1 February 2018

ఈ కేటాయింపులతో అభివృద్ధి సాధ్యమేనా ..?

కేంద్ర బడ్జెట్‌లో ఏపీ గురించి ప్రస్తావనే లేదు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో వెనుకడుగు వేశారని వైయస్ ఆర్ సీపీ ఎంపి విజయసాయిరెడ్డి ఆక్షేపించారు. పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై ఆయన స్పందిస్తూ, విశాఖ రైల్వే జోన్‌ విషయంలోనూ క్లారిటీ లేదు. రైల్వే జోన్‌ ఏర్పాటు చేయకుండా, అది లాభదాయకం కాదంటూ తప్పించుకుంటున్నారన్నారు.  రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపై ఆసక్తి ప్రదర్శించకపోవడం బాధాకరం. పునర్విభజన చట్టంలో షెడ్యూల్‌ 13లో 11 కేంద్రత ప్రభుత్వ సంస్థలు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఇంతవరకు రెండు కూడా ఏర్పాటు చేయలేదు. ఇప్పటి వరకు ఇచ్చిన రిపోర్టు ప్రకారం 9 కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఏర్పాటు చేయాలంటే రూ. 11,267 కోట్లు నిధులు అవసరం అవుతాయని చెప్పారు. గత నాలుగేళ్లలో జరిగిన కేటాయింపులు చూస్తే 421 కోట్లు మాత్రమే ఇచ్చారు. ఇలాగైతే అభివృద్ధి ఎలా జరుగుతుందని నమ్మగలమని ప్రశ్నించారు. సెంట్రల్‌ యూనివర్సిటీ, ట్రైబల్‌ యూనివర్సిటీకి సంబంధించి రాబోయే సమావేశాల్లో చట్టం తీసుకొస్తామని చెప్పారు. 70 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. కానీ లెక్కలు చూస్తే మాత్రం నిరాశాజనకంగా ఉన్నాయని సాయిరెడ్డి అన్నారు.
 గడిచిన మూడేళ్లలో జరిగింది కూడా ఏమీలేదు. పైగా 1.2 శాతం తగ్గుదల కనిపించింది. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామంటే.. చాలా ఊహించుకున్నారనీ, ఇప్పుడున్న కనీస మద్ధతు ధర చూస్తే పెట్టుబడులకు కూడా చాలడం లేదని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.  రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలంటే దిగుబడిని పెంచుతామని గతంలో కేంద్ర ఆర్థిక మంత్రి చెప్పారు. ఇప్పుడేమో 1.5 శాతం అంటున్నారు. ఇప్పుడున్న మద్ధతు ధరలు చూస్తే కనీసం పెట్టుబడికి కూడా సరిపోవడం లేదు. రాబోయే ఐదేళ్లలో రైతుల ఆదాయాన్ని రెండింతలు చేయాలంటే కనీసం మద్ధతు ధర 20 శాతం పెంచాలని డిమాండ్ చేశారు. అప్పటికి గానీ 2022 నాటికి రైతుల  ఆదాయాన్ని రెండింతల ఆదాయాన్ని చూడగలమని వివరించారు. 

విభజన హామీలు నెరవేరుతాయనుకుని మోసపోయాం

2018–19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పెదవి విరిచారు. ఏపీకి సంబంధించి బడ్జెట్‌లో ఒరగబెట్టిందేమీ లేదని విమర్శించారు. ఇంకా ఆయన ఏమన్నారంటే... ‘బడ్జెట్‌ చూసి నిరాశకు గురయ్యాం. విభజన చట్టంలోని హామీలు అమలవుతాయని ఆశించాం. కానీ అమలు కాలేదు. ప్రత్యేక హోదా లేక పరిశ్రమలు ఒక్కటీ రాలేదు. నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. పోలవరం ప్రాజెక్టు మీద క్లారిటీ ఇవ్వలేదు. విశాఖ రైల్వే జోన్‌ ప్రస్తావనే రాలేదు. దుగరాజపట్నం 2018 పూర్తి చేసి ఇవ్వాలని ఉంది.. పట్టించుకోలేదు. అయితే రైతులకు మద్ధతు ధరను 1.5 రెట్లు పెంచుతామని చెప్పిన హామీ కొంచెం ఊరట కల్పించింది. 2005లో దివంగత మహానేత వైయస్‌ఆర్‌ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయడానికి పూనుకోవడం సంతోషించాల్సిన విషయం. రూ. 5 లక్షల వరకు ఆరోగ్య బీమా కల్పించేందుకు ముందుకు రావడం అభినందనీయమే అయినా ఏపీకి సంబందించి ఆరోగ్యశ్రీ పథకం నిర్వీర్యం అవుతోంది. మహిళలకు కొంత మేరకు చొరవ చూపింది. స్వయం సహాయ సంఘాలకు మేలు చేసేదిగా ఉన్నా.. ఇవన్నీ  దివంగత మహానేత వైయస్‌ఆర్‌ అద్భుతంగా ఆచరించి చూపించారు.   ప్రత్యేక హోదా గురించి ప్రస్తావించకపోవడం చాలా దారుణం. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుంటే అన్న మాట ప్రకారం రాజీనామా చేయడానికి ఇప్పటికీ కట్టుబడి ఉన్నాం. మేం రాజీనామా చేస్తే ఇప్పుడే ప్రత్యేకహోదా వస్తుందంటే మే సిద్ధమే. కేంద్రంలో భాగస్వామ్య పక్షంగా ఉన్న టీడీపీ దీనిపై సమాధానం చెప్పాలి. రుణమాఫీపై క్లారిటీ వస్తుందని దేశవ్యాప్తంగా రైతులు ఎదురు చూశారు. కానీ ఎలాంటి ప్రకటన రాలేదు.

