1 February 2018

చంద్రబాబు అసమర్ధుడు

నెల్లూరు: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయలేని అసమర్ధుడు చంద్రబాబు అని వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ వరప్రసాద్‌ మండిపడ్డారు. పొదలకూరు బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ..నాలుగేళ్లుగా బహుబలి షెట్టింగ్స్‌తో రాజధాని అంటూ ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. చంద్రబాబు పాలనలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరన్నారు. ఈ అబద్ధాలు, అవినీతి పాలన పోవాలని, వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి రావాలని ఆకాంక్షించారు. ఎన్నికల సమయంలో ప్రతి మహిళలకు సెల్‌ ఫోన్‌ఇస్తానని మోసం చేశారన్నారు. వంద ఇళ్లకు ఐదు బెల్టు షాపులు పెట్టిన ఘనుడు చంద్రబాబు అన్నారు. నీరు – చెట్టు పేరుతో నిధులు స్వాహా చేస్తున్నారన్నారు. అభివృద్ధి అన్నది రాష్ట్రంలో కనిపించడం లేదన్నారు. యువకులు, చేనేతలు, మత్స్యకారులను ఇలా అన్ని వర్గాలను చంద్రబాబు మోసం చేశారన్నారు. అన్ని విధానాలుగా దగా చేసిన చంద్రబాబును ఇంటికి పంపించాలని ఆయన పిలుపునిచ్చారు. 

No comments:

Post a Comment