చంద్రబాబుకు మతిస్థిమితం చెడింది. అందుకే ఏది పడితే అది మాట్లాడుతున్నాడు. ప్రత్యేక హోదా కోసం పోరాడాల్సిన చంద్రబాబు ఆ పని చేయకపోగా హోదా కోసం పోరాడితే జైల్లో పెట్టిస్తానంటున్నాడు. పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు ఇప్పుడు 5 కోట్ల ఆంధ్రులకు వెన్నుపోటు పొడిచారు. ఇలాంటి వ్యక్తి ఏపీ సీఎం కావడం మన దౌర్భాగ్యం.
YSR Congress Party's goal is to ensure that, in the long run, every citizen is adequately empowered to lead a decent life..
11 November 2016
బాబు సీఎం కావడం మన దౌర్భాగ్యం
చంద్రబాబుకు మతిస్థిమితం చెడింది. అందుకే ఏది పడితే అది మాట్లాడుతున్నాడు. ప్రత్యేక హోదా కోసం పోరాడాల్సిన చంద్రబాబు ఆ పని చేయకపోగా హోదా కోసం పోరాడితే జైల్లో పెట్టిస్తానంటున్నాడు. పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు ఇప్పుడు 5 కోట్ల ఆంధ్రులకు వెన్నుపోటు పొడిచారు. ఇలాంటి వ్యక్తి ఏపీ సీఎం కావడం మన దౌర్భాగ్యం.
7 October 2016
ప్రత్యేకహోదా..నిరాహార దీక్షకు ఏడాది
- హోదా కోసం గుంటూరు వేదికగా ఆమరణ దీక్ష
- దీక్ష ఏడవ రోజుకు చేరుకున్న సమయంలో బాబు కుట్రలు
- బలవంతంగా దీక్ష భగ్నం
- హోదాపై మాట తప్పిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
- కేసులకు భయపడి హోదాను తాకట్టు పెట్టిన బాబు
- పార్లమెంట్, తిరుపతి వెంకన్న సాక్షిగా ఇచ్చిన హామీకి తూట్లు
- బీజేపీ, టీడీపీల మోసంపై ప్రజాగ్రహం
- హోదా కోసం వైయస్ జగన్ అలుపెరగని పోరు
గుంటూరుః ప్రత్యేకహోదా కోసం ప్రతిపక్ష నేత వైయస్ జగన్ గుంటూరు వేదికగా చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష.. నేటతో ఏడాది పూర్తిచేసుకుంది. ప్రత్యేకహోదా ఇస్తామన్న కేంద్రం, తెస్తామన్న టీడీపీ రెండు పార్టీలు ఏపీ ప్రజలను వంచించాయి. పార్లమెంట్, తిరుపతి వెంకన్న సాక్షిగా ఇచ్చిన ప్రత్యేకహోదా హామీని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గంగలో కలిపాయి. విభజన సమయంలో ఆనాటి ప్రదాని హోదా ఐదేళ్లు అంటే, కాదు పదేళ్లు కావాలని బీజేపీకి చెందిన వెంకయ్యనాయుడు, అరుణ్ జైట్లీలు కోరారు. హోదా పదిహేనేళ్లు కావాలని చంద్రబాబు నాయుడు ఎన్నికలముందు ఊదరగొట్టారు. అంతే కాదు ప్రత్యేకహోదా ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలోనూ పెట్టారు. కానీ అధికారంలోకి వచ్చాక ఇచ్చిన వాగ్దానాన్ని మర్చి ప్రజలను మోసం చేశారు. దీంతో, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం సంజీవని లాంటి ప్రత్యేకహోదాను సాధించేందుకు ప్రధాన ప్రతిపక్ష నేతగా వైయస్ జగన్ ఆ బాధ్యతను తన భుజస్కందాలపై వేసుకున్నారు. గుంటూరు నగర శివారు నల్లపాడు రోడ్డులో వైయస్ జగన్ స్వయంగా 07-10-2015 తేదీన నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. ప్రాణాలను పణంగా పెట్టి హోదా కోసం పోరాడుతున్న జననేతకు మద్దతుగా రాష్ట్రప్రజానీకమంతా నల్లపాడుకు కదలివచ్చింది. హోదా కోసం గర్జించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినదించారు.
వైయస్ జగన్ దీక్షతో వణికిపోయిన ప్రభుత్వం కుట్రలకు తెరలేపింది. జనం కోసం జననేత...జననేత కోసం జనం ఒక్కటై హోదా పోరాటం సాగించడంతో బాబుకు ముచ్చెమటలు పట్టాయి. గుంటూరుకు రాకుండా అడ్డుకునేందుకు శతవిథాల ప్రయత్నించి తోకముడిచారు. మొక్కవోని దీక్షతో హోదా కోసం పోరాటం కొనసాగిస్తున్న వైయస్ జగన్ కు సంఘీభావంగా తరలివచ్చి ప్రతీ పౌరుడు తోడుగా నిలిచారు. ఆరోగ్యం నీరసించిపోయినా తన వద్దకు వచ్చిన ప్రతీ ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ వైయస్ జగన్ దీక్ష కొనసాగించారు. తల్లి విజయమ్మ, సతీమణి భారతి, సోదరి షర్మిల, పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున వైయస్ జగన్ దీక్షా శిబిరాన్ని సందర్శించి ఆయన ఆరోగ్య పరిస్థితిని చూసి కంటతడి పెట్టారు. ఆరోగ్యం బాగా క్షీణించిపోవడంతో దీక్ష విరమించాలని పార్టీ నేతలు కోరినా ఏమాత్రం లెక్కచేయలేదు. తనకన్నా ప్రజల ప్రయోజనాలే ముఖ్యమని వైయస్ జగన్ దీక్షను నిర్విరామంగా కొనసాగించారు. ప్రధాని మోడీ రాష్ట్ర పర్యటనకు వస్తున్న నేపథ్యంలో బాబు కుయుక్తులు పన్నారు. హోదా కోసం పోరాడుతున్న ప్రజలగొంతు వినపడకుండా చేసేందుకు పోలీసులను ఉసిగొల్పాడు. వైయస్ జగన్ దీక్ష ఏడవ రోజుకు చేరుకున్న సమయంలో దొంగచాటుగా అర్థరాత్రి పోలీసులను పంపించి బలవంతంగా భగ్నం చేశారు. గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఐనా కూడా వైయస్ జగన్ వెనకడుగు వేయకుండా ఆస్పత్రిలోనూ దీక్ష కొనసాగించారు. అక్కడ వైద్యులు బలవంతంగా ఫ్లూయిడ్స్ ఎక్కించారు.
ప్రత్యేకహోదా కోసం అనేక దపాలుగా గల్లీ నుంచి ఢిల్లీ వరకు వైయస్సార్సీపీ తన పోరాటాలు కొనసాగించింది. ధర్నాలు, దీక్షలు, బంద్ లు, యువభేరి సదస్సులతో ప్రత్యేకహోదా ఆకాంక్షను చాటిచెప్పింది. అసెంబ్లీలోనూ, వెలుపల హోదా కోసం అలుపెరగని పోరాటం కొనసాగించింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చి తీరాల్సిందేనని పట్టుబట్టింది. ఐనా కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించాయి. ఓటుకు కోట్లు కేసులో ఇరుక్కున్న చంద్రబాబు రాష్ట్ర ప్రజల హక్కును కేంద్రానికి తాకట్టుపెట్టాడు. ఐదుకోట్ల మంది ఆంధ్రులను నిట్టనిలువునా దగా చేశారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి హోదా కోసం పోరాడాల్సింది పోయి హోదా వల్ల ఏమొస్తాయంటూ ఎగతాళి చేయడం మొదలుపెట్టారు. హోదా ఏమైనా సంజీవనా, హోదాతో రాష్ట్రం స్వర్గమైపోతుందా, కోడలు మగపిల్లాడిని కంటానంటే అత్తవద్దంటుందా అంటూ పూటకో మాట మాట్లాడుతూ పథకం ప్రకారం నీరుగార్చుతూ వచ్చారు. ముఖ్యమంత్రే అడగనప్పుడు హోదా ఎందుకు ఇవ్వాలన్న ధోరణిలోకి కేంద్రం వెళ్లింది.
రెండున్నరేళ్లుగా అదిగో హోదా, ఇదిగో హోదా అంటూ ఊరిస్తూ వచ్చిన టీడీపీ, బీజేపీలు ఉసూరుమనిపించాయి. హోదా కోసం ఏళ్ల తరబడి ఎదురుచూసిన ఆంధ్రుల ఆశలపై నీళ్లు చల్లాయి. ఎప్పటికైనా హోదా తీసుకొచ్చేది మేమే అన్న చంద్రబాబు...హోదాని కాదని ప్యాకేజీకి మోకరిల్లాడు. అర్థరాత్రి అరుణ్ జైట్లీ ప్రకటనను బాబు స్వాగతించించడంపై రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. ప్రతిపక్ష నేత వైయస్ జగన్ బీజేపీ, టీడీపల తీరుపై తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. హోదాను ఇవ్వకుండా ఎగ్గొట్టేందుకు బీజేపీ కుంటిసాకులు వెతుకుతోందని మండిపడ్డారు. ప్యాకేజీని స్వాగతించడానికి బాబు ఎవరని నిలదీశారు. ప్రత్యేకహోదా ఐదు కోట్ల ఆంధ్రుల హక్కు అని నొక్కి వక్కానించారు. బాబు తన జేబులు నింపుకోవడం కోసం హోదాను తాకట్టు పెట్టి ప్యాకేజీని కోరడాన్ని ముక్తకంఠంతో ఖండించారు.
హోదా వస్తేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని వైయస్ జగన్ అనేక సందర్భాల్లో చాటిచెప్పారు. విద్యార్థులు, యువత రాష్ట్ర ప్రజలకు హోదా ప్రాముఖ్యత గురించి ఎప్పటికప్పుడు తెలియజేస్తూ వస్తున్నారు. బీజేపీ, టీడీపీలు చేస్తున్న మోసాలను ఎంగడుతూ హోదా పోరాటంలో అందరినీ భాగస్వాములు చేస్తున్నారు. ప్రత్యేకహోదా సాధించేవరకు విశ్రమించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. హోదా ఒక్క జగన్ తో సాధ్యం కాదని, అందరం కలిసికట్టుగా పోరాడుదామని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర పోరాట స్ఫూర్తితో హోదా కోసం ఉద్యమిద్దామని ప్రతీ ఒక్కరినీ కోరారు. ప్రత్యేకహోదాను అమ్మేసి ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని ఢిల్లీ నడివీధుల్లో తాకట్టు పెట్టిన చంద్రబాబు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఉద్యమాన్ని తీవ్రతరం చేశారు. రాష్ట్రానికి హోదా సాధించేవరకు పోరాటాన్ని కొనసాగిద్దామన్నారు. వచ్చే ఎన్నికల్లో స్పెషల్ స్టేటస్ ఇచ్చే ప్రభుత్వాలను ఢిల్లీపీఠంపై కూర్చోబెడదామని వైయస్ జగన్ తేల్చిచెప్పారు.
6 October 2016
కొడుక్కి జై కొడితే పనై పోతుందా
- బాబు, లోకేష్ భూ దందాలకు ఆద్యులు
- రాణి కమల దేవి భూకుంభకోణంలో లోకేష్ హస్తం
- రూ.కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని లూటీ చేస్తున్నారు
- ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వమా లేక రియల్ ఎస్టేట్ వ్యాపారమా..?
- లోకేష్ భూ బాగోతంపై పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం
- వైయస్ఆర్ సీపీ జిల్లా అధ్యక్షుడు అమర్నాథ్
విశాఖపట్నం: అనుభవజ్ఞుడనని బీరాలు పలికే చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ అవినీతి, భూ దందా కుట్రలకు ఆద్యులని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ నిప్పులు చెరిగారు. గాంధీకి వారసుడిని, నీతికి అన్నా హజారే తమ్ముడినని చెప్పుకునే చంద్రబాబు దోపిడీ పరిపాలన చేస్తున్నారని ఆయన విమర్శించారు. విశాఖలో అత్యంత విలువైన రాణి కమల దేవి ప్రభుత్వ భూమిని సీఎం కుమారుడు నారా లోకేష్ బీనామీలతో దోపిడీకి పాల్పడుతున్నారని ఆయన విరుచుకుపడ్డారు. విశాఖ జిల్లా పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా గత 20 సంవత్సరాలుగా కోర్టులో ఉన్న అత్యంత విలువైన ప్రభుత్వ స్థలాన్ని ముఖ్యమంత్రి తనయుడు నారా లోకేష్ వాటాలు వేసి పంచుకుంటున్నాడని మండిపడ్డారు. తండ్రి అధికారంతో కొడుకు పెత్తనం చేస్తున్నాడని దుయ్యబట్టారు.
