8 January 2018

టీడీపీ ఓటమి చిత్తూరు నుంచే మొదలు

చిత్తూరు: రైతు రుణమాఫీ అనే ఒక్క మోసపువాగ్ధానాన్ని నమ్మి ప్రజలంతా విశ్వాసంతో ఓటేస్తే రైతులను చంద్రబాబు నట్టేట ముంచాడని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ అధికార ప్రతినిధి పద్మజ విమర్శించారు. గతంలో 9 ఏళ్ల పాటు వెన్నుపోటు పరిపాలనలో వ్యవసాయాన్ని చంద్రబాబు చిన్నచూపు చూశారన్నారు. చిత్తూరు జిల్లాలో కొనసాగుతున్న ప్రజా సంకల్పయాత్రలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు 2014 ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని, రైతుకు గిట్టుబాటు ధర లేదు, పంట బీమా లేదు, ఇన్సూరెన్స్, ఇన్‌పుట్‌ సబ్సిడీ వంటి వాటిని మర్చిపోయారన్నారు. చంద్రబాబు పాలనలో పదుల ఎకరాలు ఉన్న రైతులు కూడా కష్టాలు పడుతున్నారన్నారు. వేసిన పంటను కోసేందుకు కూలిడబ్బులు కూడా గిట్టుబాటు ధర దొరకడం లేదన్నారు. వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాడిపరిశ్రమను అభివృద్ధి చేస్తానని, చిత్తూరు డైరీని, షుగర్‌ ఫ్యాక్టరీలను తెరిపించి రైతులను మేలు చేస్తానని ప్రకటించారని గుర్తు చేశారు. అదే విధంగా వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లాంటి నాయకుడు ముఖ్యమంత్రిగా ఉంటే ప్రత్యేక హోదా కూడా సాధించుకోవచ్చునని, హోదా వస్తే పరిశ్రమలు, ఉద్యోగాలు, ఉపాధి లభిస్తాయన్నారు. వైయస్‌ జగన్‌ వల్లే ఇవన్నీ సాధ్యపడతాయన్నారు. చంద్రబాబుకు ఓటేసి గెలిపించిన చిత్తూరు జిల్లా వాసులంతా సిగ్గుపడుతున్నారని, రాబోయే రోజుల్లో టీడీపీ ఓటమి చిత్తూరు నుంచే మొదలవుతుందన్నారు. నీతి, నిజాయితీ లేని ఫిరాయింపు ఎమ్మెల్యే అమర్‌నాథ్‌రెడ్డి లాంటి వ్యక్తులకు బుద్ధి చెబుతారన్నారు. 

No comments:

Post a Comment