30 January 2016

పులివెందులలో ప్రజల చెంత జననేత

క్యాంపు క్యార్యాలయంలో బిజీబిజీ
వైఎస్ జగన్ ను కలుసుకున్న పార్టీశ్రేణులు, ప్రజలు
స్థానిక సమస్యలు అడిగి తెలుసుకున్న జననేత

వైఎస్సార్ జిల్లాః  ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ వైఎస్సార్ జిల్లా పర్యటనలో బిజీగా గడిపారు.  పులివెందులలోని క్యాంపు కార్యాలయంలో అందుబాటులో ఉన్న జననేతను...పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు కలుసుకొని తమ సమస్యలను విన్నవించారు. వారి విన్నపాలను వైఎస్ జగన్ సావధానం విన్నారు. ఈసందర్భంగా వైఎస్ జగన్ సమక్షంలో ఆర్టీసీ కార్మికులు పెద్ద ఎత్తున వైఎస్సార్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ లో చేరారు. అందరికీ వైఎస్ జగన్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.  కార్మికుల సమస్యలు, గుర్తింపు ఎన్నికలపై వైఎస్సార్ మజ్దూర్ యూనియన్ నేతలు వైఎస్ జగన్ తో చర్చించారు. 

ఫిబ్రవరిలో రాష్ట్రవ్యాప్తంగా జరగనున్న ఆర్టీసీ ఎన్నికల్లో వైఎస్సార్ మజ్దూర్ యూనియన్ ను గెలిపించుకుంటామని ఆర్టీసీ  కార్మికులు తెలిపారు. వైఎస్ జగన్ నాయకత్వాన్ని బలపరుస్తామని చెప్పారు. ఆర్టీసీ ప్రైవేటీకరణకు సీఎం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఈసందర్భంగా కార్మికులు వైఎస్ జగన్ దృష్టికి తీసుకొచ్చారు. తాము అధికారంలోకి వచ్చాక ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని, కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని  జననేత వారికి హామీ ఇచ్చారు. కార్మికుల భద్రత, ఆర్టీసీ మనుగడే ధ్యేయంగా వైఎస్సార్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ ఏర్పాటైన సంగతి తెలిసిందే. 

పులివెందులలో ఆరోగ్యమిత్ర ఉద్యోగులు వైఎస్ జగన్ కలుసుకొని తమ గోడు చెప్పుకున్నారు. మహానేత వైఎస్. రాజశేఖర్ రెడ్డి ఓ వైద్యుడిగా తమను నియమించి తమను ఎంతో బాగా చూసుకున్నారని వారు తెలిపారు. అవార్డులు కూడా ఇచ్చారని చెప్పారు. వైఎస్సార్ చేపట్టిన ఈపథకాన్ని పక్క రాష్ట్రాలు కూడా ఆదర్శంగా తీసుకున్నారని చెప్పారు. కానీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఆరోగ్యమిత్రలను వైద్యమిత్రలుగా పేరు మార్చడంతో పాటు ఉన్నపళంగా విద్యార్హత సాకు చూపి తొలగించడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ సలహా మేరకు కోర్టును ఆశ్రయించామని...న్యాయస్థానం తమకు అనుకూలంగా తీర్చి ఇచ్చిందని చెప్పారు. ఐనా కూడా చంద్రబాబు కుట్ర చేసి తొలగిస్తే..మన ప్రభుత్వం వచ్చాక అందరికీ న్యాయం చేస్తామని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారన్నారు. 

29 January 2016

చంద్రబాబు బాధ్యత తీసుకొంటారా.. లేక అధికారుల్ని బలిపశువుల్ని చేస్తారా..!

అమరావతి నిర్మాణం పేరు చెప్పి చంద్రబాబు చేస్తున్న అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. సింగపూర్ కంపెనీల కోసం నిబంధనల్ని తుంగలోకి తొక్కి బాబు సర్కార్ చెలరేగుతోంది.
రాజధాని నిర్మాణంలో పర్యావరణ చట్టాల్ని ఘోరంగా తుంగలోకి తొక్కుతోందంటూ పర్యావరణ వేత్తలు శ్రీమన్నారాయణఈఎఎస్ శర్మ వేర్వేరుగా పిటీషన్లు వేశారు. రాజధాని ప్రాంతంలో పంట భూములుతడి నేలలు ఉన్నాయంటూ ట్రిబ్యునల్ నోటీసులోకి తీసుకొని వచ్చారు. దీని మీద వివరణ ఇవ్వాలని ట్రిబ్యునల్ ఆదేశించింది. అయితే ఇందులో ఎక్కడా తడినేలలు లేవని సమాచార హక్కు చట్టం కింద ఇచ్చిన  పిటీషన్ కు జవాబు ఇచ్చారు. అదే సమయంలో తడి నేలలు ఉన్నాయంటూ ట్రిబ్యునల్ కు ప్రభుత్వం సమాచారం ఇచ్చింది. ఒకే అంశం మీద రెండు రకాలు గా జవాబులు ఇస్తున్న అంశాన్ని పిటీషన్ దారులు ట్రిబ్యునల్ ద్రష్టికి తెచ్చారు.
 రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండే పర్యావరణ మండలి కి కేవలం 1.7 చదరపు కిలోమీటర్ల పరిధి వరకే అనుమతి ఇచ్చే అధికారం ఉంది. కానీ, 217 చదరుప కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ప్రాజెక్టులకు అనుమతి తీసుకొని.. రాజధాని ప్రాంతానికి అన్ని అనుమతులు వచ్చేసినట్లుగా కలరింగ్ ఇచ్చేశారు. అంటే రాష్ట్ర ప్రభుత్వం చెప్పు చేతల్లో ఉండే ఒక మండలి.. అదే రాష్ట్ర ప్రభుత్వానికి క్లియరెన్స్ ఇవ్వటం అన్న మాట. అది కూడా ఒక దిగువ స్థాయి అధికారి సంతకంతో ఇచ్చిన అనుమతి అన్న మాట.
 పంట పొలాల్లో చదును పూరిత కార్యకలాపాలు ఏమీ చేపట్టవద్దని ట్రిబ్యునల్ ఆదేశించింది. కానీఆ తర్వాతే లింగాయపాలెం అనే చోట అరటి తోటల్ని సిబ్బంది నరికేశారు. దీని మీద కూడా పిటీషనర్లు ట్రిబ్యునల్ నోటీసులోకి తెచ్చారు.
మొత్తం మీద ట్రిబ్యునల్ వ్యవహారాన్ని తెలివిగా అధికారుల మెడకు చుట్టేసేందుకు చంద్రబాబు ప్రభుత్వ పెద్దలు ప్రయత్నిస్తున్నారు. గతంలో కూడా భూ సమీకరణ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు బాబు గారికి ఏమీ తెలీదనిఅంతా అధికారులే చేశారని నమ్మబలికారు. బాక్సైట్ తవ్వకాల విషయంలో కూడా అధికారుల మీదకే నెట్టేశారు. ఇప్పుడు కూడా అదే బాటలో నడిచేందుకు ప్రయత్నిస్తున్నారు. 

టాప్ టెన్ పవర్ ఫుల్ కామెంట్లు..!

కాకినాడ: ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు ఆడుతున్న నాటకాల్ని ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ స్పష్టంగా బయట పెట్టారు. యువ భేరి కార్యక్రమంలో వైఎస్ జగన్ ప్రసంగంలో టాప్ టెన్ కామెంట్లు ఇప్పుడు చూద్దాం.

1. ప్రత్యేక హోదా వస్తే చంద్రబాబు మలేషియా, సింగపూర్ వెళ్లనక్కర లేదు. ఢిల్లీ వెళ్లి హోదా మీద ఒత్తిడి తెస్తే చాలు.
2. ప్రత్యేక హోదా వస్తే ప్రతీ జిల్లా ఒక హైదరాబాద్ అవుతుంది. హోదా కోసం మన ప్రభుత్వ పెద్దలు, మంత్రులు పోరాడటం లేదు.
3. ప్రత్యేక హోదా కోసం ఉద్యమిస్తే రోజుకో అబద్దం చెబుతున్నారు. ఇటువంటి అబద్దాల్ని ఒక కంట కనిపెడుతూ ఉండాలి.
4. మేం ఈ తరం వాళ్లం. చదువుకొన్న వాళ్లం. తెలియని విషయాలు తెలుసుకొంటాం. తెలుసుకొని నిలదీస్తాం అని చెబుతాం.
5. ఆరు నెలల పాటు ప్రణాళికా మండలి దగ్గర మన ఫైల్ పడి ఉంటే చంద్రబాబు పట్టించుకొన్న పాపాన పోలేదు.
6. ఆంధ్ర రాష్ట్రంలో అన్నీ లంచాలే. అడుగడుగునా లంచాలు గుంజుతున్నారు.
7. బొగ్గు నుంచి మద్యం దాకా.. షాపుల నుంచి జీవో 22 దాకా అన్నీ కమీషన్లే
8. చంద్రబాబుని నిలదీసే సమయం ఆసన్నమైంది.
9. బాబు మెడలు వంచైనా ప్రత్యేక హోదా సాధించుకొందాం.
10. అంతా కలిసికట్టుగా పోరాడుదాం . గట్టిగా ఒత్తిడి తెద్దాం.

28 January 2016

అందరం ఒక్కటవుదాం..హోదా కోసం ఒత్తిడి తీసుకొద్దాం

తూర్పుగోదావరిః  కాకినాడ యువభేరి సదస్సులో ఈరతం నాయకుడు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ యువతతో ముఖాముఖి మాట్లాడారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఆవశ్యకత గురించి వైఎస్ జగన్ వారికి దిశానిర్దేశం చేశారు. ఈసందర్భంగా విద్యార్థులు, నిరుద్యోగులు అడిగిన సందేహాలన్నంటినీ వైఎస్ జగన్ నివృత్తి చేశారు. అందరం ఒక్కటై ప్రత్యేకహోదాను సాధించుకుందామన్నారు.  హోదాకు అడ్డుపెడుతున్న చంద్రబాబు చెంపలాగిపెట్టికొట్టాలని విద్యార్థిలోకానికి పిలుపునిచ్చారు. 

ప్రవీన...(స్టూడెంట్)
ప్రత్యేకహోదాపై  చంద్రబాబుబాబు వెనకడుగు వేస్తున్నారు. ప్రత్యేకహోదా వల్ల అనేక లాభాలు ఉన్నప్పటికీ కేంద్రప్రభుత్వం  ఎందుకు వెనకడుగు వేస్తోంది.

వైఎస్ జగన్...
ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు ఎమ్మెల్యేలను కొంటూ అడ్డంగా దొరికిపోయారు. దాన్నుంచి తప్పించుకునేందుకే చంద్రబాబు హోదాను కేంద్రం వద్ద తాకట్టుపెట్టాడు.  వాళ్లను గట్టిగా నిలదీస్తే జైల్లో పెడతారని చంద్రబాబు బయపడుతున్నాడు.  అందరం కలిసి బాబుపై ఒత్తిడి తీసుకొద్దాం. అందరం కలిసికట్టుగా చేస్తేనే సాధ్యమవుతోంది. 

సౌజన్య..(స్టూడెంట్)
యూనివర్సిటీలో రాజకీయ ప్రమేయాలు ఎక్కువయ్యాయి. దానికేమైనా చర్యలు చేపట్టే ప్రయత్నం చేస్తారా సార్. 

