27 December 2017

బాబులా కాకుండా నిబద్ధతతో పనిచేస్తా

అనంతపురం: చంద్రబాబులా కాకుండా తాను నిబద్ధతతో పని చేస్తానని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న వైయస్‌ జగన్‌ మీడియా ప్రతినిధుల చిట్‌చాట్‌లో మాట్లాడారు. మేం విలువలతో కూడిన రాజకీయం చేస్తామని తెలిపారు. మా పార్టీలోకి రావాలంటే రాజీనామా చేయాలని శిల్పా చక్రపాణిరెడ్డికి చెప్పా..రాజీనామా చేశాకే చక్రపాణిరెడ్డి పార్టీలో చేరారని గుర్తు చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీని కూడా చంద్రబాబు నెరవేర్చలేదని విమర్శించారు. నేను చంద్రబాబు లాగ కాకుండా నిబద్ధతతో పనిచేస్తానని, ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తానని చెప్పారు. మేం ఏం చేయబోయేది ముందుగానే ప్రకటిస్తామని వైయస్‌ జగన్‌ వెల్లడించారు.  మా మేనిఫెస్టోను ఇంటర్‌నెట్‌లో పెడతామని, మేం మాటకు కట్టుబడకపోతే ఎవరైనా మమ్మల్ని ప్రశ్నించొచ్చు అన్నారు. సంక్షేమ పథకాల అమలులో కులాలు, మతాలు, పార్టీలు చూడమని, అర్హులందరికీ న్యాయం చేస్తామని జననేత స్పష్టం చేశారు.
 – పోలవరంలో చంద్రబాబు అవినీతికి పాల్పడుతున్నారు, పోలవరం అవినీతిపై భవిష్యత్తులో కచ్చితంగా విచారణ జరుగుతుంది. అవినీతి పరులు, అక్రమార్కులకు చంద్రబాబు అండగా నిలుస్తున్నారు. వైయస్‌ఆర్‌ హయాంలో 90 శాతం పూర్తి అయిన ప్రాజెక్టులకు చంద్రబాబు గేట్లు ఎత్తుతున్నారు. ధర్మవరంలో చేనేత మహిళల కష్టాలు చూశాకే 45 ఏళ్లకే పింఛన్‌ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నానని వైయస్ జగన్ పేర్కొన్నారు.  

No comments:

Post a Comment