పట్టి సీమ కడితే గోదావరి వరద నీరు సద్వినియోగం అవుతుందని, దీంతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని కొందరు డబ్బా కొడుతున్నారు. కానీ తరచి చూస్తే ఇలాంటి అనాలోచిత చర్యలతో త్వరలోనే గోదావరి ఎడారి గా మారిపోయే ప్రమాదం ఉంది. వరదల సమయంలో ఓకే కానీ, మిగిలిన 9 నెలల పాటు చాలా తక్కువ నీళ్లు మాత్రమే గోదావరి లో ప్రవహిస్తాయి. ఆ కాస్త నీటిని రిజర్వాయర్ లేని ఎత్తిపోతల పథకం ద్వారా తోడేస్తే ఇక గోదావరి జిల్లాల రైతులకు సాగునీరు అందడం కష్టం అవుతుంది. అంతిమంగా వరదలు లేని రెండో పంట సీజన్ లో ఇక్కట్లు తప్పవు.
# గోదావరికి వస్తున్న నీరు చాలా తక్కువగా ఉంది. అంటే అసలు నీటి ప్రవాహం 1,500 క్యూసెక్కులు,సీలేరు నుంచి 4వేలు, బైపాస్ చేయగా వస్తున్నది 2వేల క్యూసెక్కులు. ఉపనదుల ప్రవాహాల్ని కలుపుకొంటేదాదాపు ఏడు ఏడున్నర వేల క్యూసెక్కుల నీరు వస్తోంది. మరి దీని నుంచి ఎనిమిదిన్నర వేల క్యూసెక్కులనీటిని తోడేసేందుకు పట్టిసీమలో ప్రణాళికలు రచిస్తున్నారు. అంటే దిగువన ఉన్న గోదావరి డెల్టాఎండిపోవాల్సిందేనా..!
# గోదావరికి వరదలు అంటే జూలై నెల చివరి నుంచి సెప్టెంబర్ చివరి దాకా, తప్పితే అక్టబర్ దాకా వస్తాయి.దాదాపుగా 60 నుంచి 90 రోజుల పాటు వరదలు పొంగితే గొప్ప. కానీ ఏడాదిలో ఆరు నెలలు, ఏడు నెలలపాటు గోదావరి పొంగుతుందని తెలుగుదేశం నేతలు గొప్పలు చెబుతున్నారు.
# జూలై నెలాఖరు నుంచి అక్టోబర్ దాకా దాదాపు 10 వేల క్యూసెక్కుల మేర నీరు పారింది అనుకొందాం. ఆతర్వాత నీటిమట్టం పడిపోవాల్సిందే. మరి అప్పుడు కూడా ఎగువ నీరు తోడటం ఆపుతారా..లేదా..!
# ప్రస్తుతం గోదావరి జిల్లాల రైతులు రెండో పంట మీదనే ఆధారపడుతున్నారు. మొదటి పంట ఎప్పుడూవరదలు, ప్రకృతి బీభత్సాలకు నష్ట పోతూంటారు. అటువంటి రెండో పంటకు పట్టి సీమ తో ముప్పు పొంచిఉంది కదా.
# పోలవరం ప్రాజెక్టుపూర్తయితే 194 టీఎమ్సీల నీటిని నిల్వచేసుకొనే వెసులుబాటు కలుగుతుంది. అప్పుడువరద నీటిని ఆపుకొని రెండో పంటకు సమృద్ధిగా నీటిని ఇచ్చుకోవచ్చు.
# పట్టి సీమలో ఎక్కడా నీటిని నిల్వ చేసుకొనే వెసులుబాటు లేదు. అటువంటప్పుడు ఏకబిగిన తోడుకొంటూపోతే, రెండో పంట నీటి పరిస్థితి ఏమిటి..
#లోకల్ గెజిట్ ఆర్డర్ - 1962 ప్రకారం దిగువ ప్రాంతాలకు మొదటగా నీరు ఇవ్వాల్సి ఉంటుంది. పట్టి సీమపుణ్యమా అని నీరు తగ్గిపోతే లవణీయత సమస్యను ఎలా ఎదుర్కొంటారు.
సూటిగా చెప్పాలంటే ఏడాది పొడవునా తెలంగాణ లోని ఏడు ఎత్తిపోతల పథకాలతోటి నీటిని తోడతారు. 1,2 ఏడాదుల్లో ఇవి పూర్తవటం ఖాయం, నీటిని తోడటం ఖాయం. అదనంగా పట్టిసీమ పేరుతో ఏడాది పొడవునా 8వేల క్యూసెక్కుల నీటిని తోడేస్తే ఇక దిగువన గోదావరికి వచ్చే వందల క్యూసెక్కులు కూడా ఉండదు. అప్పుడు దిగువన ఉన్న గోదావరి జిల్లాలు ఎండిపోవాల్సిందే కదా..!
No comments:
Post a Comment