13 June 2015

రాజధాని రైతుల్లో గందరగోళం

రాష్ట్రమంతా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భవితవ్యం మీద చర్చించుకొంటున్నారు. సామ దాన భేద దండోపాయాలు ఉపయోగించి రైతుల నుంచి చంద్రబాబు ప్రభుత్వం భూములు లాక్కొంది. పరిహారం మాత్రం ఇంకా ఇవ్వలేదు. ఇప్పుడు చంద్రబాబు అరెస్టు అయితే పరిహారం సంగతి ఏమిటి, ఎటు తిరిగి ఏమవుతుంది, హామీలు అమలవుతాయా..అన్న అనుమానాలు కలుగుతున్నాయి.
   రాజధాని ప్రాంత రైతులు ...చంద్రబాబు అరెస్టు వ్యవహరంలో  ఏం జరుగుతుందోనని  ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఓటుకు నోటు వ్యవహారంలో  ఎటు వచ్చి ఎటు పోయినా,  తమ జీవితాలు తారుమారవుతాయనే ఆందోళన వారిలో  కనబడుతోంది. టీడీపీ నాయకులు  ఎవరు ఎదురైనా  దీనిపై ప్రశ్నలు సంధిస్తున్నారు. తెలంగాణ ఏసీబీ చంద్రబాబుకు  నోటీసులు ఇచ్చే అవకాశం ఉందా? సీఎం అరెస్టు అవుతారా?తరువాత ముఖ్యమంత్రి ఎవరు అనే అంశాలపై ఆరా తీస్తున్నారు. కొత్త ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీలను నిలుపుకొంటుందా..అని అడుగుతున్నారు.

 ఉత్తుత్తి హామీలు
 ఇచ్చిన హామీల్ని ఎప్పటికప్పుడు మరిచి పోవటం చంద్రబాబు నాయుడికి అలవాటు. అందుకే  ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తర్వాత కాలంలో తుంగలో తొక్కారు. రైతులకు రుణమాఫీ, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ, ఇంటికో ఉద్యోగం... లేదంటే నిరుద్యోగ భృతి వంటి హామీలను గాలికి వదిలేశారు. బడుగు బలహీన వర్గాలకు కొత్త ఇళ్లు కట్టించటం మాట దేవుడెరుగు, నిర్మాణంలో ఉన్న ఇళ్లకు సైతం బిల్లులు ఎగ్గొడుతున్నారు. ప్రత్యేక హోదా ఇప్పిస్తామని చెప్పి, ఇప్పుడు ఆ ఊసెత్తటం లేదు. ఇన్ని రకాలుగా వంచించిన చంద్రబాబు, ఎన్నికల తర్వాత రాజధాని పనులు ఆగ మేఘాల మీద మొదలెట్టేశారు. సింగపూర్ సంస్థలకు దోచిపెట్టేందుకు వేలాది ఎకరాల్ని బలవంతంగా లాక్కొన్నారు. భూముల్ని లాక్కొనేటప్పుడు చాలా హామీలు గుప్పించారు.
  ఇప్పుడు ఆ హామీల పరిస్థితి ఏమిటనే దానిపై ఆందోళన నెలకొంది. తీసుకొన్న భూమిని బట్టి అంటే మెట్ట లేదా జరీబు భూముల్ని బట్టి పరిహారం ప్రకటించారు. అంటే  కౌలు డీడులు ఇచ్చి  కౌలు చెల్లిస్తామన్నారు. అంతే గాకుండా ఆగ మేఘాల మీద రుణ మాఫీలు చేస్తామన్నారు. వ్యవసాయ భూమికి తగినట్లుగా పట్టణ ప్రాంతాల్లో సైట్ లను ఎలాట్ చేస్తామన్నారు. అరచేతిలో స్వర్గం సృష్టించి అమాంతం చూపించారు.