వైఎస్ జగన్.
రాజకీయ ప్రమేయం లేకుంటేనే యూనివర్సిటీలు బాగుంటాయి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో  ఓవిద్యార్థిని వేధించేందుకు ఓ కేంద్రమంత్రి మరో కేంద్రమంత్రికి  లేఖ రాయడం... ఆలేఖ పట్టుకొని సదరు కేంద్రమంత్రి ఐదుసార్లు వీసీకి లెటర్ రాసి ఒత్తిడి తీసుకొచ్చింది. దాన్ని పట్టుకొని వీసీ సస్పెండ్ చేశాడు. ఓ విద్యార్థి ఆత్మహత్యకు కారణమయ్యారు. రాజకీయ ప్రమేయం ఇంతటితో ఆగలేదు. ఎస్వీ  యూనివర్సిటీలో  చంద్రబాబు కొడుకు లోకేష్ పుట్టినరోజు జరిగితే వీసీ వెళ్లి కేక్ కట్ చేస్తున్నారు. అందుకు సంబంధించిన  ఫోటోను వైఎస్ జగన్ యువభేరి సభా ముఖంగా చూపించారు. హోదా కోసం పిల్లలను చైతన్యవంతులను చేసేందుకు క్యాంపస్ అడిగితే ఇవ్వడం లేదు. హోదాపై యువత చైతన్యవంతులయితే ప్రమాదం అని చంద్రబాబు దాన్ని అణచాలని చూస్తున్నారు. ఈవ్యవస్థను రూపుమాపే రోజు వస్తుంది తల్లి. 

శ్రీనివాస్..(స్టూడెంట్)
క్యాబినెట్ తీసుకొనే డెసిషన్ ను నీతి ఆయోగ్ కు పంపించాలని మాట్లాడుతున్నారు. క్యాబినెట్ ద్వారా పాస్ అవ్వాల్సిన దాన్ని బాబు ఇంత చేస్తున్నాడు. 

వైఎస్ జగన్..
ఎంత దారుణంగా ఆరోజు రాష్ట్రాన్ని విడగొట్టారంటే. రాష్ట్రాన్ని విడగొట్టేనాడు ప్రధానమంత్రి చెప్పినదానికి ప్రతిపక్షాలన్నీ మద్దతిచ్చి విడగొట్టారు.  పార్లమెంట్ లో ఇచ్చిన విలువకే దిక్కుదివానా లేకపోతే ..ఎక్కడకు పోవాలన్న ప్రశ్న తలెత్తుతోంది. ఎక్కడకు పోతున్నామో ప్రతి ఒక్కరు  ఈ రాజకీయ వ్యవస్థను ప్రశ్నించుకోవాలి. చంద్రబాబు, వెంకయ్యనాయుడు, బీజేపీ అందరూ కలిసి విడగొట్టారు. దీనికి ఖచ్చితంగా బాధ్యత వహించాలి. 

శ్రావణి..
రాష్ట్రంలో చాలా మంది మందు తాగి చనిపోతున్నారు. కుటుంబాలు నాశనమయిపోతున్నాయి సార్. 

వైఎస్ జగన్
చంద్రబాబు ఎన్నికల ముందు షాపులు తగ్గిస్తాను, మద్యపానాన్ని తగ్గిస్తాను అని రకరకాల స్పీచ్ లు ఇచ్చాడు. బాబు సీఎం అయ్యాక షాపులు లేని గ్రామాల్లోనూ చంద్రబాబు దగ్గరుండి షాపులు పెట్టించి అనధికారికంగా వేలం వేయించి పోలీసులతో షాపులు నడిపిస్తున్నాడు. మద్యాన్ని పెంచి పోషిస్తున్నాడు. శ్రావణి అమ్మ మీకు హామీ ఇస్తున్నా. మన ప్రభుత్వం వచ్చాక ఒక్క షాపు కూడా లేకుండా చేస్తా. పూర్తిగా మద్యపానాన్ని నిషేధిస్తాం. మద్యం తాగాలంటే సూట్ బూస్ వేసుకునే వాళ్లు హోటల్ లో తాగుతారు. 

శివ..
పోలీస్ రిక్రూట్ మెంట్ అన్నారు. ఇంతవరకు లేదు. అదిగదిగో వస్తున్నాయని ఆంధ్రరాష్ట్రం మభ్యపెడుతోంది.  తెలంగాణకు అన్నీ నోటిఫికేషన్లు విడుదల అవుతున్నాయి.  రేపు రేపు అని నిమ్మకాయల చినరాజప్ప చెబుతున్నాడు. నిరుద్యోగులంతా ఆశగా ఎదురుచూస్తున్నారు సార్. 

వైఎస్ జగన్..
ఏపీపీఎస్సీ రిక్రూట్ మెంట్ లేదు. ఇయర్ క్యాలెండర్ రిలీజ్ చేయరు. లక్షా 42,828 ఉద్యోగాలున్నాయని రాష్ట్రం విడగొట్టేనాడు చెప్పారు. ఒక్క నోటిఫికేషన్ ఇవ్వడం లేదు. డీఎస్సీ రాసిన వారికి ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తరో తెలియని ఆందోళనలో వారు ఉన్నారు. ఉద్యోగాలు ఇవ్వకపోగా చంద్రబాబు ఉన్న ఉద్యోగాలు ఊడబెరుకుతున్నాడు. 20 నెలలు దాటింది. ఇంతవరకు ఏమీ లేదు. ప్రభుత్వంపై పోరాడుదాం. 

శిరీష..(విద్యార్థిని)
అన్న నేను ఏడాదిన్నర నుంచి ఎస్ ఐ కోచింగ్ లో ఉన్నాను. అసలు ఈప్రభుత్వం ఉన్నంతకాలం నోటిఫికేషన్లు ఇస్తదంటారా.

వైఎస్ జగన్..
కర్మ ఏంటంటే చంద్రబాబు చర్మం ఈమధ్య కాలంలో మందమైపోయింది. మనిషికో మాట పశువుకో దెబ్బ అన్నమాదిరి చంద్రబాబుకు ఎంత చెప్పినా పట్టించుకోరు. సిగ్గు ఎగ్గూ లేదు. కనీసం నీ మాటలైనా తగిలి చంద్రబాబుకు సిగ్గు వస్తుందేమో తల్లి. చంద్రబాబును గట్టిగా నిలదీద్దాం. 

ఈశ్వరి..(విద్యార్థిని)
బాబు వస్తే జాబు గ్యారంటీ అని చాలా బాగా చెప్పాడు. రెండు సంవత్సరాల నుంచి అసలు చంద్రబాబు ఏం చేస్తున్నాడు అన్నా. ఉద్యోగాలు లేక బీటెక్ వాళ్లు దొంగతనాలు చేస్తున్నారు, నక్సలైట్లు అవుతున్నారని చెబుతున్నారన్నా. తలచుకుంటేనే భయమవుతుందన్నా. 

వైఎస్ జగన్..
బాబు వస్తే జాబు అన్నాడు. ఇవాళ  ఉన్న ఉద్యోగాలు ఊడబెరుకుతున్నాడు. ఉద్యోగం లేని వారికి నెలకు రూ.2 వేలు నిరుద్యోగ భృతి అన్నాడు. అదీ ఇవ్వడం లేదు. ప్రత్యేకహోదా తెచ్చుకుంటే ఉద్యోగాలు వస్తాయి. ఖచ్చితంగా పోరాడుదాం తల్లి. 

రాహుల్..(ఇంజినీరింగ్ స్టూడెంట్)
పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీకే విలువలేకపోతే దేశంలో ఏముందనుకోవాలి. పోరాటం ఏవిధంగా ముందుకు తీసుకుపోవాలి. మీరు మాకు దిశానిర్దేశం చేయాలి. సివిల్ ఇంజినీరింగ్ పోస్టుు 10 వేలు ఖాళీలున్నాయి. వాటిని విడుదల చేయడం లేదు.

వైఎస్ జగన్..
విశ్వసనీయత అన్న పదం  రాజకీయ నాయకులకు లేకుండా పోతోంది. విశ్వసనీయతను రాజకీయ వ్యవస్థలోకి తీసుకురావాలంటే అబద్ధం చెప్పిన చంద్రబాబు  చెంప చెళ్లుమనిపించాలి.

హిమజ( డిగ్రీ సెకండియర్)
భారత పౌరులకు రాజ్యాంగం మీద కొంతైనా అవగాహన ఉండాలి. మీరు చెప్పిన ఇన్ని రైట్స్ ఉంటాయమని మాకు తెలియదు సార్. ఇప్పుడు చాలా తెలుసుకున్నాం.

వైఎస్ జగన్..
విద్యార్థులకు సబ్జెక్ట్ మీద అవగాహన ఉంటే రాజకీయనాయకులను ప్రశ్నించవచ్చు. విషయం మీద అవగాహన ఉండాలంటే నెట్ లోకి వెళ్లి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పైనాన్స్ డిపార్ట్ మెంట్ స్పెషల్ స్టేటస్ కొడితే రకరకాల వెబ్ సైట్స్ ఉంటాయి తల్లి. పార్లమెంట్ రీసెర్చ్ సెంటర్ లో డాక్యుమెంట్ చదివితే చాలు. స్పెషల్ స్టేటస్ ఏంటి. ఎవరికిస్తున్నారు. పూర్తిగా అవగాహన లభిస్తుంది. అప్పుడు చంద్రబాబు, మంత్రులు అబద్ధాలు చెప్పినప్పుడు గట్టిగా నిలదీయోచ్చు. మా చెవిలో పూలు లేవని టీడీపీ, బీజేపీ వాళ్లను ప్రశ్నించవచ్చు. అదేవిధంగా వైఎస్సార్ కాంగ్రెస్ వెబ్ సైట్ లోకి వెళ్లితే అందులో ప్రత్యేకహోదా కరపత్రం ఉంటుంది. అక్కడ హోదాకు సంబంధించి పూర్తిగా సమాచారం ఉంటుంది తల్లి. www.ysrcongress.com లో పూర్తి సమాచారం లభిస్తుంది. 

బాల..(స్టూడెంట్)
ప్రత్యేకహోదా వస్తదా రాదా. మేము అసలు ఉద్యోగాలు చేస్తామా సార్. 

వైఎస్ జగన్..
ఇంతకుముందు చెప్పిన విధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫైనాన్స్ డిపార్ట్ మెంట్ వెబ్ సైట్ ఓపెన్ చేస్తే హోదా వల్ల కలిగే మేలు తెలుస్తుంది. 
రాష్ట్రానికి హోదా ఇస్తామని కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలు అందరూ కలిసి రాష్ట్రాన్ని విడగొట్టారు. అందరం కలిసికట్టుగా పోరాడి హోదాను తెచ్చుకుందాం తల్లి. హోదా వల్ల జగన్ కు ఏ ఉద్యోగం రాదు తల్లి. నాకో నాలాంటి వాళ్లకోసమో కాదు. డిగ్రీ పుచ్చుకొని కాళ్లరిగేలా తిరుగుతున్న మనలాంటి సామాన్యుడికి హోదా ఖచ్చితంగా కావాలి. సామాన్యుడికి ఉపయోగపడేవిధంగా చేయనప్పుడు పదవిలో ఉండడమెందుకు. గట్టిగా పోరాడుదాం.

మెడలు వంచైనా ప్రత్యేక హోదాను సాధించుకొందాం..!

ప్రత్యేక హోదా తో ఎన్నెన్నో ప్రయోజనాలు
చంద్రబాబు తాకట్టు పెట్టేశారు
నిలదీయాల్సిన సమయం వచ్చేసింది 



కాకినాడ: ప్రత్యేక హోదా ను సాధించుకొనేందుకు చంద్రబాబు ని నిలదీయాల్సిన సమయం ఆసన్నమైందని ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ అభిప్రాయ పడ్డారు. విద్యార్థులు, యువత కలసి వచ్చి ప్రత్యేక హోదాను సమష్టిగా సాధించుకొందామని ఆయన పిలుపు ఇచ్చారు. ప్రత్యేక హోదా ప్రాధాన్యాన్ని వైఎస్ జగన్ కాకినాడ యువభేరి వేదికగా విద్యార్థులు, యువతకు వివరించారు.

