11 May 2015

రైతుల కోసం... రైతు కుటుంబాల కోసం..!

రైతుల కోసం, రైతు కుటుంబాల కోసం వైఎస్సార్‌సీపీ అధ్య‌క్షుడు వైఎస్ జ‌గ‌న్ రైతు భ‌రోసా యాత్ర చేప‌డుతున్నారు. అనంత‌పురం జిల్లాలో మొద‌టి విడ‌త ఐదు రోజుల పాటుయాత్ర జ‌రిగింది. ఇప్పుడు మ‌ళ్లీ ఈ యాత్ర‌ను చేప‌డుతున్నారు. 

రైతుల‌కు రుణ మాఫీ చేస్తాన‌ని చెప్పి చంద్ర‌బాబు నిలువునా మోసం చేశాడు. అటు రుణ మాఫీ కాక‌, తిరిగి బ్యాంకుల నుంచి అప్పులు దొర‌క్క  రైతులు ప్రైవేటు వ్యాపారుల్ని ఆశ్ర‌యించారు. ఈ లోగా బ్యాంకుల్లో అప్పులకు వ‌డ్డీల మీద వ‌డ్డీలు ప‌డ‌టం, ఇటు ప్రైవేటు వ్యాపారుల నుంచి తీసుకొన్న దానికి చ‌క్ర వ‌డ్డీలు ప‌డ‌టం జ‌రిగింది. దీంతో రైతులు పూర్తిగా అప్పుల్లో కూరుకొని పోయారు. ఇటువంటి ప‌రిస్థితుల్లో కొంద‌రు రైతులు ఆత్మ‌హత్య‌ల‌కు పాల్ప‌డ్డారు.

దీనిపై చ‌లించిపోయిన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ అసెంబ్లీలో ఈ అంశాన్ని లేవ‌నెత్తారు. ఇప్ప‌టికైనా ప్ర‌భుత్వం మేలుకొని, రైతుల్ని ఆదుకోవాల‌ని కోరారు. దీనిపై స్పందించాల్సింది పోయి, చంద్ర‌బాబు ప్ర‌భుత్వం అడ్డంగా అబ‌ద్దాలు ఆడింది. ఎక్క‌డా రైతుల ఆత్మ‌హ‌త్య‌లు లేవ‌ని బుకాయించింది. దీంతో ప్ర‌జ‌ల త‌ర‌పున స్పందించిన వైఎస్ జ‌గ‌న్‌.. తాను రైతుల కోసం యాత్ర చేడ‌తానని, రైతు ఆత్మ‌హ‌త్య‌లు జ‌రిగిన ఇళ్ల‌కు వెళ్లి కుటుంబాల్ని ప‌ల‌క‌రించి వ‌స్తాన‌ని చెప్పారు. అన్న‌ట్లుగానే అసెంబ్లీ స‌మావేశాల త‌రువాత రైతు భ‌రోసా యాత్ర చేపట్టారు. అప్ప‌ట్లో 11 రైతు కుటుంబాల్ని ప‌రామ‌ర్శించారు.

ఇప్పుడు మ‌ళ్లీ వైఎస్ జ‌గ‌న్ రైతు భ‌రోసా యాత్ర చేప‌డుతున్నారు. ఇటీవ‌ల కాలంలో ప‌చ్చ‌చొక్కాల గూండాల చేతిలో హ‌త‌మైన ప్ర‌సాద్ రెడ్డి కుటుంబాన్ని ప‌రామ‌ర్శిస్తారు. త‌ర్వాత అదే జిల్లాలో ఆత్మ‌హ‌త్య‌లు చేసుకొన్న రైతు కుటుంబాల్ని ప‌రామ‌ర్శిస్తారు.

No comments:

Post a Comment