19 May 2016

అడ్డగోలుగా నీళ్లు తోడుకోవడం అన్యాయం కేసీఆర్ః వైయస్ జగన్

  • ఢిల్లీ వెళ్లి ఏం సాధించావు చంద్రబాబు
  • హోదాపై రెండు నాల్కల ధోరణితో మాట్లాడుతున్నాడు
  • ఆంధ్ర తగలబడుతుంటే ఫిడేల్ వాయిస్తున్నాడు
  • ఇలాంటి ముఖ్యమంత్రి మనకుండడం సిగ్గుచేటు
  • కేసుల భయంతోనే బాబు నోరుమెదపడం లేదు

కర్నూలు: రాష్ట్రం తగలబడిపోతుంటే పోతే పోనీయ్ అన్నట్లు చంద్రబాబు నీరో చక్రవర్తిలా ఫిడేల్ వాయిస్తున్నాడని వైయస్సార్సీపీ అధ్యక్షులు ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మండిపడ్డారు. ఓ పక్క తెలంగాణ అక్రమ ప్రాజెక్ట్ లు నిర్మిస్తూ ఏపీకి అన్యాయం చేస్తుంటే బాబు అవేమీ పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. గతంలో పై రాష్ట్రాలు ఆల్మట్టి, బాబ్లీలు నిర్మించినా బాబు పట్టించుకోలేదని... ఇప్పుడు తెలంగాణ ప్రాజెక్ట్ లను అడ్డుకోవడం లేదని దుయ్యబట్టారు. 
 
రెండు నాల్కల ధోరణి 
చంద్రబాబు ఢిల్లీ వెళ్లి ప్రత్యేక హోదా గురించి మాట్లాడకపోవడం దురదృష్టకరమని వైయస్‌ జగన్‌ మండిపడ్డారు. ఢిల్లీ వెళ్లిన బాబు  ప్రత్యేక హోదా వస్తే నిధులు రావని «రెండు నాల్కల దోరణితో మాట్లాడటం సిగ్గు చేటన్నారు. కర్నూలు దీక్షాస్థలి నుంచి వైయస్ జగన్ మాట్లాడారు. తెలంగాణ ప్రాజెక్టులపై విలేకరి అడిగి ప్రశ్నలకు బాబు చెప్పిన సమాధానం ఏంటో తెలుసా..! జలవనరుల అనుమతి తీసుకోవాలని, సీడబ్ల్యూసీ అనుమతి తీసుకోవాలని బాబు సమాధానం చెప్పడం హాస్యాస్పదం. ఇవన్ని మనకు తెలియవా అని వైయస్ జగన్ బాబును తూర్పారబట్టారు. గతంలో  9 ఏళ్లు బాబు సీఎంగా చేశారు. అప్పట్లో మహారాష్ట్ర, కర్ణాటక ప్రభుత్వాలు అడ్డగోలుగా ప్రాజెక్టులు కడుతున్నా పట్టించుకోలేదు. ఇప్పుడు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 


జైలుకు పోతావని భయమా బాబు
తెలంగాణలో ఓటుకు కోట్లు కేసులో ఎమ్మెల్యేలకు లంచం ఇస్తూ ఆడియో, వీడియో టేపులతో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు....ప్రాజెక్ట్ లపై  కేసీఆర్‌ను ప్రశ్నిస్తే  జైలుకు పంపిస్తాడని భయపడుతున్నాడు. పోనీ కేంద్రాన్నైనా అడుగుతారా అని చూస్తే..అది కూడా లేదు. కేంద్రానికి అల్టిమేటం ఇచ్చే కెపాసిటి చంద్రబాబుకు లేదు. కారణం. నరేంద్రమోదీ వద్దకు వెళ్లి మాట్లాడితే అవినీతిపై విచారణ చేపడతారని బాబు భయపడుతున్నాడు. చంద్రబాబు ఆలోచనలో మార్పు రావాలని, ఇకనైనా ఆయనకు జ్ఞానోదయం కలగాలని వైయస్ జగన్ అన్నారు. ఆయనపై ఒత్తిడి తెచ్చేందుకు రాబోయే రోజుల్లో ఈ పోరాటాలు కొనసాగిద్దామని పిలుపునిచ్చారు. కృష్ణా ప్రాంతంలో జలదీక్ష చేశాం. రాబోయే రోజుల్లో గోదావరి జలాలపై ఆందోళనలు చేపడుదామని చెప్పారు. దమాషా ప్రకారం కిందకు నీటిని వదలకపోతే రాష్ట్రాలు బతకవని జననేత వాపోయారు. వ్యవస్థలో మార్పు కోసం కలిసికట్టుగా ఉద్యమిద్దామని ప్రజానీకానికి పిలుపునిచ్చారు.

 

ఎడాపెడా నీళ్లు తోడుకుంటే మా పరిస్థితి ఏంటి..?
తెలంగాణ ప్రభుత్వం ఎగువన ఎడాపెడా నీళ్లు తోడుకుంటే దిగువన ఉన్న ఆంధ్ర రాష్ట్ర ప్రజల పరిస్థితి ఏంటని వైయస్‌ జగన్‌ ప్రశ్నించారు. అయ్యా కేసీఆర్‌.. మనమందరం అన్నదమ్ముళ్లా కలిసి మెలిసి ఉన్నాం. ఆరోజు పై రాష్ట్రాల్లో బాబ్లీ, ఆల్మట్టి కడుతున్నప్పుడు అందరం కలిసి కట్టుగా పోరాటం చేశాం. నాటి పోరాటం కేసీఆర్‌కు గుర్తుకు రావడం లేదా అని ప్రశ్నించారు. కేసీఆర్‌..మీ గుండెల మీద చేయి వేసుకొని ఆలోచించాలని సూచించారు.  మహారాష్ట్ర అవసరాలు తీరనిదే మనకు నీళ్లు రావలని తెలుసు. ఇవాళ మీరు కూడా మధ్యలో వచ్చి శ్రీశైలానికి నీరు రాకముందే మోటర్లు పెట్టి తోడుకుంటామని చెప్పడం ఎంత వరకు సమంజసం అని నిలదీశారు.

