ఎన్నికల ముందు 600లకు పైగా హామీలు ఇచ్చిన చంద్రబాబు నాలుగేళ్లు అవుతున్నా ఒక్క హామీ కూడా నెరవేర్చని నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రశ్నించడం లేదని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు శిల్పా చక్రపాణిరెడ్డి పవన్ కల్యాణ్ను నిలదీశారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన శిల్పా చక్రపాణిరెడ్డి పవన్ కళ్యాణ్, చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నాడు ప్రశ్నిస్తానన్న పవన్ కల్యాణ్ నేడు బాబుకు ప్రశ్నించకుండా ఎందుకు నోరు మూసుకున్నారన్నారు. కేంద్రం నిధులలో ఏపీకి జరుగుతున్న అన్యాయంపై చంద్రబాబు రోజుకో విధంగా లీకులు ఇచ్చి డ్రామాలు ఆడుతున్నారన్నారు. పవన్ కళ్యాణ్ను ముందు పెట్టి డ్రామాలు ఆడడం మానుకోవాలని బాబుకు హితవు పలికారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు.
No comments:
Post a Comment