కేంద్ర గ్రాంట్లు 90 శాతం ..!
ఆర్థికసంఘం సిఫార్సుల మేరకు   గ్రాంట్లు, లోన్ ద్వారా రాష్ట్రాలకు సొమ్ము అందుతుంది. గ్రాంట్ అయితే తిరిగి చెల్లించక్కర్లేదు. అదే లోన్ అయితే తిరిగి చెల్లించాలి. ప్రత్యేకహోదా ఉంటే కేంద్ర నిధుల్లో 90 శాతం గ్రాంట్. ఈ 90 శాతం తిరిగి చెల్లించనక్కర లేదన్న మాట. లోన్ కేవలం 10 శాతం ఉంటుంది. ప్రత్యేకహోదా లేని రాష్ట్రాలకు కేంద్రం 30 శాతానికి మించి గ్రాంట్లు ఇవ్వదు. మిగతా 70 శాతం లోన్ గానే వస్తుంది.   అదేవిధంగా  ప్రత్యేకహోదా కలిగిన రాష్ట్రాలకు విపరీతంగా పారిశ్రామిక రాయితీలు ఇస్తారు. దేశంలో ఇప్పటి వరకు  11 రాష్ట్రాలకు హోదా ఉంది. వీటికి మాత్రమే రాయితీలు ఇచ్చారు. వేరేవాళ్లకు ఇవ్వలేదు. 100 శాతం ఎక్సైజ్ రాయితీలు,  ఇతర సుంకాల మినహాయింపులు ఉంటాయి. ట్రాన్స్ పోర్ట్ ఖర్చులు వెనక్కిస్తారు. పరిశ్రమలకి ఇచ్చే కరెంట్ 20 ఏళ్లపాటు రాయితీ ఇస్తారు. ఇలా ఎన్నెన్నో ప్రయోజనాలు ఉంటాయి.

అన్నీ తెలిసే బాబు మోసం..!
చంద్రబాబు మలేషియా, సింగపూర్ వెళ్లాల్సిన పనిలేదు. ఆయన చేయాల్సిందల్లా ఢిల్లీకి వెళ్లి కేంద్రం మీద ఒత్తిడి తేవాలి. హోదా వస్తే పారిశ్రామికవేత్తలు రాష్ట్రానికి క్యూ కడతారని బాబుకు తెలిసికూడా తెలియనట్టు ఉంటాడు. ప్రత్యేక హోదా వస్తే  ప్రతి జిల్లా ఓ హైదరాబాద్ అవుతుంది.  హోదా కోసం మన రాష్ట్రంలోని పెద్దలు, ముఖ్యమంత్రులు, మంత్రులు పోరాడడం లేదు.

ఆనాడు పార్లమెంట్ లో టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్ లు రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు రాష్ట్రానికి హోదా ఇస్తామని హామీ ఇచ్చారు.   ఐదేళ్లపాటు కాంగ్రెస్   హోదా ఇస్తామంటే... ఐదేళ్లు కాదు పదేళ్లు కావాలని బీజేపీ, చంద్రబాబు రాజ్యసభలో అడిగారు. ఆరోజు అందరూ కలిసికట్టుగా ఒక్కటై ప్రత్యేకహోదా ఇస్తామన్న హామీ ఇచ్చి విడగొట్టారు. ఆతర్వాత ఎన్నికలకు వెళ్లారు. రకారకాలుగా పాంప్లెంట్ వేశారు. ప్రతి ఇంటికి పంపించారు. మేనిఫెస్టో రిలీజ్ చేశారు. 

హోదా గురించి ఎప్పుడు ఉద్యమించినా రోజుకో అబద్దమే. వాళ్లంతటే వాళ్లే చెబుతారు హోదా లేదు. దాని శకం ముగిసిందని చెబుతారు. వీళ్లు చెబుతున్న అబద్ధాలు చూస్తే బాధనిపిస్తోంది. మన పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి లేఖ రాస్తే, ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కొనసాగుతోందని పార్లమెంటు వేదికగా కేంద్రం జవాబిచ్చింది. అయినా సరే, ఇక్కడ అబద్దాలు ఆడుతున్నారు. ప్రజలు బయటకొడతారని ఆంధ్రకు వచ్చినప్పుడు అబద్ధాలు చెబుతున్నారు.

ఆర్థికసంఘం అడ్డుతగులుతుందని మాట్లాడతారు. వాళ్ల పరిధి కాదు. కేవలం రాష్ట్రాలమధ్య ట్యాక్స్ లు ఎలా పెంచాలన్నది డీల్ చేస్తారు. రాష్ట్రాల మధ్య నిధుల పంపకాలు.

మేము చదువుకున్నాం, డిగ్రీలు పాస్ అయ్యాం. మేం ఈతరం వాళ్లం. తెలియని విషయాలు తెలుసుకుంటాం, నిలదీస్తామని చెప్పండి. ఆర్థికసంఘాలకు హోదా ఇవ్వాలన్న కెపాసిటీ లేదు. అది అర్థమయ్యేట్లు చెప్పండి. హోదా కలిగిన రాష్ట్రానికి వనరులు తక్కువ ఇస్తున్నారు. లేని రాష్ట్రానికి ఎక్కువ ఇస్తున్నారని బాబు ఈమద్య మళ్ల మభ్యపెట్టేప్రకటన చేస్తున్నాడు.

చంద్రబాబును అడగండి. హోదా ఉన్న రాష్ట్రాలకు ఎంత డబ్బులు ఇవ్వాలన్నదానికి ఫార్ములా లేదు. జమ్ముకాశ్మీర్ ఎన్నికలప్పుడు మోదీ వెళ్లాడు. 70 వేల కోట్ల ప్యాకేజీ ప్రకటించాడు.

కోటి 20 లక్షల జనాభా ఉన్న జమ్ముకాశ్మీర్ కు అంత ప్రకటిస్తే.. 5 కోట్లు ఉన్న మనకు ఎంత కేటాయించాలో బాబును అడగండి.

చంద్రబాబుమీద ఒత్తిడి పెంచాల్సిందే..!
ప్రత్యేక హోదా ఇచ్చే అధికారం జాతీయ అభివ్రద్ది మండలి ది. దీనికి అధ్యక్షులు ప్రధానమంత్రి. అలాగే క్యాబినెట్ కు కానీ, ఎన్టీయే మండలి కి కానీ, నీతి అయోగ్ కుకానీ ఛైర్మన్ ఆయనే.. మరి అటువంటప్పుడు ఆయనే సంతకం పెడితే ఆపేదెవరు. క్యాబినెట్ ఒక్క సంతకంతో ఇచ్చే నిర్ణయం. అప్పటి కేంద్ర క్యాబినెట్ తీర్మానం చేసి ప్లానింగ్ కమిషన్ కు పంపిస్తే.. 8 నెలల పాటు   అలాగే పడి  ఉంది. ఆ ఫైల్ కావాలని బాబు కేంద్రాన్ని అడిగిన పాపాన పోలేదు. చంద్రబాబు ఎందుకు గట్టిగా అడగడం లేదన్న డౌట్ అందరికీ వస్తుంది.

ఆంధ్ర రాష్ట్రంలో లంచాలు తీసుకొని ..మామూలు లంచాలు కాదు. ఎంత దారుణంగా అంటే పోలవరం నుంచి పట్టిసీమ వరకు..ఇసుక నుంచి మట్టి వరకు. బొగ్గు వరకు అన్నీ లంచాలే.   ఈలంచాలతో విచ్చలవిడిగా తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతుంటే 8 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ఒక్కొక్కరికీ 25 కోట్లు ఆశచూపి రెడ్ హ్యండెడ్ గా ఆడియో, వీడియో టేపులతో దొరికిపోయాడు. ఆకేసు నుంచి తప్పించుకునేందుకు హోదాను తాకట్టుపెట్టాడు.   హోదా  వేస్ట్ అని చెబుతున్నాడు.   పిల్లల జీవితాలు తాకట్టుపెట్టడం ఎంతవరకు సబబో బాబును నిలదీయాల్సిన సమయం వచ్చింది. బాబు మెడలువంచాలంటే జగన్ ఒక్కడే కాదు. జగన్ కు అందరూ తోడవ్వాలి. అందరం ఒక్కటై ఒత్తిడి తీసుకొస్తేనే ఇవాళ గాకపోతే రేపైనా ఇస్తారు. ఒత్తిడి తీసుకురాకపోతే మరుగున పరుస్తారు. రాబోయే రోజుల్లో గట్టిగా ఒత్తిడి తీసుకొద్దాం. మీ అందరి తోడు కావాలి . ప్రయాస పడి వచ్చిన వారందరికీ కృతజ్ఞతలు. 

27 January 2016

గ‌ర్జించు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌.. ప్ర‌త్యేక హోదా కోసం గ‌ర్జించు!

ప్రత్యేకహోదాపై వైఎస్సార్సీపీ కరపత్రం ..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఓ సంజీవని.   ప్ర‌త్యేక హోదాయే శ్రీ‌రామ ర‌క్ష‌. ఉద్యోగాలు, ప‌రిశ్ర‌మ‌లు, ప‌న్ను రాయితీలు అన్నీ ప్రత్యేకహోదాతోనే సాధ్యం.  ప్ర‌త్యేక హోదాతోనే వస్తువుల ధరలు స‌గానికి స‌గం త‌గ్గుతాయి. విభజనతో అడ్డంగా న‌రికిన మ‌న రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదాయే ప్రాణ‌వాయువు. కాబ‌ట్టే ఆత్మాభిమానులైన అయిదు కోట్ల ఆంధ్రప్ర‌దేశ్ ప్ర‌జ‌లారా గ‌ర్జించండి... దిక్కులు పిక్క‌టిల్లేలా సింహ‌నాదాలు చేయండి.  తెలుగువాడి గ‌ర్జ‌న‌ను ఢిల్లీ వ‌ర‌కు ప్ర‌తిధ్వ‌నింప‌జేయండి.  ప్ర‌త్యేక హోదా ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌ల హ‌క్కు.  మోసం చేస్తున్న ప్ర‌భుత్వాల‌పై పోరాడి అయినా దీన్ని సాధించుకుందాం రండి!

పార్ల‌మెంటులో ఇచ్చిన హామీకే దిక్కు లేక‌పోతే...

రాష్ట్ర విభ‌జ‌నే అన్యాయం. ఆ అన్యాయం చేస్తున్న స‌మయంలో సాక్షాత్తు దేశ పార్ల‌మెంటులో అప్ప‌టి ప్ర‌ధాని ఒక హామీ ఇచ్చారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు అయిదేళ్ళు ప్ర‌త్యేక హోదా ఇస్తాం అని కాంగ్రెస్ అంటే, కాదు ప‌దేళ్లు కావాల‌ని బీజేపీ డిమాండ్ చేసింది. తాము అధికారంలోకి వ‌స్తే అయిదేళ్ళు కాదు - ప‌దేళ్ళు ప్ర‌త్యేక హోదా ఇస్తాం అని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల మేనిఫెస్టోలో ఆ పార్టీ స్ప‌ష్టం చేసింది. చంద్ర‌బాబు నాయుడు కూడా అయిదేళ్ళు చాల‌దు - ప‌దేళ్ళు కావాల‌ని ఎన్నిక‌లకు ముందు - త‌రువాత చెప్పాడు. అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీలు క‌లిసి రాష్ట్రాన్ని విభ‌జించేందుకు పార్ల‌మెంటులో ఇచ్చిన హామీకే దిక్కులేట్ట‌యితే... ఇక పార్ల‌మెంటుకు విశ్వ‌స‌నీయ‌త ఏముంటుంది?
లంచాల కేసు నుంచి బ‌య‌ట‌ప‌డ‌టం సంజీవ‌ని అవుతుందా?

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో లంచాలు తీసుకుని ప‌ట్టిసీమ నుంచి పోల‌వ‌రం దాకా, ఇసుక నుంచి బొగ్గు దాకా, ఎంపిక చేసిన వారికి పారిశ్రామిక రాయితీలు మొద‌లు.... కొంద‌రికే మ‌ద్యం ఉత్ప‌త్తి పెంపు లైసెన్సుల వ‌ర‌కు ప్ర‌తి ఒక్క అంశంలోనూ విచ్చ‌ల‌విడిగా పుచ్చుకున్న ముడుపుల‌తో ...వంద‌ల కోట్లు కుమ్మ‌రించి తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ఎమ్మెల్యేల‌ను కొనుగోలు చేస్తూ ఆడియో వీడియో సాక్ష్యాల‌తో స‌హా అడ్డంగా దొరికిపోయిన చంద్ర‌బాబు నాయుడు గారికి ఇప్పుడు ఏపీకి ప్ర‌త్యేక హోదా కంటే త‌న ముఖ్య‌మంత్రి హోదా ఊడ‌కుండా చూసుకోవ‌టం ముఖ్య‌మయింది. అందుకే ఆ కేసు నుంచి బ‌య‌ట ప‌డేందుకు అయిదు కోట్ల ప్ర‌జ‌లు, వారి పిల్ల‌లు, భ‌విష్య‌త్తు త‌రాల ప్ర‌యోజ‌నాల‌న్నింటినీ తాక‌ట్టుపెట్టిన విధంగా ఢిల్లీ వెళ్ళి మ‌రీ... ప్ర‌త్యేక హోదా సంజీవ‌ని కాదు అంటూ దుర్మార్గ‌మైన ప్ర‌క‌ట‌న చేశారు.

