వైయస్ఆర్ జిల్లా: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డిని బద్వేల్ నియోజకవర్గ నేతలు కలిశారు. సోమవారం ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్ఆర్ జిల్లాలో పాదయాత్ర చేస్తున్న వైయస్ జగన్ను బద్వేలు నేతలు కలిసి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా తమ నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలను జననేత దృష్టికి తీసుకెళ్లారు. తమ ప్రభుత్వం రాగానే వీటిని పరిష్కరిస్తానని వైయస్ జగన్ నేతలకు హామీ ఇచ్చారు.
No comments:
Post a Comment