13 January 2016

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు వైఎస్సార్సీపీ దూరం

గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేయరాదని తెలంగాణ వైఎస్సార్సీపీ నిర్ణయించింది. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, మద్దతుదారులతో సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసుకోవడంపై వైఎస్సార్సీపీ దృష్టిసారించింది. గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్, టీడీపీ-బీజేపీ, కాంగ్రెస్ లు డబ్బులతో పీఠం నెగ్గాలని చూస్తున్నాయి. అయితే వైఎస్సార్సీపీ అందుకు పూర్తిగా వ్యతిరేకం. ప్రజల పక్షాన నిలిచి, వారికి అవసరమైన సమయంలో అండగా నిలిచేందుకు వైఎస్సార్సీపీ ఎప్పుడూ వెనకాడదని పార్టీ ప్రకటించింది. ఈ మేరకు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు.




ఏపీలో అధికారంలో ఉండి అవినీతి వ్యవహారాల్లో లెక్కకు మించి డబ్బు సంపాదిస్తోన్న టీడీపీ, కేంద్రంలో అధికారాన్ని చూసుకుని బీజేపీ, పొరుగు రాష్ట్రం కర్ణాటక ప్రభుత్వ మద్ధతుతో కాంగ్రెస్ పార్టీ, ఇక తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అందుకోసం ఎంతైనా డబ్బు ఖర్చు చేసేందుకు ఆ పార్టీలు వెనుకాడటం లేదన్నారు.

ఆ పార్టీలు ఈ పోటీలో డబ్బుతోనే నెగ్గాలని చూస్తున్నాయని ఆరోపించారు. మరోవైపు పార్టీని బలోపేతం చేయాలని, అప్పటి వరకు వేచి చూడాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. ఈ కారణాలతోనే ఫిబ్రవరి 2న జరగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయరాదని నిర్ణయించుకున్నట్లు పొంగులేటి వివరించారు. 2009లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పోటీ చేయలేదన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ప్రజల పక్షాన నిలిచి, వారికి అవసరమైనప్పుడు అండగా ఉండేందుకు వైఎస్ఆర్ సీపీ క్షణం కూడా వెనుకాడదన్నారు.

1 comment:

  1. I think YCP should have contested, would have given a fight in some areas

    ReplyDelete