వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర 93వ రోజు షెడ్యూల్ను వైయస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి తలశీల రఘురాం విడుదల చేశారు. మంగళవారం ఉదయం కొండేపి నియోజకవర్గంలోని విప్పగుంట శివారు నుంచి వైయస్ జగన్ పాదయాత్ర ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి పొన్నలూరు మండలం చౌటపాలెం, లింగం గుంట, మాలేపాడు వరకు సాగుతుంది. 12 గంటలకు మధ్యాహ్న భోజన విరామం ఉంటుంది. అనంతరం 2.45 గంటలకు పొన్నలూరు, తిమ్మనపాలెం వరకు పాదయాత్ర సాగుతుంది. తిమ్మనపాలెం వద్ద రైతులతో వైయస్ జగన్ ముఖాముఖి కార్యక్రమం ఉంటుంది.
No comments:
Post a Comment