5 November 2015

ప్రభుత్వ మోసాలపై టాప్ టెన్ కామెంట్స్




పులివెందుల) రైతుల ఆత్మహత్యల్ని నివారించి, రైతుల్లో  భరోసా కల్పించడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూర్తిగా విఫలమయ్యారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విమర్శించారు. 
పులివెందుల పర్యటనలో వైఎస్ జగన్ చేసిన పవర్ ఫుల్ కామెంట్స్..
1.     పబ్లిసిటీ వస్తే తప్ప... చంద్రబాబు పెద్దగా స్పందించరు. ఇంత మంది రైతుల ఆత్మహత్యలు కొనసాగుతున్నా.. పట్టించుకోని చంద్రబాబు ఏదైనా పబ్లిసిటీ వస్తుందంటే.. ముందు వరుసలో ఉంటారు
2.    పులివెందుల ప్రాంతంలో రైతు ఆత్మహత్య చేసుకొని 18రోజులు గడిచాయి... పురుగుల మందు తాగి రాజశేఖరన్న చనిపోతే గవర్నమెంటోళ్లు ఈ పక్కకు తిరిగి చూడలేదంటే ఏమనాలి?’
3.    వ్యవసాయంపై చేసిన అప్పులు తీర్చే దారిలేక చాలామంది రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. సంఘటన జరిగిన తర్వాతనైనా ఒక్క అధికారి రాడు.. ఎందుకు రావడంలేదో నాకైతే అర్థం కావడంలేదు.
4.     చనిపోయిన రైతు రైతుగా కనిపించడంలేదా.. లేక చనిపోయింది పులివెందులలో కాబట్టి వివక్ష చూపుతూ రాలేదా
5.    పేద రైతు కుటుంబాలు ఎలా బ్రతుకుతాయన్న ఆలోచన కూడా బాబుకు రాకపోవడం శోచనీయం.
6.    అనంతపురంలో 46మంది ఆత్మహత్యలు చేసుకున్న రైతుల ఇళ్లకు వెళ్లా.. అందులో 20కి పైగా ఇళ్లకు గవర్నమెంటోళ్లు పోలేదు.
7.    ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.5లక్షలు పరిహారం అందిస్తున్నట్లు గొప్పలు చెప్పుకుంటున్న చంద్రబాబు ఆచరణలో ఏమీ అందించడంలేదు.
8.    రూ.1.50లక్షలు అప్పులోళ్లకిచ్చి మిగిలిన రూ.3.50లక్షలు బ్యాంకులో వేస్తామంటారు.. తీరా చూస్తే అకౌంటులో మాత్రం ఏమీ ఉండదు.. ఇలా ఎంతమంది రైతు కుటుంబాలను మభ్యపెడతారు
9.    అసలు ప్రభుత్వం ఏమి చేస్తోంది? ఎందుకు చేయలేకపోతోంది.. చనిపోయిన రైతులకు ఎందుకు పరిహారం ఇవ్వడం లేదో చెప్పాలి
10.  ఇప్పటికైనా కళ్లు తెరిచి ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకోవాలి. పబ్లిసిటీ వస్తుందంటేనే పరిహారం ఇవ్వాలన్న ఆలోచనను పక్కనపెట్టి ఆత్మహత్య చేసుకున్న ప్రతి రైతు కుటుంబానికి పరిహారం అందించి న్యాయం చేయాలి. 