పేద‌వారికి ఉచిత ఇసుక ఏదీ?

నగరి:  ప్ర‌భుత్వం  పేదవారికి ఎవరికీ ఇసుకను ఉచితంగా అందించడం లేదని, టీడీపీ నాయకులకు సంపాదించి పెట్టడానికి మాత్రమే ఇసుకను అందిస్తున్నార‌ని వైయ‌స్ఆర్‌ సీపీ రాష్ట్ర మహిళాధ్యక్షురాలు, ఎమ్మెల్యే ఆర్‌కే రోజా మండిప‌డ్డారు.  టీడీపీ నాయకులే ఇష్టారీతిన ఇసుకను దోచుకుంటున్నారని విమ‌ర్శించారు. మండలంలోని మిట్టపాళెం వద్ద కుశస్థలి నది నుంచి అధిక సంఖ్యలో ట్రాక్టర్లు ఇసుకను తరలిస్తుండడాన్ని గమనించి, నదిలోకి వెళ్లారు. అక్కడి ట్రాక్టర్ల డ్రైవర్ల నుంచి రశీదులు తీసుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ నగరిలో ఇసుక రీచ్‌లు లేకపోయిన టీడీపీ నేతలు, కార్యకర్తల కోసం తహసీల్దార్‌ రీచ్‌లను సృష్టించి, దోచి పెట్టడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపించా రు. ఇసుకను అధిక సంఖ్యలో తోడేసి తమిళనాడుకు, బెంగళూరుకు తరలిస్తున్నారని విమర్శించారు. నది లో ఇసుకను తోడివేతతో ఏర్పడిన గుంతల్లో పడి గ తంలో ఇద్దరు చిన్నారులు చనిపోయారన్నారు. అయినా అధికారులు వాటిని పట్టించుకోవడం లేదన్నారు.   పేదవారికి ఎవరికీ ఇసుకను ఉచితంగా అందించడం లేదన్నారు. టీడీపీ నాయకులకు సంపాదించి పెట్టడానికి మాత్రమే ఇసుకను అందిస్తున్నారన్నారు. తహసీల్దార్‌ ఇకనైనా వీటిని ఆపాలని, లేకుంటే ప్రజలతో కలిసి ధర్నా చేస్తామని ఎమ్మెల్యే హెచ్చరించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ కె.శాంతి, మాజీ చైర్మన్‌ కేజేకుమార్, నాయకులు బుజ్జిరెడ్డి, జయకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

చంద్రబాబు అసమర్ధుడు

నెల్లూరు: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయలేని అసమర్ధుడు చంద్రబాబు అని వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ వరప్రసాద్‌ మండిపడ్డారు. పొదలకూరు బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ..నాలుగేళ్లుగా బహుబలి షెట్టింగ్స్‌తో రాజధాని అంటూ ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. చంద్రబాబు పాలనలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరన్నారు. ఈ అబద్ధాలు, అవినీతి పాలన పోవాలని, వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి రావాలని ఆకాంక్షించారు. ఎన్నికల సమయంలో ప్రతి మహిళలకు సెల్‌ ఫోన్‌ఇస్తానని మోసం చేశారన్నారు. వంద ఇళ్లకు ఐదు బెల్టు షాపులు పెట్టిన ఘనుడు చంద్రబాబు అన్నారు. నీరు – చెట్టు పేరుతో నిధులు స్వాహా చేస్తున్నారన్నారు. అభివృద్ధి అన్నది రాష్ట్రంలో కనిపించడం లేదన్నారు. యువకులు, చేనేతలు, మత్స్యకారులను ఇలా అన్ని వర్గాలను చంద్రబాబు మోసం చేశారన్నారు. అన్ని విధానాలుగా దగా చేసిన చంద్రబాబును ఇంటికి పంపించాలని ఆయన పిలుపునిచ్చారు. 

రాష్ట్రానికి ‘చంద్ర’ గ్రహణం

– రాష్ట్రాన్ని చంద్రబాబు అడ్డగోలుగా దోచేస్తున్నారు
–  అరాచక ఆంధ్రప్రదేశ్‌గా , అప్పుల ఆంధ్రగా మార్చారు.
– గోదావరి పుష్కరాల్లో 29 మందిని బలి తీసుకున్నారు
– ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయారు.
– పార్టీ ఫిరాయింపులను  దగ్గరుండి ప్రోత్సహించారు
– మనందరి ప్రభుత్వం వచ్చాక వ్యవసాయాన్ని పండుగలా చేయిస్తాం
– ప్రతి రైతుకు ప్రభుత్వమే ఉచితంగా బోరు వేయిస్తుంది
– ప్రతి రైతుకు పెట్టుబడులకు రూ.12,500
– రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు
– రూ. 4 వేల కోట్లతో ప్రకృతి వైఫరీత్యాల నిధి
– పెండింగ్‌ ప్రాజెక్టులు యుద్ధప్రాతిపాదికన పూర్తి చేస్తా

