ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్న అపరిష్కృత సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ప్రధాని నరేంద్రమోడీని కోరారు. శనివారం విజయసాయిరెడ్డి పార్లమెంట్లో ప్రధానిని కలిశారు. ఈ సందర్భంగా కడపకు చెందిన ఫాతిమా మెడికల్ కాలేజ్ సమస్యని పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే విభజన చట్టంలోని ప్రత్యేక హోదా అంశంపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరారు. పోలవరం ప్రాజెక్టు ని త్వరితగతిన పూర్తి చేయాలని విజయసాయిరెడ్డి ప్రధానిని కోరారు. విశాఖకు రైల్వే జోన్, రాయలసీమకి స్టీల్ ఫ్యాక్టరీ తోపాటు రాష్ట్రానికి సంభందించిన అనేక సమస్యలని ప్రధాని దృష్టికి తీసుకెళ్లి అన్నిటినీ త్వరితగతిన పూర్తి చేయాలని విజ్ఞప్తి చేసినట్లు ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా రాజ్యసభలో సమర్ధవంతంగా చాలా చక్కగా సమస్యలని ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తూ మంచి పార్లమెంటేయన్ గా గుర్తింపు తెచ్చుకొంటున్నావని, దీనిని ఇలాగే కొనసాగించాలని విజయసాయిరెడ్డిని ప్రధాని మోడీ ప్రశంసించటం గమనార్హం .
No comments:
Post a Comment