేలను కొంటూ చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నారని...ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మండిపడ్డారు. ఆనాడు అధికారం కోసం ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచి ఎమ్మెల్యేలను లాక్కున్నాడని, ఇవాళ పదవులు, డబ్బులు ఎర చూపి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్నాడని ధ్వజమెత్తారు. వైఎస్సార్ జిల్లా పర్యటనలో భాగంగా బద్వేల్ కు వచ్చిన వైఎస్ జగన్...అక్కడ మీడియాతో మాట్లాడారు. 


చంద్రబాబుకు ఏమాత్రం దమ్మూ, ధైర్యం, సిగ్గు,లజ్జ ఉన్నా...ప్రలోభాలతో చేర్చుకున్న ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించాలని జననేత సవాల్ విసిరారు. అప్పుడు ఎన్నికలకు వెళ్దాం,  ప్రజలు ఎవరి వైపున నిలబడతారో తెలుస్తోందన్నారు. తన సవాల్ ను  ఛాలెంజ్ గా తీసుకునే సత్తా ఉందా అని బాబును ప్రశ్నించారు. ఎమ్మెల్యేలను కొంటే ప్రభుత్వాలు నిలబడవని, ప్రజల గుండెల్లో స్థానం సంపాదిస్తేనే ప్రభుత్వాలు నిలబడతాయన్నారు. ప్రజల ఆదరాభిమానాలే తనను నిలబెడుతున్నాయని, ఎక్కడికెళ్లినా నీకు మేమున్నామంటూ భరోసా కల్పిస్తున్నారని వైఎస్ జగన్ ఉద్విఘ్నంగా మాట్లాడారు. 


పార్టీ పెట్టిన రోజు నేను, అమ్మ మాత్రమే ఉన్నామని వైఎస్ జగన్ చెప్పారు. ఆతర్వాత రాజీనామా చేసి ఎన్నికలకు పోయి 18 మంది ఎమ్మెల్యేలను సంపాదించుకున్నామన్నారు. ఆ 18 ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ప్రజల అండతో ఎన్నికల్లో  గెలిచామన్నారు. అలా ఇద్దరం 18 మంది, 18 నుంచి 67 మంది ఎమ్మెల్యేలం అయ్యామన్నారు. నలుగురైదుగురు పోయినంత మాత్రాన పార్టీకి ఏమీ కాదన్నారు. టీడీపీలోకి వెళ్లిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో అంతకంటే మెరుగైన నాయకులు వస్తారని వైఎస్ జగన్ స్పష్టం చేశారు.  

పట్టిసీమ నుంచి బొగ్గుదాక, ఇసుక నుంచి మట్టి దాకా, జెన్ కో టెండర్లు, ప్రాజెక్ట్ లలో విచ్చలవిడిగా చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని వైఎస్ జగన్ ఫైరయ్యారు. అలా వచ్చిన అక్రమ సొమ్ముతో ఎమ్మెల్యేలను ఎర వేస్తున్నారని దుయ్యబట్టారు. ఒక్కో ఎమ్మెల్యేకు రూ. 20 నుంచి 30 కోట్లు, మంత్రి పదవులు, మైనింగ్ ఆఫర్లు ఇస్తున్నాడని తూర్పారబట్టారు. ఇంకో ఏడాదిపోతే టీడీపీ ఎమ్మెల్యేలే తమ పార్టీలోకి వస్తారని...అప్పుడు నైతికంగా రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్తామన్నారు. 

రైతులు, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ అన్నాడు, బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే బాబు రావాలన్నాడు. ఇంటికో ఉద్యోగమన్నాడు. ఉద్యోగం లేని వారికి నెలకు రూ. 2వేల నిరుద్యోగ భృతి అన్నాడు. ఇలా ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానం నెరవేర్చకుండా చంద్రబాబు ప్రజలను మోసగించారని వైఎస్ జగన్ నిప్పులు చెరిగారు. ప్రజలు చంద్రబాబును తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారన్నారు.  ప్రజల్లోకి వెళ్లే ధైర్యం లేకనే....ప్రజల ఘోష వినిపిస్తున్న ప్రతిపక్షం గొంతు నొక్కుతున్నాడని బాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

24 February 2016

62 మంది మా వెంట ఉన్నారు. వారు అందరికీ నా హ్యాట్సాఫ్

* కుటుంబ సభ్యులు అనుకొన్న వారినే ప్రలోభ పెట్టారు
* ఎన్ని ప్రలోభాలు పెట్టినా 62 మంది వెళ్లనేలేదు
* మా తో మిగిలిన సభ్యులకు మా హ్యాట్సాఫ్
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్ని ప్రలోభాలు పెట్టినా పార్టీని వీడకుండా ప్రజల తరపున నిలిచిన 62 మంది ఎమ్మెల్యేలను అభినందిస్తున్నట్లు ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ హ్యాట్సాఫ్ చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న నీచపు పనుల్ని ప్రజలంతా గమనిస్తున్నారని ఆయన అభిప్రాయ పడ్డారు. త్వరలోనే తగిన శాస్తి జరుగుతుందని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ అంశాలకు సంబంధించిన నాలుగు ముఖ్యమైన అంశాల మీద రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసి వినతి పత్రం ఇచ్చిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడారో.. ఆయన మాటల్లోనే..!
       నిస్సిగ్గుగా చంద్రబాబు నాయుడు నలుగురు ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టి, కోట్లాది రూపాయిలు ఇచ్చి , మంత్రి పదవుల్ని ఎర చూపి ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేస్తూ చంద్రబాబు నాయుడు చేసే పనుల్ని చూస్తే ప్రజాస్వామ్యం సిగ్గుపడుతుంది. ఈ పనుల్ని చూస్తే బాధ అనిపించింది. బాగా దగ్గరగా ఉన్న కుటుంబసభ్యులు అనుకొన్న మనుషుల్ని ప్రలోభ పెట్టి తీసుకెళ్లటం బాధ అనిపించింది. భూమా నాగిరెడ్డి అన్న గురించి చెబుతున్నాను. అప్పట్లో శోభమ్మ చనిపోతే నా కుటుంబసభ్యులు అంతా.. మా శ్రీమతి భారతి, అమ్మ విజయమ్మ, చెల్లెలు షర్మిలమ్మ హాజరు అవటం జరిగింది. తర్వాత స్మరణ దినం రోజున కుటుంబ సభ్యులం అంతా హాజరు అయ్యాం. అటువంటి వ్యక్తికి మంత్రి పదవి ఎర చూపి తీసుకొని వెళ్లారు. మంత్రులే స్వయంగా కోట్ల రూపాయిలు ఎర చూపుతున్నారు. మిగిలిన వారిని ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.  ప్రలోభ పెట్టేందుకు స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే రంగంలోకి దిగి ప్రయత్నించినా కేవలం నలుగురిని మాత్రమే తీసుకొని పోగలిగారు. మిగిలిన వారంతా అంటే62 మంది మా వెంట ఉన్నారు. వారు అందరికీ నా హ్యాట్సాఫ్.   ప్రలోభ పెట్టి పెట్టినా ప్రజల తరపున నిలిచిన సభ్యులు వీరంతా..!
          ఎవరైతే పార్టీ మారారో ఆ నలుగురు సభ్యులు గుండెల మీద చెయ్యి వేసుకొని మనస్సాక్షిని ఒక విషయం అడగాలి. చంద్రబాబు నాయుడు భేషరతుగా మాఫీ చేస్తానని చెప్పిన రైతుల్ని అడగాలి. మొత్తంగా 7,300 కోట్ల రూపాయిలు మాత్రమే రుణమాఫీ కి విడుదల చేశారు. వాస్తవానికి చంద్రబాబు హామీ ఇచ్చేటప్పటికే రూ. 87, 612 కోట్ల రూపాయిల అప్పులు ఉన్నాయి. దీనికి వడ్డీయే ఇప్పటికి రూ. 24 వేల కోట్ల రూపాయిలు అయింది. అటువంటప్పుడు ఈ వడ్డీ లో మూడో వంతు మాత్రమే విడుదల చేసి మాఫీ అయిపోయిందని చెబుతున్న చంద్రబాబు పార్టీలోకి వెళ్లటం ఎంత వరకు న్యాయమో ప్రజలు అడిగితే ఏం చెబుతారు.
       డ్వాక్రా అక్క చెల్లెమ్మలు అడిగితే ఏం జవాబు చెబుతారో ఆలోచించుకోవాలి. మొత్తంగా రుణమాఫీ చేస్తానని చెప్పి చేయకుండా తప్పించుకొని తిరుగుతున్న చంద్రబాబుని నిలదీయాల్సింది పోయి అటువైపు పోతే అక్క చెల్లెమ్మలు అడిగే ప్రశ్నలకు ఏం జవాబు చెబుతారు అనేది ఆలోచించుకోవాలి. ఇటు, నిరుద్యోగులకు ఇంటికో ఉద్యోగం ఇస్తానని హామీ ఇచ్చారు. జాబులు ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగాల్ని ఊడబెరుకుతున్నారు. పూర్తిగా మోసం చేసిన చంద్రబాబు గురించి నిరుద్యోగులు అడిగితే ఏం చెబుతారు. ఇక, పేదలకు ఇళ్లు కట్టిస్తానని ఎన్నికల సమయంలో ఊదర గొట్టారు. ఇప్పుడు ఊరికి రెండు ఇళ్లు కూడా కట్టి ఉండరు కదా. దీని మీద రేపు ప్రజలు అడిగితే ఏం జవాబు చెబుతారు. మంత్రి పదవులు, డబ్బుల కోసం వెళ్లిపోతే ఏం జవాబు చెబుతారు అనేది మనస్సాక్షిని అడగాల్సి ఉంటుంది.
       