నెల్లూరు: నాలుగేళ్లుగా ఆంధ్రప్రదేశ్‌కు చంద్రబాబు రూపంలో చంద్ర గ్రహణం పట్టిందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి విమర్శించారు. చంద్రబాబు నాలుగేళ్ల పాలనలో రాష్ట్రాన్ని సర్వ నాశనం చేశారని, పైస్థాయిలో చంద్రబాబు, కిందిస్థాయిలో జన్మభూమి కమిటీలు కమీషన్లు తీసుకొని అవినీతి ఆంధ్రప్రదేశ్‌గా మార్చారని మండిపడ్డారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి రాగానే వ్యవసాయాన్ని పండుగలా జరిపిస్తామని వైయస్‌ జగన్‌హామీ ఇచ్చారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలోని పొదలకూరులో బుధవారం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో అశేష జనవాహినిని ఉద్దేశించి వైయస్‌జగన్‌ ప్రసంగించారు. ఆయన ఏమన్నారంటే..వైయస్‌ జగన్‌ మాటల్లోనే.. వేలాది మంది నాతో పాటు అడుగులో అడుగులు వేస్తున్నారు. ఏ ఒక్కరికి నడిరోడ్డుపై వచ్చి నిలబడాల్సిన అవసరం లేదు. నాపై ప్రేమానురాగాలు చూపుతున్న ప్రతి ఒక్కరికి పేరు పేరునా కృతజ్ఞతలు.

నిన్నటి కంటే ఇవాళ సంతోషంగా ఉన్నారా? 
 నాలుగేళ్ల చంద్రబాబు పాలన చూశాం. మరో ఏడాదిలో ఎన్నికలు జరుగబోతున్నాయని ఇదే పెద్ద మనిషి చంద్రబాబు తన కార్యకర్తలను ఉద్దేశించి ఊదరగొడుతున్నారు. ఇవాళ మీ అందర్ని అడుగుతున్నాను. ఒక్క సారి మీ గుండెల మీద చేతులు వేసుకోని ప్రశ్నించుకోండి. నాకు తెలిసిన అభివృద్ధి అంటే నిన్నటి కన్న ఈ రోజు సంతోషంగా ఉంటే దాన్ని అభివృద్ధి అంటారు. నాలుగేళ్ల చంద్రబాబు పాలన ఒక్కసారి చూడండి. నిన్నటి కన్న ఈ రోజు మీరు సంతోషంగా ఉన్నారా? . నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో రాష్ట్రానికి చంద్ర గ్రహణం పట్టింది. 

నాలుగేళ్ల బాబు పాలన ఎలా ఉందంటే..
రిపబ్లిక్‌ డే రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు కనిపించడు. నాలుగేళ్ల పరిపాలన ఎలా ఉందంటే..సాక్షాత్తు మన సీఎం అక్రమ నివాసంలో ఉంటారు. వేరే ఎవరైనా అక్రమ నివాసంలో ఉంటే బలవంతంగా తొలగిస్తారు. అదే సీఎం భార్య రిపబ్లిక్‌డే రోజు అక్రమ నివాసంలో జెండా వందనం చేస్తున్నారు. నాలుగేళ్లుగా చంద్రబాబు విదేశాలకు వెళ్తారు. ఆ సమయంలో ఆయన బావమరిది సీఎం సీట్లో కూర్చుంటారు. రాష్ట్రానికి చంద్రగ్రహణం ఏ స్థాయిలో పట్టిందంటే..అర్చకులకు బదులు తాంత్రికులు పూజలు చేస్తున్నారు. ప్రతి పక్ష ఎమ్మెల్యేలను నిసిగ్గుగా రూ.30 కోట్లు పెట్టి కొనుగోలు చేస్తారు. వారిని అనర్హులుగా ప్రకటించడం లేదు. రాజ్యాంగాన్ని కాపాడాల్సిన వ్యక్తులు దగ్గరుండి తూట్లు పొడుస్తున్నారు. రాష్ట్రపతి మన రాష్ట్రానికి వస్తే అనుమతి లేని అక్రమ బోటులో ఆయన కుటుంబాన్ని తిప్పుతున్నారు. నాలుగేళ్ల చంద్రబాబు పాలన ఎలా ఉందంటే..29 మందిని అక్షరాల చంద్రబాబు పుష్కరాల్లో షూటింగ్‌ కోసం భక్తులందరినీ ఆపి సీఎం స్నానం అయిపోయిన తరువాత గేట్లు తెరచి తొక్కిసలాటలో అమాయకులను బలి తీసుకున్నారు. రాష్ట్రానికి చంద్రగ్రహణం ఏస్థాయిలో పట్టిందంటే..పక్క రాష్ట్రంలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ సీఎం ఆడియో, వీడియోలతో దొరికిపోయారు. ఎవరైనా లంచం తీసుకుంటూ పట్టుబడితే అలాంటి వ్యక్తిని ఉద్యోగం నుంచి తొలగిస్తారు. అదే సీఎం ఆధారాలతో సహా దొరికిపోయిన ఎలాంటి కేసులు ఉండవు. లంచాల సొమ్ముతో దొరికిపోయిన సీఎం ఆ తరువాత రాష్ట్రాన్ని అమ్మేశారు. చంద్రగ్రహణం ఏస్థాయిలో పట్టిందంటే..మనకు రావాల్సిన హక్కులను కేంద్రాన్ని అడిగే పరిస్థితి నెలకొంది. సీబీఐ విచారణ చేపడుతారని ప్రత్యేక హోదాను అమ్మేశారు. ప్రత్యేక ప్యాకేజీ అని ఆ రోజు అన్నారు. ఇవాళ ఇదే పెద్ద మనిషి ఏమంటారు? ఒక్క రూపాయి కూడా దాని వల్ల మేలు జరగడం లేదని నిసిగ్గుగా అంటున్నారు. ఇవాళ బైకులు ఉన్న వారు పెట్రోలు పోయించుకునేందుకు వెళ్తే జేబుకు చిల్లులు పెడుతున్నారు. పక్క రాష్ట్రాల్లో పెట్రోలు రేట్లు తక్కువగా ఉన్నాయి. నాలుగేళ్లుగా దేశంలో ఏ రాష్ట్రంలో లేని రేట్లు మన రాష్ట్రంలో ఉన్నాయి. 