ఓటుకు నోటు కేసు నుండి రాజధాని భూ దందా వరకు, అగ్రి గోల్డ్ దందా నుండి డాన్ నయీం దందాల వరకు చంద్రబాబు, లోకేష్ పాత్ర స్పష్టంగా కనబడుతోందని, వారి నేరచరిత్రను ప్రజలు తెలుసుకున్నారని అమర్నాథ్ అన్నారు. గత 20 సంవత్సరాలుగా కోర్టులో ఉన్న ప్రభుత్వ భూమిని విశాఖ పెద్దలకు వాటాలు వేసి పంచుతున్న తీరు చూస్తుంటే దీపం ఉండగానే ఇల్లు చక్క బెట్టుకొన్నట్లుందని అన్నారు. విశాఖ నడి బొడ్డున గవర్నర్ బంగ్లా ఆనుకొని ఉన్న అత్యంత విలువైన ప్రాంతంలోని సర్వే నెంబర్– 1027, 1028, 1029, 1196 మరియు 1197 భూమి రాణి కమల దేవి భూమి అని అన్నారు. ఐతే, ఈ ప్రభుత్వ భూమిని ఆమె ప్రైవేట్ భూమిగా సృష్టించి గత 20 సంవత్సరాలుగా హైకోర్టులో పోరాటం చేస్తున్న కొందరు బినామీ పెద్దల అసలు రూపం బట్టబయలు చేశారు. లోకేష్తో సిండికేట్ అయ్యి బినామీ పెద్దలు దొంగలు దొంగలు ఊర్లు పంచుకున్నట్లుగా స్థలాన్ని పంచుకుంటున్నారని మండిపడ్డారు. చంద్రబాబు కుమారుడు లోకేష్ సహకారంతో సుమారు 50 మంది పెద్దలు ప్రభుత్వ భూమిని లూటీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వమా లేక రియలెస్టేట్ వ్యాపారమా అని ప్రశ్నించారు.
ప్రభుత్వ స్థలాన్ని ప్రైవేట్ పరం చేయడం సిగ్గుచేటు
రాణిదేవి భూమిని సర్వేలు చేసి ప్రభుత్వ భూమిగా నిర్ధారించిన జిల్లా కలెక్టర్ యువరాజ్ నోటీకి ప్రభుత్వ పెద్దలు తాళాలు వేశారని అమర్నాథ్ స్పష్టం చేశారు. నిజాయితీగా నిర్థారణ చేసి కోర్టు వ్యవహారాలలో కీలకంగా మారి అత్యంత క్షుణ్ణంగా పరిశీలన చేస్తున్న సమయంలో ఆయన చేసిన సేవలకు గుర్తింపు లేకుండా బదిలీ చేశారని చెప్పారు. చంద్రబాబుకు అన్ని విధాలుగా భాగస్వామి అయిన మరో నాయుడు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుకు పీఎస్గా నియమించి అధికారి నోటికి తాళం వేసింది నిజం కాదా అని ప్రశ్నించారు. ఇదే భూ వివాదంలో నిజాయితీగా పనిచేస్తున్న మరో సబ్ రిజిస్టర్ పోతురాజుపై ఏసీబీని ప్రయోగించి బీనామీ పెద్దలు సస్పెండ్ చేయించింది నిజమా కాదా అని ప్రశ్నించారు. జిల్లా కలెక్టర్ సర్వే నెంబర్ 1196,1197 భూమిని ప్రభుత్వ భూమిగా ప్రకటించి విశాఖపట్నం వెబ్ సైటులో పెడితే , నగర కమిషనర్ సర్వే నెంబర్లను ప్రభుత్వ భూమిగా తప్పించి నివేదిక ఇవ్వడంలో ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. రిజర్వాయర్, వాటర్ ట్యాంక్లు ఉన్న ప్రభుత్వ స్థలాన్ని ప్రైవేట్ స్థలంగా మార్చడం సిగ్గుచేటన్నారు. ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా అనేక విషయాలు ఈ సర్వే నెంబర్లపై అడిగినా ఒక్కదానికి కూడా నేరుగా సమాధానం ఇవ్వలేని పరిస్థితుల్లో జిల్లా యంత్రాంగం ఉండడం సిగ్గుచేటు అని అమర్ విమర్శించారు. ఎఫ్ఎంబీ, ఎస్ఎఫ్ఏ కాపీ అడిగితే కలెక్టరేట్, తహశీల్దార్ కార్యాలయం చుట్టు తిప్పుతున్నారని ఫైరయ్యారు. ప్రతిపక్ష పార్టీకి జిల్లా అధ్యక్షుడినైన తనకే ఇలా జరిగితే సామాన్య ప్రజల పరిస్థితేంటని ఆందోళన వ్యక్తం చేశారు.
లోకేష్ కనుసన్నల్లో ఆర్థిక వ్యవహారాలు
విశాఖ 1196 సర్వే నెంబర్ స్థలం కోర్టులో ఉండగానే 2002లో టీడీపీ హయాంలో రెండు వేల గజాల స్థలాన్ని పార్టీ కార్యాలయానికి చంద్రబాబు కేటాయించడం నిజమా? కాదా? అని అమర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రస్తుతం బినామీ పెద్దలతో లాలూచి పడి వారితో బహుమతిగా తెలుగుదేశం కార్యాలయం కట్టించుకోవడం వాస్తవమా కాదా అని నిలదీశారు. తెలుగుదేశం పార్టీ ఆర్ధిక వ్యవహారాలన్నీ లోకేష్ కనుసన్నల్లో జరుగుతున్నాయని చెప్పారు. ఈ స్థలాన్ని ప్రైవేట్ వ్యక్తులు పరం కాకుండా అడ్డుకుంటామని అమర్నాథ్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. జిల్లా యంత్రాగం తక్షణమే ఈ వ్యవహారం ఫై దృష్టి పెట్టకపోతే లోకేష్ భూ భాగోతంపై పెద్ద ఎత్తున ఉద్యమిస్తామన్నారు. న్యాయం కోసం న్యాయస్థానాలను ఆశ్రయిస్తామన్నారు. రాణిదేవి భూమిని ప్రభుత్వ పరం అయ్యే వరకు పోరాటం చేస్తామన్నారు. ఈ సమావేశంలో తూర్పు సమన్వయకర్త వంశీకృష్ణ శ్రీనివాస్. గాజువాక సమన్వయకర్త తిప్పల నాగిరెడ్డి, దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త కోలా గురువులు, పెందుర్తి సమన్వయకర్త అదీప్ రాజు, రాష్ట్ర నాయకులు కొయ్య ప్రసాద్ రెడ్డి, జాన్ వెస్లీ, పక్కి దివాకర్ తదితరులు పాల్గొన్నారు.
5 October 2016
చంద్రబాబు కు వైయస్ జగన్ సూటి పశ్న
- ఒక్క ఎకరా కూడా ఎండనివ్వనని బీరాలు పలికాడు
- జిల్లాలో కరువు ఉందా అంటూ ఎగతాళి చేశాడు
- నాలుగు రోజుల్లోనే కరువును తరిమికొట్టానంటూ పచ్చి అబద్ధాలు
- ఇలాంటి ముఖ్యమంత్రిని చంద్రబాబునే చూస్తున్నాం
- రైతు మహాధర్నాలో బాబుపై ధ్వజమెత్తిన వైయస్ జగన్
అనంతపురంః రైతులు కరువుతో అల్లాడుతుంటే ముఖ్యమంత్రి చంద్రబాబుకు పబ్లిసిటీ కోసం పాకులాడటం సిగ్గుచేటని వైయస్ జగన్ మండిపడ్డారు. కరువు ప్రాంతాలను కూడా హెలికాఫ్టర్లో ఏరియల్ సర్వే ద్వారా సమీక్షించే ముఖ్యమంత్రిని చంద్రబాబునే చూస్తున్నామని ఎద్దేవా చేశారు. అనంతపురం జిల్లా కలెక్టరేట్ ఎదుట వైయస్ జగన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు మహా ధర్నాకు ప్రజలు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా వైయస్ఆర్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ ధర్నాలో పాల్గొన్న ప్రతిఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.
ముఖ్యమంత్రి కరువే లేదన్నాడు...
అనంతరపురం జిల్లాను ఆగస్టు 6, 8, 28 తేదీల్లో సందర్శించిన మూడుసార్లు సందర్శించిన ముఖ్యమంత్రి జిల్లాలో ఒక్క ఎకరాన్ని కూడా ఎండిపోనివ్వనని బీరాలు పలికారన్నారు. ఆగస్టు 28న పుట్టపర్తికి వచ్చిన బాబు జిల్లాలో కరువుందా అని వ్యంగ్యంగా మాట్లాడి పోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే నాలుగు రోజుల తర్వాత సెప్టెంబర్ 1న కరువును తరిమికొట్టానని పేర్కొనడం చేస్తుంటే అంతా అయోమయంగా ఉందన్నారు. కరువే లేదన్న ముఖ్యమంత్రి నాలుగు రోజుల్లో కనిపించిందా అని ఎద్దేవా చేశారు. వ్యవసాయ మంత్రి మాట్లాడుతూ కరువే లేదని సెలవిస్తే మరో మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ కరువును పారదోలేందుకు సమీక్ష నిర్వహిస్తారని చెప్పడం దేనికి నిదర్శనమని ప్రశ్నించారు. రాష్ట్ర తాజా పరిస్థితులపై మీలోనే ఇన్ని బేదాభిప్రాయాలున్నప్పుడు ప్రజలను ఎలా ఆదుకుంటారని ప్రశ్నించారు.
15 లక్షల ఎకరాల్లో పంట ఎండిపోయింది...
రెయిన్ గన్లతో నాలుగు రోజుల్లో కరువును తరిమికొట్టానని సీఎం చంద్రబాబు చంకలు గుద్దుకోవడంపై వైయస్ జగన్ తీవ్రంగా స్పందించారు. రాయలసీమ జిల్లాల్లో 21 లక్షల ఎకరాలకు గాను దాదాపు 15 లక్షల ఎకరాల్లో పంట ఎండిపోయిందని తెలిపారు. రెయిన్ గన్లను ఈయనే కొత్తగా కనిపెట్టినట్టు ప్రచారం చేసుకోవడం ఆశ్చర్యకరంగా ఉందన్నారు. రెయిన్గన్లు, డ్రిఫ్ట్లు, స్ప్రింకర్లు దాదాపు పదిహేనేళ్ల నుంచే వాడుకలో ఉన్నాయన్నారు. ముఖ్యమంత్రి హడావుడి చేసి దానేదో అపర బ్రహ్మలా మాట్లాడటం సరికాదన్నారు. వాస్తవ పరిస్థితులను చూసి తెలుసుకోవాలన్నారు. కరువు పరిస్థితులను తెలుసుకోవాలంటే హెలికాఫ్టర్లో తిరిగితే తెలియదని, వరదలు వచ్చిన సందర్భాల్లోనే హెలికాఫ్టర్లు వాడటం చూస్తాంగానీ మన ముఖ్యమంత్రి మాత్రం వరదలొచ్చినప్పుడూ గాల్లో తిరుగుతుంటారని ఎద్దేవా చేశారు. కంప్యూటర్లు తానే కనిపెట్టానని డబ్బాలు కొట్టుకుంటూ... ప్రతీదీ ఇంటర్నెట్లో వెతికే ముఖ్యమంత్రికి రాష్ట్రంలో కరువుందని మీ కంప్యూటర్లు చెప్పలేదా అని ప్రశ్నించారు.
రోజుకు 25 లక్షల ట్యాంకర్లు ఎక్కడ్నుంచి తెచ్చారు..
నాలుగు రోజుల్లో కరువును తరిమేసిన ముఖ్యమంత్రీ 30 లక్షల ట్యాంకర్లు ఎక్కడ్నుంచి తెచ్చారని వైయస్ జగన్ ప్రశ్నించారు. ఈ సందర్భంగా రెయిన్గన్ల పనితీరు సామర్థ్యం.. వాటికి అవసరమయ్యే నీటిని వివరాత్మకంగా ట్యాంకర్లతో లెక్కించి బాబు మాయను కళ్లకు కట్టినట్లు చూపించారు. ఒక ఎకరా పంటను తడిపేందుకు కనీసం 5 ఎంఎం వర్షపాతం కావాలని.. అంటే దానికి 25వేల లీటర్ల సామర్థ్యం ఉన్న ట్యాంకర్లు అవసరమవుతాయని జగన్ వెల్లడించారు. మన దగ్గర ఉండేవి 5 లô దా 6 వేల లీటర్ల ట్యాంకర్లు కాబట్టి కనీసం ఐదు ట్యాంకర్లు అవవసరం కావొచ్చిని తెలిపారు. అంటే ఎకరాకి దాదాపు 25 ట్యాంకర్లు వినియోగిచాల్సి వస్తుందన్నారు. అలాంటిది లక్ష ఎకరాలను తడపాలంటే కనీసం 25 లక్షల ట్యాంకర్లు అవసరం కావొచ్చని అన్ని ట్యాంకర్లు పక్క రాష్ట్రాలు తిరిగినా దొరకవన్నారు. అలాంటిది నాలుగు రోజుల్లో రోజుకు లక్ష ఎకరాల వంతున 25 లక్షల ట్యాంకర్లతో నాలుగు రోజులకు లక్షల ట్యాంకర్లు ఎక్కడ్నుంచి తెచ్చారో అర్థం కావడం లేదని పేర్కొన్నారు.
పదును రావాలంటే కనీసం 28 ఎంఎం వర్షపాతం కావాలి
బాబు చెప్పిన దాని ప్రకారం చూసుకుంన్నా ఎకరాకి 5 ఎంఎం తడి ఎట్టిపరిస్థితుల్లోనూ సరిపోదన్నారు. పంట సక్రమంగా పండాలంటే.. పదును రావాలంటే కనీసం 28 ఎంఎం వర్షపాతం అవసరం అవుతుందని 5ఎంఎంతో పంటలను ఎలా బతికిద్దామనుకన్నారని ప్రశ్నించారు. ఇప్పటికైనా బూటకపు మాటలతో ప్రజలను మాయం చేయడం ఆపాలని సూచించారు.
టీడీపీ మాజీ సర్పంచ్ పంట ఎండిపోయింది...