3 November 2015

ధరల పెరుగుదలకు 10 కారణాలు



ఇటీవల కొంతమంది మాట్లాడుతూ ధరలు దేశమంతా పెరుగుతున్నాయని, ఉత్పత్తి తగ్గితే ఎవరు ఏం చేస్తారని, చంద్రబాబు చేతుల్లో ఏమీ ఉండదు..కేంద్రానిదో, మరొకరిదో లోపమని ప్రచారం చేస్తున్నారు. ఒక్క కందిపప్పు విషయం తీసుకొంటే మనకు  కనికట్టు బాగా అర్థం అవుతుంది. నిత్యావసర వస్తువుల ధరలు భగ్గుమనటంలో చంద్రబాబు పాత్ర ఇదిగో..
1.       ఆంధ్రప్రదేశ్ లో కందిపప్పు వినియోగం ఏడాదికి సుమారు 3 లక్షల టన్నులు. ఇందులో మూడో వంతు అంటే  ఒక లక్ష లేదా మరో పాతిక వేలు అదనంగా మాత్రమే మన దగ్గర పండుతోంది. అంటే అధిక భాగం దిగుమతుల మీద ఆధారపడటమే. అంటే ఉత్పత్తి విషయం పెద్దగా ప్రభావితం చూపదు
2.       ఉత్పత్తి తగ్గిందన్న మాట కాసేపు అంగీకరిద్దాం. కానీ ఈ ఏడాది ఉత్పత్తిలో తగ్గుదల 9శాతం మాత్రమే అంటే.  అలా అయితే రేటు కూడా మహా అయితే 10 లేక 15శాతం మాత్రమే పెరగాలి. కానీ రేటు 150శాతం పెరిగింది
3.       దేశంలో ఫ్యూచర్ ట్రేడింగ్ బాగా పెరగుతోంది. ఇందులో నిత్యావసర వస్తువులు అయిన కందిపప్పు, మినప పప్పు ఉండటంతో క్రత్రిమంగా ధరలు ఒక్కోసారి భగ్గుమంటున్నాయి. వీటిని తప్పించాలన్న డిమాండ్ ఉంది. కానీ ఇప్పటి దాకా చంద్రబాబు ప్రభుత్వం  ఈ మేరకు కేంద్రాన్ని కోరనూలేదు. కనీసం లేఖ కూడా రాయలేదు.
4.       మరో వైపు ధరలు ఉరకలు వేస్తూ పరుగులు తీస్తున్నప్పుడే తక్షణ చర్యలకు ఉపక్రమించాల్సింది. కానీ చంద్రబాబు ఆ సమయంలో అమరావతి శంకుస్థాపన ఏర్పాట్లలో బిజీగా ఉండిపోయారు. సీఎం వెంట మంత్రులు, ఆ వెంట ఉన్నతాధికారులు ఉండిపోయి ధరల్ని ఆకాశానికి వదిలేశారు.
5.       ధరలు పెరిగేటప్పుడే పౌర సరఫరాల శాఖ జోక్యం చేసుకొని ఉంటే కొంత మేర అయినా సామాన్యులకు న్యాయం దక్కేది.
 6.       జిల్లాల్లో వర్తకలు ఎవరు, నల్ల బజారుకి సరుకుల్ని తరలించేది ఎవరు అన్నది గుర్తించాలంటే అధికారులతో టాస్క్ ఫోర్స్ లు ఏర్పాటు చేయాలి. అక్రమ నిల్వలు దాచిన గోడౌన్ లపై దాడి చేయాలి.
 (గతంలో ఇసుక మాఫియా ను అడ్డుకొన్నందుకు వనజాక్షి అనే మహిళా రెవిన్యూ అధికారిని తెలుగుదేశం ఎమ్మెల్యే నిస్సిగ్గుగా కొట్టిస్తే చంద్రబాబు సెటిల్ మెంట్ చేయించి నోరు మూయించారు. అటువంటప్పుడు అధికారులు టీడీపీ మాఫియా ఆగడాల్ని ఎలా ఆపగలుగుతారు)
7.       నల్ల బజారు కు తరలుతున్న అక్రమ నిల్వల విషయంలో కేంద్రం రెండు నెలల క్రితమే రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ లేఖ రాసింది. అయినా సరే చంద్రబాబు ప్రభుత్వం నిద్ర నటించింది.
8.       చౌక ధరల దుకాణాలు, రైతు బజార్లలో సబ్సిడీ రేటుకి సరఫరా చేయించే ఏర్పాట్లు ఉండాల్సి ఉండగా, సమగ్రంగా ప్రజలకు అందుబాటులోకి రాలేదు.
9.       పైగా ఇప్పుడు వర్తకుల దగ్గరే రేటును రూ. 140 (హోల్ సేల్), రూ. 143(రిటైల్) గా స్థిరీకరించి అమ్మిస్తామని చెప్పి చేతులు దులుపుకొంటున్నారు.
10.   దళారీలే రేటును 70 నుంచి రూ. 200 కి పెంచితే, వాళ్లకే అవకాశం ఇచ్చి రూ.140 దగ్గర స్థిరీకరించామని చెప్పటం ఎంత వరకు సమంజసం.
కందిపప్పు విషయంలో చంద్రబాబు బండారం బయట పడింది కదా. మిగిలిన నిత్యావసర వస్తువుల
ధరలు భగ్గుమనటానికి కూడా కారణం ముమ్మాటికీ చంద్రబాబే..!