ఇదే పెద్ద మనిషి ఎన్నికలకు ముందు ఏమన్నారు..
కరెంటు బిల్లు చూస్తే షాక్‌ కొడుతోంది. చంద్రబాబు పాలనలో ఇవాళ చంద్రగ్రహణం ఏస్థాయిలో పట్టిందంటే..చివరికి ప్రభుత్వ ఉద్యోగులకు రెండు డీఏలు బాకీ పడ్డారు. ఏ రైతుకు కూడా గిట్టుబాటు ధర రావడం లేదు. ఇదే పెద్ద మనిషి ఎన్నికల సమయంలో రైతుల రుణాలు పూర్తిగా మాఫీ చేస్తామన్నారు. నాలుగేళ్ల పాలనలో ఆయన చేసిన రుణమాఫీ వడ్డీలకు సరిపోవడం లేదు. అక్కా చెల్లెమ్మల రుణాలు మాఫీ కావడం లేదు. బ్యాంకుల నుంచి నోటీసులు వస్తున్నాయి.
– జాబు రావాలంటే బాబు రావాలన్నారు. ఇవాళ పరిస్థితి ఏంటంటే జాబు ఉండాలంటే..బాబు పోవాలని అంటున్నారు. జాబు ఇవ్వకపోతే ప్రతి ఇంటికి రూ.2 వేలు నిరుద్యోగ భృతి అన్నారు. ఇంతవరకు రూపాయి కూడా ఇవ్వలేదు. ప్రతి ఇంటికి రూ.90 వేలు బాకీ పడ్డారు. 
– పైన చంద్రబాబు ఇసుక నుంచి మట్టి దాక, బోగ్గు, కాంట్రాక్టర్లు, కరెంటు కోనుగోలు, రాజధాని భూములు, గుడి భూములు వరకు ఏది వదలకుండా లంచాలు తీసుకుంటున్నారు. కింద గ్రామ స్థాయిలో జన్మభూమి కమిటీలు ఏర్పాటు చేశారు. వారు ఏ స్థాయిలో మేస్తున్నారంటే పింఛన్‌ కావాలన్నా..మరుగుదొడ్డి కావాలన్నా..లంచాలు తీసుకుంటున్నారు. 

ఒక్క  ఇటుక కూడా కట్టిన పాపాన పోలేదు
రాజధాని అని మాటిమాటికి అంటారు. చంద్రగ్రహణం పట్టిన రాష్ట్రంలో నాలుగేళ్ల కాలంలో కనీసం ఒక్క ఇటుక కూడా కట్టిన పాపాన పోలేదు. రాష్ట్రానికి చంద్రబాబు ఏం మిగిల్చిరో తెలుసా? అప్పుల ఆంధ్రప్రదేశ్‌గా మార్చారు. అవినీతి ఏపీగా మార్చిన చరిత్ర, ఘనత బాబుదే. నాలుగేళ్ల పాలనలో అరాచకాంధ్రప్రదేశ్‌గా మార్చారు. రాజ్యాంగం అమలు కాని రాష్ట్రంగా మార్చారు. చట్టం అన్నది ఎక్కడా కూడా అమలు కాని రాష్ట్రంగామార్చారు. మహిళలకు రక్షణలేని రాష్ట్రంగా మార్చారు. ఏ ఒక్కరికి రక్షణ లేని రాష్ట్రంగా మార్చారు. బహుషా..ఈ చంద్రగ్రహణం కొద్ది గంటల్లో వీగి పోతుంది. ఈ రాష్ట్రానికి పట్టిన చంద్రబాబు చంద్రగ్రహణం రాష్ట్రాన్ని పూర్తిగా నాశనం చేసేంత వరకు కూడా పోయోలా లేదు.

