14 November 2017

ఎవరు పట్టించుకోవడం లేదు:

- నరసింహా, ముత్యాల పాడు
బతకడానికి ఏ ఆధారం లేదు. అమ్మ నాన్నలు లేడు. పింఛన్‌ ఇవ్వమని చాగలమ్రరి కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాను. ఎవరు పట్టించుకోవడం లేదు. ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదు.

72 గంటల్లోనే సంక్షేమ పథకాలు అందిస్తా: వైయస్‌ జగన్‌ 
 ప్రభుత్వ పథకాలు ఏమీ కావాలన్నా జన్మభూమి కమిటీలకు లంచాలు ఇస్తేనే కానీ పలకని పరిస్థితి నెలకొంది. నరసింహ మాదిరిగానే చాలా మంది కూడా పింఛన్‌ అందడం లేదు. రేపు మన ప్రభుత్వం వచ్చిన తరువాత మీ గ్రామంలోనే గ్రామ సచివాలయం ఇక్కడే తెరచి, మీ గ్రామానికి  చెందిన 10 మందికి గవర్నమెంట్‌ ఉద్యోగాలు ఇస్తాం. గ్రామంలో పింఛన్, ఇల్లు, ఆరోగ్య శ్రీ వంటి ఏ పథకం కావాలన్న వీరి నుంచే ఇప్పించేలా చర్యలు తీసుకుంటాను. 72 గంటల్లోనే మీకు ప్రభుత్వ పథకాలు అందేలా చూస్తాను. కులాలు చూడం, మతాలు చూడం, రాజకీయాలు చూడం, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమపథకాలు అందజేస్తాం. నరసింహ విషయంపై కలెక్టర్‌కు లేఖ రాస్తాను. చంద్రబాబు స్పందిస్తారో లేదో చూద్దాం.  దేవుడు చంద్రబాబుకు బుద్ధి ఇవ్వాలని, గడ్డి పెట్టాలని, నరసింహకు పింఛన్‌ ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను.

No comments:

Post a Comment