మీరే స్వయంగా రెయిన్ గన్లతో తడి చేసిన మీ మాజీ సర్పంచ్ పొలం ఎండిపోయిందని ఈ సందర్భంగా జగన్ ఫొటోలు చూపెట్టి బాబుకు హితబోధ చేశారు. రాయచోటిలోని మాధవరం టీడీపీ మాజీ సర్పంచ్కు చెందిన పొలంలో చంద్రబాబు రెయిన్గన్లతో నీరు పెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టగా అదిప్పుడు ఎండిపోయిందని అలాంటిది నాలుగు లక్షల ఎకరాల సంగతి ఎలా ఉంటుందో తెలిసిపోతుందన్నారు. తాను రోడ్డు మార్గంలో జిల్లాకు వచ్చేటప్పుడు చూడగా పొలాలన్నీ ఎండిపోయి బీళ్లుగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక ముఖ్యమంత్రిగా ఇలాంటి పరిస్థితుల్లో బాధ్యతగా వ్యవహరించాలి తప్ప మాటలు చెప్పి కడుపులు నింపాలనుకోవడం సరికాదన్నారు. ఆనాడు దివంగత నేత వైయస్ రాజశేఖర్రెడ్డి కరువు పరిస్థితుల్లో రాష్ట్రానికి చేసిన మేళ్లు ఈ సందర్భంగా వైయస్ జగన్ ప్రస్తావించారు.
3 October 2016
ఈ రకంగా దండయాత్ర చేస్తే పోలా..?
- రెండున్నరేళ్లలో ఒక్క బిల్డింగ్ అయినా కట్టారా..?
- అన్ని తాత్కాలికమంటూ తరలిపోతున్నాడు
- రాష్ట్రాన్ని అవినీతి మయం చేశారు
- ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలపై చట్టవ్యతిరేక చర్యలు
- పోలీసులు, తూటాలతో ఉద్యమాలని అణచివేయలేరు
- బాబును ప్రజలు తరిమికొట్టే రోజు వస్తుంది
- వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు
హైదరాబాద్ః చంద్రబాబు అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లవుతున్నా రాజధానిలో ఒక్క నిర్మాణం కూడా చేపట్టకపోవడం దురదృష్టకరమని వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. అన్నీ తాత్కాలిక కార్యక్రమాలు చేస్తూ హైదరాబాద్ నుంచి తరలిపోవడం దారుణమన్నారు. సగపాలన పూర్తయ్యాక కూడా ఇంకా తాత్కాలికమంటూ బాబు ప్రజలను మభ్యపెడుతున్నారని ఫైర్ అయ్యారు. తాత్కాలిక సెక్రటేరియట్, తాత్కాలిక శాసనసభ, మండలి వెనుక జరుగుతున్న తంతంగం చూస్తే బాధేస్తోందన్నారు. రెండున్నరేళ్లలో పర్మినెంట్ బిల్డింగ్ లు కట్టే అవకాశం ఉన్నా కట్టకపోవడం బాధాకరమన్నారు. ఇది ముమ్మాటికి ప్రభుత్వ అసమర్థతే కారణమన్నారు. అమరావతిలో శంకుస్థాపన రాయి వేయడం తప్ప బాబు చేసిందేమీ లేదని దుయ్యబట్టారు. తన అవినీతి, అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకే బాబు, లోకేష్ లు తాత్కాలిక కార్యక్రమం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రం విడిపోయాక మంచి రాజధాని కావాలి, పరిపాలన మంచిగా జరగాలని అంతా కోరుకున్నామన్నారు. కానీ ఇప్పుడు జరుగుతున్న విధానం దారుణంగా ఉందని అంబటి విమర్శించారు. ఎలాంటి వసతులు కల్పించకుండానే వెలగపూడి కేంద్రంగా అమరావతిలో పరిపాలన సాగించేందుకు హడావిడిగా ఉద్యోగులను తరలించడం సరికాదన్నారు. హైదరాబాద్ లో పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో అంబటి మాట్లాడారు.
ఉమ్మడి రాజధాని హైదరాబాద్ లో పదేళ్లు ఉండే అవకాశం ఉన్నా... దోపిడీకి అడ్డుగా ఉందనే, ఉన్నపళంగా బాబు విజయవాడ తరలిపోయారని అంబటి ధ్వజమెత్తారు. హైదరాబాద్ సెక్రటేరియట్ లో జీవోలు ఇష్యూ చేసినా, డబ్బులు ఖర్చుపెట్టినా ఏదైనా నేరం జరిగితే ఇక్కడి పోలీసులు, డీజీపీ, సీఐడీ పరిధిలోకి వస్తుందన్నారు. హైదరాబాద్ లో ఉండి చేస్తే తన ఆధీనంలో లేని పోలీస్ వ్యవస్థను మేనేజ్ చేయలేడు గనుకే బాబు తరలిపోయారని దుయ్యబట్టారు. మేనేజ్ చేసుకునే పోలీస్ వ్యవస్థ విజయవాడలో ఉంది కాబట్టి, అక్కడకు తరలివెళ్లాలనే తాపత్రయం మినహా ప్రజలకు అందుబాటులో రాజధాని తీసుకెళ్లాలన్న చిత్తశుద్ది బాబుకు ఏ కోశాన లేదన్నారు. బాబు ప్రతీ కార్యక్రమంలో వైట్ కాలర్ క్రైం, డబ్బులు దండుకునే కార్యక్రమం చేస్తున్నాడని నిప్పులు చెరిగారు. రాష్ట్రం చీలిపోయి మూడేళ్లు రాబోతోంది. దేశంలో ఎవరిని నమ్మకుండా సింగపూర్, జపాన్, మలేషియా వాళ్ల మీద ఆధారపడి ఒక్క కట్టడం కూడా కట్టని దౌర్భగ్యంలో ఎందుకున్నారని బాబును నిలదీశారు. అన్ని వసతులతో ప్రజలకు అందుబాటులో ఉండాలి కానీ ఉద్దేశ్యపూర్వకంగా వసతులు కల్పించకుండా ఉద్యోగులను తరలించడం సరైంది కాదన్నారు. ప్రభుత్వ తీరును ప్రజలు గమనించాలని సూచించారు.
భూసేకరణకు వ్యతిరేకంగా, ప్రత్యేకహోదా కోసం ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు ఉద్యమాలు చేస్తే పోలీసు వ్యవస్థను ఉసిగొల్పి అణిచివేయాలని చూడడం ప్రభుత్వానికి తగదన్నారు. ఉన్నతాధికారుల మీటింగ్ లో ప్రివెంటివ్ ఆఫ్ డిటెక్షన్ యాక్ట్ అప్లై చేయాలని బాబు చెబుతున్న ధోరణి చూస్తుంటే డిక్టేటర్ పాలనలో ఉన్నామా...ప్రజాస్వామ్య పాలనలో ఉన్నామో అర్థం కావడం లేదన్నారు. ప్రభుత్వ అక్రమాలు, అన్యాయాలపై ఉద్యమిస్తున్న వారిపై ప్రివెంటివ్ డిటెక్షన్ యాక్ట్ పెట్టి పోలీసుల రాజ్యం, తూటాల రాజ్యంతో అణిచేయాలని చూస్తే ప్రజలు తరమికొట్టే పరిస్థితి వస్తుందన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు ఆక్వా బాధితులకు మద్దతుగా ఉద్యమం చేస్తే గుండాలు, క్రిమినల్స్ మీద ఎటాక్ చేసినట్లు పోలీసులను ఉసిగొల్పి అరెస్ట్ చేసి, నిర్బందించి జైలు పాలు జేశారు. తిరుపతికి వెంకయ్యనాయుడు వస్తే చాలు వైయస్సార్సీపీ నాయకులను అరెస్ట్ చేశారు. చెవిరెడ్డిని నిర్బంధించారు. వెంకయ్యనాయుడుకు సన్మానం అనగానే ప్రతిపక్షం వాళ్లను అరెస్ట్ చేసి దండాలు వేస్తున్నారు. ఇదేనా సన్మానం...? పోలీస్ వ్యవస్థను అఢ్డుపెట్టుకొని బాబు పరిపాలన కొనసాగించడం దుర్మార్గమని అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు. దుర్మార్గుల కోసం ఏర్పాటు చేసిన చట్టాలను తీసుకొచ్చి వైయస్సార్సీపీ, ప్రజాసంఘాలమీద అమలు చేయాలని చూస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని బాబును హెచ్చరించారు. పోలీస్ వ్యవస్థ శాంతిభద్రతలు కాపాడేందుకు, క్రిమినల్స్ ను అణిచేసేందుకు ఉండాలి గానీ..చట్టానికి వ్యతిరేకంగా బాబు ఏది చెబితే అది చేయడానికి కాదన్నారు. అధికారం ఎవరికి శాశ్వతం కాదన్న సంగతి డీజీపీ, ఐపీఎస్, ఐఏఎస్ లు తెలుసుకోవాలన్నారు. ఎన్టీఆర్, ఇందిరాగాంధీలు చిత్తుగా ఓడిన సందర్భాలున్నాయి. బాబు కూడా చిత్తుగా ఓడిపోయిన సంగతి గుర్తుంచుకోవాలన్నారు.
దోమల మీద దండయాత్ర చేయాలని బాబు పిలుపునివ్వడం హాస్యాస్పదమని అంబటి తూర్పారబట్టారు. ఎంత పనికిమాలిన ప్రభుత్వం కాకపోతే దోమలపై దండయాత్ర ఏంటని ఎద్దేవా చేశారు. ప్రభుత్వానికి ఏం పోయే కాలం వచ్చిందని తూర్పారబట్టారు. ఈసందర్భంగా ఓ తల్లి, పిల్లదోమ కథ చెప్పిన అంబటి ప్రభుత్వంపై ఛలోక్తులు విసిరారు. దోమలు మనుషుల రక్తాన్ని ఏవిధంగా పీల్చుకొని తాగుతాయో, బాబు కూడా అదే మాదిరి ప్రజల రక్తాన్ని పీల్చుకొని తాగుతున్నాడని..బాబుకు కాంపిటీషన్ గా ఉన్నామనే మనల్ని సర్వనాశనం చేయాలని చూస్తున్నాడని పిల్ల దోమ ప్రశ్నకు తల్లిదోమ బదులిచ్చిన విషయాన్ని అంబటి వివరించారు. చేయాల్సినవి చేయకుండా దోమల మీద దండయాత్రలు. ప్రతిపక్షం మీద పీడీయాక్ట్ లతో అణిచేయాలని చూడడం అవివేకమని ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. టీడీపీ మళ్లీ అధికారంలోకి వచ్చే వరకు హైదరాబాద్ లోనే ఉంటానని ప్రగల్భాలు పలకిన బాబు...ఓటుకు నోటు కేసులో దొరికిపోవడంతో కేసులు పెడతారని భయపడి హైదరాబాద్ ఖాళీ చేసి వెళ్లిపోయాడని అన్నారు. కేసీఆర్, బాబుకు మధ్య వెంకయ్యనాయుడు రాజీ కుదిర్చారని చెప్పారు. బాబుకు ఎక్కడా రాజధాని నిర్మాణ ఆలోచనే లేదని దుయ్యబట్టారు. రాజధాని నిర్మాణం ముసుగులో విదేశాలకు దోచిపెట్టారు గనుకే న్యాయస్థానాలు కూడా బాబుకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చాయని తెలిపారు.
దోమలపై దండయాత్ర కాదని బాబు, మంత్రులు, లోకేష్ మీద ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ఉపయోగించాలని అంబటి పేర్కొన్నారు. ఇవాళ కాకపోయినా భవిష్యత్తులో అది జరుగుతుందన్నారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా అవినీతి జరుగుతోందని విమర్శించారు. బాబు తన మాటకు ఎదురుచెప్పని వారిని కీలకమైన ఫోకల్ లో పాయింట్స్ లో వేసుకొని అరెస్ట్ లు చేయిస్తున్నారని ఫైర్ అయ్యారు. ఏదో ఓ రోజు ధర్మంగా వ్యవహరించే రోజు వస్తుందన్నారు. చట్టాలు చేతిలో ఉన్నాయి కదా అని ప్రతిపక్షాలను అణిచేయాలని చేయడం బాబు చేతగాదని అంబటి తేల్చిచెప్పారు. ఎంత అణిచివేయాలని చూస్తే అంత ఉవ్వెత్తున ఉద్యమాలు ఎగుస్తాయని, చరిత్ర చదువుకోవాలని బాబుకు హితవు పలికారు. ప్రతిపక్షాలపై ప్రివెంటివ్ డిటెక్షన్ యాక్ట్ ప్రయోగిస్తే అది వికటిస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
1 October 2016
వామ్మో.. అంత పబ్లిసిటీ పిచ్చా.. కొంప మునగటం ఖాయం
- రాష్ట్రానికి ప్రత్యేక హోదా ముమ్మాటికీ సంజీవినే
- అందుకే అన్ని రాష్ట్రాలు హోదానే అడుగుతున్నాయ్
- ప్రత్యేక ప్యాకేజీలో ప్రత్యేకంగా ఏమిచ్చారో చెప్పాలి
- ఉన్నత పదవుల్లో ఉన్నవారు హుందాగా వ్యవహరించాలి
- టీడీపీ, బీజేపీలపై నిప్పులు చెరిగిన బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి
హైదరాబాద్ః ప్రత్యేక హోదాపై రోజుకో మాట చెప్పి ప్రజలను మభ్యపెట్టడం మాని రాష్ట్రాభివృద్ధికి అవసరమైన చర్యలు చేపట్టాలని ఏపీ పీఏసీ చైర్మన్, వైయస్సార్సీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హితవు పలికారు. హైదరాబాద్లోని కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... రాష్ట్రానికి ప్రత్యేక హోదా ముమ్మాటికీ సంజీవనే అని స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా కంటే ప్యాకేజీయే గొప్పదైనప్పుడు అన్ని రాష్ట్రాలు ప్యాకేజీ అడగకుండా హోదా కావాలని ఎందుకు డిమాండ్ చేస్తున్నారో బాబు సమాధానం చెప్పాలన్నారు. ప్రత్యేక ప్యాకేజీకి అంగీకారం తెలిపిన చంద్రబాబు మన రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన వాటి కంటే కొత్తగా కేంద్రం ఏమిచ్చిందో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు.