కృష్ణపట్నం పోర్టు సంగతి ఎలా ఉందంటే..
మన జిల్లాలోనే కృష్ణపట్నం పోర్టు కనిపిస్తుంది. గతంలో చంద్రబాబు 9 ఏళ్లు సీఎంగా ఉన్నప్పుడు కృష్ణపట్నంకు టెంకాయలు కొట్టారు. ఆయన చేయకపోతే దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి అప్పట్లో అక్కడ మొక్కలు నాటారు. నాన్నగారు ముఖ్యమంత్రి అయిన తరువాత ఆ పోర్టు కార్యరూపం దాల్చి అణిముత్యంలా మారింది. ఇదే కృష్ణపట్నం పోర్టు ఎలాంటి పురోగతి దాల్చిందో చూడండి. అక్కడున్న మత్య్సకారులను ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. నాలుగేళ్ల చంద్రబాబు పాలన చూశాం. ఇవాల్టికి కూడా అక్కడున్న ఉప్పు రైతులకు పరిహారం అందడం లేదు. మత్స్యకారులకు అందాల్సిన ప్యాకేజీ నిధులు అందడం లేదు. చేపలు పట్టే వారే కాకుండా, సముద్రంపై బతికే వారిని నాన్నగారు గుర్తించి ప్రతి ఒక్కరికి రూ.40 వేలు ఇవ్వాలని భావించి అప్పట్లో రూ.8 కోట్లు సాయం చేశారు. ఇవాళ వారిని పట్టించుకోవడం లేదు. పోర్టు వస్తే జిల్లా బాగుపడుతుందని అందరం భావించాం. నాన్నగారి హయాంలో అక్కడే ఫిషింగ్‌ హర్భర్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ పట్టించుకోవడం లేదు. పోర్టు వచ్చినా..ఎస్‌ఈజెడ్‌ వచ్చినా మనందరం భూములు ఇస్తాం. ఎందుకంటే ఇవన్నీ వస్తే మనకు ఇక్కడే ఉద్యోగాలు వస్తాయని ఆశపడుతాం.  ఇవాళ పోర్టు వచ్చినా..ఎస్‌ఈజెడ్లు వచ్చినా ఉద్యోగాలు మనకు రావడం లేదు. వేరే రాష్ట్రాల వారికి వస్తున్నాయి. 

స్థానికులకే ఉద్యోగాలు ఇప్పిస్తా
రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మనందరి ప్రభుత్వం వచ్చాక ప్రతి పరిశ్రమలో స్థానికులే ఉద్యోగాలు ఇస్తాం. ప్రతి పరిశ్రమకు నోటీసులు ఇస్తాం. పోర్టులు కావాలన్నా..ఎస్‌ఈజెడ్లు కోసం మనందరం ఎదురు చూస్తాం. ఒకవైపున ప్రత్యేక హోదా రాకుండా ఎగురగొట్టారు. మరోవైపు స్థానికులకు పరిశ్రమల్లో ఉద్యోగాలు ఇవ్వకుండా మోసం చేస్తున్నారు.

కండలేరు ప్రాజెక్టు ఏమైంది?
కండలేరు హై లెవల్‌ కెనాల్‌ ద్వారా పొదలకూరు మండలానికి మేలు జరుగుతుందని లిప్ట్‌ పెట్టేందుకు రూ.22 వేల కోట్లు మంజూరు చేశారు. నాన్నగారు చనిపోయిన తరువాత ఆ కాంట్రాక్ట్‌ రేటు రూ.50 వేల కోట్లకు రేట్లు పెంచారు. ఇవాళ ఆ లిప్టులు పని చేయడం లేదు. ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతున్నాను. ఇదే చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో ఇక్కడికి వచ్చారు. ఎమ్మెల్సీగా ఎన్నికైన చంద్రమోహన్‌రెడ్డి మంత్రిగా ఎన్నికయ్యారు. ఈ నియోజకవర్గ ప్రజల తరఫున డుగుతున్నాను..ఏమైంది ఈ ప్రాజెక్టు అని అడుగుతున్నాను. ఇలాంటి చిన్న చిన్న ప్రాజెక్టులను కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఇదే నియోజకవర్గంలో మేలు జరిగేందుకు పెన్నా నదిపై చేపట్టిన పనులు అడుగు కూడా ముందుకు సాగడం లేదు.

నిమ్మ రైతుల పరిస్థితి దారుణం
ఇదే నియోజకవర్గంలో నిమ్మరైతులు నా వద్దకు వచ్చారు. రోడ్డుపై నిమ్మకాయలు పోసి వారి గోడు చెప్పుకున్నారు. నియోజకవర్గంలో 20 వేల ఎకరాల్లో నిమ్మకాయలు పండిస్తారు. ఇవాళ నిమ్మకాయలకు గిట్టుబాటు ధర లేదని రైతన్నలు అంటున్నారు. ఒక్కసారి ఆలోచన చేయండి. ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర రావడం లేదు. కారణం సీఎం అనే వ్యక్తి రైతులకు తోడుగా ఉండాలి. మన ఖర్మ ఏంటో తెలుసా సీఎం అనే వ్యక్తి దళారిగా మారాడు. చంద్రబాబుకు హెరిటేజ్‌ షాప్‌ ఉంది. తాను కూడా దళారులకు తోడై రైతులను మోసం చేస్తున్నారు. రైతుల వద్ద ఉన్నప్పుడు తక్కువ ధరలకు కొనుగోలు చేసి ఆ తరువాత ఎక్కువ రేట్లకు అమ్ముకుంటున్నారు.

