27 February 2018

ప్రారంభ‌మైన 99వ రోజు ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర‌

ఒంగోలు: ప‌్ర‌జా సంక‌ల్ప‌యాత్ర‌లో భాగంగా వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేప‌ట్టిన పాద‌యాత్ర నేటికి 99వ రోజుకు చేరుకుంది. ఈ రోజు వైయ‌స్ జ‌గ‌న్‌ మార్కాపురం నియోజ‌క‌వ‌ర్గం, క‌టురివారిపాలెం నుంచి త‌న పాద‌యాత్ర‌ను ప్రారంభించారు. మ‌రికాసేప‌ట్లో జ‌న‌నేత పాద‌యాత్ర కొండేపి నియోజ‌క‌వ‌ర్గంలోకి ప్రవేశించ‌నుంది. అనంత‌రం అగ్ర‌హారం క్రాస్, ఫిర‌దోసి న‌గ‌ర్‌, గోగినేనిపాలెం మీదుగా ఉప్ప‌ల‌పాడు వ‌ర‌కు పాద‌యాత్ర చేయ‌నున్నారు. కాగా పాద‌యాత్ర‌లో భాగంగా ఉప్ప‌ల‌పాడులో ప్ర‌జ‌ల‌తో మ‌మేకం కానున్నారు.

No comments:

Post a Comment