3 February 2016

విద్యార్థులతో వైఎస్ జగన్ ముఖాముఖి

శ్రీకాకుళంః పట్టణంలోని టౌన్ హాలులో నిర్వహించిన యువభేరి సదస్సు  విజయభేరిలా మారుమోగింది. జైజగన్ నినాదాలతో యువభేరి ప్రాంగణం హోరెత్తింది.  ప్రతిపక్ష నాయకుడు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రత్యేకహోదా సహా అనేక అంశాలపై విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. చంద్రబాబుపై ఒత్తిడి తీసుకొచ్చి అందరం ఒక్కటై ప్రత్యేకహోదాను సాధించుకుందామని విద్యార్థులు,యువతకు పిలుపునిచ్చారు. ఈసందర్భంగా జననేత వారితో నిర్వహించిన ముఖాముఖి ఇలా సాగింది. 

యోగేశ్వరరావు..
పులివెందుల పులిబిడ్డ వైఎస్ జగన్,  ఆచార్యులు, పెద్దలకు నమస్కారం. ప్రత్యేకహోదా రాకపోతే రాష్ట్రం అమ్ముడుపోతోంది. చంద్రబాబుది ఏం పోయింది సార్.  రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి సింగపూర్ వెళ్లిపోతాడు. 

వైఎస్ జగన్..
రాష్ట్రాన్ని అమ్మేసి సింగపూర్ పోతున్నాడని మాకు డౌట్ ఉంది. సింగపూర్ లో ఇళ్లు కట్టుకున్నాడని ఎవరో చెప్పారు. అందుకే రాష్ట్రాన్ని పట్టించుకోకుండా అబద్ధాలు ఆడుతున్నాడు.

హిమలక్ష్మి..
వైఎస్సార్ హయంలో చాలామంది పాజిటివ్ రిజల్ట్స్ తీసుకున్నారు. 2 సంవత్సరాలైంది బాబు వచ్చి.  ఆయన మాకు స్మార్ట్ సిటీస్ ఇవ్వనవసరం లేదు. విద్యార్థుల్లో ఉన్న స్మార్ట్ ట్యాలెంట్ గుర్తిస్తే చాలు.  ఆయనేం చేయడని మాకు అర్థమైంది. మీకు మా సపోర్ట్ ఉంటుంది. మీ నాయకత్వంలో హోదా కోసం పోరాడుతాం జగన్ అన్న. 

వైఎస్ జగన్
ఒకరికి ఒకరం తోడుగా కలిసికట్టుగా హోదాను సాధించుకుందాం తల్లి.

దేవి...
రుణమాఫీ ఇస్తానన్నాడు. మాకు డ్వాక్రా రుణాలు మాఫీ కాలేదు. చదువుకు ఇబ్బంది అవుతోంది. 

వైఎస్ జగన్..
లోన్ మాఫీకాలేదు. అమ్మ ఇబ్బందులు పడుతోంది. రుణాలు మాఫీ చేయకుండానే అన్నీ చేశానంటూ అబద్ధాలు ఆడుతున్నాడు. చంద్రబాబుకు నీ ఆవేదనతోనైనా  జ్ఞానోదయం అవుతుందని ఆశిస్తున్నాం. ఈఅంశంపై కూడా పెద్ద ధర్నాలు చేద్దాం తల్లి. 
సౌజన్య.
మేకిన్ ఇండియా, మేకిన్ ఆంధ్రా అన్నారు. మన ఆంధ్రాలో ఇంజినీర్లు లేరా. సింగపూర్ లోనే ఉంటారా. చంద్రబాబు డాక్టర్లను కూడా అక్కడినుంచే తీసుకొస్తారా సార్.

వైఎస్ జగన్..
మన దేశంలో పుట్టిన ఇంజినీర్లు ఎంతోమంది పెద్ద పెద్ద ప్రాజెక్ట్ లు కట్టారు. బాబు ఇళ్లు కూడా ఇక్కడి వాళ్లే డిజైన్ చేశారు. ఆయన సింగపూర్ నుంచి ఎందుకు తెచ్చుకుంటున్నాడంటే ఎలాంటి టెండర్లు లేకుండానే లంచాల కోసం అక్కడి కంపెనీలకు భూములిస్తున్నాడు. అందుకోసం సింగపూర్ జపం చేస్తున్నాడు. 
గాయత్రి..
స్కాలర్ షిప్, ఫీజు రీయింబర్స్ మెంట్ ఇవ్వడం లేదు సార్. 

వైఎస్ జగన్..
చంద్రబాబు వచ్చాక ఫీజు రీయింబర్స్ మెంట్ ను అటకెక్కించాడు. ఈసంవత్సరం సంగతి దేవుడెరుగు. పోయిన సంవత్సరం కూడా పెండింగ్ లో పెట్టాడు. ఇచ్చే వాటిలో కూడా సగానికి తగ్గించే కుట్ర చేస్తున్నాడు. బాబుకు  ఉసురు తగులుతుంది. ఖచ్చితంగా ఒత్తిడి తెద్దాం. గట్టిగా పోరాడుదాం. నేను ఒక్కటే హామీ ఇస్తున్నా. మనం అధికారంలోకి వచ్చాక ఫీజు రీయింబర్స్ మెంట్ ను రెవల్యూషనైజ్ చేస్తానని జననేత చెప్పారు.

పవిత్ర...(బీఎస్సీ సెకండ్ ఇయర్)
ఇంటికో ఉద్యోగమంటే నమ్మి ఓట్లేశాం. ఒక్క నోటిఫికేషన్ లేదు. ఇలాంటి నైతిక విలువలు లేని వ్యక్తికి పాలించే అర్హత ఎక్కడ ఉంది. 