బంగారానికి బోనస్‌ బెంజి కారు అంటాడు..
 ఇలాంటి అన్యాయమైన, మోసం చేసే పాలనను క్షమిస్తే రేపొద్దున ఇదే చంద్రబాబు మీ వద్దకు వచ్చి ..ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తానంటారు. నమ్ముతారా?..కేజీ బంగారుకు బోనస్‌ అంటాడు. ప్రతి  ఇంటికి బెంజీ కారు కొనిస్తా అంటాడు. నమ్ముతారా? ప్రతి ఒక్కరిని అవినీతితో సంపాదించిన డబ్బుతో కొనుగోలు చే సే ప్రయత్నం చేస్తారు. ఆ డబ్బులు తీసుకోండి. ఆ డబ్బంతా మన వద్ద నుంచి దోచుకున్నదే. చెడిపోయిన రాజకీయ వ్యవస్థలోకి నిజాయితీ అన్న పదం రావాలి. ఎవరైనా నాయకుడు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ఇంటికి పోవాలి. ఈ వ్యవస్థను బాగుపరిచేందుకే పాదయాత్రగా బయలుదేరాను. ఈ వ్యవస్థను మార్చడం నా ఒక్కరి వల్ల కాదు..జగన్‌కు మీ అందరి చల్లని దీవెనలు కావాలి. అప్పుడే ఈ వ్యవస్థలోకి విశ్వసనీయత, నిజాయితీ అన్న పదాలకు అర్ధం వస్తుంది.
రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నవరత్నాలు ప్రకటించాం. ఈ పథకాలతో ప్రతి పేద వాడి ముఖంలో చిరునవ్వు చూడాలని నవరత్నాలు ప్రకటించాం.  అందులో ఏదైనా మార్పులు చేర్పులు చేయాల్సి వస్తే మీ అందరూ కూడా సలహాలు, సూచనలు ఇవ్వండి. ప్రతి సభలో నవరత్నాల గురించి చెబుతున్నాను. నవరత్నాల నుంచి నేను చెప్పబోయే అంశం రైతన్నలకు ఏం మేలు చేస్తామన్నది చెబుతున్నాను.

రైతుకు పెట్టుబడులు తగ్గించేందుకు..
రైతుల గురించి ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ మనం ఎలా ఉన్నామో ఆలోచన చేయండి. రైతు అనే వాడు ఏం చేయాలి. రైతులకు మొట్ట  మొదట పెట్టుబడులు తగ్గాలి. రైతులు పండించిన పంటకు మంచి గిట్టుబాటు ధర ఉంటే అప్పుడు రైతుల ముఖాల్లో చిరునవ్వులు ఉంటాయి.  దిశగా అడుగులు వేస్తూ..
1. రెతులకు పెట్టుబడులు తగ్గించేందుకు మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఏం చేస్తామంటే..ప్రతి రైతుకు 9 గంటల పాటు పగటి పూట ఉచిత విద్యుత్‌ ఇచ్చి తోడుగా ఉంటాం.
2.  రైతులకు ఇవాళ బ్యాంకుల నుంచి వడ్డీ లేని రుణాలు రావడం లేదు. వడ్డీ లెక్కలు రాష్ట్ర ప్రభుత్వం రైతుల తరఫున బ్యాంకులకు కట్టినప్పుడే వడ్డీ లేని రుణాలు ఇస్తారు. ఇవాళ చంద్రబాబు సీఎం అయ్యాక మన ఖర్మ ఏంటో తెలుసా? రైతులకు సంబంధించిన వడ్డీ లెక్కలు బ్యాంకులకు కట్టడం మానేశారు. ఇవాళ ఏ బ్యాంకులు కూడా వడ్డీ లేని రుణాలు ఇవ్వడం లేదు. రైతులకు పెట్టుబడులు తగ్గించేందుకు..మనందరి ప్రభుత్వం వచ్చాక ప్రతి రైతుకు వడ్డీ లేని రుణాలు ఇప్పిస్తాం. దీని వల్ల రైతులకు బ్యాంకుల నుంచి డబ్బులు వస్తాయి. రైతులకు పెట్టుబడి తగ్గుతుంది.
3. రేపొద్దున దేవుడి దయ వల్ల మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతి రైతుకు మే మాసంలో రూ.12,500 ఇచ్చి తోడుగా ఉంటామని చెబుతున్నాను. ఒక ఎకరా ఉన్న రైతుకు దాదాపు 90 శాతం పెట్టుబడి ఖర్చులు వస్తాయి. ఈ కార్యక్రమాల వల్ల రైతులకు పెట్టుబడి భారం తగ్గుతుంది.

మనందరి ప్రభుత్వం వచ్చాక..
రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర వస్తే రైతు ముఖంలో చిరునవ్వులు ఉంటాయి. ఇవాళ ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర వస్తుంది. మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పంట వేసే ముందే గిట్టుబాటు ధర ప్రకటించి ఆ పంటను కొనుగోలు చేస్తాం. ఇందుకోసం రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి తోడుగా ఉంటాం. రైతు ఒక్క వ్యవసాయంపై బతికితే గిట్టుబాటు కాదు. పాడి పరిశ్రమ వల్ల రైతులకు మేలు జరుగుతుంది. మీరు కో–ఆపరేటివ్‌ రంగంలోని డయిరీలకు పాలు పోస్తే లీటర్‌కు రూ.4 సబ్సిడీ ఇస్తుంది. ఆ తరువాత ప్రైవేట్‌ రంగంలోని డయీరీలు కూడా రూ.4 ఇచ్చి పాలు కొనుగోలు చేస్తారు. నిమ్మ పండిస్తున్నారు కానీ, కోల్డు స్టోరేజీలు లేవు. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు లేవు. ప్రతి మండల కేంద్రంలో కోల్డు స్టోరేజీలు, ఫుడ్‌ ప్రాసెసింగ్‌లు ఏర్పాటు చేస్తాం. ఏ రైతు కూడా కరువు, అకాల వర్షాలతో బాధపడుకుండా ఉండేందుకు రూ.4 వేల కోట్లతో ప్రకృతి వైఫరీత్యాల నిధి ఏర్పాటు చేసి తోడుగా ఉంటాను. వ్యవసాయం అన్నది ఒక పండుగలా చేసుకునే పరిస్థితి తీసుకువస్తాను. 

