5 June 2015

సమర దీక్ష విజయవంతం


తరలి వచ్చిన జనం.. ఉప్పొంగిన అభిమానం..
 హైదరాబాద్ :  ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండు రోజుల పాటు చేసిన సమర దీక్ష విజయవంతం అయింది.  ఏడాదిపాటు పరిపాలించిన చంద్రబాబు పాలనలోని వైఫల్యాల్ని ఎండగడుతూ ఈ దీక్ష నిర్వహించటం జరిగింది. విజయవాడ - గుంటూరు మధ్యలో, ప్రతిపాదిత రాజ ధాని ప్రాంతానికి కాస్త దూరంలో మంగళగిరి వై జంక్షన్ లో ఈ దీక్ష జరిగింది.

 సమరమే నినాదం
  బుధవారం ఉదయం వైఎస్ జగన్ దీక్ష స్థలికి చేరుకొని దివంగత ముఖ్యమంత్రి,మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం సభ ను ఉద్దేశించి క్లుప్తంగా ప్రసంగించారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఏడాది పాలనలో ప్రజలకు ఎలాంటి మంచి జరగలేద నీ, పైగా ప్రజల్ని అన్యాయమైన పరిస్థితుల్లోకి నె ట్టివేశారని ఆయన ఘాటుగా విమర్శించారు. చంద్రబాబు మోసాల్ని చాటి చెప్పటానికే ఈ దీక్షకు సమర దీక్ష అని నామకరణం చేశామని, ఆయనపై పోరాటానికి ఈ దీక్షను ఒక వేదికగా చేసుకొన్నామని వివరించారు. ఎన్నికల సందర్భంగా చంద్రబాబు ఇచ్చిన హామీలు ఏమిటి.. ఇప్పుడు ఆయన చేస్తున్నది ఏమిటి..అని సూటిగా ప్రశ్నించారు. రైతన్నలకు రుణమాఫీ, డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు రుణమాఫీ, ఇంటింటికీ ఉద్యోగం లేదా నిరుద్యోగ భృతి, రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రాజధాని పేరుతో బలవంతపు భూ సమీకరణ అంశాల మీద తాను దీక్ష చేస్తున్నానని ఆయన వివరించారు. ఈ దీక్ష ఎందుకు చేస్తున్నదీ ప్రజలు అందరికీ తెలుసని, తెలియని ఏకైక వ్యక్తి మాత్రం చంద్రబాబే అని ఆయన అన్నారు.

 వె ల్లువెత్తిన జన వాహిని
  మొదటి రోజు దీక్ష కు పెద్ద ఎత్తున జనం తరలి వచ్చారు. డ్వాక్రా మహిళలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. క్లుప్తంగా చేసిన జగన్ ప్రసంగానికి హర్షాతిరేకాలు తెలిపారు. ముఖ్యంగా చంద్రబాబు మోసాల్ని జగన్ ఉదహరించినప్పుడు భారీగా స్పందన కనిపించింది. మండుటెండల్ని సైతం లెక్క చేయకుండా యువకులు, మహిళలు, వృద్ధులు తరలి వచ్చారు. వైఎస్ జగన్ తో పాటు ఇతర నాయకుల ప్రసంగాల్ని ఆద్యంతం ఆలకించారు. చంద్రబాబు గురించి ఉదహరించి విమర్శలు చేసినప్పుడల్లా పెద్ద ఎత్తున చప్పట్లు చరిచి హర్షాతిరేకాలు వెలిబుచ్చారు.

ప్రభుత్వ నిర్వాకం
  ప్రతిపక్ష నాయకుడు దీక్ష చేస్తున్నప్పటికీ, పోలీసులు భద్రత కల్పించనే లేదు. దీనిపై పార్టీ నాయకులు మండిపడ్డారు. ఇది సరైన విధానం కాదని గర్హించారు. ఉదయం నుంచి పెద్ద ఎత్తున తరలి వస్తున్న వాహనాలతో ైవె  జంక్షన్,సర్వీసు రోడ్లు నిండిపోయాయి. పార్టీ కార్యకర్తలే స్వచ్చందంగా ట్రాఫిక్ నియంత్రణ చేసుకొన్నారు. అటు సభ స్థలిలో కూడా కార్యకర్తలే వాలంటీర్లుగా ఏర్పడి సమన్వయం చేసుకొన్నారు. మొత్తం సభ ప్రాంగణంలో కార్యకర్తలు, అభిమానుల సందడి బాగా కనిపించింది. ముఖ్యంగా యువత వైఎస్ జగన్ పట్ల తమ అభిమానాన్ని చాటుకొన్నారు.  సాయంత్రం కొందరు అభిమానులు, కార్యకర్తలు వైఎస్ జగన్ ను కలిశారు. వారందరితో ఓపికగా వైఎస్ జగన్ మాట్లాడారు. వివిధ వయస్సుల వారు పెద్ద సంఖ్యలో ఆయన్ని కలిసి మనస్సులోని మాటను చెప్పుకొన్నారు.

 రెండో రోజు అదే జన ప్రభంజనం
  రెండో రోజున వైఎస్ జగన్ సమర దీక్ష ప్రాంగణం దగ్గరకు పెద్ద ఎత్తున జనం తరలి వచ్చారు. కొందరు పోలీసులు వచ్చి ట్రాఫిక్, బందోబస్తు సమన్వయం చేశారు. అంతకంతకూ జనం రాక పెరిగిపోవటంతో ప్రత్యేక ఏర్పాట్లు చేయాల్సి వ చ్చింది. చుట్టు పక్కల స్థలాల్ని ఖాళీ చేయించి పార్కింగ్ సౌకర్యం కల్పించారు. విరివిగా జనం తరలి రావటంతో ప్రాంగణం అంతా కిక్కిరిసి పోయింది. ముఖ్యంగా రెండో రోజున జగన్ ను చూసేందుకు జనం పోటీ పడ్డారు. దీంతో వేదిక ముందు ప్రాంతాన్ని పదే పదే క్లియర్ చేయాల్సి వ చ్చింది.

