4 January 2018

అధికారిక సభా వేదికపై రౌడీలెందుకు

ఎంపీ వైయస్‌ అవినాష్‌రెడ్డి ప్రసంగాన్ని ఎందుకు అడ్డుకున్నారు
జన్మభూమి సభలో సీఎం తీరును ఖండిస్తున్నాం
ఇది ప్రజాస్వామ్యమా.. లేక రాచరికమా?
చేతిలో మైక్‌ లాక్కోవడమేనా మీ అనుభవం
ఎంపీ ఎవరినైనా దుర్భాషలాడారా.. లేక నిందించారా?
మహానేత వైయస్‌ఆర్‌ కృషిని గుర్తుచేసుకోవడం తప్పా
హైదరాబాద్‌: జన్మభూమి సభ అధికారిక కార్యక్రమం అని చెప్పిన చంద్రబాబు ఆ సభా వేదికపైకి రౌడీలను, గుండాలను ఎందుకు ఎక్కించారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. కడప జిల్లా పులివెందులలో జరిగిన జన్మభూమి సమావేశంలో ఎంపీ వైయస్‌ అవినాష్‌రెడ్డిపై టీడీపీ నేతలు, చంద్రబాబు ప్రవర్తించిన తీరును ఖండిస్తున్నామని బొత్స అన్నారు. హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో బొత్స సత్యనారాయణ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జన్మభూమి సమావేశం పేరుతో పోలీసులు ఎంపీ వైయస్‌ అవినాష్‌రెడ్డిని గృహనిర్బంధం చేయాలని ప్రయత్నించారన్నారు. తరువాత సభకు వచ్చిన ఎంపీని మాట్లాడనివ్వకుండా చంద్రబాబు ప్రవర్తించిన తీరు, చేతిలో మైక్‌ ల్కావడం ఏంటని నిలదీశారు. ఇది ప్రజాస్వామ్యమా.. లేక నియంత పాలనా అని ప్రశ్నించారు. ముందుగా స్థానిక ఎంపీతో మాట్లాడించి తరువాత సీఎం మాట్లాడాలని అదే ప్రోటోకాల్‌ అని, కానీ చంద్రబాబు అందుకు విరుద్ధంగా ప్రవర్తించారని ధ్వజమెత్తారు. 

ఎంపీ వైయస్‌ అవినాష్‌రెడ్డి ఎవరినైనా నిందించారా.. లేక ఏమైనా దుర్భాషలాడారా.. దేనికి చేతిలో మైక్‌ లాక్కున్నారని బొత్స ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గండిపేట నుంచి నీరు ఇస్తానని, పైడిపాలెం ప్రాజెక్టు నుంచి నీరు ఇస్తానని చెప్పారు. పైడిపాలెం ప్రాజెక్టు విలువ రూ. 700 కోట్లు ఉంటే చంద్రబాబు కేవలం రూ. 23 కోట్లే ఖర్చు చేశారని, అదే విధంగా గండిపేట ప్రాజెక్టుకు టీడీపీ ప్రభుత్వం ఖర్చు చేసింది రూ. 72 కోట్లేనని, దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి రూ.11 వందల కోట్లు ఖర్చు చేశారని వైయస్‌ అవినాష్‌రెడ్డి వేదికపై గుర్తు చేశారన్నారు. అంతకంటే ఎక్కువ ఏమైనా మాట్లాడారా.. ఎంపీ చెప్పింది ఏమైనా అవాస్తవమా.. వాస్తవం మాట్లాడినందుకు చేతిలో మైక్‌ లాక్కుంటారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయస్‌ఆర్‌ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేసి దాదాపు పూర్తి చేశారని చంద్రబాబే చెప్పుకోవాలన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇది ప్రభుత్వ సభ అన్నారు.. ప్రభుత్వ సభలోకి గుండాలు, రౌడీలు ఎందుకు వచ్చారని ప్రశ్నించారు. 