రైతులు అప్పులపాలు కాకూడదు..
రైతులకు సాగునీరు చాలా అవసరం. ఇవాళ రైతులు ఎక్కువ శాతం ఆత్మహత్యలు చేసుకునేందుకు ఎందుకో తెలుసా..నీటి కోసం బోర్లు వేసుకొని అప్పులపాలు అవుతున్నారు. రేపొద్దున మనందరి ప్రభుత్వం వచ్చిన తరువాత ప్రతి రైతుకు ఉచితంగా బోరు వేయిస్తాం. జలయజ్ఞాన్ని చంద్రబాబు ధనయజ్ఞంగా మార్చారు. కాంట్రాక్టర్ల నుంచి డబ్బులు దండుకునే కార్యక్రమాలు చేస్తున్నారు తప్ప నీరు తీసుకురావడం లేదు. ప్రతి ప్రాజెక్టును యుద్ధప్రాతిపాదిక పెండింగ్‌ ప్రాజెక్టులు పూర్తి చేస్తాను. రైతు బాగుంటునే రాష్ట్రం బాగుంటుంది. నవరత్నాల్లో ఏదైనా మార్పులు, చేర్పులు చేయాల్సి వస్తే సలహాలు, సూచనలు ఇవ్వమని మీ అందరిని కోరుతున్నారు. ఎవరైనా నన్ను కలువవచ్చు. ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థను బాగు చేసేందుకు పాదయాత్రగా బయలుదేరిన మీ బిడ్డను ఆశీర్వదించమని పేరు పేరున కోరుతూ..సెలవు తీసుకుంటున్నాను.

వైయస్‌ జగన్‌ ఏపీ ప్రజలకు వరం

నెల్లూరు: వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి రాబోయే రోజుల్లో ఏపీకి నాయకత్వం వహించడం మనందరికి వరమని ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. పొదలకూరు బహిరంగ సభలో ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ..ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైయస్‌ రాజశేఖరరెడ్డి పాలనను దేశంలో ఎక్కడ..ఎవరూ చూసి ఉండరన్నారు. ఒకప్పుడు వెలుగు వెలిగిన రాష్ట్రం నేడు చంద్రబాబు పాలనలో మగ్గిపోతుందన్నారు. చేతి వృత్తులు, కుల వృత్తులు, ఇలా అన్ని వర్గాల సమస్యలు తెలుసుకునేందుకు వైయస్‌ జగన్‌ పాదయాత్రగా బయలుదేరారన్నారు. వైయస్‌ఆర్‌ పాదయాత్ర చేసి ఆ తరువాత అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ సమస్యలు అన్నీ కూడా నెరవేర్చారన్నారు. చంద్రబాబు పాదయాత్రలో తప్పుడు హామీలు ఇచ్చి తీరా..అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలకు మొండిచెయ్యి చూపించిన నయవంచకుడు చంద్రబాబు అన్నారు. రాబోయే రోజుల్లో తన కొడుకును ముఖ్యమంత్రి చేసుకునేందుకు ప్రజల ప్రయోజనాలను కేంద్రానికి తాకట్టు పెట్టారన్నారు. వైయస్‌ఆర్, చంద్రబాబు మధ్య చాలా తేడా ఉందన్నారు. పేదవాడి కోసం వైయస్‌ఆర్‌ తపన పడ్డారన్నారు. అదే చంద్రబాబు, ఆయన చెంచాలు జన్మభూమి కమిటీలు మనిషి చనిపోతే పరిహారం ఇస్తామని చెబుతున్నారని, ఇదే వారిద్దరి మధ్య ఉన్న ఉదాహరణగా గమనించాలన్నారు. ఏపీలో ఎంతో మంది ఉద్దండులు ఉన్నా సరే పార్టీని నడపలేకపోయారని, వైయస్‌ జగన్‌ ప్రజల పక్షాన నిలబడి రాజీలేని పోరాటం చేసిన వ్యక్తి అన్నారు. అలాంటి వ్యక్తి ఈ ప్రాంతానికి రావడం మనందరి అదృష్టమన్నారు. వైయస్‌ రాజశేఖరరెడ్డి పరిపాలన కోరుకునే మనందరం వైయస్‌ జగన్‌కు తోడుగా నిలబడాలన్నారు. జగనన్న ప్రతినిధిగా మీరు నన్ను గెలిపిస్తే..ఓడిపోయిన వ్యక్తి చంద్రమోహన్‌రెడ్డి దొడ్డిదారిన మంత్రి పదవి పొంది మనపై విమర్శలు చేస్తున్నారన్నారు. వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని నిండు నూరేళ్లు ఆశీర్వదించాలని కాకాణి కోరారు. 

30 January 2018

నడుస్తూ.. నడిపిస్తూ


– పాదయాత్రలోనే అభ్యర్థుల ప్రకటన
– కుప్పం నుంచి చంద్రబాబుపై పోటీగా చంద్రమౌళి
– పత్తికొండ నుంచి చెరుకులపాటి నారాయణ రెడ్డి భార్యకే అవకాశం 
– పార్టీ శ్రేణుల్లో రోజురోజుకు పెరుగుతున్న ఉత్సాహం 