షిండేజీ అని లేఖలు రాసి మరీ విభజించారుగా..!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోవాలని ఎవరూ కోరుకోకపోయినా విడిపోయాం. రాష్ట్రం నుంచి టీడీపీ, కేంద్రంలో బీజేపీలు ఆనాటి యూపీఏ ప్రభుత్వానికి మద్దతు పలక పోయి ఉంటే రాష్ట్ర విభజన జరిగి ఉండేదే కాదన్నారు. విభజన జరగకుండా ఉండి ఉంటే మనం ఇన్ని కష్టాలు పడాల్సి వచ్చేది కాదన్నారు. టీడీపీ నాయకుడు చంద్రబాబు షిండేజీతో మాట్లాడుతూ విభజనకు అంగీకరిస్తూ ఉత్తరాలు రాసిన సంగతి మర్చిపోతే ఎలా అని ప్రశ్నించారు. అయితే అదంతా గతం. జరిగినదేదో జరిగిపోయింది. ఇకనైనా మాటలాపి ముఖ్యమంత్రి అభివృద్ధి మీద దృష్టి సారించాలని బాబుకు సూచించారు. హోదా కావాలని ఒకసారి, హోదా సంజీవినా అని మరోసారి... ప్యాకేజీ బాగుందని ఇంకోసారి తడవకోసారి అర్థం పర్థం లేని మాటలు చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టించడం తగదని బాబుకు హితబోధ చేశారు.
హోదాతో చాలా లాభాలున్నాయి
రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావడం వలన చాలా ప్రయోజనాలున్నాయని బుగ్గన వివరించారు. హోదా ఉన్న కాలంలో పరిశ్రమలు స్థాపిస్తే కలిగే ప్రయోజనాలను ఆయన వివరించారు. వంద శాతం ఇన్కమ్ ట్యాక్స్, సెంట్రల్ ఎక్సయిజ్ ట్యాక్స్ నుంచి మినహాయింపు ఉంటుందని తెలిపారు. వీటితోపాటు బ్యాంకుల నుంచి తీసుకునే అప్పులో 3శాతం వడ్డీ మినహాయింపు ఉంటుందని తెలిపారు. ఇటీవల కేంద్రమంత్రులు, టీడీపీ నాయకులు, వెంకయ్య నాయుడు తదితరులు మాట్లాడుతూ పరిశ్రమలు తమ పెట్టుబడిలో 15 శాతం ఖర్చుగా చూపించడంతోపాటు 35శాతం తరుగుదల అవకాశం కూడా కల్పించామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. అయితే ఇదేమీ మన రాష్ట్రానికి ప్రత్యేకంగా ఇచ్చిన వరం కాదన్నారు. మనతోపాటు పశ్చిమ బంగా, తెలంగాణ, బీహార్ ఇలాంటి రాష్ట్రాలకు కూడా కేటాయించిందని తెలియజేశారు. అలాంటప్పుడు మన కే ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చినట్లు చెప్పడానికి వారికి నోరెలా వచ్చిందో అర్థం కావడం లేదన్నారు. అంతేకాకుండా ఏపీలో ఐఐటీ, ట్రిపుల్ ఐటీ, ఐఐఎంలు స్థాపిస్తామని చెప్పడం మంచిదే కానీ ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో ఏర్పాటయ్యాయని కొత్తగా మనకూ కేటాయిస్తున్నారు తప్ప ఇందులో గొప్పతనం ఏమీ లేదన్నారు. ఇవన్నీ విభజన చట్టంలో పొందుపర్చారని అవే వారు నెరవేరుస్తామని చెబుతున్నారని ప్రత్యేక ప్యాకేజీ పేరుతో ప్రత్యేకంగా ఒక్క పైసా ఇవ్వలేదని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.
ఇలా అయితే మేకిన్ ఇండియా సాధ్యమా
మేకిన్ ఇండియా అంటూ ప్రచారం చేసుకుంటున్న మోడీ సార థ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం పరిశ్రమలు స్థాపించకుండా మేకిన్ ఇండియా ఎలా సాధ్యమవుతుందన్నారు. పరిశ్రమలు స్థాపించడానికి పారిశ్రామిక వేత్తలు ముందుకు రావాలంటే ఇక్కడ అవకాశం కల్పించాలని కోరారు. అప్పుడే ఉద్యోగాలు పెరిగి యువకులకు ఉపాధి లభిస్తుందని, తద్వారా రాష్ట్రం పురోగమిస్తుందని వెల్లడించారు. ప్యాకేజీల పేరుతో రావాల్సినవే విదిలిస్తే మేకిన్ ఇండియా కలగానే మిగిలిపోవాల్సి ఉంటుందని బుగ్గన పేర్కొన్నారు.
హోదా వలన ఉత్తరాఖండ్ దూసుకెళుతోంది
హోదా వలన రాష్ట్రాలకు ఏమంత ప్రయోజనం కలిగిందే చెప్పాలని మాట్లాడిన చంద్రబాబుకు బుగ్గన ఉత్తరాఖండ్ ఆర్థిక పరిస్థితిని వివరించారు. ఇటీవలే ప్రత్యేక హోదా సాధించిన కోటి మంది జనాభ గల చిన్నరాష్ట్రమైన ఉత్తరాఖండ్కు స్థూల జాతీయోత్పత్తిలో 23 శాతం నిధులు కేటాయిస్తే ఐదు కోట్ల జనాభా కలిగిన ఏపీ కనీసం పదిశాతం కూడా కేటాయించకపోవడం దారుణమన్నారు. దీన్ని కూడా ప్రత్యేక ప్యాకే జీ అంటారా అని ప్రశ్నించారు. ఉన్నత పదవుల్లో ఉండే నాయకులు హుందాగా ప్రవర్తించాలని హితవు పలికారు. సొంత ప్రయోజనాల కోసం రాష్ట్ర అభివృద్ధిని పణంగా పెట్టడం సరికాదన్నారు. ఇదీ చాలదన్నట్టు హోదా కంటే ప్యాకేజీయే బాగుందని చెబుతున్న ప్రభుత్వ పెద్దలు మరి రెండున్నరేళ్ల కాలంలో చేసిన అభివృద్ధి కనిపించడం లేదే అని ఎద్దేవా చేశారు.
ఎకనామిక్స్లో పీహె చ్డీ అన్నావ్ ఇదేనా.. నీ జ్ఞానం
చంద్రబాబు తనకు తాను ఆర్థికవేత్తనని, ఎకనామిక్స్లో పీహెచ్డీ చేశానని చెప్పుకోవడం తనను ఆశ్చర్యానికి గురిచేసిందని బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి వెల్లడించారు. మరి అంత జ్ఞానమున్న వ్యక్తి ప్యాకేజీకి ఎలా అంగీకారం తెలిపారో తనకైతే అర్థంకావడం లేదన్నారు. ప్రత్యేక హోదా కంటే ప్యాకేజీ బాగుందని చెప్పడం సిగ్గుచేటన్నారు. అంతటి విద్యావేత్తకు హోదా వలన కలిగే ప్రయోజనాలు తెలియవా అని ప్రశ్నించారు. చంద్రబాబు ప్రకటించిన దోమలపై దండయాత్రపై ఛలోక్తులు విసిరారు. ఆయన చేసే యుద్ధం ఇంగ్లిషు చిత్రాలను గుర్తుకు తెస్తుందని విమర్శించారు. ఆయన దోమలను తుపాకులతో కాల్చినట్టు ప్రజలు కలలో కూడా భయపడుతున్నారని తెలిపారు.
కరువంటే.. పుష్కరాలు, వాగ్ధానాలు అంటే... సింధు
సమస్యలను పక్కదారి పట్టించడం చంద్రబాబుకు తెలిసినంతగా మరెవరికీ తెలియదని ముఖ్యమంత్రిని బుగ్గన ఈ సందర్భంగా విమర్శించారు. ప్రతిపక్షాలు కరువు గురించి మాట్లాడితే చంద్రబాబు పుష్కరాలు బాగా చేద్దాం అంటారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్ధానాలను నెరవేర్చమని ప్రశ్నిస్తే సింధును తయారు చేశానని చెప్పుకుంటారు... ప్రత్యేక హోదా కోసం ప్రతిపక్షాలు ధర్నాలు, రాస్తారోకోలు చేస్తుంటే ముఖ్యమంత్రి దోమలపై సమరం అనడం సమస్యలకు భయపడి తప్పించుకోవడం కాక మరేమిటని ప్రశ్నించారు. ఒక ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాల్సిన బాధ్యత మీపై ఉందని దానిని సమర్థవంతంగా నిర్వహించాలే తప్ప సమస్యలకు సాకులు వెదకడమో.. లేక ప్రతిపక్షాల మీద పడి ఏడవడం చేయడం ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తులకు సరికాదని సూచించారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కళ్లు తెరిచి పబ్లిసిటీ మాని పనుల మీద దృష్టి పెట్టాలని హితవు పలికారు.
టీడీపీ, బీజేపీలు నియంతలా వ్యవహరిస్తున్నాయి
- ఓట్లు దండుకొని హోదా ఇవ్వకుండా ప్రజలను మోసం చేశాయి
- జేబులు నింపుకునేందుకే బాబు ప్యాకేజీని స్వాగతించారు
- కమీషన్లు, కాంట్రాక్టుల కోసమే పోలవరం
వైయస్ఆర్ జిల్లా: రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి చెంది, లక్షల మందికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్న కనీస జ్ఞానం కూడా చంద్రబాబుకు లేకపోవడం దారుణమని మాజీ మంత్రి, వైయస్సార్సీపీ సీనియర్ నేత వైయస్ వివేకానందరెడ్డి మండిపడ్డారు. కడప హరితా కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన చైతన్య పథం కార్యక్రమానికి హాజరైన సందర్భంగా మాట్లాడారు. సమైక్యాంధ్ర కోసం ఏపీ రాష్ట్రమంతా పోరాడినా వారి భవిష్యత్తును నిర్ధాక్షిణ్యంగా కాంగ్రెస్, బీజేపీలు నాశనం చేశాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. విభజనకు కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంటే బీజేపీ దానికి మద్దతు ఇచ్చి బిల్లుకు సహకరించిందన్నారు.
విభజన బిల్లుకు సహకరించిన బీజేపీ ప్రభుత్వం ప్రత్యేక హోదాను అమలు పర్చకపోవడం దుర్మార్గమన్నారు. టీడీపీ, బీజేపీలు ప్రజా సమస్యల గురించి పట్టించుకోకుండా నియంతలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. హోదా వస్తే ఆర్థికంగా, పారిశ్రామికంగా వెలుసుబాటు కలుగుతుందన్నారు. రాయలసీమ ప్రాజెక్టులన్నీ ఇబ్బందికరంగా మిగిలిపోయినా కనీసం చంద్రబాబు వాటిని పట్టించుకోవడం లేదన్నారు. కేవలం రెయిన్ గన్లతో ట్యాంకర్లతో నీటి కొరతను ఎలా పారదోలుతారని ప్రశ్నించారు. రాయలసీమ ఉక్కు కర్మాగారాన్ని కూడా కేంద్రం ఆధ్వర్యంలో నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు.
లాభం కాదని ఇతర రాష్ట్రాల్లో పెట్టుబడులా?
ప్రత్యేక హోదాతో ఉపయోగం లేదని మాట్లాడిన టీడీపీ, బీజేపీ నేతలు హోదా కలిగిన రాష్ట్రాల్లో ఎందుకు పెట్టుబడులు పెడుతున్నారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కమలాపురం ఎమ్మెల్యే పి. రవీంధ్రనాథ్రెడ్డి ప్రశ్నించారు. ఇతర రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టి కోట్లకు పడగలెత్తుతూ ఏపీకి హోదాతో ఉపయోగం లేదని మాట్లాడడం దారుణమన్నారు. ‘చైతన్యపథం’ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఎన్నికల్లో టీడీపీ, బీజేపీలు ముందస్తు డ్రామా ప్రకారం హామీలను కురిపించి ఓట్లు దండుకొని ప్రజలను తీవ్రంగా మోసం చేశారని మండిపడ్డారు. బంతి అయిపోయింది అన్నం పెట్టరు అన్నట్లుగా చంద్రబాబు, వెంకయ్యనాయుడు మాట్లాడుతున్నారని అన్నారు. ఏరుదాటాక తెప్ప తగలేసే కార్యక్రమం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
విభజన చట్టంలోని అంశాలే తప్ప ప్రత్యేకంగా ఏపీకి ఇచ్చిందేమీ లేకపోయినా బాబు అర్థరాత్రి దాన్ని స్వాగతించడం దారుణమన్నారు. ఏ కార్యక్రమానైనా డబ్బుల ఈవెంట్గా మల్చుకోవడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని విమర్శించారు. అందుకోసమే ప్యాకేజీని కూడా జేబులు నింపుకోవడానికి స్వాగతించారని చెప్పారు. కమీషన్లు, కాంట్రాక్టుల కోసం పోలవరాన్ని బాబు చేజిక్కించుకున్నారని ఆరోపించారు. రాయపాటి సాంబశివరావు, సీఎం రమేష్, మెగా కృష్ణారెడ్డిలకు డబ్బులు ముట్టజెప్పేందుకు పోలవరాన్ని తీసుకొచ్చారన్నారు. పోలవరం బిల్లుల కోసమే ఏపీ ప్రజల మనోభావాలను బాబు కేంద్రానికి తాకట్టుపెట్టారని మండిపడ్డారు.