ప్యాకేజీకి అర్థం చ‌ట్టం ప్ర‌కారం ఇవాల్సిన నిధులే కాదా?
విభ‌జ‌న చ‌ట్టం ప్ర‌కారం ప్యాకేజీకి అర్థం అప్ప‌టికే కేంద్రప్ర‌భుత్వం వివిధ ప‌థ‌కాల కోసం యాక్ట్‌లో పెట్టి మ‌న రాష్ట్రానికి ఇస్తాన‌న్న నిధులేక‌దా..? చ‌ట్ట‌ప్ర‌కారం ఇవ్వాల్సిన ఆ నిధులు మ‌న‌కు రావ‌టం మ‌న హ‌క్కు క‌దా? అవే నిధుల‌కు ప్యాకేజీ అని పేరు పెట్టి, అదేదో కొత్త‌గా తానేదో తీసుకువ‌స్తున్నాని మ‌భ్య‌పెట్టే ప్ర‌య‌త్నం దారుణం కాదా? ఏకంగా ప్ర‌త్యేక హోదానే ప‌ణంగా పెట్ట‌టం ధర్మ‌మేనా?

ఎందుకు ఇవ్వ‌రని నిల‌దీస్తుంటే... ఎన్నో అబ‌ద్ధాలు!
18 నెల‌లు గ‌డిపోయాయి. పార్ల‌మెంటులో మాట ఇచ్చి, అప్ప‌టి కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపి... ప్ర‌ణాళిక సంఘానికి ప్ర‌త్యేక హోదా ఇవ్వండ‌ని ఉత్త‌ర్వులు జారీ చేసి... 2014 డిసెంబ‌రులో న‌రేంద్ర‌మోడీగారు ప్ర‌ణాళిక సంఘాన్ని ర‌ద్దు చేసి నీతి ఆయోగ్ ఏర్పాటు చేసే వ‌ర‌కు కూడా ప్ర‌త్యేక హోదా ఇవ్వాల‌న్న సిఫార‌సు ఆచ‌ర‌ణ‌కు రాకుండా 8 నెల‌లు అలాగే ప‌డి ఉంది. ఇప్పుడు 18 నెల‌లు గ‌డిచినా ప్ర‌త్యేక హోదా ఊసులేదు... ఇస్తార‌న్న ఆశ లేదు. ఏపీకి ఎన్ని అన్యాయాలు అయినా చేయ‌వ‌చ్చునన్న‌ట్టుగా కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు కుమ్మ‌క్కు అయ్యాయి. అంత‌కు ముందు - 14వ ఆర్థిక సంఘం ప్ర‌త్యేక హోదా ఇవ్వొద్ద‌న్న‌ద‌ని అబద్ధం చెప్పారు. ఆర్థిక సంఘానికి అలా చెప్పే అధికార ప‌రిధే లేదు. ఆర్థిక సంఘం ప‌ని కేంద్ర రాష్ట్రాల మ‌ధ్య కేంద్ర పన్నుల్ని పంప‌కం చేయ‌టం, నాన్‌ప్లాన్ గ్రాంట్స్ అండ్ లోన్‌గా పంచ‌టం. ప్లాన్ గ్రాంట్లు, ప్లాన్ డెఫిసిట్ ఇచ్చే బాధ్య‌త ఆర్థిక సంఘానికి కాదు. అదేర‌కంగా ప్ర‌త్యేక హోదా క‌లిగిన రాష్ట్రాల‌కు ఎంత మొత్తం నిధులుగా ఇవ్వాలో ఒక ఫార్ములా లేదు. నిధుల‌ను గ‌త ఆర్థిక సంవ‌త్స‌రాల‌కు సంబంధించిన ప్ర‌ణాళిక వ్య‌యం, ప్ర‌స్తుత ఆర్థిక సంవ‌త్స‌రానికి సంబంధించిన ప్ర‌ణాళిక నిధుల ప‌రిమాణం ఆధారంగా ఇస్తారు. కాబ‌ట్టే ఆ హోదా ఉన్న జ‌మ్మూకాశ్మీర్‌కు ఎన్నిక‌ల ముందు న‌రేంద్ర మోడీ గారు రూ. 70వేల కోట్లు గ్రాంట్‌గా ప్ర‌క‌టించారు. ఆ రాష్ట్ర జ‌నాభా కేవ‌లం 1.25 కోట్లు మాత్ర‌మే. అదే ప్ర‌త్యేక హోదాలేని రాష్ట్రాలు అయితే నిర్ధిష్ఠ గాడ్డిల్‌-ముఖ‌ర్జీ ఫార్ములా మేర‌కే నిధులు ఇస్తారు. ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌టం కుద‌ర‌దంటూ కేంద్రంలో ఉన్న పెద్ద‌లు మ‌రో విచిత్ర‌మైన వాద‌న చేశారు - మ‌హారాష్ట్ర‌, త‌మిళ‌నాడు, ఒరిస్సాలు అడ్డుకుంటున్నాయ‌ని సాకులు చెప్పారు. విభ‌జ‌న స‌మ‌యంలో ఈ రాష్ట్రాలు లేవా? ఇప్పుడు ఆ రాష్ట్రాలు అడ్డుకొంటున్నాయ‌న‌టం భావ్య‌మా? ఎన్డీసీ అయినా, ప్ర‌ణాళికా సంఘం అయినా, నీతి ఆయోగ్ అయినా, కేంద్ర క్యాబినెట్ అయినా... అన్నింటికీ ప్ర‌ధాన‌మంత్రే అధ్య‌క్షుడు. ప్ర‌త్యేక హోదా అన్న‌ది కేవ‌లం క్యాబినెట్ నిర్ణ‌యం. అంటే ఎగ్జిక్యూటివ్ డెసిష‌న్‌. గ‌తంలో ఏర్పాటు అయినా ఏ రాష్ట్రానికి అయినా అప్ప‌టి కేంద్ర క్యాబినెట్ నిర్ణ‌యం ద్వారానే ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌టం జ‌రిగింది. అడ‌గాల్సింది బాబు.... ఇవ్వాల్సింది కేంద్ర మంత్రిమండ‌లి. త‌ల‌చుకుంటే ఇది చిటికెలో ప‌ని!

విద్యార్థులు, యువ‌త ఉద్య‌మించాలి!
అయినా బాబు గ‌ట్టిగా అడ‌గ‌డు... కేంద్రం ఇవ్వ‌దు! ఇదీ ప‌రిస్థితి! కాబ‌ట్టే మ‌న రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌ను మ‌న‌మే కాపాడుకునేందుకు ఉద్య‌మించాల్సిన త‌రుణం వ‌చ్చింది. ప్ర‌త్యేక హోదా ఏపీ హ‌క్కు అని దిక్కులు పిక్క‌టిల్లేలా ఉద్య‌మించి కార్యాచ‌ర‌ణ‌కు దిగాల్సిన సంద‌ర్భం వ‌చ్చింది. ఈ నేప‌థ్యంలోనే తొలుత విజ్ఞాప‌న‌లు, త‌రువాత మంగ‌ళ‌గిరిలో దీక్ష‌, ఆ పైన ఛ‌లో ఢిల్లీ, ఏపీ బంద్‌, శాస‌న‌స‌భ‌లో నిల‌దీత‌...
ఇలా ఈ మొద‌టి నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ అడుగులు వేస్తూనే వ‌చ్చింది. ప్ర‌త్యేక హోదా ఇచ్చే, తెచ్చే విష‌యంలో నిద్ర న‌టిస్తున్న వారిని ప్ర‌జ‌లే నిద్ర లేపాల్సిన స‌మ‌యం అస‌న్న‌మ‌యింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఒక రాష్ట్రంగా స‌గ‌ర్వంగా నిల‌బ‌డాల‌న్నా, అభివృద్ధి చెందాల‌న్నా, యువ‌త‌కు ఉద్యోగాలు రావాలన్నా కేంద్రంలో - రాష్ట్రంలో అధికారం అనుభ‌విస్తున్న పార్టీలు ఇచ్చిన మాట నిల‌బెట్టుకోవాలి. రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌కుమించిన ప్రయోజ‌నాలు ఏవీ లేవ‌ని తెలుగు ప్ర‌జ‌ల‌కు నిరూపించ‌ద‌ల‌చుకుంటే చంద్ర‌బాబు నాయుడు త‌క్ష‌ణం త‌న మంత్రుల‌తో రాజీనామా చేయించాలి. ఒత్తిడి తేవాలి. మ‌హోద్య‌మం రావాలి. 