 రాష్ట్రానికే మోసగాడు
 ప్రజల్ని రక రకాలుగా వే ధిస్తున్న చంద్రబాబు పాలనపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక పుస్తకాన్ని విడుదల చేసింది. ‘రాష్ట్రానికే మోసగాడు’ పేరుతో 80 పేజీల పుస్తకాన్ని పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆవిష్కరించారు. మొత్తంగా 9 అంశాలుగా విభజించి పరిపాలనను విశ్లేషించారు. ఈ పుస్తకాన్ని తీసుకొనేందుకు జనం పోటీపడ్డారు. స్టాల్ ఏర్పాటు చేసిన కొద్ది గంటల్లోనే ఈ పుస్తకాలన్నీ తీసుకొని వెళ్లిపోయారంటే అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా చాలా మంది అక్కడికక్కడే పుస్తకంలోని అంశాల్ని చదువుకొని చర్చించుకోవటం కనిపించింది.

 ప్రజా బ్యాలెట్ కు విశేష స్పందన
 చంద్రబాబు నాయుడు పరిపాలన మీద వైఎస్సార్ సీపీ ఒక బ్యాలెట్ పత్రాన్ని రూపొందించింది. 100 ప్రశ్నలు ఇచ్చి జవాబులు రాయమని కోరారు. వీటిని అక్కడికక్కడ అందించేందుకు ్రపజా బ్యాలెట్ బ్యాక్సులు ఏర్పాటు చేశారు. వీటితో పాటు పోస్టల్ ద్వారా కూడా ఈ బ్యాలెట్ పత్రాల్ని అందించేందుకు ఏర్పాట్లు జరిగాయి. ఈ బ్యాలెట్ లోని ప్రశ్నల్ని నాయకులు చదివి వినిపించినప్పుడు అక్కడికక్కడే పెద్ద ఎత్తున స్పందన వినిపించింది. ఈ బ్యాలెట్‌ద్వారా ప్రజల స్పందన ను తెలియచేయాలని నాయకులు కోరటం జరిగింది.

 ఆకర్షణీయంగా నిలిచిన డిజిటల్ మీడియా స్టాల్
 పార్టీ శ్రేణులకు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు ఇంటర్ నెట్ ద్వారా సేవలు అందిస్తున్న డిజిటల్ మీడియా ఒక స్టాల్ ఏర్పాటు చేసింది. దీని ద్వారా డిజిటల్ మీడియా సేవల్ని అందరికీ తెలియ చేశారు. వెబ్ సైట్, ఫేస్ బుక్, ట్విటర్, యూ ట్యూబ్, ఈ పేపర్, నెట్‌టీవీ అనే విభిన్న మాధ్యమాల్లోని పార్టీ పేజీల్ని తెలియ పరిచే ఫ్లెక్సీలను ప్రాంగణంలో పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేశారు. వీటిపై ఆయా పేజీల అడ్రస్ లను పొందిపరిచారు. దీంతో పాటుగా ఆయా వివరాలు తెలిపే కార్డులను పంపిణీ చేశారు.

 గర్జించిన ప్రజా నేత
 రెండో రోజు దీక్ష ముగింపు సందర్భంగా వైఎస్ జగన్ .. రాష్ట్రంలోని చ ంద్రబాబు పాలనపై నిప్పులు చెరిగారు. ఈ సారి ఎన్నికలోస్తే చంద్రబాబుకు డిపాజిట్లు కూడా దక్కవని మండి పడ్డారు. ప్రజల గుండెల్లోంచి వచ్చే కోపాగ్ని కెరటం ఉవ్వెత్తున ఎగసి, ఆయనను బంగాళాఖాతంలో కలుపుతుందని విరుచుకు పడ్డారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను గద్దెనెక్కిన తర్వాత ఏ రకంగా తుంగలో తొక్కారో ప్రజలు గమనిస్తూనే ఉన్నారని , వారే చంద్రబాబుకి గట్టిగా బుద్ది చెబుతారని హెచచరించారు. ప్రజల చెవుల్లో కాలీఫ్లవర్ పువ్వులు పెట్టి ముఖ్యమంత్రి పీఠం ఎక్కారని వైఎస్ జగన్ అన్నారు. కేంద్ర ్రపభుత్వంపై ఇప్పటికీ చంద్రబాబు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

 అదే ప్రజా స్పందన
 ఈ దీక్షలో పార్టీకి చెందిన సీనియర్‌నాయకులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక సంస్థల ప్రతినిధులు, కన్వీనర్లు, కోర్డినేటర్లు పాల్గొన్నారు. నాయకులు తమ ప్రసంగాల్లో చంద్రబాబు మోసాల్ని ఎండగట్టారు. అటు, చంద్రబాబు ఎన్నికల బహిరంగ సభల్లో చేసిన ప్రసంగాల్ని డి జిటల్ స్క్రీన్ మీద ప్రదర్శించారు. చివరగా మంగళగిరి శాసనసభ్యుడు రామకృష్ణా రెడ్డి, స్థానిక రైతు నాయకులు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింప చేశారు.

No comments:

Post a Comment