- శ్రీశైలం ప్రాజెక్ట్ నిండకుండా కక్ష సాధింపు
- చంద్రబాబు రాయలసీమ ద్రోహి
వైయస్సార్ జిల్లాః పులివెందుల, గండికోటకు నీళ్లు ఇస్తామని చెప్పడమే తప్ప ఆచరణలో మాత్రం శూన్యమని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మైదుకూరు ఎమ్మెల్యే రఘురాంరెడ్డి, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డిలు బాబుపై మండిపడ్డారు. శ్రీశైలం ప్రాజెక్టు నిండకూడదన్న కక్ష సాధింపుతో టీడీపీ పాలన సాగుతుందన్నారు. కేసీ కెనాల్, తెలుగుగంగ, గాలేరు - నగిరికి ఖరీఫ్ కు నీళ్లు ఇవ్వొద్దన్న ఆలేచనలో బాబు ఉండడం దారుణమన్నారు. చంద్రబాబు రాయలసీమ ద్రోహిగా మిగిలిపోతారని హెచ్చరించారు.
మరిన్ని విషయాలు వారి మాటల్లోనే...
* బాబు వల్ల ప్రజలకు ఎలాంటి మేలు కలగలేదు... కేవలం డబ్బులు సంపాదించుకోవడమే బాబు లక్ష్యం.
* రెండేళ్ల క్రితం గండికోటకు నీళ్లిస్తామని బాబు హామీ ఇచ్చారు... ఇంతవరకు అది అమలు కాలేదు
* 13సార్లు రాయలసీమకు వచ్చిన చంద్రబాబు గండికోట, పులివెందులకు నీళ్లు ఇస్తానన్నహామీ ఏమైంది
* రాయలసీమకు ఇంత అన్యాయం జరుగుతున్నా ఇక్కడి టీడీపీ నాయకులు స్పందించకపోవడం సిగ్గుచేటు
* శాసనసభ్యులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలను ప్రలోభాలకు గురి చేసి టీడీపీలో చేర్చుకోవడమే ధ్యేయంగా టీడీపీ పని చేస్తోంది.
* ప్రజలకు సేవ చేయడం, ప్రజల అవసరాలను తీర్చడంలో టీడీపీ పూర్తిగా విఫలమైంది
* జిల్లాలో ఉన్న టీడీపీ నాయకులందరు కాంట్రాక్టర్లుగా మారారు
* కేవలం కాంట్రాక్టుల కోసమే ప్రభుత్వంతో పని చేస్తున్నారే తప్ప... ప్రజా సమస్యలపై ఏనాడు ఆలోచించడం లేదు
* కృష్ణాడెల్టాలో తాగునీరు ఉన్నా శ్రీశైలం నుంచే ఎందుకు నీటిని తీసుకెళ్తున్నారు
* శ్రీశైలం నీటిని కిందకు వదలవద్దని ప్రిన్సిపాల్ సెక్రటరీకు విన్నవించి కనీసం వారం కూడా గడవక ముందే నీటిని వదలివేయడం దుర్మార్గం
* ప్రజలకు సేవ చేస్తూ... ప్రజల అవసరాలను తీర్చుతూ... ప్రజల మధ్య ఉన్న పార్టీలకు ప్రజలు దగ్గరవుతారు... అంతేకానీ ప్రజలపైకక్షసాధింపు చర్యలకు పాల్పడితే ప్రజల మద్దతు లభించదు.
* చంద్రబాబు సర్కారుకు రాయలసీమపై చిత్తశుద్ధి లేదు... ఇప్పటికైనా రైతులందరు కలిసి ఉద్యమం చేయాలి
* రాయలసీమ ప్రాంతానికి చెందిన వ్యక్తి ముఖ్యమంత్రిగా బాధ్యత వహిస్తూ... సీమకు తీరని అన్యాయం చేస్తున్నారు.
* రాయలసీమలో ఇదే పరిస్థితి కొనసాగితే రైతులందరూ కూలీలుగా మారే దుస్థితి నెలకొంటుంది
* రాయలసీమకు నీటి కేటాయింపులపై త్వరలోనే ఉద్యమిస్తామని ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు.
No comments:
Post a Comment