ప్ర‌త్యేక హోదాతో మాత్ర‌మే ఇవ‌న్నీ సాధ్యం!
కేంద్ర గ్రాంట్లు 90శాతం వ‌స్తాయి
- ఆర్థిక సంఘం సిఫార్సుల మేర‌కు ప‌న్నుల్లో వాటాతో పాటు గ్రాంట్లు, లోన్ ద్వారా రాష్ట్రాల‌కు సొమ్ము అందుతుంది. గ్రాంట్ అంటే తిరిగి చెల్లించ‌న‌క్క‌ర‌లేని సొమ్ము. అదే లోన్ అయితే తిరిగి చెల్లించాలి.
- స్పెష‌ల్ కేట‌గిరీ లేని రాష్ట్రాల‌కు కేంద్ర ఇచ్చే గ్రాంట్లు 30శాతానికి మించి ఉండ‌వు. అంటే ఏ ప‌థ‌కం, ఏ కార్య‌క్ర‌మం చేప‌ట్టినా... కేంద్రం గ్రాంట్ పోనూ మిగ‌తా 70శాతం లోనుగానే వ‌స్తుంది.
- అదే రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా ఇస్తే కేంద్ర గ్రాంట్ 90శాతం అందుతుంది. లోన్ కేవ‌లం 10శాతం ఉంటుంది.
- ఇవికాక ప్ర‌త్యేక హోదా ఉన్న రాష్ట్రాల‌కు మాత్ర‌మే అద‌నంగా భారీ పారిశ్రామిక రాయితీలు ఇస్తారు.
ప్ర‌త్యేక హోదాతోనే భారీ పార‌శ్రామిక రాయితీలు...
- దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు 11 రాష్ట్రాల‌కు ప్ర‌త్యేక హోదా ఇచ్చారు. ఆ 11 రాష్ట్రాల‌కు ప్ర‌త్యేక హోదా ఇచ్చినందునే ప‌రిశ్ర‌మ‌ల‌కు రాయితీలు భారీగా వ‌చ్చాయి. మిగ‌తా రాష్ట్రాల‌కు అర‌కొర పారిశ్రామిక రాయితీలు ల‌భిస్తే ప్ర‌త్యేక హోదా రాష్ట్రాల‌కు అత్యంత భారీగా పారిశ్రామిక రాయితీలు ద‌క్కాయి. చంద్ర‌బాబు నాయుడు గారు ఏమంటున్నారంటే... ప్ర‌త్యేక హోదా వేరు - పారిశ్రామిక రాయితీలు వేరు అంటున్నారు. ఇది అబద్ధం. ప్ర‌త్యేక హోదా లేకుండా దేశ చ‌రిత్ర‌లో ఏ ఒక్క రాష్ట్రానికి అటువంటి భారీ పారిశ్రామిక రాయితీలు ల‌భించ‌లేదు. ఇది తెలిసీ చంద్ర‌బాబు అబద్ధాలు చెప్ప‌టం మ‌రీ దారుణం. వేల‌కొద్దీ ప‌రిశ్ర‌మ‌లు, వాటితో పాటు ల‌క్ష‌ల సంఖ్య‌లో ఉద్యోగాలు రావాల‌న్నా క‌చ్చితంగా ప్ర‌త్యేక హోదా కావాలి.
హోదా వ‌స్తే ప‌రిశ్ర‌మ‌ల‌కు మ‌హ‌ర్ద‌శ‌... ఉద్యోగాల వెల్లువ‌
- ప్ర‌త్యేక హోదా ఉంటేనే పారిశ్రామిక యూనిట్ల‌కు 100శాతం ఎక్సైజ్ డ్యూటీ మిన‌హాయింపు ల‌భిస్తుంది. ఆదాయం మీద ప‌న్నులో (ఇన్‌క‌మ్ ట్యాక్స్ - ఐటి) కూడా 100 శాతం రాయితీ ల‌భిస్తుంది. ప‌న్ను మిన‌హాయింపులు, ఫ్రైట్ రీయింబ‌ర్స్‌మెంట్‌లు ద‌క్కుతాయి. ప్ర‌త్యేక హోదాతో దక్కే ఇలాంటి రాయితీలు ఉంటేనే మిగ‌తా రాష్ట్రాల నుంచి కూడా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు పెద్ద‌పెద్ద కంపెనీల పారిశ్రామిక వేత్త‌లు రెక్క‌లు క‌ట్టుకు వ‌స్తారు. ల‌క్ష‌ల కోట్లు పెట్టుబ‌డులు వ‌స్తాయి. ల‌క్ష‌ల సంఖ్య‌లో ఉద్యోగాలు స‌మ‌కూర‌తాయి.
- ప్లాంట్లు, యంత్రాల మీద పెట్టే పెట్టుబ‌డిలో 30శాతం రాయితీ ల‌భిస్తుంది. కొత్త‌గా ఏర్పాటయ్యే ప‌రిశ్ర‌మ‌ల‌తో పాటు, ప్ర‌త్యేక హోదా ప్ర‌క‌ట‌న నాటికే ఏర్పాటై... ఆ త‌ర్వాత విస్త‌ర‌ణ చేప‌ట్టిన ప‌రిశ్ర‌మ‌ల‌కు కూడా ఇది వ‌ర్తిస్తుంది.
- మ‌న రాష్ట్రంలో ఉన్న ఔత్సాహికులు సొంతంగా ప‌రిశ్ర‌మ‌లు ఏర్పాటు చేయ‌డానికి ఈ నిర్ణ‌యాలు దోహ‌దం చేస్తాయి. మ‌ధ్య‌, చిన్న‌త‌ర‌హా ప‌రిశ్ర‌మ‌ల ఏర్పాటుకు ఇలాంటి రాయితీలు ప‌నికి వ‌స్తాయి. 
- పరిశ్ర‌మ‌ల ఏర్పాటుకు తీసుకునే వ‌ర్కింగ్ క్యాపిట‌ల్‌పై 3 శాతం వ‌డ్డీ రాయితీ ల‌భిస్తుంది. 
- ప‌రిశ్ర‌మ‌లకు 20 ఏళ్ళ‌కు త‌గ్గ‌కుండా విద్యుత్ చార్జీల‌పై 50 శాతం రాయితీ ల‌భిస్తుంది.
- ఇవే కాకుండా ఇన్సూరెన్స్‌, ర‌వాణా వ్య‌యంపైనా రాయితీలు ఉంటాయి.
- కేంద్ర సూక్ష్మ‌, చిన్న‌, మ‌ధ్య‌త‌ర‌హా, భారీ ప‌రిశ్ర‌మ‌ల శాఖ ఏర్పాటు స‌మీకృత మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న కేంద్రాల ఏర్పాటులో పెట్టుబ‌డుల తీరును ప్ర‌త్యేక హోదా మారుస్తుంది. ప్ర‌భుత్వ రంగంలోని ఓఎన్జీసీ, హెచ్‌పీసీఎల్ వంటివి కూడా భారీ పెట్టుబ‌డుల‌తో ముందుకు వ‌చ్చే అవ‌కాశం ఉంది.
- సాధార‌ణ రాష్ట్రాల్లో ఏర్పాటు చేస్తే కేంద్ర‌, రాష్ట్ర పెట్టుబ‌డుల నిష్ప‌త్తి 2:3గ‌ఆ ఉంటుంది. అదే ప్ర‌త్యేక హోదా ఉంటే 4:1 నిష్ప‌త్తిలో ఉంటుంది. ఒక్క మాట‌లో చెప్పాలంటే ప‌దేళ్ళ ప్ర‌త్యేక హోదాతో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని 13 జిల్లాలూ ఒక్కో హైద‌రాబాద్‌గా రూపొందుతాయి. కంపెనీలే నిరుద్యోగుల వెంట ప‌డే ప‌రిస్థితి వ‌స్తుంది. నో వేకెన్సీ బోర్డులు పోయి వాంటెడ్ అంటూ ప్ర‌తి కంపెనీ ఎదుటూ బోర్డులు పెట్టే ప‌రిస్థితి వ‌స్తుంది. ప‌న్ను రాయితీలు, ప్రోత్సాహ‌కాల వ‌ల్ల మ‌నం కొనుగోలు చేస్తున్న అనేక వ‌స్తువుల ధ‌ర‌లు స‌గానికి స‌గం త‌గ్గే అవ‌కాశం ఉంది. ఉత్ప‌త్తి చేసే వ‌స్తువుల మీద 100 శాతం ప‌న్ను రాయితీలు ల‌భిస్తే ఏ రాష్ట్రంలోనూ ల‌భించ‌నంత చౌక‌గా మ‌న రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు వ‌స్తువులు అందుతాయి.
 హోదా ఉంటే మ‌న నీటి ప్రాజెక్టుల్ని కేంద్ర‌మే క‌డుతుంది.

- యాక్సిల‌రేటెడ్ ఇరిగేష‌న్ బెనిఫిట్ ప్రోగ్రామ్‌(ఏఐబీపీ) అన‌ది కేంద్ర ప్ర‌భుత్వం రాష్ట్రాల్లో నీటి ప్రాజెక్టుల‌కు నిధులు ఇచ్చే కార్య‌క్ర‌మం. ప్ర‌త్యేక హోదా లేని రాష్ట్రాల‌కు ఈ ప‌థ‌కం కింద ప్రాజెక్టులు వ‌చ్చినా మ‌హా అయితే 25 నుంచి 50 శాతం నిధులు గ్రాంట్‌గా ఇస్తారు. అదే ప్ర‌త్యేక హోదా ఉన్న రాష్ట్రాల‌కు నీటి ప్రాజెక్టుల నిర్మాణానికి 90శాతం నిధుల‌ను కేంద్ర‌మే గ్రాంట్‌గా ఇస్తుంది. ఉదాహ‌ర‌ణ‌కు ఆంధ్రప్ర‌దేశ్ పున‌ర్ వ్య‌వ‌స్థీకర‌ణ చ‌ట్టం పేరా నంబ‌ర్ 10లో హంద్రీ-నీవా, గాలేరు-న‌గ‌రి, వంటి నీటి ప‌థ‌కాలు ఉన్నాయి. ఇవి పూర్తి కావాలంటే క‌నీసం రూ. 8వేల కోట్లు కావాలి. ప్ర‌త్యేక హోదా ఉంటేనే ఈ ప్రాజెక్టుల‌కు 90శాతం డ‌బ్బు గ్రాంట్‌గా వ‌స్తుంది.

హోదా ఉంటే మ‌న రుణాన్ని కేంద్రమే చెల్లిస్తుంది
- ఎక్స్‌ట‌ర్న‌ల్లీ ఎయిడెడ్ ప్రాజెక్టుల‌కు సంబంధించి విదేశీ రుణ భారాన్ని కేంద్ర‌మే భ‌రిస్తుంది. రుణంలో 90శాతం మొత్తాన్ని కేంద్ర‌మే గ్రాంటుగా ఇస్తుంది.
- ఆ రుణంపై వ‌డ్డీ కూడా కేంద్ర‌మే క‌డుతుంది.
- ఉదాహ‌ర‌ణ‌కు విశాఖ‌ప‌ట్నం-చెన్నై పారిశ్రామిక కారిడ‌ర్ ఏర్పాటుకు రూ. 5000 కోట్ల రుణాన్ని ఆసియ‌న్ డెవ‌ల‌ప్‌మెంట్ బ్యాంక్ నుంచి తీసుకోవాల‌నే ప్ర‌తిపాద‌న ఉంది. విశాఖ‌ప‌ట్నం, విజ‌య‌వాడ మెట్రో రైళ్ళ ఏర్పాటుకు దాదాపు రూ. 8 వేల కోట్లు ఖ‌ర్చ‌వుతాయ‌ని అంచ‌నా. ఈ రెండు ప్రాజెక్టుల‌కు కూడా విదేశీ ఏజెన్సీల నుంచి రుణం పొంద‌నున్నారు. ప్ర‌త్యేక హోదా ఇస్తే 90శాతం రుణాన్ని గ్రాంట్‌గా ఇవ్వ‌టంతో పాటు వ‌డ్డీ కూడా కేంద్ర ప్ర‌భుత్వ‌మే భ‌రిస్తుంది. విశాఖ‌-చెన్నై పారిశ్రామిక కారిడార్‌, విశాఖ‌, విజ‌య‌వాడ‌(వీజీటీఎం) మెట్రో రైళ్ళు.... విభ‌జ‌న చ‌ట్టంలో హామీలే. 90 శాతం రుణం కేంద్రం భ‌రిస్తే.... విశాఖ‌-చెన్నై పారిశ్రామిక కారిడ‌ర్‌తో పాటు అన్నీ వ‌స్తాయి. ఎంద‌రో పారిశ్రామిక‌వేత్త‌లు కారిడార్ పొడ‌వునా ప‌రిశ్ర‌మ‌లు పెడ‌తారు. భారీగా ఉద్యోగాలూ వ‌స్తాయి. కారిడార్ వెంబ‌డి అనుంబంధ ప‌రిశ్ర‌మ‌లు వ‌స్తాయి. ఉపాధి, యువ‌త ముందుకు వ‌స్తుంది. అదే ప్ర‌త్యేక హోదా లేక‌పోతే, ఈ ప్రాజెక్టుల‌న్నింటికీ కేంద్రం నిధుల్ని గ్రాంట్‌గా ఇచ్చే విష‌యం దేవుడెరుగు.... వ‌డ్డీతో స‌హా మొత్తం మ‌న రాష్ట్ర‌మే క‌ట్టాల్సి వ‌స్తుంది. అటువంటి ప‌రిస్థితుల్లో గ్రాంట్లు ఇస్తే గిస్తే... వారి ద‌య - మ‌న ప్రాప్తం!

