హైదరాబాద్ః హెచ్ సీ యూ లో ఆత్మహత్య చేసుకున్న దళిత విద్యార్థి రోహిత్ కుటుంబసభ్యులను ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పరామర్శించారు. యూనివర్సిటీలో జరిగిన ఘటనపై వైఎస్ జగన్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. రోహిత్ తల్లిదండ్రులను వైఎస్ జగన్ పరామర్శించి ఓదార్చారు. ఆత్మహత్యకు దారి తీసిన పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు .
యువ పరిశోధకుడైన రోహిత్ ఆత్మహత్యకు దారితీసిన దురదృష్టకర పరిణామాలను వైఎస్ జగన్ తీవ్రంగా పరిగణించారు. రోహిత్ ఆత్మహత్యకు కారకులైన వారు.... ఎంతటి వారైనా, ఏ స్థాయిలో ఉన్న వారైనా కఠినంగా శిక్షించాలని వైఎస్ జగన్మోహన్రెడ్డి డిమాండ్ చేశారు. దుండగులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టవద్దని ప్రభుత్వానికి సూచించారు. రోహిత్ మృతి పట్ల వైఎస్ జగన్ తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ..అతని కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
హెచ్సీయూ వీసీ అప్పారావు ఐదుగురు విద్యార్థులను సస్సెండ్ చేశారు. వీరిలో గుంటూరుకు చెందిన వేముల రోహిత్ అనే పీహెచ్డీ విద్యార్థి కలత చెంది ఆదివారం ఆత్మహత్య చేసుకున్నారు.
No comments:
Post a Comment