చిత్తూరు: గాలేరు-నగరి సుజల స్రవంతి ప్రాజెక్టు సాధన కోసం నగరి ఎమ్మెల్యే ఆర్.కె.రోజా పాదయాత్ర శుక్రవారం నాలుగో రోజుకు చేరుకుంది. నవంబర్ 28న ఆమె పాదయాత్ర ప్రారంభించగా చిత్తూరు జిల్లాలో విశేష స్పందన లభిస్తోంది. నగరి నియోజకవర్గంలోని ఐదు మండలాలు తాగునీరు, సాగునీటి కోసం గాలేరు-నగరి ప్రాజెక్టుపై ఆధారపడి ఉన్నాయి. ఈ ప్రాజెక్టు కోసం రోజా నగరిలోని సత్రవాడ నుంచి ప్రారంభమైంది. ఇవాళ సాయంత్రానికి రోజా తిరుమలకు చేరుకుంటారు. ఈ యాత్ర ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని, ప్రభుత్వం ప్రాజెక్టును పూర్తి చేయని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని ఆమె హెచ్చరించారు. రోజా పాదయాత్రకు వైయస్ఆర్ పార్టీ నేతలు సంఘీభావం తెలిపారు.
No comments:
Post a Comment