ప్ర‌త్యేక హోదాతో ప్ర‌యోజ‌నం పొందిన రాష్ట్రాలు
ఉదాహ‌ర‌ణ‌కు ఉత్త‌రాఖండ్‌కు ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌డం వ‌ల్ల ఆ రాష్ట్రంలో 2 వేల ప‌రిశ్ర‌మ‌లు వ‌చ్చాయి. రూ. 30వేల కోట్ల పెట్టుబ‌డుల‌తో ఒకేసారి 130శాతం అధికంగా ప‌రిశ్ర‌మ‌లు ఏర్పాటు కావ‌డం వ‌ల్ల ఉపాధి అవ‌కాశాలు 490 శాతం పెరిగాయి. 
- మ‌న రాష్ట్రం కంటే బాగా వెనక‌బ‌డిన హిమాచ‌ల్‌ప్ర‌దేశ్‌కు ప్ర‌త్యేక హోదా వ‌ల్ల ఏకంగా 10వేల ప‌రిశ్ర‌మ‌లు వ‌చ్చాయి. 
- 972 కిలోమీట‌ర్ల స‌ముద్ర‌తీరం ఉన్న ఆంధ్ర‌ప్ర‌దేశ్కు ప్ర‌త్యేక హోదా ల‌భిస్తే అది ఈ రాష్టం పాలిట సంజీవ‌నిగా ఉప‌యోగ‌ప‌డ‌దా?
ఇన్ని ప్ర‌యోజ‌నాలున్న ప్ర‌త్యేక హోదా మ‌న రాష్ట్రానికి రావాల‌ని అయిదు కోట్ల మంది కోరుకుంటారు. హోదా ఇవ్వం అన్న దుర్మార్గ‌పు మాట‌లు విని ఇప్ప‌టికే అయిదుగురు త‌మ జీవితాన్ని బ‌లిదానం చేశారు. అయినా, ప్ర‌త్యేక హోదా సంజీవ‌ని కాద‌ని, అదే స‌ర్వ‌రోగ నివారిణి కాద‌ని, అది జిందా తిలిస్మాత్ కాద‌ని అధికారంలో ఉన్న నాయ‌కులు వ్యాఖ్య‌నించ‌టం అంటే ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌యోజ‌నాల‌ను కాల‌ద‌న్న‌ట‌మే. అటువంటి దుస్సాహ‌సానికి ఒడిగ‌డుతున్న పార్టీలు, నాయ‌కులు, ప్ర‌భుత్వాల‌కు వ్య‌తిరేకంగా ఉద్య‌మించాల్సిన స‌మ‌యం ఇది. ప్ర‌త్యేక హోదా - ఆంధ్ర‌ప్ర‌దేశ్ హ‌క్కు. అది ఇవ్వ‌టం ప్ర‌భుత్వాల బాధ్య‌త‌!
జై తెలుగుత‌ల్లీ! జై వైఎస్సార్‌!!

25 January 2016

ఈ సారి ఆరోగ్య మిత్ర వంతు..!

* బాబు వచ్చాక జాబులు పోతున్న వైనం
* ఫీల్డ్ అసిస్టెంట్లు, ఆదర్శ రైతుల ఉద్యోగాలు పోయాయి
* అంగన్ వాడీ ఉద్యోగాలు ఊగుతున్నాయి
* ఇప్పుడు ఆరోగ్యమిత్ర ఉద్యోగులు రోడ్డున పడుతున్నాయి
హైదరాబాద్ : ఎన్నికలకు ముందు బాబు వస్తేనే జాబు వస్తుంది అని ఊదర గొట్టిన చంద్రబాబు ...అధికారంలోకి వచ్చాక ఉద్యోగాల్ని ఊడబెరుకుతున్నారు. అనేకమంది ఫీల్డ్ అసిస్టెంట్లు, ఆదర్శ రైతులు ఇంటి బాట పట్టారు. ఇప్పుడు ఆరోగ్యమిత్ర ఉద్యోగులు రోడ్డున పడుతున్నాయి.
ఎన్నికల ముందు అదే ప్రచారం
ఎలక్షన్ల సమయంలో చంద్రబాబు రెచ్చిపోయి హామీలు ఇచ్చారు. బాబు వస్తేనే జాబులు వస్తాయని తెలుగు తమ్ముళ్లు రెచ్చిపోయి ప్రచారం చేశారు. ఉద్యోగం లేకపోతే మాత్రం నిరుద్యోగులకు భ్రతి కోసం రూ. 2వేల రూపాయిలు ఇప్పిస్తామని నమ్మబలికారు. ఇదంతా పూర్తయింది. ఎన్నికలు పూర్తయ్యాక చంద్రబాబుకి అయితే మాత్రం చక్కటి ఉపాధి లభించింది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అదిగదిగో ఉద్యోగాలు వచ్చేస్తాయంటూ నిరుద్యోగులు ఆశగా ఎదురు  చూడసాగారు. కానీ, ఈలోగానే అసలు కార్యక్రమం మొదలైంది.

ఉద్యోగాలు తీసివేయటమే లక్ష్యంగా..!
అప్పటి దాకా ఉద్యోగాలు చేసుకొంటూ కుటుంబాల్ని పోషించుకొంటున్న అనేక మంది ఉసురు పెట్టేందుకు చంద్రబాబు సిద్ధపడ్డారు. మొదటగా ఆదర్శ రైతుల్ని తీసివేసి ఇంటికి పంపించారు. తర్వాత ఉపాధి హామీ పథకాన్ని పర్యవేక్షించి నివేదికలు సమర్పించే ఫీల్డు అసిస్టెంట్ ఉద్యోగుల్ని తీసివేశారు.  తర్వాత దశలో  అంగన్ వాడీ ఉద్యోగుల మీద కన్ను పడింది. కేవలం పెంచిన జీతాలు ఇప్పించండంటూ ధర్నా చేసినందుకు గాను, ఉద్యోగాల నుంచి తొలగించేందుకు చంద్రబాబు సిద్దపడ్డారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
ఇప్పుడు ఆరోగ్యమిత్రల వంతు..!
పేదలకు కార్పొరేట్ వైద్యం అందించేందుకు దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయంలో ఆరోగ్య శ్రీ పథకాన్ని ప్రవేశ పెట్టారు. దీని కింద నిరుపేద వర్గాలకు కూడా ప్రైవేటు ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్యం అందించేలా చర్యలు తీసుకొన్నారు. అయితే ఆయా కార్పొరేట్ ఆసుపత్రుల్లో బిల్లింగ్ విభాగాల్లో సమస్యలు వస్తుండటంతో దీన్ని పరిష్కరించేందుకు ఆరోగ్య మిత్ర పేరుతో ఉద్యోగుల్ని నియమించారు. ప్రతీరోజూ ఆయా కార్పొరేట్ ఆసుపత్రులకు వచ్చే పేదలకు వైద్య పరంగా బిల్లింగ్ పరంగా సాయం చేయటం ఈ ఉద్యోగుల విధి. ఇప్పుడు చంద్రబాబు కన్ను ఈ ఉద్యోగుల మీద పడింది. దీంతో ఒక్క కలం పోటు తో ఈ ఉద్యోగుల్ని ఇంటికి పంపించేందుకు మార్గం సిద్దం చేశారు. దీంతో ఈ ఉద్యోగులంతా లబోదిబోమంటున్నారు. 

పీవీ సింధుకు వైఎస్ జగన్ అభినందనలు

హైదరాబాద్‌: తెలుగు తేజం పీవీ సింధుని ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ అభినందించారు మలేసియా ఓపెన్‌ బ్యాడ్మింటన్ టైటిల్‌ను గెలుచుకొన్నందుకు గాను ఆమెకు అభినందనలు తెలియచేశారు.   బ్యాడ్మింటన్‌ ఆటలో పీవీ సింధు మరిన్ని విజయాలు సాధించాలని, మున్ముందు మరిన్ని టోర్నమెంట్లలో విజయాలు సొంతం చేసుకోవాలని ఆకాంక్షించారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. 


 భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు ఆదివారం జరిగిన తుదిపోరులో 21-15, 21-9 తేడాతో క్రిస్టీ గిల్మౌర్(స్కాట్లాండ్)ను ఓడించి.. మలేషియా ఓపెన్ గ్రాండ్ ప్రి టైటిల్ ను కైవసం చేసుకుంది. గతంలో 2013 లో కూడా సింధు ఈ టైటిల్‌ను గెలిచింది.

23 January 2016

చంద్రబాబు పోలీసు రాజ్యం..!


ఏలూరు: చంద్రబాబు మార్కు పోలీసు రాజ్యం అన్ని చోట్ల ఆవిష్క్రతం అవుతోంది. న్యాయం అడిగితే చాలు లాఠీల చేత కొట్టించటం చంద్రబాబుకే సాధ్యం. గత తొమ్మిదేళ్ల పాలనలో చంద్రబాబు ఈ సూత్రాన్ని బాగా రుజువు చేశారు. ఈ సారి కూడా అదే ఫార్ములా అమలు చేస్తున్నారు.

పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలం తుందుర్రు గ్రామంలో తెలుగుదేశం నాయకులు ఆక్వా మెగా పార్క్ కట్టాలని సంకల్పించారు. కోట్ల రూపాయిల వ్యాపారం కావటంతో చంద్రబాబు ఆగమేఘాల మీద అనుమతులు మంజూరు చేశారు. ఇది పూర్తయితే దాదాపు పదుల సంఖ్యలో గ్రామాల్లో పొలాలు చౌడు బారిపోతాయి. అంటే చుట్టుపక్కల ఎక్కడా పొలాల్లో పంట పండే పరిస్థితి ఉండదని నిపుణులు చెబుతున్నారు. దీంతో పాటు తాగు నీరు రసాయనికంగా మారిపోయే అవకాశం ఉంది. దీనిపై ప్రజా సంఘాల చైతన్యంతో ప్రజలు మేల్కొన్నారు. ఈ పార్క్ వద్దంటే వద్దని వినతి పత్రాలు సమర్పించారు. అయినా కోట్ల రూపాయిల మీద మనస్సు పారేసుకొన్న తెలుగుదేశం ప్రభుత్వం.. దీన్ని కట్టి తీరాలని నిర్ణయించుకొంది.

దఫదఫాలుగా వ్యతిరేకిస్తున్న గ్రామస్తులు తాజాగా ఆక్వా మెగా పార్క్ దగ్గరకు చేరుకొన్నారు. ముందుగానే మేలుకొన్న తెలుగుదేశం నాయకుడు అక్కడకు పోలీసుల్ని ఉసి కొల్పారు. పెద్ద సంఖ్యలో పోలీసు బలగాల్ని రంగంలోకి దింపారు. ఇదే జిల్లాలో కోడి పందాలు పెద్ద ఎత్తున జరిగితే పోలీసులు కనిపించనే లేదు. ఇదే జిల్లాకు ఆనుకొని మహిళా తహశీల్దార్ వనజాక్షిని ఇసుకలో దొర్లించి కొట్టిస్తే అడ్డుకొనే ప్రయత్నం కూడా అక్కడ ఉన్న పోలీసులు చేయలేదు. ఇదే జిల్లాలో ఇసుకను విపరీతంగా తవ్వేస్తున్నారని స్థానిక ఎంపీ సహా అనేకమంది చెబుతున్నా అటుకేసి చూడలేదు.

కానీ, గ్రామస్తులు ప్రజాస్వామ్య పద్దతిలో నిరసన తెలపడానికి వస్తే మాత్రం పోలీసులు రెచ్చిపోయారు. లాఠీ చార్జీకి దిగి... గ్రామస్తులపై విచక్షణ రహితంగా కొట్టారు. బండ బూతులకు తిడుతూ.. గ్రామస్తుల్ని తరిమి తరిమి కొట్టారు. ఈ ఘటనలో గ్రామస్తులు తీవ్రంగా గాయపడ్డారు. బ్రిటీష్ పాలకుల్ని తలపిస్తున్నట్లుగా దాడి చేశారని గ్రామస్తులు వాపోయారు. నమ్మి ఓట్లేసి గెలిపిస్తే తమకు జరిగిన ఫలితం ఇదని ఆవేదన చెందుతున్నారు.

22 January 2016

ద‌మ్ముంటే నిజాలు చెప్పండి..!

