9 February 2016

కుర్చీకోసం కులాలతో బాబు ఆటలు

చంద్రబాబు కులాల మధ్య చిచ్చుపెట్టి..
రాష్ట్రాన్ని రణరంగంగా మారుస్తున్నాడు
కుర్చీకోసం కులాలను పావుగా వాడుకుంటున్నాడు
హామీలు నెరవేర్చలేక చేతగానితనంతో..
చంద్రబాబు వైఎస్సార్సీపీపై బురద జల్లుతున్నాడుః పార్ధసారథి

హైదరాబాద్ః చంద్రబాబు కుల అహంకారంతో మాట్లాడుతున్నారని వైఎస్సార్సీపీ సీనియర్ నేత పార్ధసారథి మండిపడ్డారు. కాపులు, బీసీల మధ్య చిచ్చుపెట్టిన చంద్రబాబు..ఇప్పుడు దళితులను కించపర్చేలా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.  ఇచ్చిన హామీలు నెరవేర్చలేక ...చంద్రబాబు రాష్ట్రాన్ని కులాల అగ్నిగుండంగా మార్చి దానిమీద మంటగాగే ప్రయత్నం చేస్తున్నారని పార్ధసారథి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది మంచిపద్దతి కాదని హితవు పలికారు. అలా చేస్తే  పేద వర్గాలు మీ భరతం పట్టడం ఖాయమన్నారు. 
 
ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి, ఎవరైనా ఎస్సీ కులంలో పుట్టాలని కోరుకుంటారా అంటూ చంద్రబాబు మాట్లాడడం దుర్మార్గమన్నారు. దళితుడు రచించిన రాజ్యాంగంపైనే దేశం నడుస్తోందని..ముఖ్యమంత్రి స్థాయికి అలా మాట్లాడడం తగదన్నారు.  కులాలను అవమానపర్చేవిధంగా వాతావరణం సృష్టించొద్దని బాబును హెచ్చరించారు. చంద్రబాబు తన చేతగాని తనంతో, ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని నిస్సాహాయ స్థితిలో ...వైఎస్సార్సీపీ కులాల మధ్య చిచ్చుపెడుతోందంటూ వైఎస్ జగన్ పై బురదజల్లే కుట్ర చేస్తున్నారని పార్ధసారథి ఆక్రోషించారు.  
 
ఓ పక్క కాపులకు రిజర్వేషన్ ఇస్తామని చెబుతూనే.. ఇచ్చేది లేదని చంద్రబాబు తన ఎమ్మెల్యేలతో చెప్పిస్తున్నారు. కాపులను బీసీల్లో చేర్చుకోవద్దని రెచ్చగొట్టింది మీరు కాదా బాబు. ప్రతి కులానికి వందల కోట్లు కేటాయిస్తామని ఎన్నికల ముందు చెప్పలేదా బాబు. బోయలను ఎస్టీల్లో చేరుస్తామని ఎన్నికల హామీ ఇవ్వలేదా చంద్రబాబు.  మేనిఫెస్టోను చిత్తుకాగితంలా భావించి తుంగలో తొక్కి.... వైఎస్సార్సీపీ కులాల మధ్య చిచ్చుపెడుతుందని ఏవిధంగా అంటారని పార్ధసారథి చంద్రబాబును ప్రశ్నించారు. బలహీన వర్గాలకు విద్యా, ఉద్యోగ, ఆర్థికంగా నష్టం జరగకుండా కాపులను బీసీల్లో చేర్చాలని తాము కోరుతుంటే....వైఎస్సార్సీపీపై అభాండాలు వేస్తున్నారని ఫైరయ్యారు. బలహీన వర్గాలకు ఒక్క రూపాయైనా ఇచ్చారా అని బాబును నిలదీశారు. 

రిజర్వేషన్లు 50 శాతం దాటడానికి వీల్లేదని సుప్రీంకోర్టు చెబుతుందన్నారు. కాపులను బీసీల్లో చేర్చేందుకు రాజ్యాంగంలో సవరణ తీసుకురావాలని, దానిపై చంద్రబాబు కేంద్రంతో ఎందుకు మాట్లడలేదని ప్రశ్నించారు.  కాపుల రిజర్వేషన్ పై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదని పార్ధసారథి దుయ్యబట్టారు.  కాపులు ఉద్యమానికి సిద్ధమయ్యాక కమిషన్ వేసిన చంద్రబాబు...అంతకుముందే వారికిచ్చిన హామీలపై ఎందుకు ముందుకెళ్లలేదని నిలదీశారు. బలహీన వర్గాలు, కాపుల మధ్య చిచ్చుపెట్టి చంద్రబాబు రాష్ట్రాన్ని రణరంగంలా తీర్చిదిద్దుతున్నారని మండిపడ్డారు. పుడితే కమ్మ కులంలో పుట్టాలని, ఎస్సీల్లో పుట్టవద్దని చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరించడం దారుణమన్నారు. 

స్థానిక శాసనసభ్యుడు దళితుడనే కారణంతో చంద్రబాబు....రాజధాని శంకుస్థాపన కార్యక్రమంలో వేదికమీద కనీస స్థానం కల్పించలేదన్నారు. కాపులకు హోంమంత్రి ఇచ్చానన్న చంద్రబాబు...చిన రాజప్పకు కనీసం గౌరవం కల్పిస్తున్నారా, డీఎస్పీని నియమించేందుకు స్వతంత్ర ఉన్నదా అని ప్రశ్నించారు. భూసేకరణ కార్యక్రమాల్లో రెవెన్యూ మినిస్టర్ ఈ కృష్ణమూర్తిని దూరం పెట్టిన సంస్కృతి తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఉందన్నారు. బలహీన వర్గాలను, కాపులను పావుగా వాడుకుంటూ ... చంద్రబాబు  కుర్చీకోసం పాకులాడుతున్నారే తప్ప మరొకటి లేదని దుయ్యబట్టారు. 

No comments:

Post a Comment