30 December 2017

వైయ‌స్ఆర్‌సీపీ జెండా రెప‌రెప‌లు

- దిగ్విజ‌యంగా సాగుతున్న ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌
-  అధినేత‌తో క‌లిసి అడుగులు వేసిన ఎంపీలు విజ‌య‌సాయిరెడ్డి, మిథున్‌రెడ్డి,  భూమ‌న 
- హార‌తులు ప‌ట్టిన మ‌హిళ‌లు
- కేరింత‌లు కొట్టిన యువ‌త‌
చిత్తూరు: జ‌నం కోసం వైయ‌స్ జ‌గ‌న్ ఎత్తిన జెండా వైయ‌స్ఆర్ అంటూ చిత్తూరు జిల్లాలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెప‌రెప‌లాడుతోంది. ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా జిల్లాలోని పాద‌యాత్ర సాగే గ్రామాల్లో పార్టీ జెండాలు క‌ళ‌క‌ళ‌లాడుతున్నాయి. సామాన్య కార్య‌క‌ర్త నుంచి పార్టీ సీనియ‌ర్ లీడ‌ర్ల వ‌ర‌కు ప్ర‌తి ఒక్క‌రూ పార్టీ జెండా చేత‌బూని అధినేత‌తో క‌లిసి అడుగులు వేయ‌డంతో పార్టీ శ్రేణుల్లో నూత‌నోత్స‌హం వ‌చ్చింది. ప్ర‌జా సంక‌ల్ప యాత్ర 47వ రోజు చిత్తూరు జిల్లా వసంతపురం నుంచి ప్రారంభం కాగా,  ఉప్పులురువాండ్లపల్లి, జి.కొత్తపల్లి క్రాస్‌, గోపిదెన్నె, బోరెడ్డివారి కోట, ఎగువ బోయనపల్లి వ‌ర‌కు సాగింది. ఈ సంద‌ర్భంగా బోరెడ్డివారికోట వ‌ద్ద పార్టీ సీనియ‌ర్ నేత‌లు ఎంపీలు విజ‌య‌సాయిరెడ్డి, మిథున్‌రెడ్డి, భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి, ద్వార‌క‌నాథ్‌రెడ్డిలు ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో పాల్గొన్నారు. పాద‌యాత్ర‌లో భాగంగా విజ‌య‌సాయిరెడ్డి, భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డిలు భుజాన జెండా పెట్టుకొని అధినేత‌తో క‌లిసి న‌డ‌వ‌డం క‌నువిందు చేసింది.  

జ‌న‌సంద్రం
ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌మ గ్రామాల‌కు వ‌స్తున్నార‌ని స‌మాచారం తెలియ‌డంతో గ్రామ‌స్తులు ప‌నులు మానుకొని ప‌డిగాపులు కాస్తున్నారు.  చిత్తూరు జిల్లాలోని తంబ‌ళ్ల‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలోని గ్రామాలు జ‌న‌సంద్రంగా మారాయి.  మంగళ వాయిద్యాలు, డప్పుల మోతలు, పరుగులు తీస్తూ యువకులు వేసే ఈలలతో కోలాహలంగా మారింది. జనవాహినితో కదలి వస్తున్న విపక్షనేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డిని చూసి మురిసిపోయింది. నాయకుడొచ్చాడని సంబరపడింది.  మ‌హిళ‌లు హార‌తులు ప‌ట్టి ఆత్మీయ స్వాగ‌తం ప‌లుకుతుండ‌గా, పార్టీ నాయ‌కులు పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలుకుతున్నారు. అన్నొస్తున్నాడ‌ని యువ‌త కేరింత‌లు కొడుతున్నారు. పొలం గ‌ట్లు, బ‌స్సు టాప్‌లపైనుంచి జ‌న‌నేత‌తో క‌ర‌చాల‌నం చేసేందుకు పోటీప‌డుతున్నారు. పాద‌యాత్ర చేసే గ్రామాల్లో  పండుగ వాతావ‌ర‌ణం నెల‌కొంది.

No comments:

Post a Comment