 చంద్రబాబు డొంకతిరుగుడు
  ఏ సందర్భంలోనూ స్పష్టంగా మాట్లాడని చంద్రబాబు, ఇప్పుడూ అదే ధోరణి కొనసాగిస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు ... ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన హామీలు అంటూ తప్పించుకొనే ప్రయత్నం చేస్తున్నారు. వాటి మీద ఎన్నికల సంఘానికి ఇచ్చిన అఫిడవిట్ లో తనకు ఉన్న అనుభవం రీత్యా ఈ హామీలను నె రవేర్చ గలనని స్పష్టం చేశారు. అయినప్పటికీ, ఇప్పుడు ఆ హామీల ఊసెత్తకుండా కాలక్షేపం చేసేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కోట్లాది రైతులు నెత్తి నోరు కొట్టుకొంటున్నా చంద్రబాబు పట్టించుకోవటం లేదు. డ్వాక్రా మహిళలు తమ రుణమాఫీ సంగతి ఏమిటని కళ్ల నీళ్లు పెట్టుకొంటున్నా ఏమాత్రం ఖాతరు చేయటం లేదు. అటువంటిది తమ 29 గ్రామాల్ని చంద్ర బాబు పట్టించుకొంటారా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.  ఇప్పుడు చంద్రబాబు అరెస్టు అయితే తర్వాత అధికార పగ్గాలు చేపట్టిన వారసులు చేతులు ఎత్తేస్తే తమ భవిష్యత్ ఏమిటని ఆందోళన చెందుతున్నారు. ఒక వేళ పనిలో పనిగా చంద్రబాబు కూడా అదే పని చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని భయపడుతున్నారు. చంద్రబాబు గత వైఖరి ఇందుకు నిదర్శనం అంటున్నారు.

 తక్షణ కర్తవ్యం
  భూములు స్వాధీనం చేయని చోట్ల మాత్రం కొందరు రైతులు  ఖరీఫ్‌కు సమాయాత్తం అవుతున్నారు. ముఖ్యంగా విత్తనాలు సేకరణ, మెట్టదుక్కులు దున్నుకోవడం వంటి  పనుల్లో నిమగ్నం  అయ్యారు. ఇప్పటికే 33,347 ఎకరాల భూ సమీకరణ  చేసిన ప్రభుత్వం 22వేల  ఎకరాలకు సంబంధించిన రైతులకు  కౌలు డీడీలు పంపిణీ చేసింది.  ఆరువేల ఎకరాలకు  సంబంధించి కౌలు డీడీలు  ఇవ్వడానికి కొన్ని సమస్యలు  ఎదురవడంతో  వాటిని  పెండింగ్‌లో పెట్టారు. మిగిలిన 5వేల  ఎకరాలకు  సంబంధించి  మారిన  రాజకీయ నేపథ్యంలో  రైతులు కౌలుడీడీలు  తీసుకునేందుకు  విముఖత చూపుతున్నారు. ఓటుకు నోటులో   సీఎం పాత్ర ఉందని   రుజువైతే , రాజధాని నిర్మాణం  ఆగిపోయినట్టేనని రైతులు అంటున్నారు. దీంతో తమ భూములను తిరిగి తామే సాగుచేసు కోవాలనుకుంటున్నారు.

 ఇప్పటికే క ష్టాల కొలిమి
 భూముల్ని పూర్తిగా అప్పగించిన రైతులు మాత్రం ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితి. రాగల రోజుల్లో ఎలా బతకాలి అనే దానిపై ఆందోళన చెందుతున్నారు. అటు కొన్ని చోట్ల రిజిస్ట్రేషన్లు నిలిపివేశారనే వార్తలు రావటంతో మిగిలిన రైతులు సైతం ఇబ్బంది పడుతున్నారు. కౌలు డీడ్‌లు తీసుకోని రైతులపై కక్ష సాధింపు చర్యలకు దిగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. అటు కూలీల పరిస్థితి మరింత దుర్భరంగా ఉంది. వ్యవసాయ కూలీల కు శిక్షణ ఇచ్చి ఇతర వృత్తుల్లోకి మళ్లిస్తామని చెప్పినప్పటికీ ఆచరణలో కనిపించటం లేదు. ఈలోగా వ్యవసాయ పనులు ప్రశ్నార్థకంగా మారాయి. దీంతో గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ ప్రాంతం నుంచి కూలీల వలసలు మొదలయ్యాయి. మూడు పంటలు పండుతూ కళ కళ లాడుతూ ఉండే పల్లెలు ఇప్పుడు వలస బాట పట్టాల్సి వ చ్చిందంటే దీనికి కారణం చ ంద్రబాబే అని మండిపడుతున్నారు. కొందరు మహిళలైతే తమ ఉసురు తగిలిందని, అందుకే గతంలో ఎన్ని నేరాలు, ఘోరాలు చేసినా దొరకని చంద్రబాబు, ఇప్పుడు రెడ్ హేండెడ్ గా దొరికిపోయాడని అంటున్నారు. 

No comments:

Post a Comment