రాష్ట్రాన్ని కేంద్రానికి తాకట్టు పెట్టారు
తూర్పుగోదావరి(మండపేట))కపిలేశ్వరపురం మండలం నేలటూరు గ్రామంలో మండపేట వైయస్సార్సీపీ కో-ఆర్డినేటర్ వేగుళ్ల లీలాకృష్ణ ఆధ్వర్యంలో గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమం కొనసాగింది. ఈసందర్భంగా స్థానికులు తమ సమస్యలు తెలియచేసారు. చేనేత రుణాలు, రేషన్ కార్డులు, ఇళ్లస్థలాలు, రుణమాఫీ ఏ ఒక్క హామీని బాబు నెరవేర్చడం లేదని ప్రభుత్వం వైఫల్యాలను ప్రజలే వైయస్సార్సీపీ నేతల వద్ద విన్నవించారు. ఈ సందర్భంగా లీలాకృష్ణ మాట్లాడుతూ....చంద్రబాబు ఓటుకు నోటు కేసులో రాష్ట్రాన్నీ కేంద్రం ప్రభుత్వం దగ్గర తాకట్టు పెట్టారు అని విమర్శించారు. సర్కారు వైఫల్యాలఫై ముద్రించిన ప్రజాబ్యాలెట్ ను ఇంటింటికి పంపిణీచేశారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో రాజన్న పాలన త్వరలోనే వస్తుందని ప్రజలకు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు , కార్యకర్తలు పాల్గొన్నారు.
30 September 2016
టీడీపీ సర్కార్ పై ప్రజాగ్రహం
నందికొట్కూరు)))టీడీపీ ప్రభుత్వం ప్రజలకు అరచేతిలో స్వర్గం చూపించేలా హామీలిచ్చిందని, అయితే వాటిని అమలు చేయడంలో మాత్రం ఘోరంగా విఫలమైందని ఎమ్మెల్యే ఐజయ్య ఆరోపించారు. గడపగడపకు వైయస్ఆర్ సీపీ కార్యక్రమంలో భాగంగా బానకచెర్ల, బానుముక్కల గ్రామాల్లో పర్యటించారు. పింఛన్, రేషన్ సక్రమంగా ఇవ్వడం లేదు, పక్కా గృహాల ఊసేలేదు అని ప్రజలు ఎమ్మెల్యే వద్ద మొరపెట్టుకున్నారు. మోసపూరిత చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్పాలని ఐజయ్య ప్రజలకు పిలుపునిచ్చారు.
కర్నూలు)))ప్రభుత్వం బంగారు వ్యాపారుల సమస్యలపై దృష్టి సారించాలని వైయస్ఆర్సీపీ కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త హఫీజ్ఖాన్ డిమాండ్ చేశారు. స్థానిక పాత బస్టాండు సమీపంలోని వెంకటాచలపతి షరాఫ్ బజారులో గడపగడపకు వైయస్ఆర్ కార్యక్రమం నిర్వహించారు. వ్యాపారులకు ప్రజా బ్యాలెట్ పత్రాలను పంపిణీ చేశారు. పార్టీ నగర అధ్యక్షుడు పి.జి. నరసింహులు యాదవ్ వాటిని పూరించే విధానాన్ని వివరించారు. సెంట్రల్ ఎక్సైజ్ విధింపుతో ఎదుర్కొంటున్న ఇబ్బందులను బంగారు వ్యాపారులు హఫీజ్ఖాన్కు విన్నవించుకున్నారు.
పత్తికొండ)) ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమను నట్టేట ముంచారని, రుణమాఫీ అంటూ మోసగించారని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. మండల పరిధిలోని అల్లుగుండు గ్రామంలో వైయస్ఆర్ సీపీ పత్తికొండ నియోజకవర్గ ఇన్చార్జి చెరుకులపాడు నారాయణరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన గడపగడపకు వైయస్ఆర్ కార్యక్రమానికి మహిళలు, రైతుల నుంచి విశేష సందన లభించింది. నారాయణరెడ్డికి పెద్ద ఎత్తున స్వాగతం పలికిన గ్రామ ప్రజలు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
టీడీపీలో గుర్తింపు లేదు
- అందుకే వైయస్సార్సీపీకి ఓటేశా
- ఎక్కడా అభివృద్ధి జరగడం లేదు
- వైయస్సార్సీపీ గెలుపునకు కృషి చేస్తా
పెడనటౌన్ (ఈడేపల్లి) : తెలుగుదేశం అధికారంలోకి వచ్చి మూడేళ్లవుతున్నా ఇప్పటికీ పార్టీలో గుర్తింపు లేదని అందుకే తాను వైయస్సార్ సీపీకి ఓటు వేశానని పెడన మున్సిపల్ కౌన్సిలర్(15వ వార్డు) లంకే స్రవంతి వెల్లడించారు. ఓటింగ్ అనంతరం ఆమె మాట్లాడుతూ నేటికీ తనకు కౌన్సిలర్ గా గుర్తింపు లేదన్నారు. వార్డు సమస్యలను మున్సిపల్ చైర్మన్, అధికారులకు చెబుతున్నా పట్టించుకోవడం లేదన్నారు.
తన ఇంటికి మంచినీటి కుళాయి కనెక్షన్ కోసం కార్యాలయం చుట్టూ ఆరునెలలపాటు ప్రదక్షిణలు చేశానని చెప్పారు. తన వార్డులో ఒక్క అభివృద్ధి పని చేయలేదని, నిధులు కూడా విడుదల చేయలేదన్నారు. మరి కొన్ని వార్డులలో కూడా ఇదే పరిస్థితి ఉందన్నారు. అందువల్లనే తాను టీడీపీ అభ్యర్థికి మద్దతు తెలుపలేదన్నారు. వైయస్సార్ సీపీకి పట్టంకడితేనే పూర్తిస్థాయిలో పట్టణాభివృద్ధి జరుగుతుందని తాను ఈ నిర్ణయం తీసుకున్నానన్నారు.
ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు ప్రారంభోత్సవాలకు, శంకుస్థాపనలకు మినహా అసలు పెడనలో కనిపించడం లేదన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న వైయస్ జగన్మోహన్రెడ్డిని ఆదర్శంగా తీసుకుని వైయస్సార్ సీపీని గెలిపించడానికి కృషిచేస్తానని తెలిపారు. అయితే.. తాను అమ్ముడుపోయానని టీడీపీ కౌన్సిలర్లు దుష్ర్పచారాలు చేస్తున్నారన్నారు. దమ్ముంటే వాటిని నిరూపించాలని టీడీపీకి ఆమె సవాల్ విసిరారు. పెడన మున్సిపాలిటీకి జరిగిన ఎన్నికల్లో మున్సిపల్ చైర్మన్, మండల పరిషత్ పీఠాలను వైయస్సార్సీపీ కైవసం చేసుకున్న తెలిసిందే.
మోసగిస్తే దుర్మార్గులు అనక మరేమంటారు..?
- దేవతా ముఖ్యమంత్రి అంటారా..?
- వ్యవసాయం శుద్ధ దండగ అనే క్యారెక్టర్ బాబుది
- ప్రతిపక్షనేత వస్తున్నాడనే బాబు హెలికాఫ్టర్ పర్యటన
- వైయస్సార్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ
గుంటూరు: ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చని వ్యక్తిని దుర్మార్గపు ముఖ్యమంత్రి అనక దేవతా ముఖ్యమంత్రి అంటారా? అని వైయస్ఆర్ సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన చంద్రబాబును ఏమని సంబోధించాలో చెప్పాలని టీడీపీ నేతలను నిలదీశారు. గుంటూరు జిల్లా కాకమాను మండలంలో వరద ముంపు ప్రాంతాలను గురువారం ఆయన పరిశీలించారు. భారీ వరదలతో తీవ్రంగా నష్టపోయిన రైతుల పంటలను పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో గత పది రోజులుగా అధిక వర్షాలతో తీవ్రమైన పంట, ఆస్తినష్టం వాటిల్లిందన్నారు. వరద కారణంగా మరణాలు కూడా సంభవించాయని గుర్తు చేశారు. గుంటూరు జిల్లాలో అత్యధికంగా నష్టం జరగిందన్నారు. వర్షాభావ ప్రభావంతో నష్టపోయిన కుటుంబాలను, రైతులను వైయస్ఆర్ సీపీ అధినేత వైయస్ జగన్మోహన్రెడ్డి కలిసి పరామర్శించారని చెప్పారు. రైతులకు జరిగిన నష్టానికి ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారన్నారు.
అత్యధిక వర్షాలు పడుతున్నాయని వాతావరణ శాఖ పలు సార్లు హెచ్చరించినా చంద్రబాబు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. ప్రతిపక్షనేత చెప్పేంత వరకు రాష్ట్రంలో సహాయక చర్యలు చేపట్టలేదన్నారు. ప్రతిపక్షనేత వైయస్ జగన్ ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తారని ప్రకటించిన తరువాత బాబు హడావిడిగా హెలికాఫ్టర్ ద్వారా వరద ప్రాంతాలను పరిశీలించారన్నారు. నష్టపడి రైతులను, ప్రజలను పట్టించుకోకుండా రాజకీయ ఆలోచనలతోనే ఉన్నారన్నారు. రెండు రోజుల పాటు నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో వరద నష్టం గురించి చంద్రబాబు చర్చించకపోవడం దారుణమన్నారు. వర్షాలతో గుంటూరు జిల్లా ఎంతో నష్టపోయిందని, ఆ నష్టాన్ని ఉదారంగా ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.
కరువులో బాబు గొప్పలు
రాష్ట్రంలో కరువుతో ప్రజలు అల్లాడుతుంటే జీడీపీ 12 శాతం పెరిగిందని చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటున్నారని బొత్స విమర్శించారు. గొప్పలు ఎనైనా చెప్పుకోండి కానీ రైతుల నడ్డి విర్చోద్దని ప్రభుత్వానికి సూచించారు. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ కంటే మించిన రుణాలు ఇవ్వోద్దని బ్యాంకర్స్మీటింగ్లో చెప్పి ఇప్పుడు బ్యాంక్లు రుణాలు ఇవ్వడం లేదని బాబు మాట్లాడడం సమంజసమా అని ప్రశ్నించారు. రుణమాఫీ పూర్తిగా చేయకుండా రైతులు రుణాలెలా ఇస్తారని నిలదీశారు. వాగులు పొంగి పొలాల్లో ఇసుక మేటలు వేశాయని, వాటిని తొలగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఉపాధి హామీ పథకం కింద ఇసుక మేటల పనిని వినియోగించుకోవాలని కోరారు. స్థానిక అధికారులను, ప్రజాప్రతినిధులను అప్రమత్తం చేసి పంట, ఆస్తి నష్టాలను అంచెనా వేయించాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్ష మాటలపై వాస్తవాలను తెలుసుకోకుండా ఎదురుదాడి చేసి పబ్బం గడుపుకోవడం మానేయాలని బాబుకు సూచించారు. చంద్రబాబుకు, టీడీపీ నేతలకు వ్యవసాయం అంటే శుద్ద దండగ అని మనస్సులో బలంగా నాటుకుపోయిందన్నారు. అదే విధంగా ఆయన పాలన కొనసాగుతుందన్నారు. సంక్షోభాన్ని అవకాశంగా చేసుకోవాలని పదే పదే చెప్పే చంద్రబాబు రైతుల ఇన్పుట్ సబ్సీడీ, నష్ట పరిహారాన్ని అవినీతికి ఆసరాగా చేసుకోవద్దని హితవు పలికారు.
బాబు ఎందుకు పోరాడరు
కర్నూలు: కాంగ్రెస్, బీజేపీ వేసిన ప్రత్యేక హోదా విత్తనాన్ని పెంచిపోషించిన చంద్రబాబు ఇప్పుడు ప్రత్యేక హోదా వల్ల ఎటువంటి లాభం లేదనడం అన్యాయమని వైయస్సార్సీపీ ఎంపీ బుట్టా రేణుక అన్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి తీరని నష్టం జరిగిన వాస్తవం ....అన్ని పార్టీలు, వర్గాలకు తెలుసని చెప్పారు. ఆర్థికంగా ఎటువంటి బలం లేకున్నా, ఏపీ ప్రజల అభిప్రాయాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్, బీజేపీలు రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించాయని బుట్టా రేణుక మండిపడ్డారు. చైతన్యపథం కార్యక్రమంలో పాల్గొని ఆమె మాట్లాడారు. విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రత్యేక హోదా గురించి అసలు తెలియదని ప్రత్యేక హోదా అనే విత్తనాన్ని వేసింది కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలేనని రేణుక పేర్కొన్నారు. రాష్ట్ర విభజన జరిగిన మరుక్షణమే కాంగ్రెస్ పార్టీ ఐదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తానంటే బీజేపీ పదేళ్లు ఇస్తానని, టీడీపీ పదిహేనేళ్లు కావాలని ప్రజలను మభ్యపెట్టాయని ఆమె ఆరోపించారు. ఏ పార్టీలైతే రాష్ట్రాన్ని విడగొట్టాయో ఆ పార్టీలే ఇప్పడు రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నాయని విమర్శించారు. తెలంగాణ ప్రాంత ప్రజలు పోరాడి ప్రత్యేక తెలంగాణను సాధించుకొని రాష్ట్రాన్ని అభివృద్ది చేసుకుంటున్నప్పుడు, ఏపీ ప్రజలందరు కలిసి పోరాడి హోదాను సాధించి ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేసుకోలేమా అని అన్నారు. రాష్ట్ర భవిష్యత్తు ప్రత్యేక హోదాతో ముడిపడి ఉందని, ప్రత్యేక హోదా పోరాటాన్ని కొనసాగిస్తేనే అభివృధ్ధి సాధ్యమన్నారు.
