25 November 2017

వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర‌కు విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల మ‌ద్ద‌తు

క‌ర్నూలు:  ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా ప‌త్తికొండ నియోజ‌క‌వ‌ర్గంలో పాద‌యాత్ర చేస్తున్న వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని విద్యుత్ కాంట్రాక్టు కార్మికులు క‌లిశారు. ఈ సంద‌ర్భంగా వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర‌కు సంఘీభావం తెలిపారు. చెరుకుల‌పాడు గ్రామం వ‌ద్ద శ‌నివారం జ‌న‌నేత‌కు క‌లిసిన కాంట్రాక్ట్ కార్మికులు త‌మ స‌మ‌స్య‌లు చెప్పుకున్నారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో త‌మ‌ను రెగ్యుల‌ర్ చేస్తామ‌ని హామీ ఇచ్చిన చంద్ర‌బాబు ఇంత‌వ‌ర‌కు ప‌ట్టించుకోవ‌డం లేద‌ని వాపోయారు. వీరి స‌మ‌స్య‌లు విన్న వైయస్ జ‌గ‌న్ సానుకూలంగా స్పందించారు. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే న్యాయం చేస్తామ‌ని హామీ ఇచ్చారు. వైయ‌స్ జ‌గ‌న్ హామీతో విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు హ‌ర్షం వ్య‌క్తం చేశారు. 

No comments:

Post a Comment