ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి
అమరావతి: రాజధాని నిర్మాణంపై ఈ రోజు ఎన్జీటి కోర్టు ఇచ్చిన తీర్పు ముఖ్యమంత్రి చంద్రబాబు కు చెంపపెట్టు అని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు . నదీ పరిరక్షణను, హక్కులను కాపాడాల్సిన ముఖ్యమంత్రే కృష్ణా నది కరకట్టపై అక్రమ నిర్మాణంలో నివాసం ఉండటం సిగ్గుచేటు అన్నారు. ఎన్జీటి తీర్పు నేపథ్యంలో నైనా ముఖ్యమంత్రి తన అక్రమ నివాసాన్ని తక్షణమే ఖాళీ చేయాలని డిమాండ్ చేశారు. కృష్ణా నదీ పరిరక్షణకు సీఎం నివాసం నుంచే ప్రక్షాళన ప్రారంభించాలని కోరారు. కృష్ణా నదిని అక్కమార్కుల నుంచి, ఇసుక మాఫియా నుండి, టీడీపీ నేతల కబంధ హస్తాల నుంచి కాపాడాలని, అలానే కొండవీడు వాగును తమకు అనుకూలంగా మళ్ళించాలనే టీడీపీ కుట్రలకు ఎన్జీటీ బ్రేక్ వేసిందని ఆర్కే పేర్కొన్నారు.
No comments:
Post a Comment