9 November 2017

14నుంచి కర్నూలు జిల్లాలో ప్రజాసంకల్పయాత్ర

ఆళ్లగడ్డ: వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర ఈనెల 14 న కర్నూలుకు చేరుకుంటుందని ప్రోగ్రాం కో–ఆర్డినేటర్‌ తలశిల రఘురాం తెలిపారు. బుధవారం రఘురాంతో కలిసి  వైయస్సార్‌సీపీ ఆళ్లగడ్డ నియోజకవర్గ  ఇన్‌చార్జ్‌ గంగుల బిజేంద్రారెడ్డి చాగలమర్రి మండలంలో పాదయాత్ర రూట్‌ను పరిశీలించారు. 14వ తేదీన కర్నూలు జిల్లాలోని చాగలమర్రి నుంచి  శెట్టివీడు, గొడిగనూరు, ముత్యాలపాడు, చక్రవర్తుల పల్లెమీదుగా ఆళ్లగడ్డ మండలంలోని ఆర్‌.కృష్ణాపురం గ్రామానికి జగన్‌మోహన్‌ రెడ్డి పాదయాత్ర ద్వారా   చేరుకుంటారని, అక్కడే రాత్రి బస ఉంటుందని తెలిపారు.

అనంతరం అక్కడి నుంచి కోటకందుకూరు మీదుగా పాలసాగరం నుంచి ఆళ్లగడ్డ చేరుకుంటారని తెలిపారు.  గంగుల బిజేంద్రారెడ్డి మాట్లాడుతూ.. తమ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి  ఘన స్వాగతం పలకనున్నట్లు  చెప్పారు.  ప్రజాసంకల్ప యాత్రను విజయవంతం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.  కార్యక్రమంలో పార్టీ నాయకులు లేళ్ల అప్పిరెడ్డి, సుధాకర్‌బాబు, భరత్‌కుమార్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment