7 October 2015

చంద్రబాబు పాలన ఏమిటో మూడు ముక్కల్లో చెప్పగలరా.. ఓపెన్ ఆఫర్



గుంటూరు ) ప్రత్యేక హోదా కోసం నిరవధిక నిరాహార దీక్షకు దిగుతున్ సందర్భంలో ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఒక ఓపెన్ ఆఫర్ ప్రకటించారు. చంద్రబాబు పాలన తీరుని మూడు ముక్కల్లో చెప్పాలని ఆపర్ ప్రకటించారు. మోసం .. మోసం.. మోసం అన్న విధంగా సాగుతోందని ఆయన అన్నారు. దీనికి తోడు వెన్నుపోటు కూడా ఉంటుందని సభికులు పెద్ద ఎత్తున అనటంతో ఆయన చిరునవ్వుతో దాన్ని కూడా జోడించారు.
గుంటూరు  నల్లపాడు రోడ్డులో ప్రత్యేకహోదా సాధన కోసం వైఎస్ జగన్ నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించారు. ఈసందర్భంగా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలపై మండిపడ్డారు. చంద్రబాబు రాష్ట్రానికి చేస్తున్న అన్యాయాన్ని కడిగి పారేశారు. తన దీక్షకు మద్దతు తెలిపేందుకు వచ్చిన అశేషజనవాహినినుద్దేశించి వైఎస్ జగన్ ప్రసంగించారు. ప్రత్యేకహోదాను సాధించేవరకు విశ్రమించబోమని ప్రభుత్వాలను హెచ్చరించారు. 

చంద్రబాబు ఎన్నికలప్పుడు ఓమాట, ఎన్నికలయి పోయాక మరో మాట చెబుతూ ప్లేయి ఫిరాయించారని వైఎస్ జగన్ విమర్శించారు. ప్రత్యేకహోదా ఐదేళ్లు కాదు, పదిసంవత్సరాలు కావాలని ఎన్నికల సమయంలో ప్రతివీధిలో, మీటింగ్ లలో, టీవీల్లో చెప్పిన చంద్రబాబు...ఇప్పుడు తన కేసుల నుంచి బయటపడేందుకు మోడీ వద్ద సాగిలపడి హోదాను తాకట్టు పెట్టారని విరుచుకుపడ్డారు.


చంద్రబాబు పాలనంతా అవినీతి, అబద్ధాలు, మోసాలు,వెన్నుపోటులేనని వైఎస్ జగన్ అన్నారు. పట్టిసీమ నుంచి ఇసుక వరకు, బొగ్గు నుంచి మట్టివరకు కమీషన్ల రూపంలో లంచాలు పిండుకొని ...విచ్చలవిడిగా వచ్చిన సొమ్మును ఎమ్మెల్సీ ఎన్నికల్లో వెదజల్లి అడ్డంగా దొరికిపోయారని దుయ్యబట్టారు

No comments:

Post a Comment