ప్రతీ వాటాకు లెక్కలు కట్టాలి
ఎడాపెడా రోజుకు 2 టీఎంసీల నీళ్లు తోడుకుంటే కిందకి నీళ్లు ఎలా వస్తాయని ప్రశ్నించారు.  మేమే పైనుండి మీకు నీళ్లు రాకుండా ఆపి ఉంటే మీ పరిస్థితి ఏంటని కడిగిపారేశారు. పాలించే వాళ్లు, పాలకులు గతం మరచి నాది నాది అని మొదలు పెడితే  భవిష్యత్‌లో అది ఏదీ మీకు అందదన్నారు. ఇవాళ అందరం కలిసి కట్టుగా ఒక్కటై మార్పు తీసుకొని వద్దామని పిలుపునిచ్చారు. మహారాష్ట్ర, కార్ణాటక, తెలంగాణ, ఏపీ పాలకులు అందరు కూడా ఆలోచించాలన్నారు. కేసీఆర్‌ కూడా ఆలోచించాలి..పైన ఉన్న కర్నాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలు ఎడాపెడా ప్రాజెక్టులు కడితే తెలంగాణ, ఆంధ్రకు కూడా నీళ్లు రావన్నారు. ప్రతి చుక్కలో మీ వాట ఇంత అని లెక్కలు కట్టాలన్నారు. దమాషా ప్రకారం కిందకు నీళ్లు వదిలినప్పుడు కరువు వస్తే అందరికి వస్తుందని, వరదలు రావని చెప్పారు. వ్యవస్థలో మార్పు కోసం మనమందరం కృషి చేయాలన్నారు. 

మొండిగా వ్యవహరిస్తే తాగడానికి కూడా నీళ్లుండవు
మహబూబునగర్‌లో లిఫ్టులు పెట్టి ఎడాపెడా నీళ్లు తోడుకుంటున్నారు. ఇది న్యాయామా..?. 800 అడుగులకే రోజుకు 30 వేల క్యుసెక్కుల నీళ్లు తోడుకుంటే కింది ప్రాంతాల పరిస్థితి ఏంటి..ఇది అన్యాయం కాదా అని నిలదీశారు. పునర్ వ్యవస్థీకరణ చట్టంలో కృష్ణా, గోదావరి నదులపై కొత్తగా కట్టే ప్రాజెక్టులు కట్టాలని నిబంధనలు లేవన్నారు. మీ చేతుల్లో అధికారం ఉందని, బలం లేని మాపై ప్రతాపం చూడటం న్యాయామా అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రాజెక్టులకు ఎఫెక్సు కమిటీ అనుమతులు, జలవనరుల అనుమతులు లేవని చెప్పారు. మా రాష్ట్రం నుంచి కిందకు నీళ్లు వెళ్తున్నాయని, మాఇష్టం అని తెలంగాణ సర్కార్‌ మొండిగా వ్యవహరిస్తే..రాయలసీమ, ప్రకాశం జిల్లాలకు తాగడానికి నీళ్లు ఉండవని ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే మాదిరిగా గోదావరిలో 70 వేల క్యూసెక్కుల నీళ్లు కేసీఆర్‌ తోడుకుంటే కింది ఆయకట్టు పరిస్థితి ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

18 May 2016

ఢిల్లీ వెళ్లి ఏం సాధించావు చంద్రబాబు

  • హోదాపై రెండు నాల్కల ధోరణితో మాట్లాడుతున్నాడు
  • ఆంధ్ర తగలబడుతుంటే ఫిడేల్ వాయిస్తున్నాడు
  • ఇలాంటి ముఖ్యమంత్రి మనకుండడం సిగ్గుచేటు
  • కేసుల భయంతోనే బాబు నోరుమెదపడం లేదు
  • అడ్డగోలుగా నీళ్లు తోడుకోవడం అన్యాయం కేసీఆర్ః వైయస్ జగన్

కర్నూలు: రాష్ట్రం తగలబడిపోతుంటే పోతే పోనీయ్ అన్నట్లు చంద్రబాబు నీరో చక్రవర్తిలా ఫిడేల్ వాయిస్తున్నాడని వైయస్సార్సీపీ అధ్యక్షులు ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మండిపడ్డారు. ఓ పక్క తెలంగాణ అక్రమ ప్రాజెక్ట్ లు నిర్మిస్తూ ఏపీకి అన్యాయం చేస్తుంటే బాబు అవేమీ పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. గతంలో పై రాష్ట్రాలు ఆల్మట్టి, బాబ్లీలు నిర్మించినా బాబు పట్టించుకోలేదని... ఇప్పుడు తెలంగాణ ప్రాజెక్ట్ లను అడ్డుకోవడం లేదని దుయ్యబట్టారు. 


 
రెండు నాల్కల ధోరణి 
చంద్రబాబు ఢిల్లీ వెళ్లి ప్రత్యేక హోదా గురించి మాట్లాడకపోవడం దురదృష్టకరమని వైయస్‌ జగన్‌ మండిపడ్డారు. ఢిల్లీ వెళ్లిన బాబు  ప్రత్యేక హోదా వస్తే నిధులు రావని «రెండు నాల్కల దోరణితో మాట్లాడటం సిగ్గు చేటన్నారు. కర్నూలు దీక్షాస్థలి నుంచి వైయస్ జగన్ మాట్లాడారు. తెలంగాణ ప్రాజెక్టులపై విలేకరి అడిగి ప్రశ్నలకు బాబు చెప్పిన సమాధానం ఏంటో తెలుసా..! జలవనరుల అనుమతి తీసుకోవాలని, సీడబ్ల్యూసీ అనుమతి తీసుకోవాలని బాబు సమాధానం చెప్పడం హాస్యాస్పదం. ఇవన్ని మనకు తెలియవా అని వైయస్ జగన్ బాబును తూర్పారబట్టారు. గతంలో  9 ఏళ్లు బాబు సీఎంగా చేశారు. అప్పట్లో మహారాష్ట్ర, కర్ణాటక ప్రభుత్వాలు అడ్డగోలుగా ప్రాజెక్టులు కడుతున్నా పట్టించుకోలేదు. ఇప్పుడు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

జైలుకు పోతావని భయమా బాబు
తెలంగాణలో ఓటుకు కోట్లు కేసులో ఎమ్మెల్యేలకు లంచం ఇస్తూ ఆడియో, వీడియో టేపులతో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు....ప్రాజెక్ట్ లపై  కేసీఆర్‌ను ప్రశ్నిస్తే  జైలుకు పంపిస్తాడని భయపడుతున్నాడు. పోనీ కేంద్రాన్నైనా అడుగుతారా అని చూస్తే..అది కూడా లేదు. కేంద్రానికి అల్టిమేటం ఇచ్చే కెపాసిటి చంద్రబాబుకు లేదు. కారణం. నరేంద్రమోదీ వద్దకు వెళ్లి మాట్లాడితే అవినీతిపై విచారణ చేపడతారని బాబు భయపడుతున్నాడు. చంద్రబాబు ఆలోచనలో మార్పు రావాలని, ఇకనైనా ఆయనకు జ్ఞానోదయం కలగాలని వైయస్ జగన్ అన్నారు. ఆయనపై ఒత్తిడి తెచ్చేందుకు రాబోయే రోజుల్లో ఈ పోరాటాలు కొనసాగిద్దామని పిలుపునిచ్చారు. కృష్ణా ప్రాంతంలో జలదీక్ష చేశాం. రాబోయే రోజుల్లో గోదావరి జలాలపై ఆందోళనలు చేపడుదామని చెప్పారు. దమాషా ప్రకారం కిందకు నీటిని వదలకపోతే రాష్ట్రాలు బతకవని జననేత వాపోయారు. వ్యవస్థలో మార్పు కోసం కలిసికట్టుగా ఉద్యమిద్దామని ప్రజానీకానికి పిలుపునిచ్చారు. 

