కృష్ణా జిల్లా : ప్రత్యేక హోదా భిక్ష కాదని, మన ఆంధ్రుల హక్కు అని వైయస్ఆర్సీపీ అధికార ప్రతినిధి జోగి రమేష్ పేర్కొన్నారు. మన ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకపోవడానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే కారణమని విమర్శించారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ..అసమర్ధ ముఖ్యమంత్రి పాలన చేస్తే మన పరిస్థితి ఇలాగే ఉంటుందని వ్యాఖ్యానించారు. నాలుగేళ్లుగా మీ మోసపూరీతి మాటలు వినీ వినీ రాష్ట్ర ప్రజలు విసిగిపోయారన్నారు. ఇంకా ఎన్నాళ్లు ఈ నాటకాలు ఆడతారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రులను ఉద్ధేశించి ఈ సందర్భంగా ప్రశ్నించారు. ప్రత్యేక హోదా కోసం యువత, విద్యార్థులు గళమెత్తుతున్నారని వ్యాఖ్యానించారు.
No comments:
Post a Comment