కర్నూలు: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజాసంకల్పయాత్ర 17వ రోజు షెడ్యూల్ ఖరారు అయింది. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం వెల్దుర్తి నుంచి ఆయన శనివారం ఉదయం పాదయాత్రను ప్రారంభించనున్నారు.
ఉదయం 8 గంటలకు వెల్దుర్తి, చెరుకులపాడు, పుట్లూరు క్రాస్, తొగరచేడు క్రాస్ వద్దకు చేరుకుంటారు. ఈ యాత్రలో వైయస్ జగన్ ప్రజా సమస్యలను తెలుసుకుంటూ, వారికి భరోసా కల్పిస్తూ ముందుకు సాగనున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు భోజన విరామం తీసుకుంటారు. భోజన విరామం అనంతరం కృష్ణగిరి నుంచి పాదయాత్ర పున:ప్రారంభం అవుతుంది. అలాగే సాయంత్రం 6.30గంటలకు రామకృష్ణ పురం చేరుకుంటారు. అనంతరం రాత్రి 7.30 గంటలకు వైయస్ జగన్ బస చేస్తారు. ఈమేరకు 17రోజు పర్యటన వివరాలను వైయస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ప్రకటించారు.
No comments:
Post a Comment