ఎడాపెడా నీళ్లు తోడుకుంటే మా పరిస్థితి ఏంటి..?
తెలంగాణ ప్రభుత్వం ఎగువన ఎడాపెడా నీళ్లు తోడుకుంటే దిగువన ఉన్న ఆంధ్ర రాష్ట్ర ప్రజల పరిస్థితి ఏంటని వైయస్‌ జగన్‌ ప్రశ్నించారు. అయ్యా కేసీఆర్‌.. మనమందరం అన్నదమ్ముళ్లా కలిసి మెలిసి ఉన్నాం. ఆరోజు పై రాష్ట్రాల్లో బాబ్లీ, ఆల్మట్టి కడుతున్నప్పుడు అందరం కలిసి కట్టుగా పోరాటం చేశాం. నాటి పోరాటం కేసీఆర్‌కు గుర్తుకు రావడం లేదా అని ప్రశ్నించారు. కేసీఆర్‌..మీ గుండెల మీద చేయి వేసుకొని ఆలోచించాలని సూచించారు.  మహారాష్ట్ర అవసరాలు తీరనిదే మనకు నీళ్లు రావలని తెలుసు. ఇవాళ మీరు కూడా మధ్యలో వచ్చి శ్రీశైలానికి నీరు రాకముందే మోటర్లు పెట్టి తోడుకుంటామని చెప్పడం ఎంత వరకు సమంజసం అని నిలదీశారు.

ప్రతీ వాటాకు లెక్కలు కట్టాలి
ఎడాపెడా రోజుకు 2 టీఎంసీల నీళ్లు తోడుకుంటే కిందకి నీళ్లు ఎలా వస్తాయని ప్రశ్నించారు.  మేమే పైనుండి మీకు నీళ్లు రాకుండా ఆపి ఉంటే మీ పరిస్థితి ఏంటని కడిగిపారేశారు. పాలించే వాళ్లు, పాలకులు గతం మరచి నాది నాది అని మొదలు పెడితే  భవిష్యత్‌లో అది ఏదీ మీకు అందదన్నారు. ఇవాళ అందరం కలిసి కట్టుగా ఒక్కటై మార్పు తీసుకొని వద్దామని పిలుపునిచ్చారు. మహారాష్ట్ర, కార్ణాటక, తెలంగాణ, ఏపీ పాలకులు అందరు కూడా ఆలోచించాలన్నారు. కేసీఆర్‌ కూడా ఆలోచించాలి..పైన ఉన్న కర్నాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలు ఎడాపెడా ప్రాజెక్టులు కడితే తెలంగాణ, ఆంధ్రకు కూడా నీళ్లు రావన్నారు. ప్రతి చుక్కలో మీ వాట ఇంత అని లెక్కలు కట్టాలన్నారు. దమాషా ప్రకారం కిందకు నీళ్లు వదిలినప్పుడు కరువు వస్తే అందరికి వస్తుందని, వరదలు రావని చెప్పారు. వ్యవస్థలో మార్పు కోసం మనమందరం కృషి చేయాలన్నారు. 

మొండిగా వ్యవహరిస్తే తాగడానికి కూడా నీళ్లుండవు
మహబూబునగర్‌లో లిఫ్టులు పెట్టి ఎడాపెడా నీళ్లు తోడుకుంటున్నారు. ఇది న్యాయామా..?. 800 అడుగులకే రోజుకు 30 వేల క్యుసెక్కుల నీళ్లు తోడుకుంటే కింది ప్రాంతాల పరిస్థితి ఏంటి..ఇది అన్యాయం కాదా అని నిలదీశారు. పునర్ వ్యవస్థీకరణ చట్టంలో కృష్ణా, గోదావరి నదులపై కొత్తగా కట్టే ప్రాజెక్టులు కట్టాలని నిబంధనలు లేవన్నారు. మీ చేతుల్లో అధికారం ఉందని, బలం లేని మాపై ప్రతాపం చూడటం న్యాయామా అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రాజెక్టులకు ఎఫెక్సు కమిటీ అనుమతులు, జలవనరుల అనుమతులు లేవని చెప్పారు. మా రాష్ట్రం నుంచి కిందకు నీళ్లు వెళ్తున్నాయని, మాఇష్టం అని తెలంగాణ సర్కార్‌ మొండిగా వ్యవహరిస్తే..రాయలసీమ, ప్రకాశం జిల్లాలకు తాగడానికి నీళ్లు ఉండవని ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే మాదిరిగా గోదావరిలో 70 వేల క్యూసెక్కుల నీళ్లు కేసీఆర్‌ తోడుకుంటే కింది ఆయకట్టు పరిస్థితి ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

రాష్ట్రానికి బాబు తిండి, నీరు లేకుండా చేస్తున్నాడు

  • స్వార్థ ప్రయోజనాల కోసం ఏపీని తాకట్టు పెడుతున్నాడు
  • అక్రమ ప్రాజెక్ట్ లతో ఏపీకి తీరని అన్యాయం 
  • ప్రజల శ్రేయస్సు కోసం జననేత అలుపెరగని పోరాటం
  • బాబు కారణంగానే ఏపీ ఎడారిగా మారిందిః ఉమ్మారెడ్డి
కర్నూలుః రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై వైయస్ జగన్ జలదీక్ష చేపట్టే వరకు కూడా ప్రభుత్వానికి చీమకుట్టినట్టైనా లేదని వైయస్సార్సీపీ ఎమ్మెల్యే ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఆగ్రహించారు.  జలదీక్ష‌ చేప‌డుతాన‌ని వైయస్ జగన్ తేదీల‌ు ఖ‌రారు చేయ‌గానే ....కేంద్రానికి, తెలంగాణ సీఎంకు లేఖలు రాస్తామంటూ పచ్చమంత్రులు మాట్లాడడం హాస్పాస్పదమన్నారు.   ప్రజల శ్రేయస్సు కోసం ప్రజానాయకుడు  వైయ‌స్ జ‌గ‌న్ అలుపెర‌గ‌కుండా పోరాడుతున్నారని చెప్పారు. ఇప్పటివరకు 26 సార్లు రాష్ట్ర స‌మ‌స్య‌ల‌పై దీక్ష‌లు చేశారని,  నేడు 27వ జ‌ల‌దీక్ష చేప‌ట్టార‌ని ఉమారెడ్డి వెంక‌టేశ్వ‌ర్లు తెలిపారు. జననేత చేపట్టిన జలదీక్ష  చ‌రిత్ర‌లో ఓ మైలురాయిలా నిలుస్తుందన్నారు.  

నీరు ఉంటేనే రాష్ట్రాభివృద్ధి....
పాలకులు, అధికారపక్షం నిర్లక్ష్యం కారణంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో తీవ్ర నీటి ఎద్ద‌డి పరిస్థితులు నెలకొన్నాయని, రాబోయే కాలంలో ఇది మరింత ప్రమాదకరంగా ఉంటుందని ఉమ్మారెడ్డి తెలిపారు.  నీరు లేక‌పోవడంతో రైతు పంట‌ను సాగు చేయ‌లేక వలసలు పోతున్నారని,  ప‌శువుల‌ు క‌భేళాల‌కు తరలుతున్న దుస్థితి నెల‌కొంద‌న్నారు. ఇవేమీ  ప‌ట్ట‌ని సీఎం చంద్రబాబు విలాసాల కోసం విదేశాలు తిరుగుతుంటే... మంత్రులు మాత్రం స‌మ‌స్య ప‌రిష్కారం కోసం దీక్ష చేస్తున్న వారిపై ఎగతాళి చేస్తున్నారని మండిపడ్డారు.  కృష్ణా, గోదావ‌రి జ‌లాల్లో ఏపీకి రావాల్సిన నీళ్ల వాటా రాక‌పోతే భ‌విష్య‌త్ త‌రాలకు మ‌నుగ‌డ ఉండ‌ద‌న్నారు. మ‌న  రాష్ట్ర హ‌క్కుల‌ను సాధించుకోవ‌డ‌మే కాకుండా, ఎగువ‌న ఉన్న రాష్ట్రాల నుంచి మ‌న రాష్ట్రానికి ఎలాంటి భంగం క‌ల‌గ‌కుండా చూసుకోవాల‌న్న ఉద్దేశంతో వైయ‌స్ జ‌గ‌న్ దీక్ష‌కు దిగార‌ని వివ‌రించారు. ఎగువ‌న ఉన్న మ‌హారాష్ట్ర‌, క‌ర్ణాట‌క‌, తెలంగాణ అక్ర‌మ ప్రాజెక్టులు చేప‌ట్టి ఏపీకి తీర‌ని అన్యాయం చేస్తున్నాయ‌న్నారు. 

తెలంగాణ సీఎం గోదావ‌రిపై ప్రాజెక్టులు నిర్మించుకునేందుకు ఎటువంటి అడ్డంకులు ఉండ‌కూడ‌ద‌ని మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం నుంచి ఐదు ప్రాజెక్టుల‌కు క్లియ‌రెన్స్ తెచ్చుకున్నార‌న్నారు. ఇది కేవ‌లం ఇద్ద‌రు ముఖ్య‌మంత్రుల ఒప్పందం మాత్ర‌మేన‌ని విభ‌జ‌న చ‌ట్టం 11 షెడ్యూల్‌లో పొందుప‌ర్చిన విధంగా సెంట‌ర్ వాట‌ర్ క‌మిష‌న్ క్లియ‌రెన్స్ కానీ, గోదావ‌రి బోర్డుతో సంప్ర‌దింపులు గానీ ఎక్క‌డ లేవ‌న్నారు. కృష్ణానదిపై ప్రాజెక్టుల‌కు అనుమ‌తి ఉందా..?  లేదా..? అనే విష‌యం గురించి ఆలోచించ‌కుండానే కేసీఆర్ శంకుస్థాప‌న‌లు చేసి, ప‌ని మొద‌లుపెట్టడం దారుణమన్నారు. తెలంగాణ ప్ర‌భుత్వం అన్ని శాఖ‌ల‌ను ప‌క్క‌న పెట్టి కేవ‌లం ఒక్క నీటిపారుద‌ల శాఖ‌కు మాత్ర‌మే రూ. 25 వేల కోట్లు కేటాయించడంలోనే కేసీఆర్ ఆంతర్యం కనబడుతుందన్నారు. 

అనుమ‌తులు లేకుండా ఎగువ రాష్ట్రాలు అన్యాయానికి పాల్ప‌డుతుంటే... చివ‌రి రాష్ట్రంగా ఉన్న ఏపీ నాయ‌క‌త్వం మాత్రం కేవ‌లం ఎమ్మెల్యేల‌ను కొనుగోలు చేయ‌డంపైనే దృష్టి సారించిందని దుయ్యబట్టారు.  ఇలాగే కొన‌సాగితే సాగునీరు కాదు క‌దా... కనీసం తాగునీరు కూడా దొరకని పరిస్థితి వస్తుందన్నారు. నిద్ర‌పోతున్న ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వాన్ని తట్టిలేపాలన్న ధృఢ‌ సంక‌ల్సంతోనే వైయ‌స్ జ‌గ‌న్ జ‌ల‌దీక్ష చేప‌ట్టార‌ని పేర్కొన్నారు. ప్ర‌జ‌ల అవ‌స‌రాల మేర‌కు స్పందించే వ్యక్తి ఎవరని చిన్న పిల్లాడి నుంచి పండు ముదుసలి వరకు ఎవరిని అడిగినా....వారు చెప్పే పేరు ఒక్కటేనని అది వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అని ఉమ్మారెడ్డి అన్నారు. 

తెలంగాణ భారీనీటి పారుద‌ల శాఖ మంత్రి హ‌రీష్‌రావు జ‌ల‌దీక్ష‌ను విర‌మించ‌ాలంటూ హెచ్చ‌రిక‌లు చేయ‌డం ఎంత‌వ‌ర‌కు స‌మంజ‌స‌మ‌న్నారు. రాయ‌ల‌సీమ‌, నెల్లూరు, ప్ర‌కాశం, కృష్ణాడెల్టాల నోరుకొట్టి నీరంతా తెలంగాణ‌కు వాడుకోవాల‌నుకునేదీ స్వార్థ‌మా కాదా అనేదీ ఒక్క‌సారి ఆత్మ‌విమ‌ర్శ చేసుకోవాల‌న్నారు.  క‌ర్నూలు కాకుండా హైద‌రాబాద్‌లో దీక్ష‌లు చేయాల‌ని కృష్ణమూర్తి అన‌డం సిగ్గు చేట‌న్నారు. క‌ర్నూలులో దీక్ష చేస్తే ఆయ‌న‌కు నిద్ర‌ప‌ట్ట‌డం లేద‌ని, ప్ర‌జల నుంచి వ‌స్తున్న స్పంద‌నను చూసి ఓర్వ‌లేక ఇలాంటి మాట‌లు మాట్లాడుతున్నార‌ని ఆరోపించారు. అధికార పార్టీ  చేయ‌లేని ప‌నిని ప్ర‌తిప‌క్షంలో ఉండి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి చేస్తున్నార‌ని వివ‌రించారు. 

ప్ర‌ధానితో భేటీ అయిన చంద్రబాబు క‌రువు, ప్ర‌త్యేకహోదా, తెలంగాణ అక్ర‌మ ప్రాజెక్టులు, పోల‌వ‌రం ఇలా ఎన్నో స‌మ‌స్య‌లున్నా ఒక్క‌దానికి కూడా ప‌రిష్కార మార్గం తీసుకురాలేక‌పోయార‌ని ఎద్దేవా చేశారు. క‌రువ‌నే మాట రాయ‌ల‌సీమ‌లో విన‌బ‌డ‌కుండా చేస్తాన‌న్న బాబూ హామీ ఏమైంద‌ని ప్ర‌శ్నించారు. ప్ర‌ధాన మంత్రి భేటీలో ఎందుకు రాష్ట్ర స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించ‌లేద‌ని ఆయ‌న నిల‌దీశారు. రాష్ట్రానికి చంద్రబాబు తిండి, నీరు లేకుండా చేస్తున్నార‌ని ఆరోపించారు. బాబు తన స్వార్థ ప్ర‌యోజ‌నాల కోసం రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌ను తాకట్టు పెట్టార‌న్నారు. న‌దుల‌పైన ఎక్క‌డా ప్రైవేట్ పంపులు పెట్ట‌కూడ‌ద‌న్న నిబంధ‌న ఉన్నా మ‌హారాష్ట్ర‌, కర్ణాట‌క ప్ర‌భుత్వాలు దానిని విస్మ‌రించాయ‌న్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్రాంతం ఎడారిగా మారాడానికి  చంద్ర‌బాబే కారణమని దుయ్యబట్టారు. 

17 May 2016

కేసుల భయంతో కేసీఆర్ తో బాబు లాలూచీ

  • మంత్రులు అవాకులు, చెవాకులు మానుకోవాలి
  • ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ప్రాజెక్ట్ లను అడ్డుకోవాలి
  • లేకపోతే చరిత్రహీనులుగా మిగిలిపోతారు
  • హరీష్ రావు రెచ్చగొట్టే ధోరణి మంచిది కాదుః అంబటి
కర్నూలుః తెలుగు ప్రజలకు జరుగుతున్న అన్యాయంపై పోరాడుతున్న జననేతపై అవాకులు చెవాకులు పేలడం మానుకోవాలని వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మంత్రులను హెచ్చరించారు. మంత్రులు పల్లె రఘునాథరెడ్డి, దేవినేని ఉమ, నారాయణ, గంటా శ్రీనివాసరావు, అదేవిధంగా తెలంగాణ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలపై అంబటి తీవ్రస్థాయిలో స్పందించారు. 

రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడుతున్న వైయస్ జగన్ దీక్షకు మద్దతు ఇవ్వాల్సిందిపోయి...టీడీపీ మంత్రులు చౌకబారు రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ అక్రమ ప్రాజెక్ట్ లపై చంద్రబాబు, మంత్రులు ముందుగా ఎందుకు స్పందించలేదని నిలదీశారు. ఓటుకు నోటు కేసులో ఎక్కడ అరెస్ట్ చేస్తారోనన్న భయంతో చంద్రబాబు కేసీఆర్ తో లాలూచీ పడ్డారని ధ్వజమెత్తారు. వైయస్ జగన్  దీక్షను అణచాలని చూసినా, పోరాటాన్ని నీరుగార్చాలని చూసిన ప్రభుత్వానికే ప్రమాదమన్నారు. 

అనుమతులు లేకుండా  ప్రాజెక్ట్ లు కట్టడమే గాక...మంత్రి హరీష్ రావు రెచ్చగొట్టే ధోరణిలో మాట్లాడడం మంచి పద్ధతి కాదన్నారు. గోదావరి, కృష్ణా జలాలను తెలగాణ ప్రభుత్వం అక్రమంగా తీసుకెళ్తుంది వాస్తవం కాదా...? అని ప్రశ్నించారు. తెలుగు ప్రజలకు దక్కాల్సిన కృష్ణా, గోదావరి జలాలను తీసుకెళ్తుంటే  చూస్తూ ఊరుకోవడానికి ప్రతిపక్ష వైయస్సార్సీపీ సిద్ధంగా లేదని తేల్చిచెప్పారు.

టీడీపీ మంత్రులు ఓ పద్ధతి లేకుండా మాట్లాడుతున్నారని అంబటి ఫైరయ్యారు. మహానేత వైయస్  రాజశేఖర్ రెడ్డి మీద, వైయస్ జగన్  మీద బురద జల్లి రాజకీయంగా లబ్ధిపొందాలని చూస్తున్నారని మండిపడ్డారు.  తమ మీద రాళ్లు వేయడం కాదని, మీకు చిత్తశుద్ధి ఉంటే  తెలంగాణ దోచుకుపోతున్న జలాలను నివారించాలని మంత్రులకు సవాల్ చేశారు.   రాజకీయంగా లబ్ధి పొందాలనుకుంటే చరిత్ర హీనులుగా మిగిలిపోతారని అధికార టీడీపీని హెచ్చరించారు. 

కేసీఆర్ హిట్లర్ లా మాట్లాడడం తగదు

  • ఆంధ్రుల జీవితాలతో కేసీఆర్, బాబుల చెలగాటం
  • అక్రమ ప్రాజెక్ట్ లతో ఏపీకి అన్యాయం చేస్తున్న సీఎంలు
  • పాలమూరు-రంగారెడ్డి, డిండిలతో తాగునీటికీ కష్టాలే
  • నిలదీసే దమ్ము బాబు లేకపోవడం వల్లే ఈదుస్థితి

కర్నూలుః తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబులు ...ఐదు కోట్ల ఆంధ్రుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని వైయస్సార్సీపీ అధ్యక్షులు ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మండిపడ్డారు. కృష్ణా, గోదావరి నదులపై ఎలాంటి అనుమతులు లేకుండానే ఎడాపెడా తెలంగాణ రాష్ట్రం ప్రాజెక్ట్ లు నిర్మిచడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. పక్కరాష్ట్రం చేపడుతున్న ప్రాజెక్ట్ లపై చంద్రబాబు నోరుమెదపకపోవడం పట్ల జననేత ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ అవసరాలు తీరాక కిందకు నీళ్లు వదులుతామని కేసీఆర్ హిట్లర్ లా మాట్లాడటం తగదన్నారు. కేసీఆర్ వ్యాఖ్యలు చేస్తుంటే...బ్రహ్మంగారు చెప్పినట్లు నీళ్ల కోసమే యుద్ధాలు జరుగుతాయేమోనన్న భయాందోళన కలుగుతుందన్నారు. 

దాదాపు ఒకటిన్నర సంవత్సరాలుగా తెలంగాణ ప్రభుత్వం కళ్లెదుటే ఏపీకి అన్యాయం చేస్తున్నా అడిగే నాథుడే కరువయ్యాడని వైఎస్ జగన్ ఆగ్రహించారు. తెలంగాణ ప్రభుత్వాన్ని నిలదీసేందుకు చంద్రబాబు ఒక్క అడుగు కూడా ముందుకు వేయడం లేదని నిప్పులు చెరిగారు. కృష్ణా, గోదావరిలపై అక్రమంగా, అడ్డగోలుగా  ప్రాజెక్ట్ లు కడుతూ పోతే కిందకు నీళ్లు ఎలా వస్తాయని నిలదీసే దమ్ము ఏపీ సీఎంకు లేకపోయిందని ఫైరయ్యారు. దిగువకు నీళ్లు రాకపోతే మన పరిస్థితి  ఏమిటన్న ఆలోచన కూడా బాబుకు లేకపోవడం దురదృష్టకరమన్నారు. 


శ్రీశైలం ప్రాజెక్ట్ కు నీళ్లు రాకముందే మహబూబ్ నగర్ లోనే తెలంగాణ ప్రభుత్వం 120 టీఎంసీల నీళ్లు అటునుంచి అటే మలుపుకుంటోందని వైయస్ జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. కృష్ణానదిలో దాదాపు 1750 టీఎంసీల నీళ్లు లైవ్ స్టోరేజీ  నిల్వ చేసే సామర్థ్యంతో పై  రాష్ట్రాల్లో ప్రాజెక్ట్ లు ఉన్నాయని చెప్పారు. అనధికారికంగా మరో 300 టీఎంసీల నీళ్లు స్టోర్ చేస్తున్నారన్నారు. ఇందులో దాదాపు 1300 టీఎంసీలకు సరిపడా కర్నాటక, మహారాష్ట్రలో డ్యామ్ లు కట్టుకున్నారని చెప్పారు. కృష్ణానదిలో మహారాష్ట్ర ప్రభుత్వం వాళ్ల అవసరాలు తీరాక కర్నాటకలోని ఆల్మట్టి, నారాయణ పూర్ కు నీరు విడుదల చేస్తుందని ...అవి నిండితే తప్ప చుక్క కూడా దిగువకు వదలట్లేదని ధ్వజమెత్తారు.

రోజుకు  రెండు టీఎంసీల నీళ్లు అుటునుంచి అటే తీసుకెళ్లేలా పాలమూరు-రంగారెడ్డి, డిండి ప్రాజెక్ట్ లు కడితే రాయలసీమ జిల్లాలు,నెల్లూరు, ప్రకాశం జిల్లాలు ఎడారిగా మారుతాయని వైయస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. కల్వకుర్తి ప్రాజెక్ట్  ఇంతకుముందు 25 టీఎంసీలు ఉంటే దాన్ని 40 టీఎంసీలకు పెంచారని, దీనికే మరో 0.66 టీఎంసీల నీళ్లు పైకి తీసుకెళ్తున్నారని ఫైర్ అయ్యారు . కేసీఆర్ రోజుకు 2.66 టీఎంసీల నీళ్లు తీసుకుపోవడం ధర్మామా అని ప్రశ్నించారు. 

శ్రీశైలంలో 854 అడుగులు దాటితే తప్ప రాయలసీమకు నీళ్లు అందే పరిస్థితి లేదు. అలాంటిది 800 అడుగులుండగానే పంపింగ్ చేస్తే శ్రీశైలానికి నీళ్లు రాకుండా పైపైనే తోడేసుకుంటే తమకు తాగడానికైనా నీళ్లు దొరుకుతాయా అని వైయస్ జగన్ కేసీఆర్, బాబులను నిలదీశారు. శ్రీశైలంలో అవసరాలు తీరిన తర్వాత సాగర్ కు, ఆతర్వాత కృష్ణాడెల్టాకు నీళ్లు వస్తాయన్నారు. రాయలసీమ జిల్లాలు, నెల్లూరు, ప్రకాశంతో పాటు  గుంటూరు, కృష్ణా అదేవిధంగా తెలంగాణలోని నల్గొండ, ఖమ్మంలకు కేసీఆర్ అన్యాయం చేస్తున్నారన్నారు. ఏపీకి ఇంతగా నష్టం జరుగుతున్నా బాబు కేసీఆర్ ను కనీసం నిలదీయకపోవడం బాధాకరమన్నారు. 

16 May 2016

బాబు కేసీఆర్ ను ఎందుకు నిలదీయడం లేదు..?

  • ఎవడబ్బ సొమ్ము అని నీళ్లు తీసుకుపోతున్నారు
  • తాగడానికి నీళ్లు రాకపోతే కేసీఆర్ కు ఉసురు తగలదా..?
  • చంద్రబాబు చేసిన అన్యాయాన్ని మహానేత సరిదిద్దారుః వైయస్ జగన్

కర్నూలుః ఏపీ పున‌ర్వ్య‌వ‌స్థీక‌ర‌ణ చ‌ట్టానికి విరుద్ధంగా తెలంగాణ స‌ర్కార్ ప్రాజెక్టులు క‌డుతుంటే ఏపీ సీఎం చంద్ర‌బాబు ఎందుకు నిల‌దీయ‌డం లేద‌ని వైయ‌స్ఆర్ సీపీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి  ప్ర‌శ్నించారు. ఏ ప్రాజెక్టులు క‌ట్టాల‌న్నా ఏపీ పున‌ర్వ్య‌వ‌స్థీక‌ర‌ణ చ‌ట్టంలోని సెక్ష‌న్ 84 ప్ర‌కారం నిబంధ‌న‌లు ఉన్నాయ‌న్నారు. ముందుగా సీడ‌బ్ల్యూసీ అనుమ‌తి, నీటి యాజ‌మాన్య బోర్డుల అనుమ‌తి తీసుకోవాల‌ని, త‌ర్వాత ఎపెక్స్ కౌన్సిల్ అనుమ‌తి తీసుకోవాల‌ని స్ప‌ష్టంగా ఉంద‌న్నారు. ఈ అనుమ‌తులు లేకుండానే కేసీఆర్ ప్రాజెక్టులు నిర్మిస్తున్నార‌ని త‌ప్పుబ‌ట్టారు.  దీనిపై బాబు కేసీఆర్ ను ఎందుకు నిల‌దీయ‌డం లేద‌ని కడిగిపారేశారు. గోదావ‌రి న‌దిపై కాళేశ్వ‌రం ఎత్తిపోత‌ల, దేవాదుల ఎత్తిపోత‌ల‌, తుపాకుల గూడెం, సీతారాంపూర్‌, భ‌క్త‌రామ‌దాసు ఎత్తిపోత‌ల‌తో నీళ్లు ఎత్తుకుపోతున్నా చంద్ర‌బాబు నోరు మెద‌ప‌డం లేద‌ని మండిప‌డ్డారు. 2015లో మ‌న‌కు చుక్క‌నీరు కూడా అంద‌లేద‌ని, 2014లో ఇదే చంద్ర‌బాబుతో క‌లిసి ఆ ఒక్క సంవ‌త్స‌రానికి సంబంధించి నీళ్ల పంప‌కంపై ఒక స‌మావేశం పెట్టుకున్నార‌ని తెలిపారు. ఆ స‌మావేశంలో 299 టీఎంసీల నీళ్లు తెలంగాణ రాష్ట్రం వాడుకోవ‌డానికి అప్ప‌ట్లో చంద్ర‌బాబు ఆమోదం తెల‌ప‌డం త‌ప్పు అన్నారు. కానీ అది కేవ‌లం ఒక్క ఏడాదికేన‌న్న‌విష‌యం మ‌ర్చిపోకూడ‌ద‌ని కేసీఆర్‌ను హెచ్చ‌రించారు. 

 
నాడు హైద‌రాబాద్ తీసుకెళ్లారు..
తెలుగు ప్ర‌జ‌లంద‌రం స‌మైక్యంగా ఉండాల‌ని పోరాటం చేస్తే.. రాష్ట్రాన్ని అడ్డంగా విభ‌జించార‌ని, కేసీఆర్ ప‌ట్టుబ‌ట్టి మ‌రీ నాడు హైద‌రాబాద్ న‌గ‌రాన్నితీసుకెళ్లిపోయార‌ని వైయ‌స్ జ‌గ‌న్ విమ‌ర్శించారు. దీంతో చ‌దువుకున్న యువ‌త‌కు ఉపాధి, ఉద్యోగ అవ‌కాశాలు కోల్పొవాల్సి వ‌చ్చింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇప్పుడు మ‌ళ్లీ మ‌న‌కు రావాల్సిన నీటిని పై నుంచి పైకి తీసుకెళ్తున్నా అడిగే నాథుడే క‌రువ‌య్యాడ‌ని దుయ్య‌బ‌ట్టారు. రాష్ట్రం విడిపోయాక తెలుగువారు అని కూడా చూడ‌కుండా ఐదు కోట్ల మంది ప్ర‌జ‌ల జీవితాల‌తో చెల‌గాటం ఆడుతున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కింది రాష్ట్రంలో తాగ‌డానికి నీళ్లు రాక‌పోతే అక్క‌డి ప్ర‌జ‌ల ఉసురు త‌గ‌ల‌దా అని కేసీఆర్‌ను నిల‌దీశారు. మీరు చేస్తున్న‌ది త‌ప్పు.. దానిని స‌రిచేసుకోవాల‌ని కేసీఆర్‌కు సూచించారు. 



మహానేత ఆ తప్పును సరిదిద్దారు
శ్రీ‌శైలం ప్రాజెక్టు నీటి మ‌ట్టం విష‌యంలో చంద్ర‌బాబు చేసిన అన్యాయాన్ని దివంగ‌త ముఖ్య‌మంత్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి జీవో నంబ‌ర్ 107 విడుద‌ల చేసి స‌రిదిద్దార‌ని వైయ‌స్ జ‌గ‌న్ గుర్తు చేశారు. శ్రీ‌శైలం ప్రాజెక్టులో ఎప్పుడూ క‌నీసం 854 అడుగుల నీళ్లుండాల‌ని 1960లోనే ప్రాజెక్ట్  డిజైన్ చేశార‌ని తెలిపారు. దానికి అనుకూలంగా నాటి ముఖ్య‌మంత్రి అంజ‌య్య పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేట‌ర్‌కు శంకుస్థాప‌న చేసి, పూర్తి చేయించార‌న్నారు. మ‌న కర్మ‌కొద్దీ చంద్ర‌బాబు ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత మొద‌టి సారిగా ఈ డ్రా డౌన్ లెవెల్‌ను ఒక జీవో ద్వారా త‌గ్గించార‌ని విమ‌ర్శించారు. మ‌ళ్లీ చంద్ర‌బాబు అధికారంలో ఉండ‌గా మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌లో కేసీఆర్ పాల‌మూరు-రంగారెడ్డి, ప్రాజెక్టు నిర్మాణానికి టెండ‌ర్లు పిలిచి, 800 అడుగుల‌కే ఇన్‌టేక్ పాయింట్ పెడుతుండ‌టం దారుణ‌మ‌న్నారు. ఎగువ ప్రాంత‌లోనే నీళ్లు తోడుకుంటే  శ్రీ‌శైలానికి నీళ్లు ఎలా వ‌స్తాయ‌ని, త‌ర్వాత సాగ‌ర్ ప‌రిస్థ‌తి ఏంట‌ని, కృష్ణా డెల్టా ఎడారి అయిపోదా అని ప్రశ్నించారు. ఇంత జ‌రుగుతున్నా చంద్ర‌బాబు నోరు మెద‌ప‌క‌పోవ‌డం దుర్మార్గ‌మ‌న్నారు. 



ప్రతీ బొట్టు కోసం పోరాడుదాం
ఆంధ్ర రాష్ట్రానికి రావాల్సిన ప్ర‌తినీటి బొట్టు కోసం అంద‌రం ఏక‌మై పోరాడుదామ‌ని వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి పిలుపునిచ్చారు. 2011 బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యూన‌ల్ తీర్పు మీద 26 మంది ఎమ్మెల్యేల‌తో నాడు ధ‌ర్నా చేశామ‌ని ఆయ‌న గుర్తు చేశారు. మ‌హారాష్ట్ర నుంచి ఆంధ్ర‌రాష్ట్రం చివ‌రి వ‌ర‌కు ప్ర‌తి బొట్టు కూడా.... మా వాటా మాకు, వాళ్ల వాటా వాళ్ల‌కు ఇవ్వాల‌ని డిమాండ్ చేసిన‌ట్లు తెలిపారు. 15 రోజుల‌కు ఒక్క‌సారి వాటాల స‌ర్ధుబాటు జ‌ర‌గాల‌న్నారు. ఇలా చేయ‌కుండా మా ద‌గ్గ‌ర నుంచి నీళ్లొస్తాయి కాబ‌ట్టి ఇష్టం వ‌చ్చిన‌ట్లు అడ్డుప‌డితే ఇండియా-పాకిస్థాన్ మ‌ధ్య గొడ‌వ‌లా అయిపోదా అని ప్ర‌శ్నించారు. కృష్ణా, గోదావ‌రి ప్రాజెక్టుల నుంచి ఎవ‌డ‌బ్బ సొమ్మ‌ని నీళ్లు తీసుకెళ్తున్నార‌ని వైయ‌స్ జ‌గ‌న్ కేసీఆర్‌పై మండిప‌డ్డారు. ఇక్క‌డ జ‌రుగుతున్న అన్యాయం మ‌న రాష్ట్రంలోని వాళ్ల‌కే కాదు, దేశంలోని నాయ‌కులంద‌రికీ తెలియాల‌న్నారు. కేసీఆర్‌, చంద్ర‌బాబుకు జ్ఞానోద‌యం కావాల‌ని నాలుగు అడుగులు ముందుకు వేద్దామ‌ని వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు.

నీటి దోపిడీపై వైయస్ జగన్ పోరాటం

కర్నూలుః టీడీపీ సర్కార్ నిర్లక్ష్య వైఖరిపై వైయస్సార్సీపీ నేతలు మండిపడ్డారు. తెలంగాణ సర్కార్ అక్రమ కట్టడాలపై బాబు ఎందుకు నోరుమెదపడం లేదని నిలదీశారు. చంద్రబాబు కారణంగా రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతుందన్నారు. రాష్ట్ర హక్కుల కోసం పోరాడుతున్న ప్రతిపక్ష నేత వైయస్ జగన్ జలదీక్షకు మద్దతుగా రాష్ట్ర ప్రజానీకం కదలిరావాలని పిలుపునిచ్చారు. 


అంబటి రాంబాబు:
తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా కృష్ణా, గోదావరి జలాలను తోడుకుంటున్నా...ఏపీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మండిపడ్డారు. తెలంగాణ సర్కార్ చట్టవ్యతిరేక పద్ధతిలో వెళ్తున్నా అధికార టీడీపీ ఏమాత్రం అడ్డుకోకపోవడం బాధాకరమన్నారు. ఓటుకు కోట్లు కేసులో రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోవడంతో చంద్రబాబు అటు కేంద్రంతో గానీ, ఇటు తెలంగాణ రాష్ట్రంపై ఒత్తిడి తేలేకపోవడం దారుణమన్నారు.  చంద్రబాబు నిర్వాకం కారణంగా  రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతోందని వాపోయారు. టీడీపీ సర్కార్ అలసత్వాన్ని, తెలంగాణ ప్రభుత్వం దోపిడీని అడ్డుకునేందుకే వైయస్ జగన్ దీక్ష చేపట్టడం జరిగిందని అంబటి స్పష్టం చేశారు.  

విశ్వేశ్వర్ రెడ్డి:
తెలంగాణ నిర్మించనున్న ప్రాజెక్ట్ వల్ల రాయలసీమకు తీరని నష్టం వాటిల్లుతుందని ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. రాయలసీమ ప్రాజెక్ట్ లకు ప్రధాన నీటివనరు కృష్ణా అని చెప్పారు.  శ్రీశైలం జలాయశంలో 870 అడుగుల నీటిమట్టం ఉంటేనే పోతిరెడ్డిపాడు, హంద్రీనీవా, గాలేరు నగరి తదితర ప్రాజెక్ట్ లకు నీరు అందే పరిస్థితి ఉంటుందని చెప్పారు. కానీ 810 అడుగులు ఉండగానే తెలంగాణ సర్కార్ నీటిని పంపింగ్ చేయడం  మొదలుపెడితే రాయలసీమ దారుణంగా నష్టపోతుందన్నారు. ఇక్కడి ప్రాజెక్ట్ లకు  నీరందాలంటే తెలంగాణ అక్రమ కట్టడాలను ఆపాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.  ఇందుకోసం రాష్ట్రమంతా సమైక్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందని చెప్పారు. చంద్రబాబు సర్కార్ ను ఎండగట్టేందుకు వైయస్ జగన్ చేపట్టిన ఈదీక్షకు రాష్ట్ర ప్రజానీకమంతా మద్దతుగా నిలవాలన్నారు. 

ఎం.వి.ఎస్.నాగిరెడ్డి:
2004 దాకా బాబు రాష్ట్రంలో ఒక్క ప్రాజెక్ట్ కూడా చేపట్టలేదని, పైగా ఆయన హయాంలో  పై రాష్ట్రాల్లో నిర్మించిన ప్రాజెక్ట్ లతో ఏపీకి తీరని అన్యాయం జరిగిందని వైయస్సార్సీపీ రైతు విభాగం అధ్యక్షుడు నాగిరెడ్డి మండిపడ్డారు. ఆనాడు రాష్ట్రాన్నికర్నాటక, మహారాష్ట్రకు తాకట్టుపెట్టాడు, ఇవాళ తెలంగాణకు తాకట్టు పెడుతున్నాడని చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. ఏపీకి తాగునీరు కూడా లేకుండా చేస్తున్నారని, తెలంగాణ సర్కార్ ప్రాజెక్ట్ లు కడితే భవిష్యత్తులో రాష్ట్రం  బీడుగా మారుతుందన్నారు. దీన్ని ఏపీలోని అన్ని రైతు సంఘాలు, ప్రజలు గుర్తించినా బాబు మాత్రం కళ్లు తెరవడం లేదని దుయ్యబట్టారు. ఏపీలో 8 జిల్లాలు, పశ్చిమగోదావరిలో లక్షన్నర ఎకరాలకు కృష్ణా జలాలే ఆధారమని  నాగిరెడ్డి చెప్పారు.  వైయస్ జగన్ దీక్షను విమర్శించి బాబు దగ్గర లబ్ది పొందేందుకు టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని ఫైరయ్యారు.  అన్ని ప్రాంతాలకు న్యాయం జరగకపోతే గ్రామాలకు గ్రామాలు వలసలు పోయేపరిస్థితి వస్తుందన్నారు.  తాగునీరు, సాగునీరు అందించడం ప్రభుత్వం బాధ్యత అని, ఇందుకు కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చి తెలంగాణ అక్రమ ప్రాజెక్ట్ లను అడ్డుకోవాలన్నారు. 

సునీల్ కుమార్:
తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్ట్ ల వల్ల రాయలసీమ జిల్లాలు ఎడారిగా మారనున్నాయని ఎమ్మెల్యే సునీల్ కుమార్ అన్నారు. రాష్ట్ర హక్కులను కాపాడుకునేందుకు ప్రతిపక్ష నేత వైయస్ జగన్ చేపట్టిన దీక్షకు రైతులంతా మద్దతుగా నిలవాలని కోరారు. ప్రతి ఒక్కరూ కదలిరావాలని పిలుపునిచ్చారు.