- సీఎం కుర్చీ కదిలేవరకు ప్రజా సంకల్పయాత్ర ఆగదు
- అవినీతి కంపుకొడుతున్న పాలనను ఇంటింకి తరిమేద్దాం
- బాబు అరుపులకు వైయస్ జగన్ ఇంట్లోని కుక్క కూడా బెదరదు
- ప్రజా సంక్షేమం కోసం ఎంతటి పోరాటానికైనా జననేత సిద్ధం
- వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా
ఇడుపులపాయ: వందల కొద్ది హామీలిచ్చి మోసం చేసి చంద్రబాబు కూర్చున్న కుర్చీ కదిలే వరకు పాదయాత్ర ఆగదని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు, ఎమ్మెల్యే ఆర్కే రోజా ధ్వజమెత్తారు. నారా నరకాసురుడు చంద్రబాబు పాలన అంతమొందే వరకు పాదయాత్ర ఆపేదేలేదన్నారు. ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రోజా మాట్లాడుతూ.. చంద్రబాబు చేసిన అవినీతితో కంపుడుతున్న పాలనను ఇంటికి పంపించాలన్నారు. ఎవరు పాదయాత్ర చేస్తే తెలుగుదేశం పార్టీ నాయకులకు దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అయ్యిందో అతనే వైయస్ జగన్ అని రోజా ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని నట్టేట ముంచిన ఘనుడు చంద్రబాబు అని ప్రజలంతా తెలుసుకున్నారన్నారు. వైయస్ జగన్ను ప్రతిపక్షంలో కూర్చోబెట్టినందుకు ప్రజలంతా చింతిస్తున్నారన్నారు. వైయస్ జగన్ లాంటి నాయకుడు ఉంటేనే రాష్ట్రంలో బాగుంటుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు కాబట్టే అన్న రాకకోసం ఎదురు చూస్తున్నారన్నారు. వారందరికీ భరోసా ఇస్తూ దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి రాజ్యాన్ని స్థాపించి అందరికీ సంక్షేమ కార్యక్రమాలతో వారి మొహంలో సంతోషాన్ని చూస్తారన్నారు.
ఎన్ని కష్టాలు ఎదురైనా ప్రజా సంక్షేమం కోసం పోరాడేందుకు వైయస్ జగన్ సిద్ధంగా ఉన్నారని రోజా స్పష్టం చేశారు. ఇన్నాళ్లు ఒకలెక్క.. ఇప్పుడొక లెక్క.. రాజన్న కొడుకు వచ్చాడన్నారు. పాదయాత్రతో 5 కోట్ల మంది ప్రజల ఆశీర్వాదంతో రాజన్న రాజ్య స్థాపనకు కృషి చేస్తున్నారన్నారు. చంద్రబాబు పాలలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని రోజా మండిపడ్డారు. మహిళల ధన, మాన, ప్రాణాలకు రక్షణ లేదన్నారు. పండంటి బిడ్డ పథకం ద్వారా బిడ్డలను, మహాలక్ష్మి పథకం ద్వారా ఆడ పిల్లలకు మోసం చేస్తున్నారన్నారు. నారాయణ కాలేజీల్లో ఆడపిల్లల ఆత్మహత్యలు చేసుకునే విధంగా ఉందన్నారు. చంద్రబాబు, ఆయన మంత్రులు అరిచే అరుపులకు వైయస్ జగన్ కాదు.. ఆయన ఇంట్లో కుక్క కూడా భయపడదన్నారు. ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు సాగుతున్న ప్రజా సంకల్పయాత్ర విజయవంతం చేయాలని కోరారు.
No comments:
Post a Comment