చంద్ర‌బాబుకు వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి స‌వాల్‌
నెల్లూరు:  చంద్ర‌బాబు నీకు ద‌మ్ముధైర్యం ఉంటే ఎంపీ మిథున్‌రెడ్డిపై పెట్టిన కేసులో నిజాలు బ‌య‌ట‌పెట్టు. ఛాలెంజ్ చేసి అడుగుతున్నా ఆయ‌న త‌ప్పు చేసిన‌ట్లు రుజువు చేయ‌గ‌ల‌రా?  రాష్ట్రంలో దారుణ‌మైన పాల‌న సాగిస్తున్నారు. ఎమర్జెన్సీని త‌ల‌పిస్తోంది. బ్రిటీష్ పాల‌న‌కంటే దారుణంగా ఉంద‌ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి స‌వాల్ విసిరారు. మా పార్టీ ఎంపీఎమ్మెల్యేల‌పై దొంగ కేసులు పెట్టి జైల్లో పెట్టారు. ఖ‌చ్చితంగా చెబుతున్నా... ఇవే ప‌రిస్థితులు మీకూ వ‌స్తాయ‌ని వైఎస్ జ‌గ‌న్ ఏపీ సీఎం చంద్ర‌బాబుపై నిప్పులు చెరిగారు. నాలుగు రోజ‌లుగా నెల్లూరు సెంట్ర‌ల్ జైల్లో ఉన్న రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డిచంద్ర‌గిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి బాస్క‌ర్‌రెడ్డిశ్రీ‌కాళ‌హ‌స్తి నియోజ‌క‌వ‌ర్గ ఇంచార్జీ బియ్య‌పు మ‌ధుసూద‌న్‌రెడ్డిని   వైఎస్ జ‌గ‌న్ ప‌రామ‌ర్శించారు. 
ద‌మ్ముంటే వాస్త‌వాలు బ‌య‌ట పెట్టండి
ఆ రోజు ఏం జ‌రిగిందంటే న‌న్ను సాగ‌నంప‌టానికి మిథున్ రెడ్డి ఎయిర్‌పోర్టుకు వ‌చ్చారు. ఆ స‌మ‌యంలో 19మంది ప్ర‌యాణీకులు ఎయిర్‌పోర్టు మేనేజ‌ర్ త‌మ‌కు బోర్డింగ్ పాసులు ఇవ్వ‌లేద‌ని ఫిర్యాదు చేశారు. వారికి బోర్డింగ్ పాస్ ఎందుకు ఇవ్వ‌లేద‌ని మేనేజ‌ర్‌ను అంద‌రి ముందే మిథున్ రెడ్డి అడిగారు. అలా మిథున్‌రెడ్డి అడ‌గ‌డం త‌ప్పా?  ఆ ప్రయాణీకులు మేనేజ‌ర్ దురుసుగా ప్ర‌వ‌ర్తించిన‌ట్టు రాత‌పూర్వ‌కంగా ఫిర్యాదు చేశారు. ఆ లెట‌ర్ ఎందుకు బ‌య‌ట‌పెట్ట‌డం లేదు?  ఆ రోజు ఎయిర్‌పోర్టు మేనేజ‌ర్ 2 గంట‌ల నుంచి 8గంట‌ల వ‌ర‌కు ఎయిర్‌పోర్టులోనే ప‌ని చేశాడు. మిథున్ చేయి చేసుకొని ఉంటే ఆరుగంట‌ల‌పాటు మేనేజ‌ర్ ఎలా ప‌ని చేస్తాడు?  ఎయిర్‌పోర్టులో మిథున్ చేయిచేసుకుంటే సీఐఎస్ ఎఫ్ బ‌ల‌గాల‌కు తెలియ‌కుండా పోతుందా?  నిజంగా కొట్టి ఉంటే వారు మిథున్‌రెడ్డిని అరెస్టు చేసి ఉండేవారు కాదా?  కేసులు పెట్టేవారు క‌దా?  తిరుప‌తి ఎయిర్‌పోర్టులో సీసీ కెమెరాలు ఎక్కువ‌గా ఉన్నాయి. అంద‌రి ముందు మిథున్ కొట్టి ఉంటే సీసీ కెమెరాల్లో ఉండాలి అలా ఎక్క‌డైనా ఉందా?  ఉంటే ఆ సీసీ ఫుటేజ్ ల‌ను ఎందుకు బ‌య‌ట‌పెట్ట‌డం లేదు?  ఆయ్యా చంద్ర‌బాబూ... మీకు ద‌మ్ముధైర్యం ఉంటే నిజాలు చెప్పండ‌ని వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి బ‌హిరంగంగా స‌వాల్ విసిరారు. 
ఇదంతా బాబు గీసిన స్కెచ్‌
అదే రోజు సాయంత్రం తిరుప‌తికి వ‌చ్చిన చంద్ర‌బాబు వెంట‌నే స్కెచ్ గీశారు. పోలీసుల‌పై ఒత్తిడి తెచ్చారు. ఎయిర్‌పోర్టు మేనేజ‌ర్‌పైనా ఒత్తిడి తెచ్చి కేసు పెట్టించారు. కేసు పెట్టిన త‌ర్వాత సాధార‌ణంగా ఆసుప‌త్రిలో మెడికో లీగ‌ల్ స‌ర్టిఫికేష‌న్ జ‌రుగుతుంది కాబ‌ట్టి రుయా ఆస్ప‌త్రికి తీసుకెళ్లారు. సీమాంధ్ర‌లో ఇవాళ రుయా నెంబ‌ర్‌-1 ఆస్ప‌త్రి. మేనేజ‌ర్ బాగానే ఉన్నాడ‌నిఎలాంటి దెబ్బ‌లూ త‌గ‌ల‌లేద‌ని రుయాలో స‌ర్టిఫై చేశారు. మ‌రుస‌టి రోజు మేనేజ‌ర్ డ్యూటీకి వెళ్లారు. విష‌యం తెలుసుకున్న చంద్ర‌బాబుఆయ‌న దూత‌లు అయ్య‌య్యో మీరు డ్యూటీకి వెళితే కేసు నిల‌బ‌డ‌దంటూ మేనేజ‌ర్‌ను య‌శోద ఆస్ప‌త్రిలో చేర‌మ‌న్నారు. సంఘ‌ట‌న జ‌రిగిన నాలుగు రోజుల త‌ర్వాత మేనేజ‌ర్ ప్రైవేట్ ఆస్ప‌త్రి య‌శోద‌లో చేరారు. మేనేజ‌ర్ సోద‌రుడు ఆ య‌శోద ఆస్ప‌త్రిలో ప‌ని చేస్తున్నాడు. ఒక ఎంపీ మీద దొంగ కేసు పెట్టి ఇంత దారుణంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని వైఎస్ జ‌గ‌న్ పేర్కొన్నారు.
క‌మీష‌న్ల‌కు అడ్డుప‌డుతున్నాడ‌నే మిథున్‌రెడ్డిపై దొంగ‌కేసులు
చిత్తూరు జిల్లాలో ఇరిగేష‌న్ స‌హా అన్ని ప్రాజెక్టుల్లో చంద్ర‌బాబుఆయ‌న కొడుకు కాంట్రాక్ట‌ర్ల‌తో కుమ్మ‌క్కై క‌మీష‌న్లు దోచుకుంటున్నారు. అయితే టెండ‌ర్ల‌లో మిథున్ పోటీకి వెళ్లి ఎల్‌1 వ‌చ్చే విధంగా త‌క్కువ‌కు కోట్ చేస్తున్నారు. మిథున్ ఉంటే త‌క్కువ‌కు టెండ‌ర్లు వేసి త‌మ‌కు క‌మీష‌న్లు రాకుండా అడ్డుప‌డుతున్నాడ‌నే చంద్ర‌బాబుఆయ‌న కుమారుడు మిథున్‌రెడ్డిపై క‌క్ష‌క‌ట్టార‌ని వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఆరోపించారు. అందుకే ఒక ఎంపీపై దొంగ కేసులు బ‌నాయించే స్థాయికి దిగ‌జారిపోయార‌ని ఆయ‌న విమ‌ర్శించారు. చంద్ర‌బాబును ఒక్క‌టే అడుగుతున్నా... ఇన్ని ప్ర‌శ్న‌లు వేశా. ద‌మ్ముధైర్యం ఉంటే వాటికి జ‌వాబు చెప్పాలి. దొంగ కేసులు బ‌నాయిస్తూ మీరు సాగిస్తున్న పాల‌న‌ను ప్ర‌జ‌లు చూస్తున్నారు. పై నుంచి దేవుడు చూస్తున్నాడు. క‌చ్చితంగా వీళ్లంద‌రి ఉసురు మీకు త‌గులుతుంది. మీరు బంగాళాఖాతంలో క‌లిసే రోజు త్వ‌ర‌లోనే వ‌స్తుందన్నారు. 
స‌న్మానించాల్సిన వారిని జైల్లో పెడ‌తారా?
రాష్ట్రం స‌మైక్యంగా ఉండాల‌ని ఎంతో మంది పోరాడారు. అందులో చెవిరెడ్డి భాస్క‌ర‌రెడ్డి కూడా ఒక‌రు. స‌మైక్యాంధ్ర కోసం ఉద్య‌మం చేసినందుకు స‌న్మానించాల్సింది పోయి ఆ కేసును ఉప‌యోగించుకుని భాస్క‌ర్‌ని అరెస్ట్ చేస్తారామ‌రింత దుర్మార్గం ఏమిటంటే 2009లో గోడ‌ల‌పై రాత‌లు రాశార‌న్న కేసును తిర‌గ‌దోడి భాస్క‌ర్‌రెడ్డిని పీలేరుకు తీసుకెళ్తున్నార‌ట‌. ఇంత‌క‌న్నా అన్యాయం ఏమ‌న్నా ఉంటుందా?  అన్నా... భాస్క‌ర్‌ని నాక‌న్నా ఎక్కువ‌గా వేధిస్తున్నార‌ని లోప‌ల క‌లిసిన‌ప్పుడు మిథున్‌రెడ్డి చెబుతున్నారు. అరెస్ట్ చేసిన ఎంపీఎమ్మెల్యేల‌ను క‌లిసే అవ‌కాశం కూడా లేకుండా చేస్తున్నారు. ఈ ప‌రిపాల‌న ఎమ‌ర్జెన్సీని త‌ల‌పిస్తోంది. ఇలాంటి పాల‌న సాగిస్తున్నందుకు చంద్ర‌బాబు సిగ్గుతో త‌ల‌దించుకోవాలి. ఎల్ల‌కాలం ఇలాగే ఉండ‌దు. మ‌నం ఏం నాటితే అదే పండు వ‌స్తుంది. మీక్కూడా ఇదే ప‌రిస్థితి వ‌చ్చే రోజులు త్వ‌ర‌లోనే వ‌స్తాయ‌ని వైఎస్ జ‌గ‌న్ అన్నారు. రోజ‌మ్మ‌గోపిరెడ్డి శ్రీ‌నివాస‌రెడ్డిమిథున్‌రెడ్డిచెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డి,భూమా నాగిరెడ్డి ఇలా వైఎస్సార్ సీపీ ఎంపీలుఎమ్మెల్యేల‌పైన త‌ప్పుడు కేసులు పెట్టారు. భ‌య‌భ్రాంతుల‌కు గురి చేసి వారి స్థైర్యాన్ని దెబ్బ‌కొట్టేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. ప్ర‌జ‌లుఆ దేవుడు చూస్తున్నారు అని జ‌గ‌న్ తెలిపారు.

21 January 2016

చంద్రబాబుకు దమ్మూ ధైర్యం ఉంటే రా...

నెల్లూరుః స్థానిక జైలులో ఉన్న వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లను ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు పరిపాలన తీరుని ఎండగట్టారు. ఆయన ప్రసంగంలోని పవర్ ఫుల్ కామెంట్లు ఇప్పుడు చూద్దాం.. 



1. చంద్రబాబుకు దమ్మూ ధైర్యం ఉంటే ఆరోపణలు రుజువు చేయాలి.
2. కుప్పంలో చంద్రబాబు, ఆయన కొడుకు లోకేశ్  ప్రాజెక్ట్ టెండర్లలో కాంట్రాక్టర్లతో కుమ్మక్కై దోచుకుంటున్నారు. కమిషన్ ల కోసం చంద్రబాబు, ఆయన కొడుకు.. చివరకు ఎంపీలు, ఎమ్మెల్యేలపై  దొంగకేసులు పెట్టే స్థాయికి దిగజారడం సిగ్గుచేటు.
3. మిథున్ రెడ్డి ఎయిర్ పోర్ట్ మేనేజర్ ను కొట్టి ఉంటే.. సీసీ పుటేజ్ ఎందుకు చూపించడం లేదు?
4. చంద్రబాబును ఒక్కటే డిమాండ్ చేస్తున్నా...మిథున్ చేయి చేసుకొని ఉంటే సీఐఎస్ ఎఫ్ పోలీసులు  లేరా..మిథున్ కొట్టి ఉంటే  కేసు పెట్టేవారే కదా.
5. సమైకాంధ్ర ఉద్యమం కేసు అని చెప్పి  ఎమ్మెల్యే భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. సమైక్యాంధ్ర కోసం పోరాటం చేస్తే సన్మానించాల్సిందిపోయి...అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం  దుర్మార్గం.
6. జైల్లో చెవిరెడ్డిపై పోలీసుల వేధింపులు ఎక్కువయ్యాయి.  గోడల మీద రాతలు రాశాడని చెప్పి అతనిపై  మరో అక్రమ కేసు పెట్టి  పీలేరుకు తరలించే కుట్ర చేస్తున్నారు.
7. దగ్గరుండి ఇంత అన్యాయమైన పాలన సాగిస్తున్న  చంద్రబాబు సిగ్గుతో తలదించుకోవాలి.
8. ప్రజలు, పైనుంచి దేవుడు అంతా గమనిస్తున్నారని...చంద్రబాబుకు త్వరలోనే బుద్ధి చెబుతారు.
9. ఖచ్చితంగా చంద్రబాబుకు అందరి ఉసురు తగులుతుందని...రాబోయే రోజుల్లో బంగాళాఖాతంలో పడిపోతాడన్నారు.
10. ఎల్లకాలం ఇలాగే ఉండదు,  ఏదైతే విత్తుతామో అదే పండుతుంది, ఖచ్చితంగా చంద్రబాబుకు  ఇదే పరిస్థితి వచ్చే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. 

