27 February 2018

1వ తేదీన కలెక్టరేట్‌ల వద్ద వైయస్‌ఆర్‌ సీపీ ధర్నా

రాజకీయాలకు అతీతంగా పాల్గొని విజయవంతం చేయండి
తెలుగోడి గుండెమంటను ప్రభుత్వాలకు తెలియజేద్దాం
ధర్నాకు మద్దతు తెలిపిన ప్రజా సంఘాలు, కమ్యూనిస్టు పార్టీలు
ప్రత్యేక హోదా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ లక్ష్యమని, హోదా సాధన కోసం వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ అధినేత వైయస్‌ జగన్‌ ఆదేశాల మేరకు మార్చి 1వ తేదీన అన్ని జిల్లాల్లోని కలెక్టరేట్‌ల వద్ద ధర్నా నిర్వహించనున్నట్లు పార్టీ అధికార ప్రతినిధి పార్థసారధి చెప్పారు. ప్రత్యేక హోదాతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, యువతీ, యువకుల భవిష్యత్తుకు, ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతుందన్నారు. రాజకీయాలకు అతీతంగా ఈ ధర్నాల్లో ప్రజలంతా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. వైయస్‌ఆర్‌ సీపీ ధర్నాకు ఇప్పటికే కమ్యూనిస్టు పార్టీలు, పలు ప్రజా సంఘాలు మద్దతు కూడా ప్రకటించడం జరిగిందన్నారు. వైయస్‌ జగన్‌ నాయకత్వంలో మార్చి 1వ తేదీన జరగబోయే ధర్నాలో పాల్గొనాలని మరోసారి ప్రజలకు పిలుపునిచ్చారు. తెలుగు ప్రజల గుండెమంటను కేంద్రానికి, కుంభకర్ణుడి నిద్రపోతున్నట్లు నటిస్తున్న చంద్రబాబును లేపే విధంగా ధర్నా ఉంటుందన్నారు. పోలీస్‌ అధికారులు ప్రత్యేక హోదా రాజకీయపక్ష డిమాండ్‌ కాకుండా 5 కోట్ల ప్రజల ఆకాంక్షగా గుర్తించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.  

No comments:

Post a Comment