23 February 2016

చంద్రబాబుకి నీతి, నిబద్దతత ప్రజాస్వామ్య విలువలు తెలుసా...?

బాబు వాపు చూసి బలుపు అనుకుంటున్నాడు
దొంగకేసులు, అక్రమ సూట్ కేసులతో ప్రలోభ పెట్టి..
ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్నాడు
ఎప్పుడు ఎన్నికలొచ్చినా టీడీపీ కుప్పకూలుతుంది
వైఎస్ జగన్ కు రాష్ట్రనాయకత్వాన్ని అప్పగించాలని..
ప్రజలు ఆతృతగా ఎదురుచూస్తున్నారుః జ్యోతుల

హైదరాబాద్ః వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, శాసనసభా పక్ష ఉనేత జ్యోతుల నెహ్రూ టీడీపీ సర్కార్ పై నిప్పులు చెరిగారు. చంద్రబాబు రాష్ట్రంలో రాజకీయ వ్యాపారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలు పరిపాలన చేయమని అధికారమిస్తే.....ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ బాబు నీతిమాలిన రాజకీయాలు చేస్తున్నాడని దుమ్మెత్తిపోశారు.  రాష్ట్రంలో వైఎస్సార్సీపీ బలోపేతాన్ని చూసి ఓర్వలేక పార్టీని నిర్వీర్యం చేయాలన్న కుట్రతో ... చంద్రబాబు నీచ సంస్కృతికి పాల్పడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. దొంగ కేసులు, అక్రమ సూట్ కేసులతో ప్రలోభ పెట్టి చంద్రబాబు ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్నారని మండిపడ్డారు. 

చంద్రబాబుకు దమ్ముంటే పార్టీలో చేరిన వారితో రాజీనామా చేయించి ఎన్నికలకు సిద్ధం కావాలని జ్యోతుల సవాల్ విసిరారు. భూమా నాగిరెడ్డికి వైఎస్సార్సీపీ ఇంకో అవకాశం ఇస్తుందని...నియోజకవర్గంలో కోరుకున్న వ్యక్తిని తనపై పోటీకి ఎంచుకొని గెలవాలని ఛాలెంజ్ చేశారు. ఎన్నికలు ముగిసిన వెంటనే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన  ఇద్దరు వైఎస్సార్సీపీ ఎంపీలను ప్రలోభ పెట్టి పార్టీలోకి తీసుకున్న చంద్రబాబు... అధికారదాహం చాలక ఇప్పుడు మరో నలుగురు ఎమ్మెల్యేలు, ఓ ఎమ్మెల్సీని చేర్చుకోవడంపై  జ్యోతుల ధ్వజమెత్తారు.  మాట్లాడితే నీతి, నిబద్ధత అని మాట్లాడే చంద్రబాబుకు...ఏమాత్రం ప్రజాస్వామ్య విలువలు తెలుసో అర్థం కావడం లేదని ఎధ్దేవా చేశారు.  ఎన్నికల హామీలు నెరవేర్చని చంద్రబాబుపై అన్ని వర్గాల ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని జ్యోతుల అన్నారు. 

కేసీఆర్ టీడీపీ ఎమ్మెల్యేలను దౌర్జన్యంగా తీసుకుంటున్నారని మాట్లాడిన చంద్రబాబు..మరి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను తీసుకోవడం ఏవిధంగా నిబద్ధత అనిపించుకుంటుందో చెప్పాలన్నారు. హామీలు అమలు చేసే చిత్తశుద్ధి లేక...జిమ్మిక్కులతో పార్టీని బలహీనపర్చాలన్న దురాలోచనతో చంద్రబాబు కుయుక్తులు పన్నుతున్నాడని జ్యోతుల ఫైరయ్యారు. బాబు నీవు ఎంత ఇలాంటి కార్యక్రమాలు చేస్తే అంత కుప్పకూలిపోవడం ఖాయమన్నారు. రోజురోజుకు  టీడీపీ బలహీనపడుతుందునే చంద్రబాబు నీతిమాలిన పనులు చేస్తున్నాడన్నది తేటతెల్లం అవుతుందన్నారు. బాబు చిన్నగీత పక్కన పెద్ద గీత గీస్తూ వాపును చూసి బలుపు అనుకుంటున్నాడని దుయ్యబట్టారు. 

ప్రజలు వైఎస్ జగన్ ను విశ్వసిస్తున్నారని జ్యోతుల తెలిపారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా...  వైఎస్ జగన్ కు రాష్ట్ర నాయకత్వం అప్పగించాలని ఆతృతతో ఎదురుచూస్తున్నారని చెప్పారు. అది గ్రహించే చంద్రబాబు నీచ పనులు చేస్తున్నాడన్నారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడితే  టీడీపీ నిర్వీర్యం అవ్వడం ఖాయన్నారు. నీ మైండ్ గేమ్ కు లొంగే వ్యక్తులు పోయారని, ఇక  నీవు సాధించేదేమీ లేదన్నారు. పార్టీ వీడిన వారిపై పార్టీ పరంగా, లీగల్ గా అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలు కూడా చంద్రబాబుపై చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నారని, సరైన సమయంలో తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. 

అక్కడ అవినీతి చేసేందుకు తెలుగుదేశం నాయకులు పథక రచన చేస్తున్నారు

* క్రిష్ణా పుష్కరాల్లోనూ అదే దోపిడీ
* నామినేషన్ పద్దతిలోనే పనులు
* రూ. 2,200 కోట్ల మేర దోపిడీకి స్కెచ్
విజయవాడ) తెలుగుదేశం పార్టీ నాయకులకు క్రిష్ణా పుష్కరాలు అనుకోని వరంగా నిలుస్తున్నాయి. ఆగస్టు 12 వ తేదీ నుంచి ప్రారంభం అయ్యే పుష్కరాల్లో పెద్ద ఎత్తున అవినీతి చేసేందుకు తెలుగుదేశం నాయకులు పథక రచన చేస్తున్నారు. గోదావరి పుష్కరాల్లో అనుసరించిన వ్యూహాన్నే ఇక్కడ అనుసరించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.
అప్పుడు ఏం జరిగింది.
పుష్కరాలు అనేవి అప్పటికప్పుడు వచ్చి పడేవి కానే కావు. పన్నెండేళ్లకోసారి జరిగే ఈ క్రతువు గురించి ముందే తెలుసు. అయినా సరే, గోదావరి పుష్కరాల సమయంలో సమయం దగ్గర పడే దాకా చంద్రబాబు ప్రభుత్వం ఎటువంటి ప్రయత్నాలు, సమీక్షలు జరపలేదు. తీరా సమయం దగ్గరకు వచ్చాక హడావుడిగా పనులు మొదలు పెట్టింది. సమయం లేదని వంక చూపించి దాదాపుగా అన్ని పనులు నామినేషన్ పద్దతిలో అప్పగించేశారు. అంటే టెండర్లు పిలవటం, విచారణ జరపటం అన్నది లేకుండా తెలుగుదేశం నాయకులకు ఎడాపెడా పనులు అప్పగించేశారు. దీంతో అవినీతి అన్ని చోట్ల కంపు కొట్టింది. అంతకు ముందు పుష్కరాలకు రూ. 100 కోట్లు ఖర్చు పెడితే ఒక్కసారిగా ఈ మొత్తాన్ని రూ. 16వందల కోట్లకు పెంచేశారు. అయిన కాడికి దోచుకొన్నారు.
ఇప్పుడు ఏం జరగబోతోంది...!
ఇప్పుడు కూడా చంద్రబాబు ప్రభుత్వం అదే టెక్నిక్ ను ఉపయోగిస్తోంది. పుష్కరాలకు ఆరు నెలల సమయం ఉంది. ఒక పద్దతి ప్రకారం ఏర్పాట్లు చేసుకొనేందుకు చాలినంత గడువు ఉంది. అయినా సరే, తిరిగి నామినేషన్ పద్దతినే నమ్ముకొని ముందుకు వెళుతోంది. తెలుగుదేశం నాయకులు అడ్డగోలుగా దోచుకొనేందుకు వీలుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీని బట్టి తెలుగుదేశ నాయకుల బరితెగింపు అర్థం అవుతోంది. సుదీర్ఘ సమయం పాటు మంత్రివర్గ సమావేశం జరిగితే అందులో పుష్కరాల గురించి ప్రస్తావన లేకపోవటం గమనార్హం. దీన్ని బట్టి చూస్తే తిరిగి మొత్తంగా డబ్బులు దోచేసేందుకు ప్రయత్నాలు జరగుతున్నాయని అర్థం అవుతోంది. 

22 February 2016

చంద్రబాబుకి ఆ టైటిల్ కలిసోచ్చిందా లేదా..

* చంద్రబాబు సింగపూర్ దోపిడీకి భయపడుతున్న అధికారులు
* నో చెప్పిన అధికారుల మీద వేటు
* ముగ్గురిని పక్కకు తప్పించిన వైనం
హైదరాబాద్: రాజధాని ప్రాంతంలో కోట్ల రూపాయిల ఆస్తుల్ని సింగపూర్ కు తరలించేందుకు చంద్రబాబు చేస్తున్న కుట్రల్ని చూసి ఉన్నతాధికారులు భయపడుతున్నారు. చెప్పిన చోట సంతకాలు పెట్టాల్సిందేనని బెదిరిస్తుండటంతో తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. మరీ మొండికేస్తే పదవుల నుంచి తప్పించేందుకు కూడా వెనుకాడటం లేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి పదవిలో ఇప్పటి దాకా ముగ్గురిని మార్చారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
       రాజధాని ప్రాంతంలో జరుగుతున్న వ్యవహారాలన్నీ అవినీతి, అక్రమాలతోనే నిండిపోయాయి. సింగపూర్ కు చెందిన అసెండాస్.. సెమ్జ్ కార్ప్..సిన్ బ్రిడ్జ్ కన్సార్టియమ్ కు మొత్తం దోచి పెట్టేందుకు ప్రభుత్వం చేయని ప్రయత్నం లేదు. మొట్ట మొదట పురపాలక శాఖ కు నాయకత్వం వహించిన సాంబశివరావు ఈ విషయంలో చురుగ్గా వ్యవహరించారు. కానీ లోతుకు వెళ్లే కొద్దీ బుసలు కొడుతున్న అవినీతి ని చూసి హడలి పోయారు. అడ్డగోలుగా సంతకాలు పెట్టేందుకు నిరాకరించటంతో ఆయన్ని   పక్కకు సాయం పెట్టేశారు. టీటీడీ ఈ వో గా బదలీ చేసి సీనియర్ అధికారి గిరిధర్ ను నియమించారు. తర్వాత కాలంలో కార్యకలాపాల్ని ఆయన కనుసన్నల్లో నడిపించారు. కానీ అడ్డగోలుగా జీవో లు జారీ చేయటానికి ఆయన వెనుకంజ వేశారు. అంతే గాకుండా ప్రభుత్వం చేస్తున్న తప్పుడు పనుల మీద ఆయన ప్రశ్నలు వేసి ఫైల్స్ లోనే కొర్రీలు వేశారు. దీనికి చంద్రబాబు అండ్ కో కి చాలా కోపం వచ్చింది. దీంతో ఆయన్ని ఏ మాత్రం ప్రాధాన్యం లేని ఏపీపీఎస్సీ కార్యదర్శి పదవికి మార్చేశారు. రాష్ర్టంలో రెండేళ్లుగా ఒక్క నోటిఫికేషన్ విడుదల చేయని ఏపీపీఎస్సీ కి పోస్టింగ్ అంటే ఏ రీతిలో అవమానించారో అర్థం చేసుకోవచ్చు.
తర్వాత పురపాలక శాఖ కార్యదర్శిగా వ్యవహరిస్తున్న అజయ్ జైన్ , పదవి రీత్యా రాజధాని నగర అభివ్రద్ది యాజమాన్య సంస్థ కు ఛైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. రాజధాని ప్రాంతంలో మాస్టర్ డెవలపర్ ను ఎంపిక చేయటంలో ఈ సంస్థ ది కీలకపాత్ర.      చంద్రబాబు చెప్పినట్లు చేయటంలో అజయ్ జైన్ కూడా వెనుకడుగు వేశారన్నది సెక్రటేరియట్ వర్గాల కథనం. ముఖ్యంగా స్విస్ ఛాలెంజ్ పద్థతిలో మాస్టర్ డెవలపర్ ను ఎంపిక చేయించాలన్నది చంద్రబాబు ఉద్దేశ్యం. దీనికి అజయ్ జైన్ ఒప్పుకోలేదని తెలుస్తోంది. పైగా థానే ఇళ్ల నిర్మాణం కేసులో సుప్రీంకోర్టు స్విస్ చాలెంజ్ మీద రూపొందించిన మార్గదర్శకాల్ని ఆయన ఉదహరించినట్లు తెలుస్తోంది. దీంతో చంద్రబాబు కోటరీ కి మింగుడు పడలేదు. దీంతో అజయ్ జైన్ ను అకస్మాత్తుగా సీసీడీఎంసీ చైర్ పర్సన్ పదవి నుంచి తొలగించినట్లు సమాచారం. ఈ పదవిలో రిటైర్డ్ అధికారి లక్ష్మీ పార్థ సారధి ని నియమించినట్లు తెలుస్తోంది. దీంతో చంద్రబాబు పాచిక పారటానికి మార్గం సుగమం అయింది.  

20 February 2016

తుదివరకు వైఎస్ జగన్ తోనే ఉంటాంః ఎస్వీ

టీడీపీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది
అవినీతి ఆరోపణల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే..
బాబు మైండ్ గేమ్ రాజకీయాలు ఆడుతున్నారు
తుదివరకు వైఎస్ జగన్ తోనే ఉంటాంః ఎస్వీ

హైదరాబాద్ః  టీడీపీ సర్కార్ కుట్ర రాజకీయాలను కర్నూలు జిల్లా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు తిప్పికొట్టారు. పార్టీ మారుతున్నారంటూ  మీడియాలో వచ్చిన వార్తలను ముక్తకంఠంతో ఖండించారు. ఎన్నికల హామీలు నిలబెట్టుకోలేక..చంద్రబాబు మైండ్ గేమ్ రాజకీయాలు ఆడుతున్నారని ఎస్వీ మోహన్ రెడ్డి మండిపడ్డారు. పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిన టీడీపీ ప్రభుత్వంపై... ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని ఎస్వీ అన్నారు. దానిలో భాగంగానే టీడీపీ ఇలాంటి ప్రచారాలు మొదలుపెట్టిందని ధ్వజమెత్తారు. 

వైఎస్సార్సీపీ గుర్తుపైనే తాము గెలిచామని, తుది వరకు తాము వైఎస్ జగన్ తోనే కొనసాగుతామని ఎస్వీ స్పష్టం చేశారు. వైఎస్ జగన్ నాయకత్వంలోనే నడుస్తామన్నారు. టీడీపీ మునిగిపోయే నావ అని...అలాంటి పార్టీలోకి ఎవరూ వెళ్లరని ఎస్వీ అన్నారు. తమను సంప్రదించకుండా ఛానల్ లో  తమ పేర్లు రాయడం సరికాదన్నారు. ప్రజల్లో అపోహలు సృష్టించడం తగదన్నారు.  తమ భవిష్యత్తుకు క్వశ్చన్ మార్కు పెట్టొద్దని మీడియాకు విజ్ఞప్తి చేశారు. ఇకనైనా స్క్రోలింగ్ లో వస్తున్న వార్తలను నిలిపేయాలన్నారు. 

ప్రజాసమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలపై చర్చించేందుకే తాము వైఎస్ జగన్ ను కలిశామని ఎస్వీ చెప్పారు.  వైఎస్సార్సీపీని వీడే ప్రసక్తే లేదని  తేల్చిచెప్పారు.  టీడీపీ తన అవినీతి ఆరోపణల నుంచి ప్రజలను మభ్యపెట్టేందుకే... మైండ్ గేమ్ రాజకీయాలు ఆడుతోందని దుయ్యబట్టారు.  వైఎస్సార్సీపీ వీడాల్సిన అవసరం తమకు లేదన్నారు.  ప్రజలకు మొహం చూపించలేకపోతున్నామని టీడీపీ ఎమ్మెల్యేలే తమతో చెబుతున్నారని ఎస్వీ తెలిపారు. స్వార్థపరులే పార్టీని వీడుతారన్నారు. 

