21 February 2018

22న జ‌రిగే ధ‌ర్నాను విజ‌య‌వంతం చేయండి

ప్ర‌త్యేక హోదా విష‌యంలో కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు ప్ర‌జ‌ల‌ను మోసం చేస్తున్నాయ‌ని ప‌లాస నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త డాక్ట‌ర్ సీదిరి అప్ప‌ల‌రాజు అన్నారు. నాలుగేళ్లు అవుతున్నా హోదా ఇవ్వ‌నందుకు నిర‌స‌న‌గా ఈ నెల 22న ధ‌ర్నా నిర్వ‌హిస్తున్నామ‌న్నారు. ``ద‌గా ప‌డ్డ యువ‌తా మేలుకో`` అనే నినాదంతో జిల్లా యువ‌జ‌న విభాగం ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించే ధ‌ర్నా కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చేయాల‌ని ఆయ‌న కోరారు. ఈ సంద‌ర్భంగా ధ‌ర్నా పోస్ట‌ర్‌ను అప్ప‌ల‌రాజు ఆవిష్క‌రించారు. కార్య‌క్ర‌మంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువ‌జ‌న కార్య‌ద‌ర్శి త‌మ్మినేని చిరంజీవి నాగ్‌, పార్టీ నాయ‌కులు త‌దిత‌రులు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment