6 November 2017

నేటి పాదయాత్ర షెడ్యూల్‌


వైయ‌స్ఆర్ జిల్లా:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ఇవాళ ఉద‌యం 9.47 గంట‌ల‌కు ఇడుపుల‌పాయ‌లో ప్రారంభ‌మైంది. మొద‌టి రోజు ఇడుపుల‌పాయ నుంచి మారుతినగర్‌ మీదుగా మధ్యాహ్నం 1 గంటకు భోజన విరామ ప్రాంతానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 3 గంటలకు తిరిగి పాదయాత్ర ప్రారంభించి వీరన్నగట్టుపల్లె కూడలిలో పార్టీ జెండా ఆవిష్కరణ చేస్తారు. అక్కడి నుంచి కుమ్మరాంపల్లె మీదుగా వేంపల్లె శివారులో ఏర్పాటు చేసిన రాత్రి బసకు చేరుకుంటారు. వేంప‌ల్లెలో ఏర్పాటు చేసిన‌ టెంట్‌లోనే వైయ‌స్ జ‌గ‌న్‌ నిద్రపోతారు. మొద‌టి రోజు 8.9 కిలోమీట‌ర్లు సాగుతోంది. వైయ‌స్ఆర్ జిల్లాలో 7 రోజుల పాటు 100 కిలోమీట‌ర్లు పాద‌యాత్ర చేస్తారు. యాత్ర‌లో భాగంగా  ప్రతి రోజు ఉదయం తన కోసం వచ్చిన వారితో పాటు, పార్టీ కార్యకర్తలు, నాయకులను కలుసుకుంటారు. రోజూ ఉదయం 7 కిలో మీటర్లు, సాయంత్రం 7 కిలో మీటర్ల చొప్పున పాదయాత్ర చేసేలా కార్యక్రమం ఖరారు చేశారు. మంగళవారం మధ్యాహ్నానికి పాదయాత్ర కమలాపురం నియోజకవర్గంలోని వీరపునాయునిపల్లె మండలంలోకి ప్రవేశిస్తుంది.

No comments:

Post a Comment