వైయస్ఆర్ జిల్లా: వైయస్ఆర్ జిల్లా ఆర్టీసీ కార్మికులను చంద్రబాబు టార్గెట్ చేశారని ఆర్టీసీ కార్మికులు వైయస్ జగన్ దృష్టికి తీసుకెళ్లారు. అన్యాయంగా ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నారని వాపోయారు.
మమ్మల్ని నట్టేట ముంచాడు: కాంట్రాక్ట్ లెక్చరర్లు
అధికారంకి వస్తే తమను క్రమబద్దీకరిస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు మమ్మల్ని నట్టేట ముంచాడని కాంట్రాక్టు లెక్చరర్లు వైయస్ జగన్ కు ఫిర్యాదు చేశారు. చంద్రబాబు మమ్మల్ని మోసం చేశాడని కాంట్రాక్టు లెక్చరర్లు తమ ఆవేదన వైయస్ జగన్తో చెప్పుకున్నారు. నేను అధికారంలోకి వస్తే మీ సమస్యలు పరిష్కరిస్తానని వైయస్ జగన్ హామీ ఇచ్చారు.
పట్టించుకోవడం లేదు: వీఆర్ఏలు
తమ సమస్యలు పరిష్కరించాలని 78 రోజులుగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వీఆర్ ఏలు వైయస్ జగన్ ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు స్పందించిన వైయస్ జగన్ పే స్కేల్ అమలు చేస్తానని హామీ ఇచ్చారు.
No comments:
Post a Comment