వైఎస్ జగన్..
ఇంటికో ఉద్యోగం, ఉద్యోగం లేని వారికి నెలకు రూ. 2వేలు నిరుద్యోగ భృతి అన్నాడు. రాష్ట్రంలో కోటి 75 లక్షల మంది బాబు మాటలు నమ్మి ఓట్లేసి బాధపడుతున్నారు. వీళ్లంతా నిలదీస్తున్నారు. ఉద్యగమన్నా, నిరుద్యోగభృతి అన్నా ఇవ్వమని అడిగితే...సిగ్గులేకుండా నేనెప్పుడు చెప్పానని చంద్రబాబు మాట్లాడుతున్నాడు. ఇలాంటి వాళ్లకు పాలించే అర్హత లేదు. పలానా వాడు మా ముఖ్యమంత్రి అని చెప్పుకోవడానికి సిగ్గుపడే పరిస్థితి తెచ్చాడు. మీ మాటతోనైనా రాజీనామా చేస్తాడేమో చూద్దాం. 

సందీప్..
ఇంతవరకు ఒక్క నోటిఫికేషన్ లేదు. బాబు వచ్చాడు జాబులు మాత్రం పోతున్నాయి. మీవెన్నంటి పోరాడుతాం జగన్ అన్న. 

వైఎస్ జగన్..
చంద్రబాబు అన్యాయమైన మైండ్ సెట్ లో ఉన్నాడు. రాష్ట్రం విడగొట్టే నాటికి లక్షా 42 వేల 828 ఉద్యోగాలున్నాయని లెక్కగట్టారు. బాబుకు సిగ్గుండాలి.  కచ్చితంగా ఒత్తిడి తెద్దాం.  మనమంతా హోదా వదిలేశామంటే ఎవరూ ఇవ్వరు. ఎవరూ పట్టించుకోరు. ఇవ్వాలన్న ఆలోచన కేంద్ర, రాష్ట్రాలకు ఉండదు. హోదా ఎవరిస్తారో వాళ్లనే ప్రధానమంత్రి పదవిలో కూర్చోబెడదాం.

గురుమూర్తి
ప్రత్యేకహోదాపై యూనివర్సిటీల్లో చర్చలు పెట్టుకునేందుకు అనుమతి ఇవ్వడం లేదు. అదే చంద్రబాబు తన కొడుకు లోకేష్ తో యూనివర్సిటీల్లో బర్త్ డే కేక్ కట్ చేయిస్తున్నాడు. 

వైఎస్ జగన్..
 ప్రత్యేకహోదా  తీసుకొచ్చి పిల్లల జీవితాలు చిరునవ్వులతో చూడాలి. అవగాహన కలిగించాలి. ప్రతి యూనివర్సిటీకి పోయి అవగాహన కల్పించాలి. కానీ చంద్రబాబు హోదాకు అడ్డుపడుతున్నాడు. యూనివర్సిటీల్లో కేకులు కట్ చేయిస్తాడు. దానికి వీసీలు కూడా పోతరు. చంద్రబాబు  దిక్కుమాలిన రాజకీయాలు విద్యార్థిలోకం చూస్తోంది. బంగాళాఖాతంలో కలిపేస్తారు. చంద్రబాబు కులాల మద్య కూడా చిచ్చుపెడుతున్నాడు. ఉసురు తగులుతుంది. 

మౌనిక..
టూరిస్ట్ ప్లేస్ లు ఎందుకు అబివృద్ది చేయం లేదు. పుష్కరాల్లో ఆడవాళ్లు చనిపోయారు. చంద్రబాబు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు.

వైఎస్ జగన్..
ప్రత్యేకహోదా వస్తే ఎన్నోపెట్టుబడులు వస్తాయి. ఉద్యోగఅవకాశాలు పెరుగుతాయి. అభివృద్ధి వాటంతట అదే జరుగుతుంది. చంద్రబాబు పుష్కరాల్లో సినిమా షూటింగ్ కోసం పూజలు చేస్తున్నట్లు కన్పించాలని ...ఘాట్ లో మనుషులను ఆపాడు. దాంతో తొక్కిసలాట జరిగి  29 మంది చనిపోయారు. పుష్కరాల్లో 29 మంది చావుకు కారణమైన చంద్రబాబునే జైల్లో పెట్టాలి. 

చైతన్య..
మీలాంటి ధైర్యవంతులు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి. బాబు ఓడిపోవడమే మా జీవిత లక్ష్యం సార్. 

వైఎస్ జగన్..
తప్పకుండా చైతన్య. థ్యాంక్యూ

సౌమ్య
సార్ మా దగ్గర రైల్వేస్టేషన్, బస్ స్టాపే బాగాలేదు. ఎయిర్ పోర్ట్ తెస్తానని చంద్రబాబు మాట్లాడుతున్నాడు. ముందు ఉన్నవి బాగుచేయమని బాబును అడుగుతున్నాం. 

వైఎస్ జగన్..
ఎయిర్ పోర్ట్ పేరుతో భూములు లాక్కుంటాడు. ప్రైవేటు వాళ్లకు ఇస్తారు. పక్కన్నేఆయన  బినామీలు భూములు కొంటారు. ఎక్కువ రేటుకు అమ్ముకుంటారు. అందరం ఏకమై బాబుపై ఒత్తిడి తీసుకొద్దాం. కలిసికట్టుగా హోదాను సాధించుకుందాం. 

No comments:

Post a Comment