చంద్రబాబూ ఎల్లకాలం అధికారం మీ చేతుల్లో ఉంటుందనుకుంటున్నావా.. ఏంటీ దౌర్జన్యం.. ఇది ప్రజాస్వామ్యమా.. రాచరికమా అని బొత్స మండిపడ్డారు. ప్రజా ప్రతినిధి చేతుల్లోంచి ఎవరైనా మైక్‌ లాక్కుంటారా.. అనువజ్ఞులమని చెప్పుకుంటారు.. ఇదేనా మీ అనుభవం అని ప్రశ్నించారు. సాక్షాత్తు స్థానిక ఎంపీకే సభలో మాట్లాడే అవకాశం ఇవ్వకుంటే ఇంకా ఎవరికి ఇస్తారని నిలదీశారు. అదే సభావేదికపై నుంచి 4 లక్షల పెన్షన్లు, రేషన్‌ కార్డులు ఇస్తున్నామని గొప్పులు చెబుతున్నారు.. 2014లో మీరు అధికారంలోకి రాకముందు గత ప్రభుత్వం ఎంత మందికి పెన్షన్‌ ఇచ్చిందో మీ 4 లక్షలతో కలుపుకొని చూసుకోవాలని సూచించారు. మీ పెన్షన్ల కంటే ఎక్కవగానే ఉంటాయన్నారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి పెన్షన్‌లపై రివ్యూమీటింగ్‌లు పెట్టి ఖాళీలు పూరించి అర్హులకు పెన్షన్‌లు ఇచ్చారన్నారు. కానీ మీరు గత మూడున్నరేళ్లుగా ఇస్తున్న పెన్షన్‌ అప్లికేషన్స్‌ను రోడ్లపై పడేస్తున్నారన్నారు. చంద్రబాబు ప్రవర్తనను వైయస్‌ఆర్‌ సీపీ పూర్తిగా ఖండిస్తుందన్నారు. 
భక్తుల మనోభాలను దెబ్బతీస్తున్న చంద్రబాబు
దుర్గగుడిలో తాంత్రిక పూజలపై విచారణ జరిపించాలి
టీడీపీ అధికారంలోకి వచ్చిన ఏదో ఒకటి చేసి భక్తుల మనోభావాలను దెబ్బతీస్తుందని బొత్స సత్యనారాయణ గుర్తు చేశారు. రాష్ట్రంలో అందరి ఇళవెల్పు వెంకటేశ్వరస్వామి, అదే స్థాయిలో బెజవాడ దుర్గమ్మ అంటే నమ్మకం అన్నారు. అలాంటి దుర్గ గుడి ప్రతిష్టను చంద్రబాబు దిగజార్చే విధంగా కార్యక్రమాలు చేస్తున్నారని బొత్స ఆరోపించారు. 26వ తేదీన దుర్గమ్మ గుడిలో తాంత్రిక పూజలు జరిగాయని, అదీ చంద్రబాబు కుటుంబ సభ్యులు చేయించారని అపవాదలు వచ్చాయన్నారు. ఇది ఒక రాజకీయ పార్టీదో.. ఒక వర్గానిదో కాదని, దీనిపై ముఖ్యమంత్రి, సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదా అని ప్రశ్నించారు. ఇప్పటికీ వారం రోజులు అవుతున్నా.. తాంత్రిక పూజల విషయంపై అతిగతి లేదన్నారు. దేవాదాయ శాఖామంత్రి ఒక మాట. పాలక మండలి ఒక మాట. ఈఓ ఒక మాట చెబుతున్నారన్నారు. ఈఓ దగ్గరుండి ఈ కార్యక్రమాలు చేయించారని పాలక మండలి చెబుతున్నా.. సంబంధిత మంత్రి ఎందుకు అంత బేలతనంగా ఉన్నారో.. అర్థం కావడం లేదన్నారు. 

ప్రతీదాన్ని రాజకీయ దురుద్దేశ్యంతో చేయాలనుకోవడం తప్పని, అది రాష్ట్రానికే అరిష్టమని బొత్స అన్నారు. చంద్రబాబు తన స్వార్థం కోసం దుర్గమ్మ గుడి ఔన్నత్యాన్ని దెబ్బకొట్టాలని చూస్తున్నాడని ఆరోపించారు. తాంత్రిక పూజలు జరిగాయని సీసీ ఫుటేజీలలో నిక్షిప్తమయ్యాయని, దీనికి ఇంకా ఎన్ని రోజులు విచారణ చేయిస్తారన్నారు. ఇంకా ఎంత కాలం భక్తులు నిరీక్షించాలని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలు సంస్కృతి సంప్రదాయాలు పాటించేవారని, వారి నమ్మకంపై దెబ్బకొట్టకుండా త్వరితగతిన విచారణ జరిపించాలన్నారు. బయటివారు ఆలయంలోకి ఎందుకు వచ్చారు.. వారి వెనక ఉన్నది ఎవరో చర్యలు తీసుకోవాలని, అదే విధంగా ప్రజాస్వామ్య రీతిలో అధికారిక కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులకు తగిన గౌరవం ఇవ్వాలని, పులివెందుల జన్మభూమి సభా వేదికపై ఉన్న రౌడీషీటర్లపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. 

No comments:

Post a Comment