25 January 2016

పీవీ సింధుకు వైఎస్ జగన్ అభినందనలు

హైదరాబాద్‌: తెలుగు తేజం పీవీ సింధుని ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ అభినందించారు మలేసియా ఓపెన్‌ బ్యాడ్మింటన్ టైటిల్‌ను గెలుచుకొన్నందుకు గాను ఆమెకు అభినందనలు తెలియచేశారు.   బ్యాడ్మింటన్‌ ఆటలో పీవీ సింధు మరిన్ని విజయాలు సాధించాలని, మున్ముందు మరిన్ని టోర్నమెంట్లలో విజయాలు సొంతం చేసుకోవాలని ఆకాంక్షించారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. 


 భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు ఆదివారం జరిగిన తుదిపోరులో 21-15, 21-9 తేడాతో క్రిస్టీ గిల్మౌర్(స్కాట్లాండ్)ను ఓడించి.. మలేషియా ఓపెన్ గ్రాండ్ ప్రి టైటిల్ ను కైవసం చేసుకుంది. గతంలో 2013 లో కూడా సింధు ఈ టైటిల్‌ను గెలిచింది.

No comments:

Post a Comment