1 November 2015

పప్పులు ధరలు పెరగటానికి కారణం




సామాన్యుల అవసరాలు చంద్రబాబుకి పెద్దగా పట్టవు. అది ఆయనకు స్వతాహాగా ఉన్న లక్షణం. అందుకే సామాన్యులకు ఎంతో ముఖ్యమైన నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోతుంటే ఆయన పెద్దగా పట్టించుకోవటం లేదు.
 కందిపప్పు విషయమే తీసుకొంటే ప్రభుత్వం చేతకాని తనం ఏమిటో స్పష్టంగా అర్థం అవుతుంది. కందిపప్పు ధర కిలో రూ. 200 దాటి పై పైకి ఎగబాకుతోంది. ఇందుకు డిమాండ్..సప్లయి సూత్రాన్ని ప్రభుత్వం పెద్దగా ప్రచారం చేస్తోంది. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో కూడా పప్పుల ధరలు పెరిగాయంటూ సన్నాయి నొక్కులు నొక్కుతోంది. కానీ ఇది చాలా వాస్తవ దూరం. ఎందుకంటే మన దగ్గర కంది ని సాగుచేయటం కాస్త తగ్గిన మాట వాస్తవం. సగటున ఉత్పత్తిలో ఈ సారి 9.5 శాతం మాత్రమే తగ్గింది. అంటే మహా అయితే 10, 20 శాతం మేర ధరలో పెరుగుదల రావచ్చు. కానీ ఎకాఎకిన 70,80 రూపాయిల నుంచి 200 రూపాయిలు దాటిపోయింది అంటే 150శాతంమేర పెరుగుదలను గమనించవచ్చు. ఈ స్థాయిలో పెరుగుదలకు ఉత్పత్తి తగ్గటం అన్నది కారణం కానే కాదు.
గతంలో కందిపప్పు ధరలు పెరిగిన ప్రతీ సారి ప్రభుత్వం నుంచి ఒకటే సన్నాయి నొక్కులు.. కందుల విస్తీర్ణాన్ని ప్రోత్సహిస్తామని, సబ్సిడీ ధరలకు విత్తనాలు అందిస్తామని, రైతులకు అండగా నిలుస్తామని, తద్వారా మార్కెట్ లో కందిపప్పు రేట్లు అదుపులో ఉంచుతామని. అక్కడికీ, మార్కెట్ లో రేట్లు పెరిగిపోవటానికి రైతులే కారణం అన్నట్లుగా కలరింగ్ ఇచ్చే ప్రయత్నం మాత్రమే ఇది. కందులకు కనీస మద్దతు ధరను రూ.130గా నిర్ణయించి, ఈ విషయాన్ని విస్తృతంగా ప్రచారం చేసి వుండవల్సింది. వర్షపాతం తక్కువగా ఉంటుందనే విషయాన్ని కూడా రైతులకు తెలియజేసి వుండవల్సింది. అప్పుడు రైతులు నీటి ఎద్దడిని తట్టు కునే వంగడాలనే సాగుచేసేవారు. తత్ఫలితంగా ఈ ఏడాది పప్పు ధాన్యాల ముఖ్యంగా కందిపప్పు కొరత ఉండేది కాదు. అలాగే కందులకు కనీస మద్దతు ధరను రూ.100 నుంచి రూ.130కి పెంచి వుండవల్సింది.   ప్రభుత్వ నిర్లక్ష్యమే ప్రస్తుతం కందిపప్పు ధర అమితంగా పెరిగిపోవడానికి ప్రధాన కారణమనడంలో సందేహం లేదు.
