కృష్ణా: సుబాబుల్ రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మొండికోట జగన్మోహన్రావు నందర్లపాడు నుంచి నందిగామ వరకు పాదయాత్ర చేపట్టారు. సుబాబుల్ రైతులకు నష్టం కలిగిస్తున్న 143, 493 జీఓలను వెంటనే ప్రభుత్వం రద్దు చేయాలని కోరారు. అదే విధంగా సుబాబుల్ క్వింటాల్కు రూ.4,400 మద్దతు ధర కల్పించి, రూ. 11 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలన్నారు. పాదయాత్రలో పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి పార్థసారధి, సామినేని ఉదయభాను తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment