న్యూఢిల్లీ: పార్టీ ఫిరాయించిన ఎంపీ కొత్తపల్లి గీతపై చర్యలు తీసుకోవాలని వైయస్ఆర్సీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి డిమాండ్ చేశారు. న్యూఢిల్లీలో పార్టీ ఫిరాయింపులపై నిర్వహించిన సదస్సులో ఎంపీ మేకపాటి పాల్గొని ప్రసంగించారు. జేడీయూ ఎంపీలపై ఇటీవల రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు అనర్హత వేటు వేసినట్లుగానే పార్టీ మారిన కొత్తపల్లి గీతపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఇక్కడో న్యాయం, ఏపీలో మారో న్యాయం సరికాదని సూచించారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు ఫిరాయింపుల చట్టాన్ని పటిష్టం చేయాలని ఆయన కోరారు.
No comments:
Post a Comment