భూమా నాగిరెడ్డి వైఎస్సార్సీపీలోనే ఉంటారని ఎస్వీ ఘంటాపథంగా చెప్పారు.  ఆయన పార్టీ మారుతున్నట్లు ఎక్కడా ప్రకటించలేదన్నారు. ఆయనకు పార్టీ అత్యంత ప్రాధాన్యత ఇచ్చిందని, పీఏసీ చైర్మన్ గా కూడా ఉన్నారని తెలియజేశారు.  పార్టీలో భూమా ఎంతో సంతృప్తిగా  ఉన్నారన్నారు. టీడీపీలోకి ఎవరినో ఒకరిని లాక్కోవాలన్న దురుద్దేశ్యంతోనే టీడీపీ కుట్ర రాజకీయాలు చేస్తోందని ఎస్వీ ఆగ్రహం వ్యక్తం చేశారు.  ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతతో చంద్రబాబు భయాందోళనతో ఉన్నారని ఎస్వీ అన్నారు. 

ముఖ్యమంత్రి అయ్యాక ఒక్కసారిగా స్టయిల్ మార్చిన చంద్రబాబు

* రాష్ట్రానికి ఒక్క ప్రాజెక్టు దక్కలేదు
* రుణమాఫీ వంటి హామీలు అమలు చేయలేదు
* ప్రత్యేక విమానాల్లో ప్రయాణాలు మాత్రం చేస్తున్నారు.
హైదరాబాద్: ముఖ్యమంత్రి గా చంద్రబాబు అధికారంలోకి వచ్చి దాదాపు 20 నెలలు దాటుతోంది. ఎంతో చేస్తాం.. ఏదేదో చేస్తాం అంటూ గ్రాఫిక్ మాయా జాలం చూపించి గద్దె నెక్కిన చంద్రబాబు .. ప్రజలకు ఉపయోగ పడే పని ఒక్కటంటే ఒక్కటి చేయలేదు. కానీ, ప్రజల సొమ్ముని మాత్రం విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారు.
          చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక ఒక్కసారిగా స్టయిల్ మార్చేశారు. ప్రయాణాలకు విమానాల వాడకం ఎక్కువైంది. అది కూడా ప్రత్యేక విమానాలు బుక్ చేసుకొని వాటి మీద ప్రయాణం సాగిస్తున్నారు. రాష్ట్రంలో హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి మద్య ఈ ప్రత్యేక విమానం తీసుకొని, దాంట్లో ప్రయాణం సాగిస్తున్నారు. నగరాల మధ్య కూడా విమానాల్నే పెద్ద సంఖ్యలో వినియోగిస్తున్నారు. వందల సంఖ్యలో విమాన ప్రయాణాలు చేస్తున్నారు.  ఈ ఖర్చంతా వెరిసి ప్రజల నెత్తినే పడుతోంది. చంద్ర‌బాబు అధికారంలోకి వ‌చ్చిన త‌ర‌వాత 23 సార్లు దేశ రాజ‌ధానికి వెళ్ళారు. మొత్తం 27 రోజు లు అక్క‌డ గ‌డిపారు. ద‌క్షిణాదిలోని ఐదు రాష్ట్రాల‌లో ఏ ముఖ్య‌మంత్రీ ఈ ఘ‌న‌త సాధించ‌ లేదు. ఫ‌లిత‌మేమైనా ద‌క్కిందా అంటే అదీ లేదు. శంకుస్థాపన సమయంలో చెంబుడు నీళ్లు, చెంబుడు మట్టి తప్ప నేరుగా కేంద్రం నుంచి కొత్త ప్రాజెక్టుని సంపాదించలేదు. పైగా విభజన చట్టంలో హామీ ఇచ్చిన విద్యాసంస్థల్నే పూర్తిగా ఏర్పాటు చేయలేదు.
         ఇక, విదేశీ ప్రయాణాల గురించి చెప్పనే అక్కర లేదు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ప్రత్యేక విమానాల్లో మందీ మార్భలం వెంట పెట్టుకొని చక్కర్లు కొట్టి వస్తున్నారు. ఆసియాలోనే ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసుకొని ఐదు దేశాల్లో పర్యటించారు. మొత్తం ఏడుసార్లు విదేశీ యాత్రలు చేశారు. దాదాపు 30 రోజులు అక్క‌ డ గ‌డిపారు. రెండుసార్లు సింగ‌పూర్, జపాన్‌, దావోస్‌ వెళ్ళారు. కానీ రాజధాని పేరుతో వేల ఎకరాలు చంద్రబాబు సింగపూర్ బినామీ సంస్థలకు ఇచ్చేశారు తప్పితే విదేశీ సంస్థలేమీ తమ ప్రాజెక్టులను ఇక్కడ ఏర్పాటు చేయలేదు.
        చంద్రబాబు చలవతో కొత్త ప్రాజెక్టులేమీ రానే రాలేదు. కనీసం విభజన చట్టంలో హామీలను అమలు చేయటానికి కేంద్రం మీద ఒత్తిడి తేలేదు. ఫలితంగా  2014-15లోని 7300కోట్ల లోటు బ‌డ్జెట్.. 2016-17కి 16 వేల కోట్ల రూపాయ‌ల‌కు చేరుకుంటోంది. అయినప్పటికీ చంద్రబాబు ఏమాత్రం తగ్గకుండా యాత్రల జోరుని కొనసాగిస్తున్నారు. 

19 February 2016

ఆలస్యానికి అసలు కారణం అభిమానమే...

* జ‌నంతో మ‌మేకం అయిపోయే జ‌న నేత‌
* వైఎస్ జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌ల్లో క‌నిపించే ఆద‌ర‌ణ‌
* అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌తో క‌లిసిపోయే ఆప్యాయ‌త‌

హైద‌రాబాద్‌: జ‌న నేత వైఎస్ జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌ల్లో అడుగడుగునా ఒక ఒర‌వ‌డి క‌నిపిస్తుంది. ప్ర‌జ‌ల్లోకి వెళ్ల‌టం, ప్ర‌జ‌ల స‌మ‌క్షాన నిల‌బ‌డ‌టం, ప్ర‌జ‌ల్లో ఒక‌డిగా పోరాడ‌టం ఆయ‌న త‌త్వం. క్ర‌మం త‌ప్ప‌కుండా ఆయ‌న జ‌రుపుతున్న ప‌ర్య‌ట‌న‌ల్లో ఈ విష‌యం బోధ ప‌డుతుంది. వారం రోజుల్లో ఆంధ్ర రాష్ట్రం న‌లు చెర‌గులా ఆయ‌న ప‌ర్య‌ట‌న‌లు సాగాయి. ఈ స‌మ‌యంలో అదే ఒర‌వ‌డి వ్య‌క్తం అయింది.

ఈ వారం ప్రారంభంలో వైఎస్ జ‌గ‌న్ శ్రీకాకుళం జిల్లా ప‌ర్య‌ట‌న‌కు వెళ్లారు. అక్క‌డ దివంగ‌త మ‌హానేత వైఎస్సార్ విగ్ర‌హాల్ని ఆవిష్క‌రించేందుకు వెళ్లారు. ఉద‌యం విశాఖ ఎయిర్ పోర్టులో దిగిన జ‌న నేత ఆవిష్క‌ర‌ణ స్థ‌లికి వెళ్లేస‌రికి మ‌ధ్యాహ్నం అయిపోయింది. దారి పొడ‌వునా నాలుగు, అయిదు సార్లు ఆయ‌న గ్రామాల కూడ‌ళ్ల దగ్గ‌ర ఆగారు. వైఎస్ జ‌గ‌న్ రాక‌ను తెలుసుకొని స్థానిక నాయ‌కులు ప‌ల‌క‌రించేందుకు ఉద్యుక్తులు అయ్యారు. గ్రామాల్లో ఆగి వైఎస్సార్సీపీ నాయ‌కుల  మంచి చెడ్డ‌లు తెలుసుకొని వ‌చ్చారు. స్తానికంగా ఉండే కార్య‌క‌ర్త‌లు, అభిమానుల్ని ప‌ల‌క‌రించి ముందుకు సాగారు. సాయంత్రం ఎమ్మెల్యే క‌ల‌మ‌ట వెంక‌ట ర‌మ‌ణ ఇంటికి చేరుకొని అక్క‌డ కుటుంబ‌స‌భ్యులతో కొద్ది సేపు ఉండి వ‌చ్చారు.


