29 January 2016

టాప్ టెన్ పవర్ ఫుల్ కామెంట్లు..!

కాకినాడ: ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు ఆడుతున్న నాటకాల్ని ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ స్పష్టంగా బయట పెట్టారు. యువ భేరి కార్యక్రమంలో వైఎస్ జగన్ ప్రసంగంలో టాప్ టెన్ కామెంట్లు ఇప్పుడు చూద్దాం.

1. ప్రత్యేక హోదా వస్తే చంద్రబాబు మలేషియా, సింగపూర్ వెళ్లనక్కర లేదు. ఢిల్లీ వెళ్లి హోదా మీద ఒత్తిడి తెస్తే చాలు.
2. ప్రత్యేక హోదా వస్తే ప్రతీ జిల్లా ఒక హైదరాబాద్ అవుతుంది. హోదా కోసం మన ప్రభుత్వ పెద్దలు, మంత్రులు పోరాడటం లేదు.
3. ప్రత్యేక హోదా కోసం ఉద్యమిస్తే రోజుకో అబద్దం చెబుతున్నారు. ఇటువంటి అబద్దాల్ని ఒక కంట కనిపెడుతూ ఉండాలి.
4. మేం ఈ తరం వాళ్లం. చదువుకొన్న వాళ్లం. తెలియని విషయాలు తెలుసుకొంటాం. తెలుసుకొని నిలదీస్తాం అని చెబుతాం.
5. ఆరు నెలల పాటు ప్రణాళికా మండలి దగ్గర మన ఫైల్ పడి ఉంటే చంద్రబాబు పట్టించుకొన్న పాపాన పోలేదు.
6. ఆంధ్ర రాష్ట్రంలో అన్నీ లంచాలే. అడుగడుగునా లంచాలు గుంజుతున్నారు.
7. బొగ్గు నుంచి మద్యం దాకా.. షాపుల నుంచి జీవో 22 దాకా అన్నీ కమీషన్లే
8. చంద్రబాబుని నిలదీసే సమయం ఆసన్నమైంది.
9. బాబు మెడలు వంచైనా ప్రత్యేక హోదా సాధించుకొందాం.
10. అంతా కలిసికట్టుగా పోరాడుదాం . గట్టిగా ఒత్తిడి తెద్దాం.

No comments:

Post a Comment