కర్నూలు: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి కొద్ది సేపటి క్రితమే చెరుకులపాడు గ్రామానికి చేరుకున్నారు. ప్రజా సంకల్ప యాత్ర 17వ రోజు శనివారం వెల్దుర్తి నుంచి ప్రారంభమైంది. అక్కడి నుంచి పాదయాత్రగా వైయస్ జగన్ చెరుకులపాడు చేరుకోవడంతో గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ఇక్కడి నుంచి పుట్లూరు క్రాస్, తొగరచేడు క్రాస్ రోడ్డు మీదుగా పాదయాత్ర సాగనుంది.
No comments:
Post a Comment