త‌ర్వాత క‌ర్నూలు జిల్లా ప‌ర్య‌ట‌న సాగింది. అమ‌రుడైన జ‌వాన్ ముస్తాక్ అహ్మ‌ద్ కుటుంబ స‌భ్యుల్ని ప‌రామర్శించ‌టానికి అక్క‌డ‌కు వెళ్లారు. తెల్ల‌వారు జామునే హైద‌రాబాద్ లో బ‌య‌లు దేరిన‌ప్ప‌టికీ పార్న‌ప‌ల్లి ద‌గ్గ‌ర‌కు చేరేస‌రికి మ‌ధ్యాహ్నం అయింది. అక్క‌డ స్థానిక సంస్క్ర‌తి ప్ర‌కారం ప్రార్థ‌న‌లు చేశారు. అనంత‌రం న‌ల్ల కలువ దగ్గ‌ర‌కు వెళ్లి స్మ్ర‌తి వ‌నాన్ని సంద‌ర్శించారు. అక్క‌డ ప‌నిచేస్తున్న ఉద్యోగుల సాధ‌క బాధ‌కాల్ని అడిగి తెలుసుకొన్నారు. ఆ మార్గంలో వెళుతూ త‌మ బాగోగుల్ని ప‌ట్టించుకొన్న జ‌న నేత ఆప్యాయ‌త‌ను చూసి క‌న్నీటి భాష్పాలు రాల్చారు. 

గురువారం వై ఎస్ జ‌గ‌న్ విశాఖ న‌గ‌రానికి వెళ్లారు. అక్క‌డ స్థానిక‌ స‌మ‌న్వ‌య క‌ర్త వంశీ క్రిష్ణ ఇంటికి వెళ్లారు. న‌గ‌రంలో ఉన్న నాయ‌కులు, మ‌ద్య స్థాయి కార్య‌క‌ర్త‌ల్ని అక్క‌డ‌కు పిలిపించుకొన్నారు. పార్టీ కార్య‌క‌లాపాల‌తో పాటు వాళ్ల యోగ క్షేమాలు తెలుసుకొన్నారు. చాలా సేపు అక్క‌డే గ‌డిపారు. త‌ర్వాత శ్రీ శార‌ద పీఠానికివెళ్లి దేవాల‌యంలో పూజ‌లు స‌లిపారు. త‌ర్వాత పెందుర్తి లోని స‌మ‌న్వ‌య క‌ర్త ఇంటికి చేరుకొన్నారు. ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ నేరుగా త‌మ ఇంటికి రావ‌టంతో వారి ఇంట ఆనందం వెల్లి విరిసింది.

ఈ విదంగా జ‌న నేత వైఎస్ జ‌గ‌న్ త‌న ప‌ర్య‌ట‌న‌ల్లో ఎక్కువ స‌మ‌యం అబిమానులు, కార్య‌క‌ర్త‌ల‌తో గ‌డిపేందుకు వెచ్చిస్తున్నారు. వైఎస్ జ‌గ‌న్ జ‌రుపుతున్న ప‌ర్య‌ట‌న‌ల తీరుని చూసి గ‌తంలో దివంగ‌త మ‌హానేత వై ఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి జ‌రిపిన ప‌ర్య‌ట‌న‌లు, చూపించిన ఆద‌ర‌ణ ను జ‌నం గుర్తు చేసుకొంటున్నారు.

18 February 2016

ఆర్టీసీ ఎన్నికల్లో ఇది ప్రధాన అంశంగా నిలుస్తోంది

* ఆర్టీసీ ని పరిరక్షించేందుకు వైఎస్సార్సీపీ ఉద్యమం
* కార్మికులు, ఉద్యోగుల సంక్షేమమే లక్ష్యం
* టేబుల్ ఫ్యాన్ గుర్తుతో బరిలోకి దిగిన వైఎస్సార్సీపీ మజ్దూర్ యూనియన్
హైదరాబాద్: అధికారంలోకి వచ్చాక ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని వైఎస్సార్సీపీ ఇచ్చిన హామీ .. ఆర్టీసీ కార్మిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గురువారం అంటే ఈ నెల 18న జరగబోయే ఆర్టీసీ ఎన్నికల్లో ఇది ప్రధాన అంశంగా నిలుస్తోంది. మొత్తం మీద ఈ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ గట్టి పోటీ ఇస్తోంది.
గురువారం ఉదయం నుంచి సాయంత్రం దాకా 13 జిల్లాల్లోనూ ఆర్టీసీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో వేల సంఖ్యలో సిబ్బంది తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. గుర్తింపు యూనియన్ ఎన్నికలు కాబట్టి వ్యక్తిగతంగా కాకుండా, యూనియన్ల పరంగానే ఎన్నికలు జరుగుతాయి. ఇందులో రెండు ఓట్లు వేయాల్సి ఉంటుంది. రీజియన్ స్థాయికి ఒక ఓటు, రాష్ట్ర స్థాయి యూనియన్ కు ఒక ఓటు వేయాలి. గెలిచిన తర్వాత ఆయా యూనియన్లు తమ కార్యవర్గాన్ని నియమించుకొంటాయి.
ఆర్టీసీ ఎన్నికల్లోకి బరిలోకి దిగుతున్న వైఎస్సార్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ అన్ని ప్రధాన డిపోల దగ్గర విస్తారంగా ప్రచారం చేసింది. ముఖ్యంగా వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని ఇప్పటికే ప్రకటించింది. దీంతో పాటు ఉద్యోగులు, కార్మికుల సంక్షేమమే ప్రధాన అజెండా గా తొమ్మిది అంశాలతో ప్రచారాన్ని నిర్వహించింది. దీని మీద కార్మిక వర్గాల్లో చక్కటి స్పందన వ్యక్తం అవుతోంది. టేబుల్ ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేసేందుకు కార్మికులు పెద్ద ఎత్తున సంసిద్ధత వ్యక్తం చేస్తున్నట్లు యూనియన్ నాయకులు చెబుతున్నారు. 

ఫ్రంట్ స్క్రీన్ బ్యాక్ స్క్రీన్‌లో దారుణంగా దోచుకుంటున్న బాబులెవరు ?

ఫ్రంట్ స్క్రీన్ లో పెదబాబు
బ్యాక్ స్క్రీన్ లో చినబాబు
దారుణంగా దోచుకుంటున్నారు
కేబినెట్ మీటింగ్ మాటున బాబు..
దోపిడీకి మార్గాన్ని సుగుమం చేసుకుంటున్నాడుఃనెహ్రూ

హైదరాబాద్ః టీడీపీ ప్రభుత్వం కేబినెట్ మీటింగ్ మాటున దోపిడీకి మార్గాన్ని సుగుమం చేసుకుంటుందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, శాసనసభాపక్ష ఉపనేత జ్యోతుల నెహ్రూ మండిపడ్డారు.  ఫ్రంట్ స్క్రీన్ లో పెదబాబు, బ్యాక్ స్క్రీన్ లో చినబాబు దారుణంగా దోచుకుతింటున్నారని జ్యోతుల నెహ్రూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. హంద్రీనీవా-గాలేరు నగరి ఫాస్ట్ ట్రాక్ ప్రాజెక్ట్ కోసం..... రూ. 12 వేల కోట్ల పనులకు, రూ.110 కోట్లు అంచనాలు పెంచి దోపిడీకి పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే పరిస్థితి కొనసాగితే మిగిలిన ప్యాకేజీలకు కూడా క్యాబినెట్ ఆమోదాన్ని ఆసరాగా చేసుకొని దోచుకుతింటారన్నారు.  ఇప్పటికే సుమారు రూ. 6 వేల కోట్లు దోచుకునేందుకు చంద్రబాబు కేబినెట్ లో శ్రీకారం చుట్టారని నెహ్రూ ఫైరయ్యారు.  

ఇద్దరు సీఎస్ లు ప్రభుత్వం చేస్తుంది  విరుద్ధ కార్యక్రమమని పైలును తిరస్కరించారు.  ఐనా కూడా  మందబలాన్ని ఉపయోగించుకొని..  నిధులను దోచుకోవడం కోసం కేబినెట్ లో ఆమోదించారు.  ఎస్టిమేట్ ఇంతగనం పెంచాల్సిన పరిస్థితి ఎందుకొచ్చిందని నెహ్రూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దీనిపై  శ్వేతపత్రం విడుదల చేసి, అందుకు గల కారణాలపై ప్రజలకు సమాధానం చెప్పాలని  డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి తనకి అత్యంత సన్నిహితుడైన టీడీపీ ఎంపీ  సీఎం రమేష్ , ఆయన అనుచరులకు.... దోచిపెట్టడం కోసం చేస్తున్న కార్యక్రమం తప్పించి, ఎస్టిమేట్ పెంచాల్సిన పనే లేదన్నారు. వాళ్లు వాటాలు తీసుకోవడం కోసమే పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నారన్నారు.