20 January 2016

వీసీ, మంత్రుల మీద చర్యలు తీసుకోవాల్సిందే..!

హైదరాబాద్: దళిత పరిశోధక విద్యార్థి రోహిత్ ఆత్మహత్య ఘటన కు కారణభూతులుగా నిలుస్తున్న వీసీ, కేంద్రమంత్రులపై చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి ఘటనలతో మానవత్వం మాయం అవుతోందా అన్న అనుమానాలు కలుగుతున్నాయని ఆయన అన్నారు. విద్యార్థులకు మద్దతుగా వైఎస్సార్సీపీ నిలుస్తుందని, పార్లమెంటులో సైతం తాము పోరాడతామని ఆయన అన్నారు.




హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ లో దీక్షలు చేస్తున్న విద్యార్థులను వైఎస్ జగన్ కలిశారు. ప్రజాస్వామ్య బద్దంగా పోరాటం చేస్తున్న విద్యార్థుల పోరాటానికి ఆయన సంఘీభావం తెలిపారు. ఆత్మహత్య చేసుకొన్న రోహిత్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడారు.

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ ఒక అత్యున్నత ప్రమాణాలు కలిగిన విద్యా సంస్థ అని వైఎస్ జగన్ అభివర్ణించారు. 3,4 వేల మంది ఐఎఎస్, ఐపీఎస్ అధికారుల్ని అందించిన యూనివర్శిటీ ఇది అని ఆయన అన్నారు. అత్యున్నత చదువులు చదువుకోవాలని ఆకాంక్షించే వారికి ఇది స్ఫూర్తి దాయక విద్యాకేంద్రం అని వైఎస్ జగన్ అన్నారు. ఇటువంటి చోట తమ కుమారుడ్ని చదివించుకొనేందుకు రోహిత్ తల్లి ఎంతోకష్టపడిందని ఆయన గుర్తు చేసుకొన్నారు. ముందు రోజు ఆ కుటుంబాన్ని కలిసినప్పుడు రోజుకి రూ. 100 లేదా రూ. 150 కష్టం చేసుకొని కుటుంబాన్ని పోషించుకొంటున్న పరిస్థితిని గమనించినట్లు వైఎస్ జగన్ వివరించారు. ఏదో ఒక రోజు తమ కుమారుడు ఐఎఎస్ లేదా ఐపీఎస్ అధికారి అవుతాడని అభిలషించారని, అది పూర్తిగా చెదిరిపోయిందని వైఎస్ జగన్ అన్నారు.
         హెచ్‑సీయూ పీహెచ్‑డీ విద్యార్థి రోహిత్‑‑‑పై చర్యలు తీసుకోవాలని లేఖలు రాసిన కేంద్ర మంత్రులతో పాటు వీసీపై చర్యలు తీసుకోవాలని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. విద్యార్థులపై చర్య తీసుకోవాలని ఓ కేంద్ర మంత్రి మరో కేంద్ర మంత్రికి లేఖ రాశారని, కేంద్ర మంత్రి లేఖ రాయడం పిచ్చుకపై బ్రహ్మాస్త్రం లాంటిదని విమర్శించారు.


        కేంద్రం నుంచి లేఖలు వస్తుండటంతో వైఎస్ ఛాన్సలర్ విద్యార్థుల మీదకు అస్త్రాల్ని ప్రయోగించారని వైఎస్ జగన్ అన్నారు. కేంద్రప్రభుత్వం నుంచి విద్యార్థుల మీద చర్యలు కోరుతూ 4-5 లేఖలు వచ్చాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చన్నారు. ఆయనేమీ జాతి వ్యతిరేక శక్తో, సంఘ వ్యతిరేక శక్తో కానే కాదు కదా అని ఆయన అన్నారు. ఇక్కడ ఉన్న విద్యార్థులకు మంచి భవిష్యత్ ఉంటుందని, ఐఎఎస్ లేదా ఐపీఎస్ అధికారులు కావాల్సిన పరిస్థితి అని వైఎస్ జగన్ అన్నారు. కానీ, ఇటువంటి చోట రోహిత్ ఆత్మహత్య చేసుకోవడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు.  

  ఈ సందర్భంగా ఘటన మీద విచారణ జరిపించేందుకు ఏర్పాటు చేసిన కమిటీ గురించి వైఎస్ జగన్ ప్రస్తావించారు. ప్రొఫెసర్ శ్రీ వాత్సవ, ప్రొఫెసర్ మహంతి మరియు వైస్ ఛాన్సలర్ లతో కూడిన కమిటీ పనిచేస్తోందని, కానీ ఈ కమిటీ గురించి విద్యార్థుల చెబుతుంటే ఘోరమైన వాస్తవాలు బయట పడ్డాయని ఆయన అన్నారు. ఈ అధికారులు అందరికీ విద్యార్థుల్ని వేధించిన ఘన చరిత్ర ఉందని వైఎస్ జగన్ అన్నారు.

        చనిపోయిన విద్యార్థి గురించి కొన్ని పత్రికల్లో, కొన్ని మాద్యమాల్లో ప్రచారం జరుగుతోందని వైఎస్ జగన్ గుర్తు చేశారు. ఇప్పటికే రోహిత్ చనిపోయారని, అటువంటప్పుడు ఆయన ఎస్సీ అని, ఎస్సీ కాదని, బీసీ అని రక రకాలుగా ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వారు అందించే మీ సేవ నుంచి తీసుకొన్న కుల ధ్రువీకరణ పత్రం తమ దగ్గర ఉందని, ఇందులో ఎస్సీ అని స్పష్టంగా ఉందని వైఎస్ జగన్ అన్నారు. తర్వాత కాలంలో ఈ రికార్డుల్ని మార్చి బీసీ విద్యార్థి అని ప్రచారం చేస్తారా అని అనుమానం వ్యక్తం చేశారు.

        ఈ సందర్బంగా విద్యార్థి రోహిత్ రాసిన ఆత్మహత్య వాంగ్మూలాన్ని ప్రస్తావించారు. మనిషిని కులంతోనే అంచనా వేస్తున్నారని, మనస్సు ఉంటుందని గుర్తించటం లేదని వాపోయారు. ఎటువంటి సమాజంలో మనం బతుకుతున్నాం అని ఆయన ఆవేదన చెందరు. సామాజిక బహిష్కరణ అన్నది ఏ కోణంలో చూసినా సరి కాదని వైఎస్ జగన్ అన్నారు.

మొత్తం ఘటన్ని మార్చే ప్రయత్నం చేయకుండా చూడాలని అన్నారు. ఇటువంటి ఘటనలు పునరావ్రతం కాకుండా స్పష్టమైన చర్యలు చేపట్టాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. ఇందులో పాత్ర పోషించిన వారందరి మీద చర్యలు తీసుకోవాలని కోరారు. వైస్ చాన్సలర్ పేరు గట్టిగా వినిపిస్తున్నందున ఆయన మీద చర్యలు తీసుకోవాలని వైఎస్ జగన్ గట్టిగా డిమాండ్ చేశారు. లైబ్రరీ, క్యాంటీన్ వంటివి వాడుకోకుండా సామాజిక బహిష్కరణ చేశారని, ఏ రకంగా చూసినా సామాజిక బహిష్కరణ సరి కాదని వైఎస్ జగన్ అబిప్రాయ పడ్డారు. ఇప్పటికైనా సస్సెండ్ చేసిన విద్యార్థుల మీద సస్పెన్షన్ ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రోజుకి రూ. 100 లేక 150 తో బతుకు సాగిస్తున్న రోహిత్ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.

ఈ సందర్భంగా విద్యార్థులు జరుపుతున్న పోరాటానికి తమ మద్దతు ఉంటుందని వైఎస్ జగన్ అన్నారు. పార్లమెంటు లో తమకు ఏడుగురు ఎంపీలు ఉన్నారని, విద్యార్థుల తరపున ఈ అంశాన్ని పార్లమెంటులో ప్రస్తావించి పోరాడతామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. ఈ పర్యటనలో పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన, గడికోట శ్రీకాంత్ రెడ్డి, నాయకులు మెరుగు నాగార్జున, నల్లా సూర్యప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

19 January 2016

వీసీ తప్పిదమే కనిపిస్తోంది

హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ లో ఆత్మహత్య చేసుకొన్న రోహిత్ బలవన్మరణంలో వైస్ ఛాన్సలర్ తప్పిదం స్పష్టంగా కనిపిస్తోందని ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష నేత, వైెఎస్సార్సీపీ అధ్యక్షులు వైెఎస్ జగన్ అభిప్రాయ పడ్డారు. ఆత్మహత్య చేసుకొన్న రోహిత్ కుటుంబసభ్యుల్ని వైఎస్ జగన్ పరామర్శించారు. హైదరాబాద్ ఉప్పల్ లోని రోహిత్ ఇంటికి వైఎస్ జగన్ వెళ్లారు. ఆయన వెంట పార్టీ సీనియర్ నేతలు బాలినేని శ్రీనివాస్ రెడ్డి, ఉప్పులేటి కల్పన, మెరుగు నాగార్జున తదితరులు ఉన్నారు.

నాగార్జున యూనివర్శిటీ లో రిషితేశ్వరి ఆత్మహత్య చేసుకొన్న ఘటన్ని ఆయన గుర్తు చేసుకొన్నారు. ఇక్కడ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో కూడా వైెస్ చాన్సలర్ తప్పిదాలు స్పష్టంగా కనిపిస్తోందని అభిప్రాయ పడ్డారు. పిల్లల్ని సంరక్షించాల్సిన వైస్ ఛాన్సలర్ లు ఆ పని చేయలేక పోతే, పిల్లలు చనిపోయే దాకా పరిస్థితిని తీసుకొస్తే.. ఏమనుకోవాలి అని వైఎస్ జగన్ సూటిగా ప్రశ్నించారు. 

ఐదుగురు విద్యార్థుల మీద సస్పెన్షన్ విధించారు, ఇందులో ఒకరు చనిపోయారు. మిగిలిన నలుగురు విద్యార్థులు ఇప్పటికీ న్యాయం కోసం దీక్ష చేస్తున్నారు. అని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు  యూనివర్శిటీ వెళ్లిపో అంటే ఎక్కడకు వెళ్లాలో తెలీని పరిస్థితి. లైబ్రరీకి వెళ్లే పరిస్థితి లేదు, క్యాంటీన్ కు వెళ్లే పరిస్థితి అంతకన్నా లేదు. అని వైఎస్ జగన్ అన్నారు. ఇప్పటికైనా మానవత్వంతో వ్యవహరించి మిగిలిన నలుగురి మీద సస్పెన్షన్ ను వెనక్కి తీసుకోవాలని కోరారు. 

రేపు యూనివర్శిటీకి వెళ్లి ఆ నలుగురు విద్యార్థుల దీక్ష శిబిరం దగ్గరకు వెళతానని చెప్పారు. సంఘీభావం తెలియచేస్తామని జన నేత వైఎస్ జగన్ అన్నారు.