అవునన్నా కాదన్నా కందిపప్పు రేట్లు భయంకరంగా పెరిగిపోవటానికి ప్రధాన కారణం బ్లాక్ మార్కెట్, అక్రమ నిల్వలు మాత్రమే. కందుల ఉత్పత్తి తగ్గటాన్ని గమనించిన దళారీలు గుట్టు చప్పుడు కాకుండా నల్లబజారుకి తరలించేశారు. అటు ఫ్యూచర్ మార్కెట్ పేరుతో అందుబాటులో ఉన్న  కందులు ఎక్కడికక్కడ బ్లాక్ అయిపోయాయి. దీంతో సామాన్యులకు మార్కెట్లో అందుబాటులో లేకుండా పోయాయి. ఫలితంగా కందిపప్పు రేట్లు భగ్గుమంటున్నాయి.  
ఇటువంటి సమయంలో అధికారులతో ఎక్కడికక్కడ టాస్క్ ఫోర్సులు ఏర్పాటు చేసి కొరడా ఝుళిపిస్తే నల్ల బజారులేని కందులు బయటకు వస్తాయి. కందిపప్పును దాచి పెట్టిన పందికొక్కుల్ని పట్టుకోవాలి. కానీ పందికొక్కులన్నీ తెలుగుదేశం తాబేదారులవి కావటంతో ప్రభుత్వం అటువైపు కన్నెత్తి చూడటం లేదు.
మహిళాతహశీల్దార్ వనజాక్షి ... ఇసుక అక్రమ రవాణాను  అడ్డుకొనేందుకు ప్రయత్నిస్తే జుట్టుపట్టి తెలుగుదేశం ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కొట్టించారు. అంతటి దాడి చేస్తే చంద్రబాబు స్వయంగా క్యాంప్ కార్యాలయంలో కూర్చొని మహిళా అధికారిని పిలిపించి బెదిరించి పంపించారు. దీంతో ప్రభుత్వ అధికారులకు ముఖ్యమంత్రి స్పష్టమైన సందేశం పంపించారు. తెలుగు తమ్ముళ్లు ఎక్కడ ఎటువంటి దందా చేసినా కన్నెత్తి చూడవద్దని పరోక్షంగా ఆదేశించారు. దీంతో ఇసుక అక్రమ మాఫియా కానీ, కందిపప్పును దాచిపెడుతున్న పందికొక్కులు కానీ హాయిగా కాలం వెళ్లదీస్తున్నాయి. అందుకే నల్ల బజారు దళారీల మీద ఎటువంటి చర్యలు లేనే లేవు.
 నిజంగా ప్రభుత్వానికి చిత్త శుద్ధి ఉంటే చాలా చర్యలు తీసుకోవచ్చు. మార్క్ ఫెడ్ ను రంగంలోకి దింపి పప్పుల కొనుగోళ్లు చేపట్టవచ్చు. రేషన్ డిపోలు, రైతు బజార్ల ద్వారా ధరల్ని క్రమబద్దీకరించి పప్పుల్ని అమ్ముకోవచ్చు. కంట్రోల్ ఆర్డర్లు జారీ చేసి ధరల పెరుగుదలకు కళ్లెం వేయవచ్చు. కానీ చంద్రబాబు ప్రభుత్వం అదేమీ చేయదు. ఎందుకంటే  సామాన్యుల గురించి ఆయనకు ఎప్పుడు పట్టదు.