చంద్రబాబు ఆర్డర్ వేయడం, ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమ ఫైల్ రెడీ చేయడం. ఆతర్వాత  దోచుకోవడం వీరికి అలవాటుగా మారిందని నెహ్రూ దుయ్యబట్టారు. ప్రస్తుతం 40 ప్యాకేజీలకు... 11వేల 229 వందల కోట్ల రూపాయల పనులు చేయాల్సి ఉండగా..దాన్ని ఒక్కసారే  24 వేల 7 వందల కోట్లు పెంచారు.  చంద్రబాబు ఆయన అనుయాయులు చేస్తున్న అవినీతిని నిలదీస్తే...అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఓ గ్లోబల్ ప్రచారం చేసి,  వైఎస్సార్సీపీపై నింద వేస్తున్నారని నెహ్రూ వాపోయారు. నిజంగా అభివృద్ధి చేయాలన్న త్రికరణ శుద్ధి ఉంటే ఈవిధంగా ఎవరూ దోచుకోరన్నారు.

అభివృద్ధి జరగాలి, ప్రజాధనం దోపిడీ కాకూడదనే బాధ్యత గల ప్రతిపక్షంగా ప్రశ్నిస్తున్నామన్నారు. రూ. 12 కోట్లకు పూర్తయ్యే ప్యాకేజీని 110 కోట్లకు ఎందుకు పెంచారో  వైట్ పేపర్ రిలీజ్ చేయాలన్నారు. ఆవిధంగానైనా  ప్రభుత్వ దోపిడీ విధానం ప్రజలకు అర్థమవుతుందన్నారు. టీడీపీ ఎంపీ  సీఎం రమేష్ అనే వ్యక్తికి లబ్ది చేకూర్చడం కోసమే కేబినెట్ లో  దోపిడీకి ఆమోదముద్ర వేశారన్నారు. ఇకనైనా తమ తీరు మార్చుకొని....మిగిలిన ప్రాజెక్ట్ ల విషయంలోనైనా అలా జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.  లేకపోతే  పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని నెహ్రూ చెప్పారు. ప్రభుత్వ అవినీతిని అడ్డుకొని తీరుతామన్నారు. 

17 February 2016

జడ్పీ సమావేశంలో ప్రోటోకాల్‌ రగడ

జిల్లాలో టీడీపీ నేతల బరితెగింపు
ప్రతిపక్ష నేతలపై దుర్భాషలు
అధికారులతో కలిసి కుట్రలు

వైఎస్‌ఆర్‌ జిల్లా: జిల్లా  జడ్పీ సమావేశంలో ప్రోటోకాల్‌ రగడ చోటుచేసుకుంది. ఈ సమావేశంలో కొందరు ఓడిపోయిన టీడీపీ నేతలు పాల్గొనడంతో వైఎస్సార్సీపీ నేతలు అభ్యంతరం తెలిపారు. ఓడిపోయిన వారిని ప్రభుత్వ కార్యక్రమాలకు పిలవొద్దని ఎక్కడైనా ఉందా అంటూ టీడీపీ ఎంపీ సీఎం రమేష్ , సతీష్ రెడ్డిలు వైఎస్సార్సీపీ నేతలపై బరితెగింపు వ్యాఖ్యలు చేశారు.  కలెక్టర్‌ ఆధ్వర్యంలోనే ఎన్నికైన సభ్యులకు అవమానం జరుగుతోందని ఈసందర్భంగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు మండిపడ్డారు. 

మిథున్ రెడ్డి...( రాజంపేట ఎంపీ)
రాష్ట్రంలో ప్రజా ప్రతినిథులకు విలువ అనే మాటే లేకుండా పోతోంది. ప్రభుత్వ అధికారుల సమక్షంలోనే పబ్లిక్ హెల్త్ సెంటర్ ఓపెనింగ్ చేస్తే...అనధికారికంగా ప్రారంభించారంటూ టీడీపీ నేతలు తమపై అక్రమ కేసు పెట్టి, ఎఫ్ ఐఆర్ నమోదు చేశారు. తాము ఓపెన్ చేశామన్న కక్షతోనే ఇదంతా చేశారు.  ఓడిపోయిన టీడీపీ నేతలను ప్రభుత్వ కార్యక్రమాల్లో పాలుపంచుకోవడం దారుణం.  ఎక్కడ కూడా ప్రజాస్వామ్యం లేదు. ప్రజలంతా గమనిస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి సరైన సమయంలో తగిన బుద్ధి చెబుతారు. 

గడికోట శ్రీకాంత్ రెడ్డి..(రాయచోటి ఎమ్మెల్యే) 
సిగ్గుందా అంటూ టీడీపీ నేతలు వైఎస్సార్సీపీ పార్లమెంట్ సభ్యులను దూషించడం సరికాదు. మెడికల్ ఆఫీసర్స్ తో సహా అందరం వెళ్లి ...హెల్త్ సెంటర్ ను ప్రారంభిస్తే నిర్ధాక్షిణంగా పగలగొట్టారు.  ప్రాపర్టీ డ్యామేజ్ చేశారని తిరిగి మాపైనే కేసు పెడుతున్నారు. ప్రజాస్వామ్యంలో ఇవి చీకటి రోజులు. ఇలాంటివి చేస్తే విశ్వాసం సన్నగిల్లుతుంది. తెలుగుదేశం నేతలు డైలాగులు చెప్పడం మాని ముందుగా ప్రోటోకాల్ పాటించడం, రాజ్యంగబద్దంగా నడవడం నేర్చుకోవాలి. పార్లమెంట్ సభ్యులను అగౌరవంగా మాట్లాడే పద్దతి  మార్చుకోవాలి. రాజ్యాంగాన్ని , ప్రజాస్వామ్యాన్ని గౌరవించినప్పుడే అందరికీ గౌరవం పెరుగుతున్న విషయం టీడీపీ నేతలు తెలుసుకోవాలి. 

రాచమల్లు శివప్రసాద్ రెడ్డి( ప్రొద్దుటూరు ఎమ్మెల్యే)
ప్రొద్దుటూరు శాసనసభ్యుడిగా ప్రోటోకాల్ పై ప్రశ్నించాను. అధికారం హక్కులేని, ప్రజల చేత తిరస్కరించబడిన టీడీపీ నాయకులను వేదికలెక్కించి.... ప్రభుత్వ కార్యక్రమాల్లో పాలు పంచుకునేలా కలెక్టర్ స్వయంగా ప్రోత్సహిస్తున్నాడు.  అందుకు సంబంధించిన ఆధారాలు, సాక్ష్యాలను.. ఫోటోలు, వీడియో క్లిప్పింగ్ లతో సహా బహిర్గతం చేశాం. తెలుగుదేశం పార్టీ నాయకులను కలెక్టర్ నెత్తికెత్తుకొని... రాజ్యాంగాన్ని పూర్తిగా తుంగలో తొక్కి కడపను వారి అబ్బ సొత్తుగా భావించి ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. ఇది చట్టరీత్యా నేరం, ప్రజాస్వామ్యవాదులకు అవమానం. 

చట్ట సభల చేత తిరస్కరించబడిన టీడీపీ నాయకులకేమో పురస్కారాలు, ప్రజలు ఆమోదించబడిన వారికేమో తిరస్కారాలా. ఇది కలెక్టర్ తీరు.  ప్రోటోకాల్ పాటించమంటే...మా ప్రభుత్వం కాబట్టి ఎవరినైనా పిలుస్తామని,  దుర్మార్గమైన ఆలోచనతో తలకెక్కి మాట్లాడుతున్నారు. కడపను ఏలుకుంటాం, ప్రజల అభిప్రాయాలు మాకు అవసరం లేదని టీడీపీ నాయకులు మాట్లాడుతున్నారు. ఇది చాలా అన్యాయం. ప్రజలే ప్రభుత్వానికి తగిన శాస్తి చేస్తారు. 

16 February 2016

చంద్రబాబు సిగ్గుతో తలదించుకోవాలి

సిపాయి పట్ల ఇంత దారుణంగా ప్రవర్తిస్తారా
దేశం మొత్తం ముస్తాక్ ను గౌరవిస్తుంటే..
చంద్రబాబు పట్టించుకోకపోవడం దుర్మార్గం
వైఎస్సార్సీపీ పోరాడితే తప్ప సహాయం చేయరా..?
ఇకనైనా కళ్లు తెరువు చంద్రబాబుః వైఎస్ జగన్

 కర్నూలు(పార్నపల్లి): వీరజవాన్ ముస్తాక్ అహ్మద్ పట్ల  ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మండిపడ్డారు.  దేశ మొత్తం సిపాయి ముస్తాక్ ని గౌరవిస్తుంటే.. చంద్రబాబు కనీసం అంత్యక్రియలకు రాకుండా, వారి కుటుంబాన్ని పట్టించుకోకపోవడం దుర్మార్గమన్నారు. మన  రాష్ట్రానికి చెందిన  సిపాయి, అందులోనూ ఓ ముస్లిం సైనికుడు చనిపోతే...ప్రభుత్వం కనీసం గౌరవించకపోవడం దారుణమన్నారు. ఇందుకు చంద్రబాబు సిగ్గుతో తలదించుకోవాలని వైఎస్ జగన్ అన్నారు. 

