6 February 2016

గ్రేటర్ ఫలితాలు.. ఆంధ్రప్రదేశ్ పై ప్రభావం

గ్రేటర్ లో చతికిలపడిన తెలుగుదేశం
టీడీపీ తో దోస్తీతో వెనుకబడిన బీజేపీ
కాంగ్రెస్ ను నమ్మని ప్రజానీకం

హైదరాబాద్: రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా నిలిచిన హైదరాబాద్ లో గ్రేటర్ ఫలితాలు విడుదల అయ్యాయి. తెలంగాణలో అధికార పక్షం టీ ఆర్ ఎస్ కు పూర్తి స్థాయిలో ఓటరు పట్టం కట్టాడు. దీంతో పాటు రెండో స్థానంలో నిలిచిన ఎమ్ ఐ ఎమ్ లను మినహాయిస్తే మిగిలిన పార్టీలకు రెండు రాష్ట్రాల్లోనూ శాఖలు ఉన్నాయి. ముఖ్యంగా తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్ ఎడతెరగని ప్రచారం చేసినప్పటికీ, షో మాత్రం అట్టర్ ప్లాప్ అయింది.

ఆంధ్రప్రదేశ్ సంబంధీకులమీద టీడీపీ కన్ను
వాస్తవానికి హైదరాబాద్ శివారు ప్రాంతాలైన కూకట్ పల్లి, మియాపూర్, మాదాపూర్, శేరిలింగంపల్లి, సూరారం, మల్కాజ్ గిరి, ఏఎస్ రావు నగర్, వనస్థలిపురం, ఎల్ బీ నగర్ ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ సంబంధీకులే ఎక్కువగా ఉంటారు. ఈ ప్రాంతాల్లో ప్రచారం చేసుకొంటే 30, 40 డివిజన్ల దాకా తమ వైపు తిప్పుకోవచ్చని టీడీపీ స్కెచ్ వేసింది. అందుకే హైదరాబాద్ ను తామే అభివ్రద్ది చేశామని, ఐటీను తామే డెవలప్ చేశామని, ప్రపంచ పటంలో తామే పెట్టామని చంద్రబాబు గొప్పలు చెప్పారు. వాటినే ప్రచారం చేసుకొన్నా కానీ చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ చతికిలపడ్డారు.
 
అబద్దాలే కొంపముంచాయి
హైదరాబాద్  పేరుతో చంద్రబాబు చెబుతున్నవన్నీ అబద్దాలే అని ప్రజలు నెమ్మదిగా గ్రహిస్తున్నారు. మరి ముఖ్యంగా ఆయన కాలంలో ఐటీ  ఏ మాత్రం ఉరకలు వేయలేదని, తర్వాత దివంగత మహానేత వైఎస్సార్ హయంలోనే చక్కటి ప్రగతి కనిపించిందని అర్థం చేసుకొన్నారు. మరో వైపు, ఎన్నికల సమయంలో ఆంధ్రప్రదేశ్ లో అందరికీ రుణమాఫీ చేస్తున్నామని చంద్రబాబు తెగ గొప్పలు చెప్పారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని, దిగువ తరగతి వర్గాలకు ఇళ్లు కట్టిస్తామని నమ్మ బలికారు. తర్వాత  అధికారంలోకి వచ్చాక ఈ హామీలకు తూట్లు పొడిచారు. ముఖ్యంగా హైదరాబాద్ లో ఆధార్ కార్డు ఉన్న వారికి ఎవ్వరికీ రుణమాఫీ చేయకూడదని నిర్ణయాన్ని అమలు చేశారు. ఒక్కటంటే ఒక్క హామీ ను అమలు చేయకపోగా రాష్ట్రాన్ని తెగనమ్మేందుకు ప్రణాళికలు అమలు చేస్తూ పోతున్నారు. దీంతో చంద్రబాబుకి గట్టిగా బుద్ది చెప్పాలని ఆంధ్రప్రదేశ్ సంబంధీకులు తలచారు. అందుకే ఒక్క కేపీహెచ్ బీ మినహా మిగిలిన అన్ని సీట్లలో టీడీపీ పూర్తిగా చతికిల పడింది.

టీడీపీ తో దోస్తీ యే కొంపముంచిందా..!
వాస్తవానికి హైదరాబాద్ లో బీజేపీ కి కాస్తో, కూస్తో క్యాడర్ ఉంది. ముఖ్యంగా ఆర్ ఎస్ ఎస్, వీహెచ్ పీ ని నేరుగా మద్దతిచ్చే అభిమానులు, సహజంగానే బీజేపీని నమ్ముకొన్న కార్యకర్తలు ఉన్నారు. అయితే చంద్రబాబు తో పొత్తులు పెట్టుకొన్నప్పటి నుంచి సహజసిద్దంగా ఉండే క్యాడర్ దూరం అవుతూ వచ్చారు. వీరంతా పూర్తిగా పార్టీకి దూరం అయినట్లు గ్రేటర్ ఎన్నికల ఫలితాలు నిగ్గు తేల్చాయి. తెలుగుదేశం అరాచకాలు తమకు చుట్టుకొన్నాయని కమల నాథులు వాపోతున్నారు.

గ్రేటర్ ఫలితాల సంకేతాలు
గ్రేటర్ ఎన్నికల ఫలితాలు భవిష్యత్ రాజకీయాల్ని సూచిస్తున్నాయని పరిశీలకులు అంటున్నారు. ముఖ్యంగా చంద్రబాబు మోసపూరిత వైఖరి బట్టబయలు అయిందని అంటున్నారు. దీన్ని బట్టి చూస్తే ఆంధ్రప్రదేశ్ సంబంధీకులు హైదరాబాద్ లో ఇచ్చిన తీర్పునే ,, ఏపీ లోనూ ఇవ్వటం ఖాయమన్న మాట వినిపిస్తోంది. చంద్రబాబు కట్టిన అబద్దాల కోటకు పూర్తి స్థాయిలో బీటలు వారుతున్నాయని అర్థం అవుతోంది. 

No comments:

Post a Comment