5 February 2018

8న ఏపీ బంద్‌కు వైయస్‌ఆర్‌సీపీ మద్దతు

అమరావతి: ఈ నెల 8న వామపక్షాలు పిలుపునిచ్చిన రాష్ట్ర వ్యాప్త బంద్‌కు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పూర్తి మద్దతు ప్రకటించింది. ఈ మేరకు సోమవారం పార్టీ కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, పోలవరం, దుగ్గిరాజపట్నం పోర్టు, విశాఖ రైల్వేజోన్, కడప స్టీల్‌ ప్యాక్టరీ సహా విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన అన్ని అంశాల మీద వైయస్‌ఆర్‌కాంగ్రెస్‌ పార్టీ గడిచిన నాలుగేళ్లుగా అలుపెరగని పోరాటం చేస్తోంది. అందులో భాగంగా ఈ అంశాలపై ఏ పార్టీ ఎలాంటి ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిచ్చినా వైయస్‌ఆర్‌సీపీ మద్దతు ఇస్తోంది. 
 

No comments:

Post a Comment