సానుభూతి లేని సర్కార్..
మొదట్లో ప్రభుత్వం కేవలం రూ. 5లక్షలు ప్రకటన చేయడం హేయనీయమని వైఎస్ జగన్ అన్నారు. చంద్రబాబు నిర్వాకం కారణంగా పక్కన ఉన్న కర్నాటక ప్రభుత్వం...చనిపోయిన సిపాయి కుటుంబానికి రూ. 25 లక్షలు, ఇళ్లు, పొలాలు, ఉద్యోగాలిచ్చారని ధర్నాలు, దీక్షలు చేయాల్సి వచ్చిందని జననేత చెప్పారు. మృతుని కుటుంబసభ్యులతో కలిసి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ధర్నాలు చేయడం వల్ల, తాను అంత్యక్రియలకు వెళ్తున్నానని తెలిసి...అప్పుడు టీడీపీ సర్కార్ రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియా ను రూ. 25 లక్షలు చేసిందన్నారు. అది కూడా సానుభూతితో చేయలేదని, వైఎస్సార్సీపీ న్యాయపోరాటం చేస్తే తప్ప ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా ప్రకటించకపోవడం బాధాకరమన్నారు.


ఇకనైనా కళ్లు తెరువు బాబు..
సిపాయి చనిపోతే  కేబినెట్ లో కనీసం నివాళులు కూడా అర్పించకపోవడం దారుణమని  వైఎస్ జగన్ మండిపడ్డారు. చంద్రబాబుకు ఇకనైనా జ్ఞానోదయమై మానవతా దృక్పథంతో ఆలోచన చేసి కాస్త ముందంజలో ఉండాలని వైఎస్ జగన్ సూచించారు. కనీసం ఇచ్చేవైనా మాట తప్పకుండా చేయాలన్నారు. ఆ ఆకుటుంబానికి ఇళ్లు, భూమి, పొలంతో పాటు ఉద్యోగం కల్పించాలన్నారు.  

దేశంతో పోటీపడండి బాబు..
దేశభద్రత కోసం ముస్లింలు కూడా ఏస్థాయిలో కష్టపడుతున్నారని చెప్పే సంఘటన జరిగింది. ఇలాంటి ఘటన జరిగినప్పుడు, సహాయం చేయడంలో ప్రభుత్వం ముందడుగు వేయకపోవడం దురదృష్టకరమన్నారు. దేశ భద్రత కోసం ఓ సైనికుడు చనిపోయినప్పుడు...దేశమొత్తం మనవైపు చూసేలా, ఓరోజు సెలవు ఇచ్చి ఆదుకొని ఉంటే బాగుండేదని జననేత అన్నారు. ఇప్పటికైనా సిపాయి కొరకు హానర్స్ తెలుపుతూ ప్రభుత్వం సెలవు ప్రకటించాలన్నారు. కర్నాటకతో కాదని దేశంతో పోటీపడాలని ప్రభుత్వానికి హితవు పలికారు. అతి మెరుగైన ప్యాకేజీ ఇచ్చి ఆకుటుంబానికి తోడ్పడాలని సూచించారు. 

న్యాయం జరగదనే రోజా హైకోర్టును ఆశ్రయించారు

బుద్ధ ప్రసాద్ కమిటీ ఏకపక్షంగా వ్యవహరిస్తోంది
కమిటీతో అన్యాయం జరుగుతుందని ముందే చెప్పాం
ప్రతిపక్షాన్ని టార్గెట్ చేసి తప్పులు చూపిస్తున్నారు
అసెంబ్లీ లీకుడ్ వీడియోస్ పై సైబర్ క్రైంలో ..
ఫిర్యాదు చేద్దామంటే ముందుకు రావడం లేదు
స్పీకర్ చైర్ ను కోడెల దిగజార్చారు
ప్రెస్ మీట్ పెట్టి ప్రతిపక్ష నేతను దుయ్యబట్టడం దారుణం

హైదరాబాద్ః అసెంబ్లీలో సభ్యుల ప్రవర్తనపై నియమించిన బుద్ధప్రసాద్ కమిటీ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. కమిటీలో ముగ్గురు అధికారపార్టీకి చెందిన వారే ఉన్నందున..ముందు నుంచి తాము చెప్పినట్లే తమకు అన్యాయం  జరుగుతోందన్నారు. తమ అభ్యంతరాలను కమిటీ చర్చించలేదని, కేవలం వైఎస్సార్సీపీనే టార్గెట్‌గా చేసుకుని చర్చించిందని శ్రీకాంత్ రెడ్డి వాపోయారు. సోషల్ మీడియాలో లీకైన వీడియోలపై సైబర్ క్రైంలో ఫిర్యాదు చేద్దామని అడిగినా కమిటీ ముందుకు రాలేదని చెప్పారు. 

బుద్ధప్రసాద్ కమిటీతో తమకు న్యాయం జరిగేలా లేదని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. తాము బాధ్యతగా అడిగిన ప్రశ్నలపై సమాధానం రాలేదని, 19న జరగనున్న సమావేశంలో వస్తుందన్న ఆశ కూడా లేదన్నారు. అసెంబ్లీలో వైఎస్సార్సీపీని దారుణంగా విమర్శించిన టీడీపీ నేతలపై కమిటీలో చర్చించకపోవడం శోచనీయమని శ్రీకాంత్ రెడ్డి  ఆవేదన వ్యక్తం చేశారు. కమిటీలతో న్యాయం జరగదన్న ఉద్దేశంతోనే ఎమ్మెల్యే రోజా హైకోర్టును ఆశ్రయించారని శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. 

అపోజిషన్ లేకుండా జీరో అవర్ లో చర్చించిన అంశాలపై కమిటీ వేసిన దాఖలాలు చరిత్రలో ఎప్పుడూ లేవని శ్రీకాంత్ రెడ్డి స్పష్టం చేశారు. సభలో రోజా సస్పెన్షన్ , సభా తీరుపై తమ అధ్యక్షులు వైఎస్ జగన్ లేఖ రాసినా...దానిపై ఎలాంటి సమాధానం ఇవ్వలేదన్నారు.  కేవలం కొంత మంది సభ్యులను టార్గెట్ చేసి.... అధికారపక్షం, ప్రతిపక్ష సభ్యులను అవమానించడం బాధాకరమన్నారు.  అసెంబ్లీలో జరిగిన విషయాలు బయటకు ఎలా వచ్చాయో చెప్పమంటే స్పీకర్, అధికారపక్షం సభ్యులు నీళ్లు నములుతున్నారన్నారు. 

అసెంబ్లీ లీకుడ్ వీడియోస్  స్పీకరే ఇచ్చాడని కాల్వ శ్రీనివాసులు చెబితే, ఎలా వచ్చాయో కెమెరాతో రికార్డ్ చేశారేమో అని స్పీకర్ చెప్పడం శోచనీయమన్నారు. సోషల్ మీడియాకు వీడియోస్ లీకేజ్ పై  సైబర్ క్రైం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేద్దామంటే...పాలకపక్షం దానిపై  ముందుకు రావడం లేదన్నారు. గతంలో జరిగిన వీడియోలను వాయిస్ ట్యాంపర్ చేసి, వారికి అనుకూలంగా  ఎడిటింగ్ చేయించి ...ప్రతిపక్షాన్ని ఏదో విధంగా దెబ్బతీయాలని చూడడం దారుణమన్నారు. అచ్చెన్నాయుడు, బోండ ఉమ, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, చింతమనేని ప్రభాకర్...ప్రతిపక్ష సభ్యులను నిండు సభలో దూషించినా అందుకు సంబంధించిన రికార్డ్స్ బయటపెట్టకుండా సభా గౌరవాన్ని మంటగల్పారన్నారు. 

