* కనకదుర్గమ్మ గుడిదగ్గర కట్టే ఫ్లైఓవర్ నిర్ణీత గడువులోపు పూర్తి అయ్యే పరిస్థితి కనిపించడం లేదు
* ఒక్క ఫ్లైఓవర్ కట్టడానికే తంటాలు.. ఇక రాజధాని ఎలా నిర్మిస్తారు?
విజయవాడ: అబద్ధాలు చెప్పడం.. ప్రజలను మోసం చేయడం చంద్రబాబు నైజమని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. మంగళవారం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కనకదుర్గమ్మ గుడి దగ్గర కట్టే ఫ్లైఓవర్ నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు ఎన్నికల ముందు అలవికానీ హామీలు ఇచ్చి ఒక్కటీ కూడా నెరవేర్చలేదన్నారు. బాబు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానంటూ గొప్పలు చెప్పారు తప్పితే అభివృద్ధి ఎక్కడా కనిపించడం లేదన్నారు. విదేశాలతో సమానంగా రాజధాని నిర్మిస్తామన్న చంద్రబాబు విజయవాడలో ఒక్క ఫ్లైఓవర్ను నిర్మించలేకపోయారని దుయ్యబట్టారు. ఒక్క ఫ్లైఓవర్ నిర్మించలేని చంద్రబాబు ఇక రాజధాని ఎలా నిర్మిస్తారని ప్రశ్నించారు. కనకదుర్గమ్మ గుడి దగ్గర ఉన్న ఫ్లైఓవర్ నిర్ణీత గడువులోగా పూర్తి అయ్యే పరిస్థితి కనిపించడం లేదన్నారు. బాబు దోచుకోవడం.. దాచుకోవడంపై ఉన్న శ్రద్ధ ప్రజల సమస్యలను పరిష్కరించడం లేదని పెద్దరెడ్డి పేర్కొన్నారు.
No comments:
Post a Comment