ఏపీకి ప్రత్యేకంగా ఏమిచ్చారు
పీఏసీ చైర్మన్, ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి
కర్నూలు: కేంద్రం ప్రకటించిన ప్యాకేజీలో విభజన చట్టంలోని అంశాలే తప్ప ప్రత్యేకమైన అంశాలేవి లేవని వైయస్ఆర్ సీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి చెప్పారు. వెంకయ్య, చంద్రబాబు గొప్పగా చెప్పుకుంటున్న ప్యాకేజీ కూడా ఇప్పటి వరకు రాలేదని మండిపడ్డారు. కర్నూలులో జరిగిన చైతన్యపథం కార్యక్రమానికి హాజరైన బుగ్గన మాట్లాడుతూ... హోదా వస్తేనే ప్రత్యేక రాయితీలతో పరిశ్రమలు మెండుగా వస్తాయన్నారు. పరిశ్రమలు వస్తే లక్షల ఉద్యోగాలు వస్తాయన్నారు. చంద్రబాబు రాష్ట్ర సమస్యలను పట్టించుకోకుండా ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. రాష్ట్రంలో కరువొచ్చిందని ప్రజలు గగ్గొలు పెడుతుంటే పుష్కరాలని హడావిడి చేశారని ఫైరయ్యారు. హామీల అమలు అంటే పీవీ సింధూ సన్మానం, ప్రత్యేక హోదా అంటే దోమలపై యుధ్ధ అంటూ ప్రజా సమస్యలను పక్కదొవ పట్టిస్తున్నారన్నారు. అసోంకు హోదా కొనసాగించాలని వారు కోరినప్పుడే రాష్ట్రానికి అన్యాయం జరగబోతుందని గ్రహించి వైయస్ఆర్ సీపీ అధినేత వైయస్ జగన్మోహన్రెడ్డి పోరాడాలని పిలుపునిచ్చారని గుర్తు చేశారు. రెండున్నర సంవత్సరాలుగా వస్తుంది వస్తుందని చెప్పుకుంటూ చివరకు రాష్ట్ర ప్రజలను నట్టేట ముంచారన్నారు.
29 September 2016
వెంకయ్య, బాబు అవిభక్త కవలలు
హైదరాబాద్: తెలుగు నాట చంద్రబాబు, వెంకయ్యనాయుడు అవిభక్త కవలల మాదిరిగా వ్యవహరిస్తున్నారని వైయస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి అభిప్రాయ పడ్డారు. రాజ్యసభలో పది సంవత్సరాలు ఏపీకి హోదా ఇవ్వాలని డిమాండ్ చేసిన వెంకయ్య, చంద్రబాబులు హోదా వల్ల రాష్ట్రానికి ఒరిగేదేమీలేదని మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. హైదరాబాద్ లోటస్ పాండ్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
ప్రత్యేక హోదా మీద అదేపనిగా మోసాలు
ప్రత్యేక హోదాను ఆర్పే ప్రయత్నం చేస్తున్న తెలుగువారైన వెంకయ్యనాయుడు, చంద్రబాబు జాతి ద్రోహులుగా మిగిలిపోతారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్రెడ్డి విమర్శించారు రెండున్నర సంవత్సరాల క్రితం ప్రత్యేక హోదా సంజీవని అని హోదాను ఇచ్చి తీరుతాం.. సాధించి తీరుతాం అని అధికారంలోకి వచ్చిన బీజేపీ, టీడీపీలు ఏపీ ప్రజలను నట్టేట ముంచారని మండిపడ్డారు. హోదాపై రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలపై భూమన విరుచుకుపడ్డారు. ఏపీకి హోదా కేటాయింపులో అనేక రాష్ట్రాల ప్రతినిధులు అడ్డుపడడంతో ఆ రోజే మనస్సు మార్చుకున్నానని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు సన్మానాలు చేయించుకొని మరీ చెబుతున్నారన్నారు. 2014 ఎన్నికల సమయంలో విశాఖలో బీజేపీ మ్యానిఫెస్టో పది సంవత్సరాలు తీసుకొస్తామని చెప్పిన మాటలు గుర్తులేదా అని వెంకయ్యను సూటిగా ప్రశ్నించారు. నాలాంటి అనుభవజ్ఞుడు అధికారంలోకి వస్తేనే హోదా సాధించగలడని బీరాలు పలికిన చంద్రబాబు నాయుడు హోదా సాధనలో అనుభవం ఏమైందని నిలదీశారు. 14వ ఆర్థిక సంఘం, నీతి అయోగ్, ఇతర రాష్ట్రాలు ఒప్పుకోవడం లేదని హోదా సంజీవనని నీరుగారుస్తున్నారని ఫైరయ్యారు. ఏపీకి రెవెన్యూ లోటు రూ. 22 వేల కోట్లు ఇస్తున్నాం కాబట్టి హోదా ఇచ్చే పరిస్థితి లేదని వెంకయ్య వ్యాఖ్యానించడం దుర్మార్గమన్నారు. హోదా లబ్దిని గుర్తించి తెలుగు జాతి ఏకమై పోరాడుతుంటే ప్యాకేజీ అంటూ మభ్యపెడుతున్నారని దుయ్యబట్టారు. తెలుగుజాతి ద్రోహులైన అవిభక్త కవలలు వెంకయ్య, చంద్రబాబుల శరీరాలు వేరైనా ఆడే అబద్దాలు మాత్రం ఒక్కటేనని ఎద్దేవా చేశారు.
హోదా ఎందుకు సాధించటం లేదు
కేంద్రం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీకి, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతున్న హోదాకు తేడాలేదంటున్న వెంకయ్య.. దానికి దీనికి తేడా లేనప్పుడు హోదానే ఇవ్వొచ్చుగా అని భూమన ధ్వజమెత్తారు. ఎన్నికల మోసపూరిత వాగ్ధానాలతో రాష్ట్ర ప్రజలను వంచించిన ద్వయం దిగ్గజాలు బాబు, వెంకయ్య ఇద్దరూ ఎందుకు హోదా సాధించలేకపోతున్నారని ప్రశ్నించారు. గత కొన్ని రోజుల క్రితం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) స్పష్టంగా ఉమ్మడి ఏపీకి రూ. 32 వేల కోట్లు ప్రకటిస్తే హోదా కల్గిన రాష్ట్రాలకు రూ. 91,980 కోట్లు కేటాయించిందన్నారు. దాదాపు ఐదున్నర కోట్ల జనాభా ఉన్న రాష్ట్రానికంటే ఏడున్నర కోట్ల జనాభా కల్గిన రాష్ట్రాలకు మూడు రెట్లు ఎక్కువగా నిధులు విడుదల చేసిందని చెప్పారు. స్వాతంత్య్ర సంగ్రామం రోజుల్లో మనల్ని పాలించే బ్రిటీష్వారు స్వాతంత్య్రం కంటే ఎక్కువ లాభం ఇస్తామని ఉంటే పోరాటాన్ని మానుకునే వాళ్లా? అని ఇద్దరు నాయుళ్లను నిలదీశారు. ప్రాణాలకు తెగించి అమరవీరులు దేశానికి స్వాతంత్య్ర సంపాదిస్తే వీరిద్దరు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని ప్రజలకు సూచించారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు హోదా కోసం ఉద్యమాలు చేస్తుంటే బాబు, వెంకయ్యలు ప్రజలను మభ్యపెట్టేందుకు ప్యాకేజీ మేలంటూ ఊరేగింపులు, సన్మానాలు చేయించుకుంటున్నారని మండిపడ్డారు.
వెంకయ్యవి చౌకబారు మాటలు
ప్రత్యేక హోదా కోసం ఉద్యమిస్తున్న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పిల్లకాంగ్రెస్ అని మాట్లాడిన వెంకయ్య చౌకబారు మాటలను భూమన తీవ్రంగా ఖండించారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం కల్గిన వ్యక్తి వెంకయ్యకు ఇలాంటి చిల్లర మాటలు తగునా అని నిలదీశారు. చిల్లర స్థాయి నాయకుడిగా ఉన్నా వెంకయ్యను బీజేపీ జాతీయ నేతగా కీర్తిస్తుందా అనే అనుమానాలు కలుగుతున్నాయని చురకంటించారు. ఏపీకి హోదా అవసరం లేదని ప్రధానమంత్రి మోడీ చెప్పకపోయినా తెలుగువాడైన వెంకయ్యనాయుడు పదేపదే ఇవ్వబోమని చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వేరే రాష్ట్రం నుంచి ఎన్నికయ్యానని ఏపీ ప్రయోజనాలను సర్వనాశనం చేస్తున్నారా అని ప్రశ్నించారు. ఈ రాష్ట్రం నుంచి ప్రతినిధిగా లేనప్పుడు 3 రోజులకు ఒకసారి ఎందుకు ఏపీలో పర్యటనలు చేస్తున్నారని భూమన విరుచుకుపడ్డారు.
బాబుది కమీషన్ల ఆరాటం
బీజేపీలో కేంద్రమంత్రిగా ఉంటూ చంద్రబాబు పార్టీకి కార్యకర్తగా వ్యవహరిస్తున్నారని భూమన విమర్శించారు. టీడీపీ నేతలు కూడా పొగడనంతగా వెంకయ్య బాబును పొగుడ్తున్నారని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలోని ప్రతి ఇంటి ప్రయోజనం కోసం పోరాటం చేస్తుంటే సీఎం చంద్రబాబు తన కమీషన్లు, తాబేదారుల ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారని భూమన ధ్వజమెత్తారు. హోదా ఇవ్వొద్దని పార్లమెంట్లో ఏ పార్టీ అభ్యంతరం చెప్పలేదన్నారు. కాంగ్రెస్ నేత కేవీపీ పెట్టిన ప్రైవేట్ బిల్లుకు కూడా రాజ్యసభలో 13 పార్టీలు మద్దతు తెలిపాయని గుర్తు చేశారు. అన్ని వనరులున్న ఏపీకి హోదా ఇస్తే దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా నిలుస్తోందన్న కుట్రతోనే ద్రోహం చేస్తున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కోసం ఏరకంగా పోరాటం జరిగిందో అంతకంటే ఎక్కవగా ప్రజా సంఘాల మద్దతుతో వైయస్ జగన్ మోహన్రెడ్డి నేతృత్వంలో హోదా ఉద్యమాలు చేస్తామని ప్రభుత్వాలను హెచ్చరించారు.
నారా చంద్రబాబు కాదు.. నయీం చంద్రబాబు
- నదులు కాదు..అవినీతి అనుసంధానం
- టీడీపీ ఎమ్మెల్యే రామకృష్ణ ఎల్లో ట్యాక్సు పై సీఎం స్పందించాలి
వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్రెడ్డి
హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని నయీం చంద్రబాబు నాయుడుగా వైయస్సార్సీపీ సీనియర్ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అభివర్ణించారు. రాష్ట్రంలో ప్రతీచోట తన మనుషుల్ని పెట్టుకొని అవినీతికి పాల్పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్ లోటస్ పాండ్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు నదుల అనుసంధానం పేరుతో అవినీతిని అనుసంధానం చేశారని మండిపడ్డారు. ఆయన నారా చంద్రబాబు కాదని, నయీం చంద్రబాబు అని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోని ప్రతి పథకంలోనూ అవినీతి, ఎల్లో ట్యాక్స్లు అధికమయ్యాయని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రే స్వయంగా అవినీతిని ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు.
వెంకటగిరి ఎమ్మెల్యే వ్యవహారమే ఉదాహరణ
తెలుగుదేశం పార్టీకి చెందిన వెంకటగిరి ఎమ్మెల్యే రామకృష్ణ రెడ్ హ్యాండెడ్గా దొరకడమే అందుకు ఒక ఉదాహరణ అని ఆయన చెప్పారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ ఎమ్మెల్యే ఏమీ మాట్లాడకపోవడంతోనే ఏం జరిగిందో అందరికీ తెలిసిందని చెప్పారు. ప్రతి అభివృద్ధి పనిలోను చంద్రబాబుకు వాటాలు ముడుతున్నాయని, అందుకే ఎమ్మెల్యేలు ఏం చేసినా పట్టించుకోవడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పుడు రామకృష్ణ అవినీతి వెలుగులోకి రావడంతో టీడీపీ నేతలు బెల్లం కొట్టిన రాయిలా వ్యవహరిస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. చంద్రబాబును ఆదర్శంగా తీసుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామానికో నయీం తయారయ్యాడని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. టీడీపీ ఎమ్మెల్యే రామకృష్ణ రైల్వే కాంట్రాక్టరును బెదిరించిన విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు.
జనాలను మేనేజ్ చేయలేవు
అవినీతితో సంపాదించిన డబ్బుతో ఏపీ సీఎం చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేయగలరేమో గాని జనాలను మేనేజ్ చేసే సత్తా ఆయనకు లేదని గడికోట శ్రీకాంత్రెడ్డి అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి కోటి ఎకరాలకు నీరందించాలనే లక్ష్యంతో జలయజ్ఞం చేపడితే..నాడు ధనయజ్ఞమని విమర్శించిన చంద్రబాబు ఇప్పుడు మహానేత చేపట్టి ప్రాజెక్టులకు మూడొంతు చొప్పున అంచనాలు పెంచి ప్రజా సొమ్ము దోచుకుంటున్నారని ఆరోపించారు. ఐదు కోట్ల ప్రజల హక్కు అయిన ప్రత్యేక హోదాను చంద్రబాబు పోలవరం కాంట్రాక్ట్ కోసం తాకట్టు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అవినీతికి ప్రోత్సాహం
అన్నా హజారే శిష్యుడ్ని అని చెప్పుకునే చంద్రబాబు రాష్ట్రంలో అవినీతిని ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. కరువును పారద్రోలుతామని పగల్బాలు పలికిన సీఎం రూ.350 కోట్లు ఖర్చు చేసి రెయిన్గన్లు కొని కనీసం పది వేల ఎకరాలు కూడా తడప లేదని విమర్శించారు. డబ్బులు సంపాదించడం, వ్యవస్థలను మేనేజ్ చేయడం బాబుకు అలవాటైందని దుయ్యబట్టారు. వైయస్ఆర్సీపీలో ఉంటే ఎమ్మెల్యేలపై కేసులు పెడతారని, అదే ఎమ్మెల్యే టీడీపీలో చేరితే కేసులు ఎత్తివేస్తున్నారని ప్రజాస్వామ్యంలో ఇలాంటి ధోరణి మంచిది కాదని హితవు పలికారు. కేంద్రం నిధులతో చేపట్టే ప్రతి పనిలోనూ టీడీపీ నేతలు కమీషన్లు పొందుతూ అభివృద్ధికి అంతరాయం కలిగిస్తున్నారని, గ్రామ, నియోజకవర్గ, రాష్ట్రస్థాయి వరకు టీడీపీ నేతల అవినీతి విస్తరించిందని మండిపడ్డారు. అవినీతిని కట్టడి చేయకపోతే టీడీపీ నేతల అరాచకాలు పెట్రేగిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు వీటన్నింటిని గమనిస్తున్నారని, అధికార పార్టీ నేతలకు తగిన గుణపాఠం చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని గడికోట శ్రీకాంత్రెడ్డి హెచ్చరించారు.
28 September 2016
బాబు నోరు తెరిస్తే అన్నీ అబద్ధాలే
- హామీలను విస్మరించి ప్రజలను వెన్నుపోటు పొడిచారు
- ఇంతటి దుర్మార్గపు ముఖ్యమంత్రి దేశంలోనే ఎవరూ లేరు
- రైతులకు దమ్మిడి సాయం చేయడం లేదు
- ఇప్పటికైనా కళ్లు తెరిచి వరద బాధితులను ఆదుకోవాలి
- ముంపు ప్రాంతాల్లో వైయస్ జగన్ పర్యటన
గుంటూరుః చంద్రబాబు సర్కార్ గ్రామాలను, రైతులను పట్టించుకోవడం లేదని ప్రతిపక్ష నేత, వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ మండిపడ్డారు. భారీ వర్షాలతో ప్రజలు సర్వం కోల్పోయి ఇబ్బందులు పడుతుంటే అవేమీ పట్టకుండా చంద్రబాబు విమానాల్లో చక్కర్లు కొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం కోసం ఆనాడు పిల్లనిచ్చిన మామను వెన్నుపోటు పొడిచారు. ఇవాళ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా వెన్నుపోటు పొడిచారని చంద్రబాబుపై ధ్వజమెత్తారు. వరద ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తూ వైయస్ జగన్ పంటనష్టపోయిన రైతులు, బాధిత నిరాశ్రయులకు అండగా నిలిచారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా రెడ్డిగూడెంలో వరద బాధితులను పరామర్శించి వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. అధికారులు, పాలకులు ఎవరూ తమ వద్దకు రాలేదని, ఏ సహాయం చేయడం లేదని బాధితులు వైయస్ జగన్ వద్ద వాపోయారు. వైయస్సార్సీపీ నేతలే తమను ఆదుకున్నారని చెప్పారు. ఈసందర్భంగా జననేత మాట్లాడుతూ....ప్రభుత్వం బాధితులకు దమ్మిడి సాయం కూడా చేయకపోవడం బాధాకరమన్నారు. చంద్రబాబు గ్రామాల్లోకి రాకుండా పొలిమేరలనుంచే వెళ్లిపోవడం దారుణమని అన్నారు.
రాష్ట్రంలో వేయి కోట్లు ఇన్ పుట్ సబ్సిడీ ఇవ్వాలని లెక్కలు గట్టారు. ఒక్క గుంటూరు జిల్లాకే రూ.120 కోట్లు ఇవ్వాలి. వేయి కోట్లలో 463 కేంద్రం చెల్లిస్తే దాన్ని కూడా బాబు వేరే కార్యక్రమాలకు ఖర్చుచేయడం ఘోరమన్నారు. అసలు ఈమనిషికి రైతుల మీద ప్రేమ ఉందా ..? బాబు నోరు తెరిస్తే అన్నీ అబద్ధాలేనని వైయస్ జగన్ విమర్శించారు. రైతులు, డ్వాక్రా మహిళల రుణాలన్నీ బేషరతుగా మాఫీ చేస్తామని చెప్పి బాబు మాట తప్పారని జగన్ ఫైర్ అయ్యారు. రుణాలు మాఫీ గాకపోవడంతో గత్యంతరం లేక మహిళలు తాళిబొట్లు తాకట్టు పెట్టి అధిక వడ్డీలకు రుణాలు తెచ్చుకుంటున్న పరిస్థితి తలెత్తిందని అన్నారు. బ్యాంకుల్లో బంగారం ఇంటికి రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలని ఎన్నికల ముందు ఊదరగొట్టిన చంద్రబాబు...ఎన్నికలయిపోయాయి ప్రజలతో పనైపోయిందన్నట్లుగా వ్యవహరిస్తున్నాడని దుయ్యబట్టారు. బ్యాంకులు బంగారం వేలం వేస్తుంటే చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు. ఇచ్చిన హామీ నెరవేర్చకపోగా, రైతులకు రుణాలివ్వొద్దంటూ బాబు బ్యాంకులకు చెప్పడం దారుణమన్నారు. ఇలాంటి దుర్మార్గపు ముఖ్యమంత్రి దేశంలో మరొకరు ఉండరని నిప్పులు చెరిగారు.
అప్పులు చేసి మరీ పంటలు వేసుకుంటే...చేతికొచ్చిన సమయంలో అవి నీట మునగడంతో రైతుకు కన్నీరే మిగిలిందని వైయస్ జగన్ ఆవేదన చెందారు. జూలై, ఆగష్టు చివర వరకు వర్షాలు రాక పంటలు ఎండిపోయాయి. ఉన్న కొద్దోగొప్పో సాగుచేసుకుంటున్న తరుణంలో వర్షాలు ముంచెత్తాయి. లక్షల ఎకరాల్లో ప్రత్తి, వరి, మిరప పంటలు పూర్తిభాగం దెబ్బతిన్నాయి. గ్రామంలో పరిస్థితి దయనీయంగా ఉంది. ఇళ్లలో బియ్యం తడిసి ముద్దయ్యాయి. స్కూళ్లో 30 కంప్యూటర్లు నీటిలో తడిసిపోయాయి. పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే సాయం చేయకుండా బాబు హెలికాప్టర్లలో తిరగుతున్నాడు. ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలని వైయస్ జగన్ విరుచుకుపడ్డారు. ఇప్పటికైనా బాబు కళ్లు తెరిచి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు, నిరాశ్రయులకు వైయస్సార్సీపీ అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తుందని, తోడుగా నిలుస్తుందని వైయస్ జగన్ స్పష్టం చేశారు.
నగరపాలక సంస్థలో అంతులేని అవినీతి, అక్రమాలు
- కార్పొరేషన్ను ముట్టడించిన వైయస్సార్సీపీ ఎమ్మెల్యేలు
- టెండర్లు వేయాలని డిమాండ్ చేస్తూ కార్యాలయం ముట్టడి
- మంత్రి నారాయణ తీరుపై అనిల్, కోటంరెడ్డిల ఆగ్రహం
నెల్లూరు : రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి.నారాయణ, నెల్లూరు మేయర్ అబ్దుల్ అజీజ్ డౌన్ డౌన్ అనే నినాదాలతో నగరపాలక సంస్థ కార్యాలయ ప్రాంతం మార్మోగింది. కార్పొరేషన్లో ఎస్సీ సబ్ప్లాన్ నిధులు రూ.42 కోట్లకు సంబంధించి... 10 నెలలుగా టెండర్లు వేయకుండా కాలయాపన చేస్తున్న వైనాన్ని నిరసిస్తూ వైయస్సార్సీపీ సిటీ, రూరల్ ఎమ్మెల్యేలు పి.అనిల్కుమార్ యాదవ్, కోటంరెడ్డి శ్రీధర్రెడ్డిలు నగరపాలక సంస్థ కార్యాలయాన్ని పార్టీ నాయకులు, కార్పొరేటర్లు, కార్యకర్తలతో కలిసి ముట్టడించారు.
ఈ సందర్భంగా అనిల్ మాట్లాడుతూ... సబ్ప్లాన్ నిధులకు టెండర్లు పిలవకుండా మేయర్, అధికారులు కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. మంత్రి నారాయణ సొంత కార్పొరేషన్లో ఈ పరిస్థితి ఉండటం బాధాకరమన్నారు. రూ.42 కోట్లను ప్యాకేజీలుగా చేసి దోచుకునేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. నగరపాలక సంస్థలో అవినీతి, అక్రమాలకు అంతులేకుండా పోయిందన్నారు. మంత్రి ప్రజలకు అందుబాటులో ఉండటంలేదని ఫైర్ అయ్యారు.
శ్రీధర్రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో అన్ని కార్పొరేషన్లలో సబ్ప్లాన్ నిధులతో పనులు పూర్తిచేయడం కూడా జరుగుతుందన్నారు. కానీ, నెల్లూరులో ఇంతవరకు అతీగతీ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలోనే కమిషనర్ను కలిసి టెండర్లు వెంటనే పిలవాలని కోరామని, ఆయన వారంరోజుల్లో పిలుస్తామని చెప్పారన్నారు. 25 రోజులు గడుస్తున్నా టెండర్లు పిలవకపోవడం దారుణమన్నారు. ఇందుకు సంబంధించి ఈనెల 28, 29 తేదీల్లో అనిల్ దీక్ష చేస్తున్నట్లు తెలిపారు. టెండర్లు పిలకపోతే కార్పొరేషన్ కార్యాలయంలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని కోటంరెడ్డి హెచ్చరించారు.
నాయకులు, పోలీసుల మధ్య తోపులాట
కార్యాలయంలో కమిషనర్ను కలిసేందుకు వైయస్సార్సీపీ ఎమ్మెల్యేలు, నాయకులు లోనికి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో కొంతసేపు పోలీసులకు, నాయకులకు మధ్య తోపులాట జరిగింది. ఈ నేపథ్యంలో కమిషనర్ వెంకటేశ్వర్లు కార్యాలయం బయటకు వచ్చి ఎమ్మెల్యేలతో మాట్లాడారు. వారం రోజుల్లో టెండర్లు తప్పనిసరిగా పిలుస్తామని చెప్పారు. ఎమ్మెల్యేలు కమిషనర్తో మాట్లాడుతూ వారంలో టెండర్లు పిలవకపోతే మీరు బాధ్యత వహిస్తారా? అని ప్రశ్నించారు. దీనికి కమిషనర్ స్పందిస్తూ వారంలో టెండర్లు పిలవకపోతే మీరు చేపట్టే దీక్షలో తాను కూడా కూర్చుంటానని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైయస్సార్సీపీ కార్పొరేషన్ ఫ్లోర్లీడర్ పోలుబోయిన రూప్కుమార్యాదవ్, విప్ బొబ్బల శ్రీనివాసులుయాదవ్ తదితరులు పాల్గొన్నారు
27 September 2016
ఫుల్ క్లారిటీ... ఫుల్ జోష్
- ప్రవాసాంధ్రులతో వైయస్ జగన్
- బాబు మోసాలను ఎండగట్టిన జననేత
- పలు ఆసక్తికర విషయాలు వెల్లడి
ఏపీ ప్రతిపక్ష నాయకుడు ఆదివారం రాత్రి ప్రవాసాంధ్రులతో నిర్వహించిన ‘ముఖామఖి’ కార్యక్రమంలో పలు ఆసక్తికరమైన అంశాలు వెల్లడించారు. ముఖ్యమంత్రి రాష్ట్రాన్నికి చేస్తున్న అన్యాయం, మోసాలను ఎండగట్టారు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి వలనే మొదటిసారి మంత్రి అయ్యాడని వెల్లడించారు. ఏపీకి హోదా రాకపోవడానికి గల కారణాలు, రాజధాని నిర్మాణంలో జరుగుతున్న అవినీతి, ఇన్సైడర్ ట్రెడింగ్, స్విస్ చాలెంజ్ మోసం, పట్టిసీమ, పోలవరం ప్రాజెక్ట్ వంటి అంశాలపై వైయస్ జగన్ ఫుల్ క్లారిటీ ఇచ్చారు. ప్రత్యేక హోదాపై ప్రవాసాంధ్రులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన వివరణాత్మకంగా సమాధానాలిచ్చారు. పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి నిర్వహించిన లైవ్ ఇంటరాక్షన్ కార్యక్రమంతో తాను చేస్తున్న, చేయబోతున్న కార్యక్రమాలపై పూర్తి అవగాహనతో ఉన్నట్లు కనిపించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా సాధన కోసం అవసరమైతే తమ పార్టీ పార్లమెంట్ సభ్యులతో రాజీనామా చేయించడానికి కూడా సిద్ధంగా ఉన్నానని కుండబద్దలు కొట్టారు.
తెలంగాణ వచ్చిందిగా... ప్రత్యేక హోదా రాదా?
అసాధ్యమనుకున్న తెలంగాణ వచ్చినపుడు.. పార్లమెంట్లో ప్రధాని హామీ ఇచ్చిన ప్రత్యేకహోదాను సాధించుకోవడం కష్టమేమీ కాదన్నారు. అబద్ధాలు చెప్పే రాజకీయ నాయకులను నిలదీసే పరిస్థితి రావాలనీ, అప్పుడే వ్యవస్థలో మార్పు వస్తుందన్నారు. ప్రస్తుత రాజకీయ వ్యవస్థ దారుణ పరిస్థితిలో ఉందని జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదాపై సీఎం చంద్రబాబు పూర్తి స్థాయిలో రాజీపడిపోయారని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామన్న వారికే కేంద్రంలో మా మద్ధతు ఉంటుందన్నారు. వైయస్సార్సీపీపై ఆధారపడే ప్రభుత్వమే కేంద్రంలో వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
ప్రత్యేకంగా ఏమీ ఇవ్వలేదు.. దీన్నీ ప్యాకేజీ అంటారా?
విభజన చట్టం ద్వారా హక్కుగా సంక్రమించిన వాటి కన్నా ఎక్కువగా చేస్తే దాన్ని ప్యాకేజీ అంటారని ప్రతిపక్ష నేత వివరించారు. కానీ విభజన చట్టంలో ఇచ్చిన హామీలకే కోతలు వేసి ఇప్పటికే అమలతున్న వాటినే తిరిగి ప్రకటిస్తే అది ఎలా ప్రత్యేక ప్యాకేజీ అవుతుందని ప్రశ్నించారు. అరుణ్ జైట్లీ సెప్టెంబరు 7న ప్రకటన చేసే సమయంలోనే ప్రత్యేక హోదా ఇవ్వమని తేల్చిచెప్పారన్నారు. 14వ ఆర్థిక సంఘం నిబంధనలు ప్రత్యేక హోదా ఇవ్వడానికి అడ్డంకిగా మారాయని అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. ప్రత్యేక హోదా ఇవ్వకూడదని 14వ ఆర్థిక సంఘం చెప్పిన దాఖలాలు ఎక్కడా లేవని సవివరంగా చెప్పారు. జైట్లీ ప్రకటనలో రాష్ట్రాన్ని నిలువునా మోసం చేసినా.. సీఎం చంద్రబాబు స్వాగతించారు కాబట్టే బాబుకు ఇంగ్లీషు రాదని తాను ఎద్దేవా చేశానని కొమ్మినేని అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
ఆ రోజే మా ఎంపీలతో రాజీనామా చేయించేవాడిని..!
అరుణ్జెట్లీ ప్రకటన చేసిన రోజే మా పార్టీ ఎంపీలతో రాజీనామా చేయిద్దామనిపించింది. అలా చేస్తే సభలోకి వెళ్లి మాట్లాడే వారే లేకుండా పోయే పరిస్థితి. వాస్తవానికి కొట్లాడుతున్నది ఎవరన్నా ఉంటే వైఎస్సార్సీపీ ఎంపీలే. అలాంటి వాళ్లు రాజీనామా చేస్తే కొట్లాడే పరిస్థితి కూడా ఉండదు. ఏదేమైనా దశలవారీగా పోరాడుతూనే ఉంటాం. సరైన సమయంలో రాజీనామా బ్రహ్మాస్రాన్ని ఉపయోగిస్తాం. ఉద్యమాన్ని మరింత ముందుకు ఎలా తీసుకువెళ్లాలనే దానిపై మేధావులతో చర్చించాలని వైఎస్ జగన్ చెప్పుకొచ్చారు.
ఆ ఇద్దరూ మాట మార్చారు
ఎన్నికలకు ముందు ప్రత్యేక హోదా రాష్ట్రానికి సంజీవని అని చెప్పిన వెంకయ్య నాయుడు, చంద్రబాబు నాయుడు ఇద్దరూ అధికారంలోకి వచ్చాక మాట మార్చారని దుయ్యబట్టారు. పైగా సెప్టెంబర్ 7న అర్ధరాత్రి అరుణ్జైట్లీ చేసిన ప్రకటనను స్వాగతించిన చంద్రబాబు 5 కోట్ల ఆంధ్రులను నిలువునా మోసం చేశారనన్నారు. ప్రత్యేక హోదా సంబంధించి పలు సందర్భాల్లో వెంకయ్య, బాబు మాట్లాడిన మాటలను గతవారం ఏలూరులో జరిగిన ‘యువభేరి’లో వీడియోలను యువత సమక్షంలో కూడా ప్రదర్శించిన అంశాన్ని గుర్తుచేశారు. ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న మాకు కనీసం మద్దతు ప్రకటించకపోగా అభివృద్ధి నిరోధకులమని దుష్ప్రచారం చూస్తున్నారని మండిపడ్డారు. ఆనాడు ప్రత్యేక హోదా సంజీవని అయినప్పుడు ఇప్పుడు ప్యాకేజీనే ఎలా గొప్పదవుతుందో ఆ నాయుళ్లిద్దరూ ప్రజలకు వివరించాలన్నారు. ఓవైపు ప్రత్యేక హోదా రాలేదని ప్రజలు ప్రభుత్వంపై కోపంతో ఉంటే సన్మానాలు చేయించుకోవడం ఏంటని ప్రశ్నించారు. చంద్రబాదు తన వ్యక్తిగత స్వార్థ కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టుపెట్టారని విమర్శించారు. రాష్ట్రాని అడ్డగోలుగా విభజించిన కాంగ్రెస్కు బుద్ధిచెప్పిన ప్రజలు ఇప్పుడు మోసం చేస్తున్న టీడీపీ, బీజేపీలకు కూడా బుద్ధిచెప్పే రోజు తొందర్లోనే రాబోతుందని పేర్కొన్నారు.
పవన్ కల్యాణ్ను లైన్లో పెట్టుకున్నా లాభంలేదు
ప్రత్యేక హోదా పేరుతో ఒకసారి మోసం చేసిన ప్రజలను మేనేజ్ చేయాలంటే కుదరదని వైయస్ జగన్ అన్నారు. ప్యాకేజీని స్వాగతిస్తున్నామని ఒప్పుకుని ప్రజల నుంచి ఆగ్రహావేశాలు వ్యక్తం కావడంతో టీడీపీ వారిని మేనేజ్ చేయాలని చూస్తుందని ఆరోపించారు. ప్రజలకు ఒకసారి అన్యాయం జరిగితే ఎప్పటికీ విశ్వసించరని అన్నారు. వారి ఆవేశాలు చల్లార్చడానికి పవన్ కల్యాణ్ ను లైన్లో పెట్టుకున్నా, మరెవరినైనా లైన్లో పెట్టుకున్నా ఐదు కోట్లమంది తెలుగు ప్రజలను మాత్రం లైనులో పెట్టడం సాధ్యం కాదని తెలిపారు.
ప్రశ్నిస్తే అభివృద్ధి నిరోధకులమా..?
అవినీతిని ప్రశ్నిస్తే అడ్డుతగులుతున్నామంటారు. రాజధాని భూదందా, ఇన్సైడర్ ట్రేడింగ్, ఓటుకు కోట్లు, స్విస్ చాలెంజ్ ఇలా రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిని ప్రశ్నించడం తప్పా అని నిలదీశారు. రాజధాని నిర్మాణం సందర్భంగా వేల కోట్ల రూపాయలు విలువ చేసే భూములను తన బినామీలకు, దొంగ కంపెనీలకు కేటాయించి ప్రజాధనాన్ని దోచుకునేందుకు చంద్రబాబు పథక రచన చేశాడని అన్నారు. వాటిని అడ్డుకుంటున్నామన్న అక్కసుతోనే మాపై అభివృద్ధి నిరోధకులమనే ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధవలేశ్వరం నుంచి రోజుకు 3లక్షల నుంచి నాలుగు లక్షల క్యూసెక్కుల నీరు, ప్రకాశం బ్యారేజీ నుంచి సుమారు 1.30 లక్షల క్యూసెక్కుల నీరు సముంద్రంలో కలుస్తుందన్నారు. మేము ఆరోజు చెప్పింది కూడా అదే కదా..! పట్టిసీమ అంటూ గోదావరి, ప్రకాశం బ్యారేజీ నుంచి నీరు తెచ్చి సముద్రంలోకి కలుపుతున్నారు. గోదావరి, కృష్ణా నదులకు ఇంచుమించుగా ఒకేసారి వరదలు వస్తాయి. అలాంటప్పుడు ఆ నీటిని ఒక స్టోరేజీ నిర్మించి భవిష్యత్తులో అవసరం వచ్చినప్పుడు వాడుకోవచ్చని సూచించారు. పోలవరం అన్నది ఆ స్టోరేజీయే. కానీ పోలవరం కట్టడు. పట్టిసీమ అంటాడు. కాలువను నది అంటాడు.. చంద్రబాబుకు మెగలేమేనియో వ్యాధి సోకిందేమోనని అనుమానంగా ఉందని ఎద్దేవా చేశారు.
ఉప ఎన్నికలకు సిద్ధమా బాబూ..?
అనేక ప్రలోభాలు పెట్టి వైయస్సార్ సీపీ టిక్కెట్ మీద గెలిచి టీడీపీలో చేరిన 20మంది ఎమ్మెల్యేల చేత రాజీనా చేయించి ఉప ఎన్నికలకు వెళ్లేందుకు చంద్రబాబు సిద్ధమా అని జగన్ సవాల్ విసిరారు. ఉప ఎన్నికల ఫలితాలను రిఫరెండంగా తీసుకునేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. బాబు సిద్ధంగా ఉన్నారా అని ప్రశ్నించారు. విలువలతో కూడిన రాజకీయాలు చేయాలి. ఎంత ఎదిగినా ఒదిగి ఉండం నేర్చుకోవాలి. ప్రతిపక్షమే లేకుండా చేయాలనుకోవడం.., మా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి రాజకీయాలు చేయాలనుకోవడం మూర్ఖత్వమవుతుందని గట్టిగానే మందలించారు. తప్పులు చేస్తున్నప్పుడు ప్రశ్నిస్తారు. వాటిని స్వాగతించాలి. తప్పులను దిద్దుకోవాలి. అంతేకాని అసహనంతో ఊగిపోవడం సరికాదని ముఖ్యమంత్రికి హితవు పలికారు.
స్వార్థం కోసం వ్యక్తిత్వాన్ని అమ్ముకోను
తమ విలువైన సమయాన్ని వెచ్చించి తాను నిర్వహిస్తున్న ముఖాముఖి కార్యక్రమానికి హాజరైన ప్రవాసాంధ్రులందరికీ ముందుగా వైయస్ జగన్ కృతజ్ఙతలు తెలిపారు. అనంతరం కార్యక్రమాన్ని ప్రారంభించిన జగన్ చాలా ఉత్సాహంగా, ధీమాగా కనిపించారు. హోదా కోసం పోరాడుతున్నా.. మీ అందరి మద్దతు కావాలి అని వారిని అడిగారు. ఇంకా ఆయన ఏమన్నారంటే...‘ ఒకటి మాత్రం చెప్పగలను. మనస్ఫూర్తిగా పోరాడుతా. స్వార్థం, స్వప్రయోజనాల కోసం నా క్యారెక్టర్ను ఎప్పుడూ అమ్ముకోలేదు.. ఎన్ని కష్టాలొచ్చినా, నష్టాలొచ్చినా నా స్వార్థం కోసం చూసుకోను. నా క్యారెక్టర్ను అమ్ముకోను. దేనికోసమో రాజీ పడే ప్రసక్తే లేదు. పోరాడితే ప్రత్యేక హోదా తప్పకుండా వస్తుందని చెప్పగలను. మీ అందరి సహకారం నాకు కావాలి. ఇప్పటికే రెండున్నరేళ్లుగా పోరాడుతూనే ఉన్నాం.. మరో రెండున్నరేళ్లు కష్టపడుదాం..’ అని ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు ముఖాముఖి ద్వారా జగన్ పిలుపునిచ్చారు
చంద్రబాబుకు మెగలోమేనియా వ్యాధి ఉందేమో
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రోజుకోమాట... సందర్భానికోరకంగా మట్లాడటం చూస్తుంటే ఆయనకు అల్జీమర్సో, మెగలోమేనియా వ్యాధి ఉన్నట్టుగా అనుమానం వస్తోందన్నారు. ప్రపంచంలో సెల్ ఫోన్ తానే కనిపెట్టానని ప్రజల చెవుల్లో కాలీఫ్లవర్లు పెడుతున్నారని ఫైర్ అయ్యారు. పీహెచ్డీ చేశానని, షికాగో యూనివర్సిటీ తనకు గౌరవ డాక్టరేట్ కూడా ఇవ్వడానికి ముందుకు వచ్చిందని చెబుతున్నారని, సత్య నాదెళ్లను మైక్రోసాఫ్ట్ సీఈఓగా తానే చేశానని అంటాడు. చివరకు రోజుకు 24 గంటలుంటే విద్యుత్తును రోజుకు 27 గంటలు ఇచ్చానంటాడు. నమ్మేవాళ్లుంటే చంద్రబాబు ఎన్ని అబద్ధాలైనా చెబుతాడని జగన్ దుయ్యబట్టారు. ఏదీ ఏమైనా హోదా సాధనలో భాగంగా వైయస్ జగన్ ప్రవాసాంధ్రుల మద్దతు కూడగట్టడం ఉద్యమానికి మరింత తోడ్పాటునందిస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సోషల్ మీడియాలో ఎన్ఆర్ఐలతో వైయస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్ వైరల్గా మారింది. జగన్ వ్యాఖ్యలపైనే నెటిజన్లు చర్చించుకుంటున్నారు.
Subscribe to:
Posts (Atom)