5 January 2018

అగ్ని ప్ర‌మాదంపై వైయ‌స్ జ‌గ‌న్ ఆరా

చిత్తూరు: వైయ‌స్ఆర్ జిల్లా బద్వేలులోని అంబేద్కర్-మార్క్స్ కాలనీలో నిన్నరాత్రి జరిగిన ఘోర అగ్ని ప్రమాదంపై చిత్తూరు జిల్లాలో ప్రజా సంకల్ప పాదయాత్రలో ఉన్నవైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆరా తీశారు. ఈ ప్రమాదంపై స్థానిక ఎంపీ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డిలను అడిగి  వివరాలు  తెలుసుకున్నారు. అగ్ని ప్రమాద బాధితులకు అండగా నిలబడాలని వారికి సూచించారు. 

స‌త్యం మృతికి వైయ‌స్ జ‌గ‌న్ సంతాపం
చిత్తూరు: గుంటూరు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం పరిధిలోని  అచ్చంపేట మండల వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు సందెపోగు సత్యం హఠాన్మరణంపై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర విచారం వ్యకం చేశారు. మృతుని కుటుంబ సభ్యులతో ఈరోజు నేరుగా ఫోన్లో మాట్లాడి, వారికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. పార్టీ అభివృద్ధికి స‌త్యం చేసిన సేవ‌లు చిర‌స్మ‌ర‌ణీయ‌మ‌న్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మృతికి వైయ‌స్ జ‌గ‌న్ సంతాపం తెలిపారు.

No comments:

Post a Comment