సభా మర్యాదను, స్పీకర్ చైర్ కు ఉన్న గౌరవాన్ని స్పీకర్ కోడెల ప్రసాదరావు దిగజార్చారని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. గౌరవప్రదమైన చైర్ లో ఉన్న స్పీకర్...ప్రెస్ మీట్ పెట్టి ప్రతిపక్ష నాయకుని దుయ్యబట్టడం దారుణమన్నారు.  వైఎస్సార్సీపీని టార్గెట్ చేసి ఎంతసేపు ఒకవైపునే తప్పులు చూపించడం ఘోరమన్నారు. ప్రజలకు సంబంధించిన అన్ని సమస్యలపైనా సభలో చర్చ జరగాలని వైఎస్సార్సీపీ కోరుకుటుందన్నారు. అందుకు అధికారపక్షం సభ్యులు సహకరించాలన్నారు. ఉన్నతంగా వ్యవహరించాలని స్పీకర్ కోడెలకు హితవు పలికారు. 

15 February 2016

రాజ‌ధాని నిర్వాసితుల‌కు చంద్ర‌బాబు షాక్‌

* కొత్త నిబంధ‌న‌లు అమ‌ల్లోకి తెస్తున్న బాబు
* కుటుంబంలో ఒక‌రికే పెన్ష‌న్‌
* ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నా పెన్ష‌న్ ఇచ్చేది లేద‌ని స్ప‌ష్టీక‌ర‌ణ‌

అమ‌రావ‌తి : రాజ‌ధాని ప్రాంతంలో రైతుల నుంచి భూములు లాక్కొనేట‌ప్పుడు క‌ల్ల‌బొల్లి క‌బుర్లు చెప్పిన ప్ర‌భుత్వం ఇప్పుడు త‌న వైఖ‌రిని బ‌య‌ట పెట్టుకొంటోంది.  సీఆర్‌డీఏ ప‌రిధిలో భూములు లేని పేద‌ల‌కు పదేళ్ల పాటు నెల‌కు రూ. 2,500 ఇస్తామ‌ని ప్ర‌భుత్వం హామి ఇచ్చింది. రాజ‌ధాని నిర్మాణం కార‌ణంగా వీళ్లంద‌రూ ఉపాధి కోల్పోతార‌న్న ఉద్దేశ్యంతో ప్ర‌క‌టించిన ఈ పెన్ష‌న్‌కు ఇప్పుడు నిబంధ‌న‌ల‌ను జ‌త ప‌ర్చారు.
భూములు లేని పేద‌ల‌కు ఇచ్చే పెన్ష‌న్ కుటుంబంలో ఒక్క‌రికేన‌ని ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది. ఈ మేర‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్ సీఆర్‌డీఏ కార్య‌ద‌ర్శి ఆజ‌య్ జైన్ మార్గ‌ద‌ర్శ‌కాల‌ను జారీ చేశారు. గ‌తంలో కుటుంబంలో ఒక్క‌రికే పెన్ష‌న్ ఇస్తామ‌ని తాజా మార్గ‌ద‌ర్శ‌కాల్లో ప్ర‌క‌టించ‌డం తీవ్ర విమ‌ర్శ‌ల‌కు దారి తీస్తోంది. 2014 డిసెంబ‌ర్ 8కి ముందే అమ‌రావ‌తి కేపిట‌ర్ ఏరియాలో నివ‌సిస్తూ ఉన్న‌వారై, కుటుంబంలో ఎంత‌మంది ఉన్నా ఒక్క‌రికే పెన్ష‌న్‌, పెన్ష‌న్ ద‌ర‌ఖాస్తుదారుడు బ్యాంక్ ఖాతా వివ‌రాల‌తో పాటు ఆఫిడ‌విట్‌ను సైతం పొందుప‌ర్చాలి. ప్ర‌భుత్వం లేదా ప్రైవేటు కార్యాల‌యాల్లో ప‌ని చేస్తూ, ఏడాదికి రూ. 60వేల సంపాద‌న ఉన్న‌వారికి పెన్ష‌న్ వ‌ర్తించ‌దు. భూమి లేని విష‌యాన్ని, దారిద్ర్యరేఖ దిగువ‌న ఉన్నారా అన్న‌దాన్ని త‌హ‌శీల్దార్ నిర్ణ‌యిస్తారు. పెన్ష‌న్ స్కీం సీఆర్‌డీఏ క‌మిష‌న‌ర్ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఉండి, భూములు ఉన్నాయా లేదా అన్నది క‌లెక్ట‌ర్ స‌మీక్షిస్తే త‌ప్ప ఇది ఆమోదం పొంద‌దు.
భూములు లాక్కొనే స‌మ‌యంలో ఎడా పెడా హామీలు ఇచ్చిన ప్ర‌భుత్వం త‌ర్వాత కాలంలో మాట మార్చింద‌ని రైతుకూలీలు వాపోతున్నారు. అప్పుడే ఈ నిబంధ‌న‌లు బ‌య‌ట పెట్టి ఉంటే ఆందోళ‌న చేసి ఉండేవార‌మ‌ని, ఇప్పుడు త‌మ‌ను ప్ర‌భుత్వం మోస‌గించిందని ఆవేద‌న చెందుతున్నారు. 

13 February 2016

మాకొద్దు బాబోయ్ ఈ చంద్రబాబు

ప్రతి నోట ఒకటే మాట .. బాబు మాకొద్దని
బాబు పరిపాలనంతా మోసం..మోసం..మోసం
హామీలు విస్మరించాడు..ప్రజలకు తీరని అన్యాయం చేశాడు
ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలని వైఎస్సార్ దేశానికే చాటిచెప్పారుః వైఎస్ జగన్

శ్రీకాకుళంః ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ...చంద్రబాబు మోసపూరిత పాలనపై నిప్పులు చెరిగారు. శ్రీకాకుళం జిల్లా పర్యటనలో భాగంగా పైడి భీమవరంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని జననేత ఆవిష్కరించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ...చంద్రబాబు లాంటి ముఖ్యమంత్రి మాకు వద్దు బాబోయ్ అని ప్రజలు గగ్గోలు పెడుతున్నారని వైఎస్ జగన్ అన్నారు. ఇలాంటి మోసకారి సీఎంను తాము ఎక్కడా చూడలేదని ప్రజలు అంటున్నారని జననేత చెప్పారు. ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలని మహానేత వైఎస్సార్ దేశానికే చాటిచెప్పారని  వైఎస్ జగన్ పేర్కొన్నారు. 

చంద్రబాబు పరిపాలన గురించి రైతన్నను అడిగితే, వారు ఒకటే చెబుతున్నారని...చంద్రబాబు లాంటి మోసగాడు దేశంలోనే ఎవరూ లేరని ప్రతి రైతు నోటా వినిపిస్తోందని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. ఎన్నికల ముందు రుణాలన్నీ బేషరతుగా మాఫీ చేస్తానన్నాడు. బ్యాంకుల్లో బంగారం ఇంటికి రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలన్నాడు. బాబయితే ముఖ్యమంత్రి అయ్యాడు గానీ రుణాలు మాఫీ కాలేదని,  రుణాలు చెల్లించాలని బ్యాంకర్లు నోటీసులు పంపిస్తుండడంతో రైతన్నలు లబోదిబోమంటున్నారని వైఎస్ జగన్ చెప్పారు. 

చంద్రబాబు పరిపాలన గురించి డ్వాక్రా అక్కచెల్లెల్లను అడిగితే...అన్నా ఎన్నికలకు ముందు పావలా వడ్డీకే రుణాలు లభించేవి. ఇవాళ బ్యాంకులకు పోతే రూ. 2 వడ్డీ వసూలు చేస్తున్నారు. ఇంత అన్యాయమైన ముఖ్యమంత్రిని జీవితంలో చూడలేదని డ్వాక్రా అక్కాచెల్లెల్లు బాధపడుతున్నారని  వైఎస్ జగన్ అన్నారు. ఎన్నికల ముందు ఏ టీవీ ఆన్ చేసినా ఒకటే వినిపించేది, కనిపించేది. జాబు రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలన్న మాట వినిపిచేంది. బాబు ఐతే ముఖ్యమంత్రి అయ్యాడు, ఉన్న జాబులు ఊడబెరుకుతున్నారని  ప్రతి విద్యార్థి, నిరుద్యోగి చెబుతున్నారని జననేత చెప్పారు. 

ఇంటికో ఉద్యోగం, ఉద్యోగం లేని వారికి నెలకు రూ. 2 వేలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నాడు. అందరికీ ఇళ్లు కట్టిస్తానన్నాడు. ఇవాళ ఇచ్చిన హామీల గురించి నిలదీస్తే...చంద్రబాబు ఖాళీ చేతులూపుతున్నాడు. బాబు పాలన గురించి మూడు మాటల్లో చెప్పాలంటే...మోసం, మోసం, మోసమని వైఎస్ జగన్ నిప్పులు చెరిగారు. ప్రతి  పేదవాడికి అభివృద్ధి ఫలాలు అందించి వైఎస్సార్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని, అందుకే రాజన్నను మర్చిపోలేకపోతున్నారని చెప్పారు.