వైయస్‌ఆర్‌సీపీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తాను చేపట్టిన ప్రజా సంకల్పయాత్రతో ఏపీ చరిత్రలో మరో నూతన అధ్యాయానికి తెర తీశారు. గత నవంబర్‌ 6న చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర ఉరకలెత్తే ఉత్సాహంతో అప్రతిహతంగా సాగిపోతోంది. ఇప్పటికే వెయ్యి కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. రాయలసీమ నాలుగుజిల్లాలను పూర్తి చేసుకుని నెల్లూరులో అడుగుపెట్టింది. సడలని ఆత్మవిశ్వాసం.. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా.. తండ్రి ఆశయ సాధన కోసం చేపట్టిన పాదయాత్రకు ప్రపంచ వ్యాప్తంగా విశేష స్పందన లభిస్తుంది. నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో విసిగి వేసారిన ప్రజలు జననేతకు ఎదురేగి స్వాగతాలు పలుకుతున్నారు. తమ సమస్యలు పరిష్కరించే నాయకుడిగా వైయస్‌ జగన్‌పై నమ్మకంతో ఆదరాభిమానాలు చూపిస్తున్నారు. 
 
ప్రజలు చూపిస్తున్న ఆదరాభిమానాలే అండగా వైయస్‌ జగన్‌ మరింత దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండే విధంగా ప్రజా సంకల్పయాత్రలోనే అభ్యర్థులను ప్రకటిస్తూ కొత్త విధానానికి తెరతీశారు. స్థానిక ప్రజలకు పార్టీ నాయకులను మరింత చేరువ చేయడమే లక్ష్యంగా, స్థానిక పరిస్థితులను ప్రభావితం చేసే విధంగా అభ్యర్థులను ప్రకటిస్తూ ముందుకు సాగుతున్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల నియోజగకవర్గాల్లో ప్రజల నుంచి కూడా విశేష స్పందన రావడంతో ఇదే ఉత్సాహాన్ని రెట్టింపు చేసే విధంగా పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతున్నారు.
రాయలసీమలో ముగ్గురు అభ్యర్థుల ప్రకటన
ఎన్నికలకు ఏడాది ముందుగానే రాయలసీమ జిల్లాల నుంచి ఇప్పటికే ముగ్గురు అభ్యర్థులను ప్రకటించారు వైయస్‌ఆర్‌సీపీ అధినేత వైయస్‌ జగన్‌. వైయస్‌ఆర్‌సీపీ నాయకుడు చెరుకులపాడు నారాయణ రెడ్డి హత్యతో ఖాళీ అయిన పత్తికొండ స్థానంలో ఆయన భార్యను సమన్వయ కర్తగా నియమించిన వైయస్‌ జగన్‌.. కర్నూలు జిల్లాలో పత్తికొండలో జరిగిన పాదయాత్రలో భాగంగా ఆమెనే పత్తికొండ అసెంబ్లీ స్థానం నుంచి ౖÐð యస్‌ఆర్‌సీపీ అభ్యర్థిగా ప్రకటించారు. అదే జిల్లా నుంచి కర్నూలు టౌన్‌ నుంచి మైనారిటీ నాయకుడు హఫీజ్‌ఖాన్‌ను అభ్యర్థిగా ప్రకటింపజేశారు. చిత్తూరు జిల్లాలో పాదయాత్రకొచ్చిన సమయంలో మరో అభ్యర్థిని ప్రకటించారు. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కుప్పం నుంచి వైయస్‌ఆర్‌సీపీ అభ్యర్థిగా మాజీ ఐఏఎస్‌ అధికారి చంద్రమౌలిని చంద్రబాబుపై పోటీకి నిలుపుతూ స్వయంగా ప్రకటించారు. అనంతపురం జిల్లాలో నిర్వహించిన బోయ, వాల్మీకి కులస్తుల ఆత్మీయ సభలో మరో కీలక ప్రకటన చేశారు. వాల్మీకి, బోయ కులాలకు చెందిన వ్యక్తిని కర్నూలు, అనంతపురం జిల్లాల నుంచి ఒక ఎంపీ స్థానం నుంచి పోటీకి నిలుపుతామని ప్రకటించి ఆయా కులాలకు వైయస్‌ఆర్‌సీపీ అండగా ఉంటుందని చెప్పకనే చెప్పారు. ఈ రెండు కులాలను ఎస్టీల్లో చేరుస్తామని 2014 ఎన్నికలకు ముందు చంద్రబాబు హామీ ఇచ్చి దారుణంగా మోసం చేశారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఆయా కులాలకు రాజకీయంగా అండగా నిలిచే విధంగా వైయస్‌ జగన్‌ చేసిన ప్రకటన బోయలు, వాల్మీకిల్లో సంతోషం నింపింది. 

ఓవైపు పాదయాత్రతో జగన్‌ దూసుకుపోతుంటే ప్రలోభాలకు గురిచేసి ప్రతిపక్ష ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకోవడం ద్వారా వైయస్‌ఆర్‌సీపీని దెబ్బతీసి తద్వారా ఆయన మనోధైర్యాన్ని దెబ్బతీయాలనే చంద్రబాబు లక్ష్యం పాదయాత్రకు తండోపతండాలుగా తరలి వస్తున్న ప్రజలను చూసి జావగారిపోతోంది. ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా.. ఎన్ని అవాంతరాలు సృష్టించినా ఎంతో సంయమనంతో వైయస్‌ జగన్‌ చేస్తున్న పాదయాత్ర జగన్నాయకుడి దృఢ సంకల్పంపై ప్రజల్లో నమ్మకం కలిగిస్తోంది. ప్రజల్లో కూడా తమకు ఎలాంటి నాయకుడైతే బాగుంటుందో ఒక స్పష్టత వస్తోంది.