12 February 2016

వైఎస్ జగన్ ఉదయించే సూర్యుడు

విజయవాడ : ఎల్లో మీడియాతో కలిసి చంద్రబాబు చేస్తున్న మైండ్ గేమ్ రాజకీయాలపై రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్సీపీ నేతలు నిప్పులు చెరిగుతున్నారు. తెలుగుదేశం పార్టీ అంతరించిపోతుందన్న భయంతో చంద్రబాబు ప్రతిపక్షంపై విష రాజకీయాలు చేయడాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు.

ఉప్పులేటి కల్పన...
తాను టీడీపీలో చేరుతానంటు వస్తున్న వార్తలు అవాస్తవమని ఉప్పులేటి కల్పన స్పష్టం చేశారు. ఆమె విలేకరులతో మాట్లాడుతూ ...తన చివరి శ్వాస వరకూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని ఆమె తెలిపారు. వైఎస్ జగన్  ఉదయించే సూర్యుడయితే...చంద్రబాబు అస్తమించే సూర్యుడని అన్నారు. భవిష్యత్ కావాలనుకునేవారు వైఎస్సార్సీపీని  వీడరు' అని ఉప్పులేటి కల్పన చెప్పారు.

ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్
ప్రకాశం జిల్లాలో ఎవరూ  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడటం లేదని ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ఎల్లో మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తమన్నారు. వైఎస్ జగన్ వల్లే తాము గెలిచామని, చివర వరకూ జగన్ తోనే ఉంటామని ఆయన పేర్కొన్నారు.

ఎమ్మెల్యే ముత్యాలనాయుడు
తెలుగుదేశం పార్టీలో చేరతానంటు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని విశాఖ జిల్లా మాడుగుల ఎమ్మెల్యే ముత్యాల నాయుడు అన్నారు. ఆయన స్థానికంగా విలేకరులతో మాట్లాడుతూ ...పార్టీ మారేంత నీతిమాలిన రాజకీయాలు చేయనని ఆయన తెలిపారు.  చివరివరకూ వైఎస్ జగన్ తోనే ఉంటానని ముత్యాల నాయుడు స్పష్టం చేశారు.

No comments:

Post a Comment